Khairtabad Ganesh
-
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి.. విశ్వరూపం
ఇంతింతై వటుడింతయై.. అన్నట్లు.. వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు.. అన్నట్లు.. 70 ఏళ్ల ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం కొనసాగుతోంది.. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం నిరి్వగ్నంగా 70 వసంతాలకు చేరుకుంది. యేటా ఒక్కో అడుగు పెంచుకుంటూ 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా రూపుదిద్దుకున్నాడు. యేటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే మహాగణపతి ఈసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్త ముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం, రెండువైపులా 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద.. ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహంతో ఈసారి దర్శనమివ్వనున్నారు. ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేశారు. మహాగణపతి పాదాల చెంత ఆయన వాహనమైన మూషికం ఆకారాలు 3 అడుగులలో దర్శనమిస్తున్నాయి. విగ్రహానికి కుడివైపున 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం విగ్రహ మూర్తులను ఏర్పాటు చేశారు. ఇంతటి అద్భుత రూపాలతో యేటా మహాగణపతిని రూపొందిస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ అంతఃకరణ శుద్ధితో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి గురించి ఆయన పంచుకున్న పలు విశేషాలు.. ప్రపంచవ్యాప్త గుర్తింపు... మహాశక్తి గణపతి వరల్డ్ రికార్డు నెలకొల్పనుంది. అప్పట్లో బాలగంగాధర్ తిలక్ అందరినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకు వాడ వాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటుచేయాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు సింగరి శంకరయ్య ఖైరతాబాద్లో ఏర్పాటుచేసిన ఒక్క అడుగు విగ్రహం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగానే కాక, విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి గణనాథుని వేడుకోవడం విశేషం. సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో.. రిజర్వ్బ్యాంక్ ఉద్యోగి ఏసుపాదం 1978లో నా వద్దకు వచ్చి ఖైరతాబాద్లో సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో 14 అడుగుల ఎత్తులో వినాయకుడిని తయారు చేయాలని కోరారు. అదే మొట్టమొదటి సారిగా ఆరు బయట స్టేజీపై 14 అడుగుల ఎత్తులో విష్ణు అవతారంలో చేసిన విగ్రహం. అది అందర్నీ ఆకట్టుకోవడంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాననే సంతోషం దక్కింది. 1980లో పంచముఖ వినాయకుడిని సారథి స్టూడియోలో చేసి ఖైరతాబాద్ తీసుకొచ్చాం. 1982లో ఎలుక రథంతో మంటపంలో చక్రాల బండిపై స్టాండ్తో తయారుచేశాం. అదే సంవత్సరం సాగర సంగమం సినిమా షూటింగ్లో భాగంగా నటుడు కమల్ హాసన్తో పాట చిత్రీకరణ జరిగింది. 1993 నుంచి 1999 వరకూ ఏడు సంవత్సరాల పాటు ఖైరతాబాద్ మహాగణపతికి శిల్పిగా వ్యవహరించలేదు. ఆ ఏడు సంవత్సరాలు ఆరి్టస్టు రంగారావు నేతృత్వంలో మహాగణపతిని తయారుచేశారు. మరలా 2000 నుంచి ఇప్పటి వరకూ నిరి్వరామంగా మహాగణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.లడ్డూ ప్రసాదం నైవేద్యంగా..తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్ మహాగణపతికి 2010లో 500 కిలోల లడ్డూను ప్రసాదంగా చేతిలో ఉంచి భక్తులకు పంచిపెట్టారు. ఆ తరువాత వరుసగా 2400, 3600, 4200 లడ్డూను నైవేద్యంగా ఇచ్చారు. 2015లో 6000 వేల కిలోల లడ్డూ మహాగణపతి చేతిలో 11 రోజులు పూజలందుకోవడం మొట్ట మొదటిసారి ఖైరతాబాద్ మహాగణపతికే సొంతం. ఆ రూపాలు సంతోషాన్నిచ్చాయి.. ఎలుక రథంపై 1982లో చేసిన వినాయకుడి రూపం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆ తరువాత విశ్వరూప, మత్స్య వినాయకుడు, ఈ యేడాది 70 అడుగుల ఎత్తులో చేసిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాలు నాకు ప్రత్యేకం. 2024 ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తులో మట్టితో మహాగణపతిని చేయడం వెనుక ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దివంగత సింగరి సుదర్శన్ భక్తులకు ఇచి్చన మాటను నిలబెట్టేందుకు ఈ విగ్రహాన్ని చేశాను. ఎత్తులో ఇదే చివరి విగ్రహం.. వచ్చే యేడాది నుంచి విగ్రహం ఎత్తు తగ్గుతూ వస్తుంది..నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఖైరతాబాద్ వినాయకుడు, మా నాన్న గారి ఆశీర్వాదంతో నేను ఉన్నన్ని రోజులూ ఖైరతాబాద్ మహాగణపతి ఖ్యాతిని ఏమాత్రం తగ్గకుండా పెంచేందుకు అందరితో కలిసి ముందుకు వెళ్తా. 70 సంవత్సరాలు 70 అడుగులు చేయాలన్న మా నాన్న సింగరి సుదర్శన్ ఆఖరి కోరికను తీరుస్తూ ఆ దిశగా అడుగులు వేయటం సంతోషంగా ఉంది. – సింగరి రాజ్కుమార్70 అడుగుల మట్టి వినాయకుడు.. ఈ యేడాది 70 అడుగుల మట్టి వినాయకుడే వరల్డ్ రికార్డు. ఉత్సవ కమిటీ కనీ్వనర్గా, ఎన్నో దశాబ్దాలుగా మహాగణపతి సేవలతో వెన్ను దన్నుగా వ్యవహరిస్తున్నా. వైజగ్లో గతంలో 80 అడుగుల వినాయకుడిని చేసినా అక్కడే నిమజ్జనం చేశారు. ఈ సంవత్సరం విజయవాడలో 72 అడుగులు వినాయకుడిని చేశారు. కానీ అక్కడే నిమజ్జనం చేస్తారు. ఇక్కడ 70 అడుగుల మహాగణపతిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం గావిస్తాం. ఇది వరల్డ్ రికార్డు. – సందీప్ రాజ్, ఉత్సవ కమిటీ కనీ్వనర్పుట్టింది అక్కడే.. తమిళనాడు, పరంబలూరు జిల్లా, పుదువేటకుడి గ్రామానికి చెందిన చిన్నస్వామి, మరుదాయి దంపతులకు 8 మంది సంతానం కాగా, వీరిలో రెండో సంతానం చిన్నస్వామి రాజేంద్రన్. పేదరికంలో ఉన్నా కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే చెన్నైకి వచ్చి అక్కడ వేలుస్వామి వద్ద పనిచేయడం ప్రారంభించా. అప్పట్లో హైదరాబాద్లో ఎన్టీఆర్ నటించే పౌరాణిక ఘట్టాలకు సంబంధించిన ఆభరణాలకు స్టోన్స్ అతికించే పనికోసం నా సీనియర్స్తో పాటు నన్ను హైదరాబాద్ పంపారు. ఆ సమయంలో నేను చేసిన పనిని గుర్తించి నన్ను ఆరి్టస్టుగా ప్రోత్సహించారు.ఆ గుర్తింపే ఇంటిపేరుగా..ఎప్పుడైతే ఖైరతాబాద్ మహా గణపతికి శిల్పిగా వ్యవహరిస్తూ వచ్చానో ఆ తరువాత నన్ను మహా గణపతి ఆర్టిస్టుగా గుర్తించడం ప్రారంభిచారు. ఇక అదే నాకు ట్రేడ్ మార్క్, ఇంటి పేరులా మారిపోయింది. ఖైరతాబాద్ మహాగణపతిని తయారుచేసే భాగ్యం నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. – చిన్నస్వామి రాజేంద్రన్, ఖైరతాబాద్ మహాగణపతి శిల్పి. -
9 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు
సాక్షి, ఖైరతాబాద్ : హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతిని తొమ్మిది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నట్లు అందుకు సంబంధించిన నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది తక్కువ ఎత్తులోనే గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో గణేశుడు దర్శనమివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. విగ్రహాన్ని 9 అడుగుల ఎత్తులో మట్టితో తయారు చేస్తున్నామని సుదర్శన్ చెప్పారు. పశ్చిమబెంగాల్లోని గంగానది నుంచి బంకమట్టిని తెప్పించి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది అడుగుల విగ్రహానికి ఆరు చేతులు, లక్ష్మీ, సరస్వతీ సమేతంగా ఏర్పాటుచేస్తున్నామని సుదర్శన్ వెల్లడించారు. కుడివైపు చేతిలో ఆయుర్వేద గ్రంథం, శంఖం, అభయహస్తం, ఎడమవైపు వనమూళికలు, అమృతభాండం, లడ్డూ, తొండంపై కలశం ఉంటుందని స్పష్టంచేశారు. -
ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్ గణపతి దర్శనం ఎలా?
-
ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్ గణపతి దర్శనం ఎలా?
వినాయక చవితి పండగ వచ్చిందంటే ప్రతి గల్లీలు జైబోలో గణేష్ మహరాజ్ కీ... అంటూ మారుమోగిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో సందడి ఇంతా అంతా ఉండదు. అందులోనూ హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో విశిష్టత ఉంది. ఈ గణనాధుడిని దర్శించుకుంటే లోకకల్యాణం జరుగుతుందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ప్రజల ఒక విశ్వాసం. ఎంతో వ్యయప్రయాలకోర్చి హైదరాబాద్ మహా నగరాన్ని చేరుకోవడం ఒక ఎతైతే అక్కడి నుండి ఖైరతాబాద్ గణేషుడిని చేరుకోవడం మరో పెద్ద సమస్య. నగరంలో రోజురోజుకు పెరిగిన ట్రాఫిక్ ప్రజలను చికాకుల్లోకి నెడుతుంటుంది. రెండు మూడు బస్సులు ఎక్కి దిగుతూ చాలా కష్టం మీద గౌరీపుత్రుడి దర్శనం చేసుకునేవారు. ఈసారి ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. వివరాలు వీడియోలో చూడండి. -
ఖైరతాబాద్ వినాయకుడిని అక్కడ నిమజ్జనం చేస్తాం
సాక్షి, ఖైరతాబాద్: పోలీసు బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనాన్ని నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 65వ సంవత్సరం జరుగుతున్న వినాయక ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తారు కనుక ట్రాఫిక్ మళ్లింపు చేపడతామన్నారు. కరెంట్ ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా రాష్ట్రంలో అన్ని మతాల పండుగలు అద్భుతంగా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జనం రోజు ప్రజలు సహకరించాలని కోరారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దర్శనం చేసుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హుస్సేన్సాగర్లో లోతైన ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుందన్నారు. నగరంలోని వినాయకుల నిమజ్జనం కోసం 32 కొలనులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పోలీసు శాఖ, ఆర్&బీ, జీహెచ్ఎంసీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘మహాగణపతి’కి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులకు శుక్రవారం కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ లైబ్రరీ ప్రాంగణంలో మహాగణపతిని ప్రతి ఏటా మాదిరిగానే 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు ‘సప్తముఖ వినాయకుడిగా’ భక్తులకు దర్శనమిస్తారని శిల్పిరాజేంద్రన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నడూ తయారుచేయని విధంగా విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు సప్తముఖ వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతిని రూపుదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహాగణపతిని ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా వివిధ రంగులలో వినాయకుడి తలలు, ఆపై ఏడు తలల సర్పం, 14 చేతుల్లో వివిధ రకాల ఆయుధాలతో మహాగణపతి డిజైన్ను తయారుచేస్తున్నామన్నారు. మరో వారం పది రోజుల్లో ఈ డిజైన్ ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ప్రతీ సంవత్సరం సర్వేశాం ఏకాదశి సందర్భంగా నిర్వహించే కర్రపూజా కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధానకార్యదర్శి భగవంతరావు, శిల్పి రాజేంద్రన్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఖైరతాబాద్ మంటపంలో వినాయక విగ్రహానికి పూజలు చేసి అనంతరం కర్రను పాతారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గజ్జల నాగేష్, ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్, రాజ్కుమార్ నాయకులు మహేష్యాదవ్, మహేందర్బాబు, మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం తరపున మహాగణపతికి భారీ కండువా.... మహాగణపతికి ప్రతీ సంవత్సరం లాగానే పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం తరపున 75 అడుగుల భారీ గాయత్రి జంధ్యం, 75 అడుగుల భారీ చేనేత కండువా వినాయక చవితి రోజు సమర్పించనున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు కొండయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు కడారి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఏలే స్వామి శుక్రవారం తెలిపారు. -
ఖైరతాబాద్ వినాయకుడి వద్ద బారులు తీరిన భక్తులు
-
ఖైరతాబాద్ గణేష్కు 'మహాలడ్డు' సిద్ధం
ఖైరతాబాద్ వినాయకుడి (గణేష్) కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 'మహాలడ్డు' పూర్తి అయిందని తూర్పుగోదావరి జిల్లా, తాపేశ్వరం గ్రామంలోని సురుచి స్వీట్స్ అధినేత పీవీవీఎస్ మల్లిఖార్జునరావు శనివారం ఇక్కడ వెల్లడించారు. నాలుగు వేల కేజీల బరువు కలిగిన ఆ లడ్డును ప్రత్యేక వావానంలో రేపు హైదరాబాద్ తరలిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 70 మంది కార్మికులు గత వారం రోజులుగా నిరంతరం శ్రమించి ఆ లడ్డును తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ లడ్డు కోసం 1600 కేజీల పంచదార, 1000 కేజీల శనగపప్పు, 900 కేజీల నెయ్యి, 200 కేజీల జీడిపప్పు, 100 కేజీల బాదం పప్పు, 50 కేజీల ఏలకులు,10 కేజీల పచ్చ కర్పురం ఆ మహాలడ్డు తయారీలో వాడినట్లు మల్లిఖార్జునరావు వివరించారు. అలాగే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం చేతిలో ఉంచేందుకు 56 కేజీల లడ్డును తయారు చేసినట్లు, ఆ లడ్డును కూడా మహాలడ్డుతో పాటు పంపిస్తామని మల్లిఖార్జునరావు చెప్పారు.