Mobile phones manufacture
-
ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని మరింత విస్తృతం చేయాలని, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచి్చంది. అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నా భారత ఆరి్థక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నా యని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)/ విదేశీ మారక నిల్వలు దండిగా ఉన్నాయంటూ, వీటిని తమ ఆరి్థక రంగ బలానికి నిదర్శనంగా చూపించారు. యాపిల్, డెల్, ఒప్పో, శామ్సంగ్, తదితర దిగ్గజ ఎల్రక్టానిక్స్, మొబైల్ కంపెనీల సీఈవోలతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ఢిల్లీలో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. భారత్ తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా నిలుస్తోందని పేర్కొంటూ, భారత్ పట్ల మరింత శక్తితో, నిబద్ధతతో వ్యవహరించాలని వారిని కోరారు. కేవలం మొబైల్, ఆటోమోటివ్ ఎల్రక్టానిక్స్లోనే కాకుండా వ్యూహాత్మక, రక్షణ, వైద్య సంబంధిత ఎల్రక్టానిక్స్, రోబోటిక్స్పైనా పెట్టుబడులు పెంచాలని మంత్రి వారికి పిలుపునిచ్చారు. భారత్ను అంతర్జాతీయ ఎగుమతులకు కేంద్రంగా చేసుకోవాలని కోరారు. 5జీతో వృద్ధి మరింత పరుగు వృద్ధి అనుకూల ప్రభుత్వం, పెట్టుబడులకు అనుకూల విధానాలు, భారత మార్కెట్ బలం, నైపుణ్య మానవ వనరులు, డిజిటల్ సామర్థ్యాలు కలిగిన భారత్.. ఎల్రక్టానిక్స్ తయారీ, ఎగుమతుల కేంద్రంగా అవతరిస్తుందన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల (రూ.28.43 లక్షల కోట్లు) ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకున్న విషయం గమనార్హం. వృద్ధికి 5జీ నూతన సరిహద్దుగా పేర్కొన్నారు. 5జీ విజ్ఞాన ఆధారిత ఆరి్థక వ్యవస్థగా అవతరించాలని భారత్ కోరుకుంటోందన్నారు. -
సెల్కాన్ ఆర్అండ్డీ హబ్
♦ గచ్చిబౌలిలో 20 అంతస్తుల్లో ♦ 2018కల్లా హబ్ సిద్ధం చేస్తాం ♦ ‘సాక్షి’తో సెల్కాన్ సీఎండీ వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్... రీసెర్చ్, డెవలప్మెంట్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొబైల్ ఫోన్ల కాన్సెప్ట్ మొదలు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వంటి విభాగాలన్నీ ఒకేచోట కేంద్రీకృతం చేయాలన్నది కంపెనీ ఆలోచన. గచ్చిబౌలిలో ప్రతిపాదిత మొబైల్ ఆర్ అండ్ డీ హబ్లో సెల్కాన్కు ఒక ఎకరం స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్రం నుంచి పలు ప్రోత్సాహకాలను అందుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళతామని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మొబైల్స్ తయారీ విషయంలో వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ హబ్ను నిర్మిస్తామని చెప్పారు. కంపెనీలన్నీ ఒకేచోట..: ప్రస్తుతం సెల్కాన్కు చైనాలోని ఆర్ అండ్ డీ కేంద్రంలో 100 మంది, బెంగళూరు టెక్నోవేషన్ కేంద్రంలో 400 మంది నిపుణులు ఉన్నారు. ఈ రెండు కేంద్రాలను హైదరాబాద్కు తరలిస్తారు. సెల్కాన్తో దాదాపు 20 కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. వీటన్నిటినీ ఒకే గూటి కిందకు తేవాలన్నది తమ ప్రణాళిక అని గురు వెల్లడించారు. ఆగస్టులో శంకుస్థాపన చేసి, 2018కల్లా 20 అంతస్తుల్లో హబ్ను పూర్తి చేస్తామని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో తొలి కేంద్రం అవుతుందని వివరించారు. హబ్ నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటుకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కాగా, నెలకు 10 లక్షల మొబైళ్ల తయారీ సామర్థ్యంతో నిర్మిస్తున్న తిరుపతి ప్లాంటును జూన్లో ప్రారంభించేందుకు సెల్కాన్ సిద్ధం అవుతోంది. టెక్నోవేషన్ నుంచి..: సెల్కాన్ త్వరలో క్లిక్ అనే స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తోంది. బెంగళూరు టెక్నోవేషన్ కేంద్రంలో అభివృద్ధి అయిన తొలి ఉత్పాదన ఇది. 180 డిగ్రీల పనోరమిక్ వ్యూలో చిత్రాలను ఈ ఫోన్ ద్వారా తీయవచ్చు. జిఫ్ ఫైల్ మాదిరిగా 3 సెకన్లపాటు వీక్షించగలిగే లైవ్ ఫొటో, ఎలాంటి హెడ్ సెట్లో అయినా సంగీతం శ్రావ్యంగా వినిపించే కస్టమైజ్డ్ మ్యూజిక్ ప్లేయర్ను జోడించారు. బ్యాటరీ 10%కి రాగానే ఇందులోని సూపర్ పవర్ సేవర్ ఫీచర్తో స్మార్ట్ఫోన్ కాస్తా బేసిక్ ఫోన్గా మారిపోతుంది.