mechine
-
స్టార్టప్స్కు ఏటా రూ.1.24 లక్షల కోట్ల నిధులు
స్టార్టప్(Startup)లకు ప్రభుత్వం అద్భుత మద్దతు ఇస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఈ సంస్థల సామర్థ్యాలను, విలువను దేశీయ ఇన్వెస్టర్లు గుర్తించారని అన్నారు. తొమ్మిదేళ్లలో భారతీయ స్టార్టప్స్ సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని వెల్లడించారు. ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు వెల్లువెత్తుతున్నాయన్నారు.‘ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు స్టార్టప్ల్లోకి వస్తున్నాయి. గరిష్టంగా ఇది 22–25 బిలియన్ డాలర్లను తాకుతోంది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో సిడ్బీ నిర్వహిస్తున్న ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (FFS) వంటి నిధుల సాధనాలు ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడానికి ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి పరివర్తన సాధనంగా పనిచేస్తున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కూడా స్టార్టప్లను ఆలోచన నుండి కార్యరూపం దశ వరకు ప్రోత్సహించడానికి పని చేస్తున్నాయి. 2024లో 76 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. జనవరి 15 నాటికి 1,59,157 నమోదిత స్టార్టప్లతో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా అవతరించింది. 2016లో దాదాపు ఈ సంఖ్య 500 మాత్రమే. పరిశ్రమ 17.2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించింది’ అని మంత్రి వివరించారు. కాగా, భారత్ స్టార్టప్ చాలెంజ్ను మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.ఇదీ చదవండి: అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు దేశీయంగా మెషీన్ల తయారీఆటో విడిభాగాల పరిశ్రమలు తయారీ మెషీనరీలను దేశీయంగా తయారు చేసుకోవాలని గోయల్ సూచించారు. ఆటో పరికరాల తయారీలో వినియోగిస్తున్న మెషీన్లను దేశీయంగా రూపొందించుకోవాలని తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. కొన్ని కంపెనీలు విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయని, ఇవి తదుపరి దశలో పోటీ నుంచి తప్పుకోవలసి వస్తుందని పేర్కొ న్నారు. భవిష్యత్లో దేశీ ప్రొడక్టులు దిగుమతులకు పోటీగా రూపొందుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని కంపెనీలు ఇప్పటికే దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతులపై ఆధారపడుతున్నాయన్నారు. దేశీయంగా అందుబాటు ధరలలో అధిక నాణ్యతగల ప్రెసిషన్ ఇంజినీరింగ్తో విడిభాగాలను తయారు చేయగలవని, దీంతో దిగుమతులపై ఆధారపడే సంస్థలకు మనుగడ కష్టంకాగలదని ఆటో విడిభాగాల ఎక్స్పో 2025 సందర్భంగా గోయల్ స్పష్టం చేశారు. -
సాగులో యంత్రాలేవీ?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ సాగు నుంచి ఆధునిక శైలిలో పంటలు పండించే పద్ధతి పెరుగుతోంది. యంత్రాలకు తోడు డ్రోన్లు వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. విత్తనాలు వేయడం నుంచి ఎరువులు చల్లడం వరకు అన్ని రంగాల్లో డ్రోన్లు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు డ్రోన్లు అందుబాటులో ఉంచాలని ఆగ్రోస్ నిర్ణయించినా, ఆచరణలో మాత్రం అమలుకావడంలేదు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా వాటిని అందుబాటులోకి తెచ్చి రైతులకు అద్దెకు ఇవ్వాలని భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలుంటే, వాటన్నింటిలోనూ డ్రోన్లు అందుబాటులో ఉంచాలనుకున్నారు. కానీ ఇప్పటికీ డ్రోన్లతోపాటు వ్యవసాయ యంత్రాలను కూడా రైతులకు సబ్సిడీపై ఇవ్వడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణపై మార్గదర్శకాలను ఖరారు చేయడంలోనే వ్యవసాయశాఖలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. దుక్కు యంత్రాలు కూడాఇచ్చే దిక్కులేదా? రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. వ్యవసాయంలో విస్తీర్ణ పరంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్పత్తి కూడా అదే స్థాయిలో ఉంది. ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలై రైతులు విత్తనాలు చల్లుతూ, దుక్కులు చేస్తున్నారు. ఈ కీలకమైన సమయంలో రైతులు వ్యవసాయ పనిముట్ల కోసం ఎదురు చూస్తున్నారు. దుక్కు యంత్రాలు, తైవాన్ స్ప్రేయర్ వంటివి సైతం రైతులకు సబ్సిడీపై ఇచ్చే దిక్కు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఒక్కో డ్రోన్ రూ.10 లక్షలు... ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో ఇకపై డ్రోన్లను కూడా ఇవ్వాలని నిర్ణయించారు. డ్రోన్ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల తక్కువ మొత్తంలో నీరు, పురుగుమందులు అవసరమవుతాయి. విత్తనాలు చల్లడంలో డ్రోన్లను వినియోగించడం వల్ల కచ్చితత్వం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎరువులను డ్రోన్ల ద్వారా చల్లితే ప్రతీ మొక్కకు చేరుతుందని భావిస్తున్నారు. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు అవుతుందని అంచనా వేశారు. అయితే సీజన్ మొదలైనా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల సరఫరాపై స్పష్టత రాలేదు. కూలీలు దొరక్క రైతుల అవస్థలు దుక్కు యంత్రాలను బయట మార్కెట్లో కొనాలంటే ధరలు భరించడం కష్టం. మరోవైపు కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సబ్సిడీపై యంత్రాలను ఇవ్వాలి. 2018 వరకు భారీగా ట్రాక్టర్లు సహా వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ప్రభుత్వమే ఇచ్చింది. వ్యవసాయ యంత్రాలు తీసుకునే ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. ఐదేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏమయ్యాయి? వరి సాగు భారీగా ఉండటంతో రాష్ట్రంలో కోత యంత్రాలకు కొరత ఏర్పడుతోంది. ఒక్కసారే కోతకు రావడంతో మిషిన్లు అందుబాటులో లేక అనేక సార్లు వడగండ్లకు, వర్షాలకు పంట నష్టపోతున్నారు. దీంతో ఓలా, ఊబర్ మాదిరి వ్యవసాయానికి సంబంధించిన భారీ కోత, నాటు మిషిన్లు బుక్ చేసుకుంటే అద్దెకు పంపించేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని గతంలో వ్యవసాయశాఖ చెప్పింది. అయితే ఇంతవరకు కస్టమ్ హైరింగ్సెంటర్లు ఎలా ఉండాలి? ఎవరి ఆధ్వర్యంలో నడిపించాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. -
యంత్రాలు మనుషులయ్యే రోజు మరెంతో దూరంలో లేదు!
వాషింగ్టన్: మనుషుల్లా ఆలోచించడం యంత్రాలవల్ల సాధ్యమవుతుందా? ఒకవేళ అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో చూశాం. అయితే అది సినిమా కదా.. అని కొట్టిపారేయలేం. ఎందుకంటే.. యంత్రా లు కూడా మనుషుల్లా ఆలోచించే రోజు మరెంతో దూరంలో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వాదనకు బలం చేకూర్చేలా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ న్యూరల్ నెట్వర్క్ చిప్ను తయారుచేశారు. ఈ చిప్లో ఉన్న నెట్వర్క్ సిస్టమ్ను రిజర్వాయర్ కంప్యూటింగ్ సిస్టమ్గా పిలుస్తున్నారు. ఎందుకంటే... ఏ సందర్భాల్లో మనిషి ఎలా ఆలోచిస్తున్నాడనే వివరాలను సేకరించి, నిక్షిప్తం చేయడం ఈ రిజర్వాయర్ కంప్యూటింగ్ సిస్టమ్ ప్రత్యేకత. ఈ చిప్లను యంత్రాలకు అనుసంధానించడంవల్ల వాటికి మనుషుల్లా ఆలోచించే శక్తిసామర్థ్యాలు సమకూరుతాయని చెబుతున్నారు. ఇప్పటిదాకా రూపొందిన రోబోలు ముందుగా నిక్షిప్తం చేసిన ప్రోగ్రామ్ ద్వారా పనిచేస్తున్నవే. ప్రత్యేక పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజా చిప్ల ద్వారా ఈ గందరగోళానికి తెరపడుతుందని, ఎటువంటి సందర్భాల్లో మనిషి ఏ రకంగా ఆలోచిస్తున్నాడనే విషయాన్ని రిజర్వాయర్ కంప్యూటింగ్ సిస్టమ్ను విశ్లేషించి, నిర్ణయం తీసుకుంటాయని చెబుతున్నారు. -
నోరూరించే గవ్వలు.. వాహ్వా అనిపించే జంతికలు
చిటెకలో తయారు చేసే యంత్రం ఇటలీ నుంచి రప్పించిన అనకాపల్లి శాస్త్రవేత్తలు బెల్లం వినియోగం పెంచడమే ప్రధాన లక్ష్యం అనకాపల్లి: బెల్లం వినియోగాన్ని మరింత పెంచేలా వివిధ రకాల వంటలు, ఆహార పదార్ధాలను తయారు చేసే యంత్రాలను అనకాపల్లి పంటకోత అనంతర పరిజ్ఞానం శాస్త్రవేత్తలు విదేశాల నుంచి రప్పించారు. దీనిలో భాగంగానే ఫుడ్ ఎక్స్ట్రూడర్ అనే యంత్రం అనకాపల్లి చేరుకుంది. ఇటలీ దేశంలో రూపొందించిన ఈ యంత్రం ఖరీదు రూ.9.70 లక్షలు. చిటెకలో గవ్వలు, జంతిక కాడల తయారీ ఈ యంత్రం సహాయంతో చిటెకలో గవ్వలు, జంతిక కాడల ఆకారంలోని పిండి పదార్ధాలను తయారు చేయవచ్చు. పింyì , నూనె కలిపి ఈ యంత్రంలో వేస్తే గంటలో 25 కేజీల పిండిని కావాల్సిన గవ్వలు, జంతిక కాడల రూపంలోకి మార్చేస్తుంది. సాధారణంగా పిండి పదార్ధాలతో కూడిన గవ్వలు, జంతికల కాడలను తయారు చేసేందుకు ఒక కేజీకి ఒక రోజు పడుతుంది. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ పరిధిలో జంతిక కాడలు, గవ్వల ఆకారంలో తయారు చేసేందుకు కొత్తగా రప్పించిన యంత్రం ఉపయోగపడుతుందని అనకాపల్లి పంటకోత అనంతర పరిజ్ఞాన విభాగ శాస్త్రవేత్త పి.వి.కె.జగన్నాథరావు చెబుతున్నారు. బెల్లం తలసరి వినియోగం పెంచేందుకు... అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పంటకోత అనంతర పరిజ్ఞాన విభాగం ఆధ్వర్యంలో బెల్లాన్ని పొడి రూపంలోనూ, ద్రవరూపంలో తయారు చేశాం. బెల్లం చాక్లెట్లు, బెల్లం కుకీస్, బెల్లం టాబ్లెట్లను కూడా రూపొందించాం. ఇటలీ నుంచి తీసుకొచ్చిన ఈ యంత్రం ద్వారా తయారు చేసే గవ్వలు, జంతిక కాడలను తీపిగానూ, కారంగానూ తయారు చేయవచ్చు. ముందుగా తీసుకున్న పిండిపదార్ధం, నూనెకు బెల్లాన్ని కలిపితే తీపిగానూ, తగిన పాళ్లలో కారం, ఉప్పు కలిపితే కారంగానూ రుచి వస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే బెల్లం తలసరి వినియోగాన్ని పెంచడమే ఈ ప్రయత్నం ఉద్దేశం. ఇటువంటి యంత్రాల సహాయంతో కావాల్సిన పిండి పదార్ధాలకు బెల్లాన్ని జోడిస్తే ఆ రుచే వేరు. తద్వారా బెల్లం వినియోగాన్ని పెంచుతూ చెరకు రైతులకు మేలు చేయడమే ఈ పరిజ్ఞాన లక్ష్యం. –శాస్త్రవేత్త పి.వి.కె.జగన్నాథరావు