LB Nagar-Ameerpet
-
మరోసారి ఆగిన మెట్రో రైలు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మరోసారి మొరాయించింది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రో రైలు శనివారం మధ్యాహ్నం సాంకేతిక కారణాలతో పంజగుట్ట స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను స్టేషన్లోనే దింపేశారు. ఫెయిల్ అయిన రైలును ఎర్రమంజిల్–పంజగుట్ట మధ్యలో ఉన్న పాకెట్ ట్రాక్లోకి మళ్లించి మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో ఎల్బీనగర్–మియాపూర్ మధ్య చాలాసేపు మెట్రో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమీర్పేట్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు అదనపు రైళ్లను నడపాల్సి వచ్చింది. మధ్యాహ్నం తరువాత ఎల్బీనగర్–మియాపూర్ మధ్య మెట్రో రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. -
ఎల్బీనగర్ స్టేషన్ నెం.1
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జర్నీకి గ్రేటర్ సిటీజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఒక్క ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచే అత్యధికంగా నిత్యం 30 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రారంభమైన రూట్లలో ఈ స్టేషన్లో ఎక్కి..దిగే ప్రయాణికులే అత్యధికం కావడం విశేషం. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో అత్యంత రద్దీ వేళల్లో ప్రతి 3.15 నిమిషాలకు ఒక మెట్రోరైలు నడుపుతున్నామని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు.ఈ ఏడాది సెప్టెంబర్ 24న ఈ మార్గంలో మెట్రోను ప్రారంభించిన విషయం విదితమే. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ, అదనపు సౌకర్యాలు తదితర అంశాలపై మంగళవారం రసూల్పురాలోని మెట్రో రైలు భవన్లో హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మార్గంలో స్థానికుల నుంచి చిన్న ఫిర్యాదులు మినహా ఎలాంటి అభ్యంతరాలు, అసౌకర్యాలు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. మెట్రో జర్నీ పట్ల స్థానికులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎల్భీనగర్–మియాపూర్ మార్గంలో నిత్యం 21 రైళ్లు, నాగోల్–అమీర్పేట్ రూట్లో నిత్యం 12 రైళ్లు మొత్తంగా 33 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఈ రెండు మార్గాల్లోనూ రద్దీ వేళల్లో ప్రతి 3.15 నిమిషాలకో రైలును నడుపుతున్నామని..సాధారణ వేళల్లో ప్రతి ఆరున్నర నిమిషాలకో రైలును నడుపుతున్నట్లు తెలిపారు. రద్దీ అత్యల్పంగా ఉండే సమయాల్లో ప్రతి 8 నిముషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తోందన్నారు. ఎల్బీనగర్– మియాపూర్ (కారిడార్–1)ల మధ్య ప్రతి రోజూ 284 ట్రిప్పులు, నాగోల్–అమీర్పేట్(కారిడార్3) రూట్లో నిత్యం 266 ట్రిప్పులు..మొత్తంగా రెండు మార్గాల్లో మొత్తం 550 ట్రిప్పుల ద్వారా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని ఎల్అండ్టీ మెట్రో ఎండీ కెవిబి రెడ్డి తెలిపారు. రికార్డు స్థాయిలో మెట్రో జర్నీ.. మెట్రో కారిడార్–1లో ప్రతి రోజూ సరాసరిన 1.25 లక్షల మంది ప్రయాణికులు, కారిడార్– 3లో 50 వేల మంది ప్రయాణిస్తున్నారని ఆయన అన్నారు. అక్టోబరు 22న రెండు మెట్రో కారిడార్లలో రికార్డు స్థాయిలో 1.90 లక్షలమంది ప్రయాణించారని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు సర్వీసులను ప్రజలు మరింత విరివిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనీల్ సైనీ, హైదరాబాద్ మెట్రో రైలు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ఎల్బీనగర్–అమీర్పేట్ మెట్రో నేడే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్వాసుల కలల మెట్రో రైలు ఎల్బీనగర్–అమీర్పేట్ (16 కి.మీ.) మార్గంలో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమీర్పేట్ మెట్రో స్టేషన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతా చోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్ బస్ డిపో, మలక్పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ–ఎంజీబీఎస్ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మెట్రో రెండో దశ ప్రారంభానికి రంగం సిద్ధం