breaking news
minority corporation
-
‘మాటపై నిలబడి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా’?
రాజమహేంద్రవరం సిటీ: ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వంద రోజుల శిక్షణ పొందిన ముస్లిం మహిళలకు కుట్టుమెషిన్ల పంపిణీ వ్యవహారం వైఎస్సార్ సీపీదే తప్ప ప్రభుత్వానిది కాదని వక్ఫ్ బోర్డు మాజీ జిల్లా అధ్యక్షుడు ఎండీ కరీంఖాన్ అన్నారు. ఈ మెషీన్ల పంపిణీ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని పిలువలేదంటూ టీడీపీకి చెందిన ముస్లిం నేతల విమర్శలను ఆయన ఖండించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనారిటీ సంస్థ ద్వారా ఈ మెషీన్లు మంజూరైనట్టు చెప్పారు. ఆ మెషీన్లు పాడయ్యే పరిస్థితి రావడంతో ప్రముఖులతో పంపిణీ తామే చేపట్టామన్నారు. ఎమ్మెల్యే భవాని అంటే గౌరవం ఉందని, వైఎస్సార్ సీపీకి చెందిన విషయం కావడంతో ఎమ్మెల్యేను ఆహా్వనించలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరైనట్టు ప్రకటించారని, అయితే జీఓలే నిధులు మంజూరు కాలేదన్నారు. ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో చెబితే ముస్లిం సంక్షేమానికి ఖచ్చు చేస్తామన్నారు. టీడీపీ పాలనలో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. మాటపై నిలబడి సుభాన్ రాజకీయాల్లోంచి తప్పుకుంటారా? కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సోషల్ మీడియాలో టీడీపీ నాయకుడు షేక్ సుభాన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ మాటపై నిలబడి రాజకీయాల నుంచి ఆయన వైదొలగాలని అన్నారు. సుభాన్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నగరంలో ముస్లింల ఆస్తులు కారుచౌకగా లీజుకు ఇచ్చిన టీడీపీ నాయకులు ఆర్థికంగా ఫలితాలు పొందారన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ మైనార్టీ సెల్ నాయకుడు మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం పురస్కారం పేరు మార్పు విషయంలో అధికారుల అత్యుత్సాహానికి పాల్పడ్డారనే విషయం సీఎం గుర్తించారన్నారు. రాష్ట్రంలో ముస్లింలు సీఎం వెన్నంటి ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేసి ఉన్న పరువు పోగొట్టుకోవద్దని సలహా ఇచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ముస్లిం నాయకులు సయ్యద్ రబ్బాని, నయూమ్ భాయ్, హసన్, సయ్యద్ మదీనా, గౌస్, ఆరిఫ్ ఉల్లాఖాన్, షేక్ మస్తాన్, అమనుల్లా బేగ్, సయ్యద్, ఈసా మొగల్, అల్తాఫ్, షరీఫ్ పాల్గొన్నారు. -
మైనారిటీ రుణాలపై.. అధికార పెత్తనం
కర్నూలు నగరంలోని ఖడక్పురాకు చెందిన మైమున్ బేగం (బాధితురాలి విన్నపం మేరకు పేరు మార్చాం) శారీ బిజినెస్ కోసం రూ.లక్ష రుణం కావాలని దరఖాస్తు చేసుకుంది. రుణం ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు కూడా అంగీకరించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఆమె మైనారిటీ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉంది. అయితే..ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. అధికార పార్టీ నేతల సిఫారసు లేకపోవడమే ఇందుకు కారణం. కర్నూలుకు చెందిన అధికార పార్టీ చోటా నాయకుడు ఇటీవలే మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తాను టీడీపీ ముఖ్య నేత అనుచరుడినని, అన్న చెప్పారు.. వీరికి రుణాలు మంజూరు చేయాలంటూ పాతిక మంది పేర్లతో కూడిన జాబితా ఇచ్చారు. ఇంత మందికి ఒకేసారి రుణాలు ఎలా మంజూరు చేయాలో తెలియని స్థితిలో అధికారులు తల పట్టుకున్నారు. కర్నూలు(రాజ్విహార్): జిల్లాలో మైనారిటీ కార్పొరేషన్ రుణాలపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఆర్థికాభివృద్ధి కోసం రుణాలకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారు. తాము చెప్పని వాళ్లకు రుణాలు ఇస్తే ఇక్కడ ఉద్యోగం చేసుకోలేరంటూ అధికారులను బెదిరించడానికీ వెనుకాడడం లేదు. వారి అనుచరులు, అనుయాయులకు మాత్రమే రుణాల మంజూరు కోసం సిఫారసు చేస్తున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,536 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు రూ.46.02 కోట్ల సబ్సిడీ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం అరకొరగానే నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటివరకు రూ.16.07 కోట్లు విడుదల కాగా.. 2,269 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 2,267 మంది అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రుణాలు మంజూరైన వారిలో అత్యధిక శాతం అధికార పార్టీ నాయకుల నుంచి సిఫారసులు పొందిన వాళ్లే కావడం గమనార్హం. మంజూరు ప్రక్రియ ఇలా.. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఇందుకోసం నిర్ణీత గడువులోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రింట్ కాపీ, ఇతర ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. మునిసిపాలిటీల్లో నివసించే వారైతే సంబంధిత మునిసిపల్ కార్యాలయం, గ్రామీణులైతే ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై దరఖాస్తుకు ఆమోదముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. అడిగింది ఇస్తేనే సిఫారసు అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల సిఫారసు ఉంటేనే రుణాలు మంజూరవుతున్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు మునిసిపాలిటీలు/ మండల పరిషత్ కార్యాలయాల్లో అప్రూవ్ కావాలంటే అధికార పార్టీ నేతల అనుమతి తప్పనిసరిగా మారింది. అక్కడ ఎలాగో చెప్పుకుని దాటి వస్తే మైనారిటీ కార్పొరేషన్లో పెండింగ్ పెడుతున్నారు. అడిగినంత ఇస్తేనే సిఫారసు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎంపీడీఓ, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహించే ఇంటర్వ్యూల్లో ఎంపిక కోసం రూ.2వేల నుంచి రూ.5వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఐదేళ్లుగా అరకొరే జిల్లాలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లుగా రుణాలు అరకొరగానే మంజూరవుతున్నాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 2,165 మందికి గాను 1,304 మంది మాత్రమే మంజూరు చేశారు. అలాగే 2014–15లో కేవలం 360 మందికి, 2015–16లో 3,863 మందికి గాను 2,262 మందికి, 2016–17లో 2,395 మందికి గాను 1,323 మందికి మంజూరు చేశారు. 2017–18లో 2,578 మందికి, 2018–19లో 4,536 మందికి గాను ఇప్పటివరకు 2,269 మందికి మాత్రమే రుణాలిచ్చారు. -
మైనార్టీ గురుకులాలకు మరో 1,863 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ : మైనార్టీ గురుకుల పాఠశాలలకు కొత్తగా 1,863 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. వీటిని రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమావేశమయ్యారు. మైనార్టీ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలున్నాయని అధికారులు ప్రస్తావించగా సీఎస్ పైవిధంగా స్పందించారు. ఇటీ వల రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1,321 మంది టీచర్లను నియమించినట్లు గుర్తు చేశారు. జిల్లాల్లోని వక్ఫ్ ఆస్తుల జాబితాను రూపొందించాలని, ఆ భూములను విద్యా సంస్థల నిర్మాణానికి వినియోగించేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. మైనార్టీ యువతకు వివిధ రంగాలలో మెరుగైన శిక్షణను అందించడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేయాలని సూచించారు. షాదీ ముభారక్ ద్వారా 24,662 మం ది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 11,746 మందికి మంజూరు చేశామని, మిగతా వాటికి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. విదేశీ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు 968 మందిని ఎంపిక చేసి రూ.109 కోట్లు ఖర్చు చేశామన్నారు. మల్టీ సెక్టో రల్ డెవలప్మెంట్కు సంబంధించి 2016–17లో 7 మైనార్టీ గురుకులాల నిర్మాణానికి కేంద్రం రూ.126 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. మొదటి దశలో కేంద్రం రూ.37.80 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.25.20 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే 2017–18లో మరో 6 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూ రు చేసిందని, కేంద్ర వాటా కింద రూ.10.08 కోట్లు, రాష్ట్ర వాటా కింద రూ.21.60 కోట్లు విడుదలయ్యా యని వెల్లడించారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవ లప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా సివిల్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. -
ఉపకారవేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఉపకార వేతనాల దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ బాబా తాజుద్దీన్ తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 వ తరగతి, ఇంటర్, పీహెచ్డీ, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనార్టీలు కేంద్ర ప్రభుత్వం అందించే పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ ఉపకార వేతనాల కోసం ఈ నెల 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను http://scholarships.gov.in వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. తెల్లరేషన్కార్డు దారులు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాల్సిన అవసరం లేదన్నారు. పింక్ రేషన్ కార్డు కలిగిన వారు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాలన్నారు. దరఖాస్తులను ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు ఆన్లైన్లో పరిశీలించి ఫార్వర్డ్ చేయాలన్నారు. వివరాలకు 08554–246615 నంబర్లో సంప్రదించాలన్నారు. -
జెరూసలెం యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(రాజ్విహార్): జెరూసలెం యాత్రకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అంజాద్ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజుల ఈ యాత్రకు అర్హత కలిగిన వారికి రూ.40వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. వివరాలకు ఫోన్ 98488 64449, 08518 277153 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు(రాజ్విహార్): డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరు మహమ్మద్ అంజాద్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్(2015–16 సంవత్సరాల్లో) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులని, వీరికి హైదరాబాద్, మిర్యాలగూడ..తదితర ప్రాంతాల్లోని రెడ్డీస్ సంస్థల్లో రెండేళ్ల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఏడాదికి రూ.1.45లక్షల వరకు ఉపకార వేతనం ఇవ్వడంతోపాటు పై చదువుకు చేయుతనివ్వనున్నట్లు తెలిపారు. సబ్సిడీపై క్యాంటీన్, హాస్టల్ సౌకర్యం కల్పిస్తారని, అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి 20 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియేట్ ఎంపీసీ, బైపీసీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ 08518 277153, 91601 05162, 98499 01149 నంబర్లుకు సంప్రదించవచ్చని తెలిపారు. -
కానిస్టేబుల్ ఉద్యోగాల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు అర్బన్ : ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ మతాలకు చెందిన యువతీ యువకులకు పోలీస్ కానిస్టేబుల్, జైలు వార్డెన్ ఉద్యోగాలకు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ హురియ ఖానమ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి 18 నుంచి 22 ఏళ్ల లోపు ఉండి కనీసం 167 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపిఎస్ఎమ్ఎఫ్సీ సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీ స్టేట్ మైనార్టిస్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏలూరు చిరునామాకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 08812–242463, 9849901162 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
‘అవినీతి సొమ్ముకోసం వాదులాడుకోవడం సిగ్గుచేటు’
శాయంపేట : ప్రజా సమస్యలు గాలికొదిలేసి అవినీతి సొమ్ముకోసం ఎంపీపీ బాసని రమాదేవి, ఎంపీడీఓ బానోతు భద్రునాయక్ వాదులాడుకోవడం సిగ్గుచేటని టీడీపీ మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాల జాబితా ఎంపికలో అన్యాయం జరిగిందని, అవేమి పట్టించుకోకుండా ఇలా మండలంలో ఉన్నతస్థానంలో ఉండి ఇలా వాదులాడుకోవడం సరైందికాదన్నారు. టీడీపీ మండల ప్రధానకార్యదర్శి వైనాల కుమారస్వామి, రాజిరెడ్డి, తడక కుమారస్వామి, రమేశ్, చిందం రవి, పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
డ్వామా పీడీ వైవీ గణేశ్ ఉపాధి హామీ లైఫ్ ప్రాజెక్టుపై అవగాహన ముకరంపుర : ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సద్వినియో గం చేసుకుని అభివృద్ధి చెందాలని డ్వామా పీడీ వైవీ గణేశ్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి, నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలపై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం కొత్తగా లైఫ్ ప్రాజెక్టు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఉపాధిహామీలో రెండేళ్లపాటు వందరోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబంలోని 18-35 సంవత్సరాల యువతీయువకులను గుర్తించి వివిధ విభాగాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధిమార్గం చూపుతామన్నారు. వంద పనిదినాలు పూర్తిచేసిన కుటుంబాల్లో 12,857మందిని ఈ కార్యక్రమానికి ఎంచుకోగా.. 805 మందిని వృత్తి నైపుణ్యత శిక్షణకు, 693 మందిని స్వయం ఉపాధికి, 803మందిని జీవనోపాధికి ఎంపిక చేసినట్లు తెలిపారు. లేడీస్ టైలరింగ్, ఎలక్ట్రిక్ మోటార్ రివైండింగ్, పంప్సెట్ల నిర్వహణ, టీవీ, డీవీడీలు, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్ రిపేరింగ్, డెరుురీ నిర్వహణ, గొర్రెల పెంపకం, అగర్బత్తుల తయారీ, పేపర్బ్యాగ్లు, పేపర్ ప్లేట్ల తయారీ, బ్యూటీపార్లర్ నిర్వహణ, సెల్ఫోన్ల రిపేరు, కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ బేసిక్స్, లైట్ మోటార్ వాహనాల డ్రైవింగ్, బొమ్మల తయారీ, కూరగాయ ల నర్సరీ, సాగు, దుస్తుల అద్దకం, కొవ్వొత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు న్యాక్ ద్వారా ఎలక్ట్రీషియన్, ప్లంబర్ తదితర డిమాండ్ ఉన్న వృత్తులలో శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తమ అభిరుచిని బట్టి శిక్షణకు కార్యక్రమ స్థలివద్ద ఉన్న స్టాల్స్లో పలువురు పేర్లు న మోదు చేసుకున్నారు. మైనార్టీ ఈడీ హమీద్, జిల్లా ఉపాధికల్పనాధికారి రవీందర్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, ఎస్బీహెచ్ మేనేజర్ జయప్రకాశ్, నాక్ డెరైక్టర్ హేమా బూక్యా , వారధి కార్యదర్శి ఆంజనేయులు, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణం మేనేజర్ ఉమారాణి, ఉపాధికూలీల కుటుంబాలు పాల్గొన్నారు. -
‘మైనార్టీ కార్పొరేషన్’ పాలక మండలి రద్దు నిలిపివేత
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పాలక మండలిని రద్దు చేస్తూ దాని స్థానంలో ఉన్నతాధికారులతో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పా టైన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ను రద్దు చేసి దాని స్థానంలో మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎక్స్అఫీషియో చైర్మన్గా ఓ బోర్డును ఏర్పాటు చేసింది. దీనిని సవాలు చేస్తూ ఫైనాన్స్ కార్పొరేషన్ డెరైక్టర్లు సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జాఫ్రీ, షేక్ అన్వర్ భాషాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యా జ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన పాలక మండలికి 2017 వరకూ కాల పరిమితి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పాలక మండలి రద్దు నిబంధనలకు విరుద్ధమనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ, ఉన్నతాధికారుల బోర్డు ఏర్పాటు జీవో అమలును నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
మైనార్టీ కార్పొరేషన్ వ్యవహారంపై కలెక్టర్ ఆరా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా ఉన్నతాధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. నిరుపేద అర్హులైన లబ్ధిదారులకు చెందాల్సిన సుమారు రూ.48 లక్షలు పక్కదారి పట్టిన వ్యవహారం వెలుగు చూడటంతో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుబ్రమణ్య శాస్త్రి బుధవారం కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్ను కలిసి వివరణ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ కథనం జిల్లా వ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు మైనార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిలిచిన కొత్త రుణాల మంజూరు ఈ బ్యాంకు లింకేజీ సబ్సిడీ పథకంలో అవకతవకలు జరిగిన వ్యవహారంపై సదరు బ్యాంకులో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న విషయం విధితమే. దీంతో ఈ బ్యాంకు ఈ పథకానికి సంబంధించిన రుణాల మంజూరును పూర్తిగా నిలిపివేసింది. విజిలెన్స్ విచారణ పూర్తయ్యే వరకు కొత్త రుణాల మంజూరు నిలిపివేయాలని సదరు బ్యాంకు అధికారులకు ఆదేశాలందడంతో అర్హులైన లబ్ధిదారులు ఇప్పుడు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ విషయమై ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కొందరు ఇటీవల రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి రామన్నను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇంకా ‘లక్ష్యం’ లేని సంస్థ 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 2.77 లక్షల మంది అల్ప సంఖ్యాక వర్గాలు ముస్లిం, క్రిస్టియన్, బుద్దిస్టులు, సిక్కులు, జైన తదితర మతాలకు చెందిన వారున్నట్లు సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ వర్గాలకు చెందిన నిరుపేద మైనార్టీ యువతీ, యువకులకు ఆర్థిక చేయూతనందించేందుకు ఈ కార్పొరేషన్ ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2014-15కు సంబంధించి ఈ సంస్థకు ఇప్పటివరకు ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు దగ్గరపడుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం లక్ష్యం ఊసే లేకపోవడంతో ఈ సంస్థ సేవలు నిర్వీర్యమయ్యాయి. బ్యాంకు లింకేజీ సబ్సిడీ పథకం, సామూహిక వివాహాలు వంటి సంక్షేమ పథకాలు నీరుగారి పోతున్నాయి. ప్రస్తుతానికి స్కాలర్షిప్లకు పరిమితం ఇన్నాళ్లు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కార్పొరేషన్ ద్వారా ఉపకార వేతనాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ల కోసం జిల్లాలోని ఆయా విద్యా సంస్థల నుంచి దరఖాస్తులను తీసుకుంటున్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 20తోనే ముగియగా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది. -
సబ్సిడీ రుణాలు ఏవీ !
బాన్సువాడ, న్యూస్లైన్ : బాన్సువాడకు చెందిన షంషొద్దీన్ అనే మెకానిక్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాల కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకొన్నాడు. సార్వత్రిక ఎన్నికల కారణంగా సబ్సిడీ రుణాల ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి వారం రోజులైనా నిధులు విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతోంది.. ఈ నేపథ్యంలో తనకు రుణం అందిస్తారో లేదో అనే ఆందోళనలో అతను ఉన్నాడు.. ఇది ఒక్క షంషొద్దీన్కే కాదు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,బీసీ, వికలాంగ యువతీ యువకుల్లో నెలకొన్న ఆందోళన. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనవరి నెలలో అప్పటి కిరణ్కుమార్రెడ్డి సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు 50శాతం సబ్సిడీపై రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. లక్ష రూపాయల సబ్సిడీ తీసుకొంటే 50వేలు బ్యాంకు ద్వారా,50వేలు సంబంధిత కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ అందజేస్తారు. ఒక కుటుంబంలో ఒకరికే అవకాశం కల్పించడంతో పాటు వారికి ఐదేళ్ళ పాటు మరోమారు రుణం ఇవ్వరు. అయితే సబ్సిడీ శాతం పెరగడంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన యువతీ యువకులు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకొన్నారు. యుద్ధప్రాతిపదికన జరిగిన ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన ఆయా కార్పొరేషన్ల అధికారులు, లబ్ధిదారులకు సంబంధించిన జీరో అకౌంట్ బ్యాలెన్సులతో బ్యాంకుల్లో ఖాతా సైతం తెరిచారు. 2లక్షల రుణం తీసుకుంటే లక్ష సబ్సిడీ రూపంలో వస్తుందని తెలుసుకొని దరఖాస్తు చేసుకొన్నారు. అయితే గత రెండు రోజుల్లో కొందరికే సబ్సిడీ మంజూరైంది. 2లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి సబ్సిడీ విడుదల కాలేదు. ఒక్క మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారానే జిల్లా వ్యాప్తంగా 1,292 మంది నిరుద్యోగ మైనారిటీ యువ తీయువకులకు రుణాలు ఇవ్వడానికి ఎంపిక చేయగా, ఒక్కో మండలానికి సగటున 50 మందికి రుణాల మంజూరీ ఇచ్చారు. దీని ద్వారా రాయితీ రూపంలో సుమారు 10 కోట్ల వరకు లబ్ధి పొందనున్నారు. గతంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లక్ష రుణం తీసుకుంటే గరిష్టంగా 30వేల సబ్సిడీ అందించే వారు. ఇప్పుడు దీనిని 50వేలకు పెంచారు. ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి కల్లా ఈ లక్ష్యం పూర్తి కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో సబ్సిడీ రుణాల ప్రక్రియ నిలిచిపోయింది. సబ్సిడీ రుణాలు వస్తున్నాయనే ఉత్సాహంలో అనేక మంది నిరుద్యోగులు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకొనేందుకు వడ్డీపై వస్తుసామాగ్రిని కొనుగోలు చేశారు. కొందరు కొత్తగా వ్యాపారాలు పెట్టడానికి మడిగెలను అద్దెకు తీసుకొని ప్రస్తుతం వేలకు వేలు చెల్లిస్తున్నారు. ఇలా వేలాది మంది తమకు సబ్సిడీ రుణాలు వస్తాయనే ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 24లోపే రాష్ట్రంలోని అన్ని పద్దులను సరిచేసుకోవాల్సి ఉంది. దీంతో తమకు సబ్సిడీ రుణాలు వస్తాయా? లేదా? అనేది స్పష్టం కావడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఈ విషయమై అధికారులు సైతం ఏ మాత్రం స్పందించడం లేదు. -
రాజన్నకు రుణపడి ఉన్నాం
50 శాతం సబ్సిడీతో కొత్తగా రుణాలు.. వైఎస్సార్ రుణాలు మాఫీ చేయడంతోపాటు‘మార్జిన్ మనీ’ పథకాన్ని తొలగించి 50శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. రూ.2.50 లక్షల్లోపు రుణాలకు 50శాతం మైనారిటీ కార్పొరేషన్, రూ. 40శాతం బ్యాంకులు, 10శాతం లబ్ధిదారుని వాటాగా పెట్టారు. ఇందులో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పూర్తిగా మాఫీ (తిరిగి చెల్లించనవసరం లేదు) అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ముస్లిం మహిళల అంతరంగం వైఎస్ ఆశయాలు నెరవేరాలంటే జగన్ సీఎం కావాలి కర్నూలు(రాజ్విహార్), న్యూస్లైన్: మైనారిటీ కార్పొరేషన్, బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడి మంజూరు చేయించుకున్న రుణాలకు సంబంధించి నెలనెలా కంతులు, వడ్డీలు చెల్లించలేక పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. స్వయం ఉపాధి కింద ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్న కుటీర పరిశ్రమలు సక్రమంగా నడవక, వచ్చిన సొమ్ముతో కటుంబాన్ని పోషించుకోలేక, గడువు కోసం.. నెల తిరక్కుండానే రుణాల చెల్లించాలని వచ్చే అధికారుల కాళ్లవేళ్లా పడలేక రుణ పీడితులు ఎదుర్కొన్న సమస్యలు అనేకం. అప్పులు కట్టలేక, కొత్తగా రుణాలు పొందలేక పడుతున్న కష్టాలను గమనించిన మహానేత.. పీడితులకు అండగా నిలిచారు. చంద్రబాబు హయాం నుంచి 2008 వరకు మైనారిటీలు తీసుకున్న రుణాలను మాఫీ చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 400 కోట్ల రుణాలు మాఫీ చేసి తమ భారాన్ని దింపిన రాజన్నకు రుణపడి ఉన్నామని, ఆయన ఆశయాలు నెరవేర్చే వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటామని మైనారిటీలు తేల్చి చెబుతున్నారు. నిబంధనాల నుంచి విముక్తి.. వైఎస్సార్ మైనారిటీ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ముస్లింలతోపాటు ఇతర మైనార్టీలుగా గుర్తింపు ఉన్న క్రైస్తవులు, బౌద్ధులు, పార్శియులకు రుణాలు అందజేశారు. రుణం నుంచి విముక్తి.. 2008లో రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా ముస్లింలకు కూడా లక్షరూపాయలలోపు రుణాలను మాఫీ చేశారు. అదే సంవత్సరం మార్చి 31 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో జిల్లాలో 30వేల మందికి పైగా ముస్లింలకు రుణభారం నుంచి విముక్తి లభించింది. బ్యాంకబుల్ స్కీమ్స్, ఇందిరా మహిళ అభివృద్ధి యోజన (తాత్కాల్), మైక్రో క్రెడిట్ టూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డోమా గ్రూప్స్ మ్యాచింగ్ గ్రాంట్స్, మౌలానా అబుల్ కలాం అజాద్ ఎడ్యుకేషనల్ లోన్స్, దుకాన్- మకాన్, ఆటో నగర్, రాజీవ్ సనత్కార్ యోజన, ఎన్ఎండీ ఎఫ్సీ డెరైక్టు లోన్, ఒకేషనల్ ట్రైనింగ్ ప్రొగాం, స్మాల్ డెరైక్టు లోన్స్ తదితర స్కీంల కింద పొందిన రుణాలన్నింటినీ మాఫీ చేసి బాధితులకు విముక్తి కల్పించారు. వైఎస్ రుణం తీర్చుకోలేనిది వైఎస్సార్ మా ముస్లింలకు చాలా మేలు చేశారు. మేము 2006లో రూ.50వేల రుణం తీసుకున్నాం. అవి బ్యాంకు లింకేజీ కావడంతో నెలనెలా చెల్లించేవాళ్లం. రాజన్న ఆ కష్టాలు తొలగించారు. ఆయన రుణం తీర్చుకోలేం. - నసీంబాను, సహారా పొదుపు గ్రూపు, కర్నూలు రాజన్న కొడుకే సీఎం కావాలి వైఎస్సార్ మా రుణాలు మాఫీ చేసి చాలా మేలు చేశారు. ఆయన మరణించినప్పుడు సొంత మనిషి చనిపోయినంత ఆవేదన కల్గింది. ఆయన కొడుకు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మళ్లీ అలాంటి మేలే చేస్తారు. - షమీమ్ బాను, సహారా గ్రూపు