Mollywood
-
షూటింగ్ ముగించుకుని వస్తుండగా అపహరణ.. నేనేం తప్పు చేశానని భయపడాలి?
కిందపడగానే పైకి లేస్తాం.. దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాసుకుంటాం.. అలాగే నేరం జరగగానే పోలీసులను సంప్రదించాను అంటోంది హీరోయిన్ భావన. మలయాళంలో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో భావన (Actress Bhavana) జీవితంలో పెద్ద కుదుపు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.ఎందుకు భయపడాలి?ఈ కేసులో హీరో దిలీప్ కుమార్ రెండునెలలపాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. తాజాగా భావన.. ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. నేను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు వెనకడుగు వేయాలి? అందుకే ఏదీ ఆలోచించకుండా నాకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో అదే కరెక్ట్ అనిపించింది, చేశాను. అయితే అప్పుడది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. మౌనంగా ఉంటే..నేనేదో గొప్ప పని చేశానని ఇప్పటికీ అనుకోను. మౌనంగా ఉంటే సమస్య ఇంకా పెద్దదవుతుంది కదా అనిపించింది. నాకు నేను సర్ది చెప్పుకుని మౌనంగా ఉండి.. కొన్నేళ్ల తర్వాత బయటకు చెప్పాననుకోండి.. ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్గా ఉన్నావంటారు. అందుకే ఆ క్షణమే పోలీసులను ఆశ్రయించాను అని చెప్పుకొచ్చింది. భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, హీరో చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది.చదవండి: నాకు పొగరనుకున్నారు.. సినిమా ఛాన్సులు కోల్పోయా: యష్ -
మెగాస్టార్ ఇంట్లో బస చేసే ఛాన్స్.. రోజుకు రూ.75,000!
హీరోలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కాస్ట్లీ బంగ్లాలో నివసిస్తారు. వారిని చూసేందుకు స్టార్ హీరోల ఇంటిముందు పడిగాపులు కాస్తుంటారు ఫ్యాన్స్. అంతేకాదు.. కథానాయకుల లైఫ్స్టైల్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? ఎక్కడకు వెళ్తుంటారు? ఇంద్రభవనంలాంటి ఇల్లు లోపల ఎలా ఉంటుంది? ఇలా అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. అందుకే ఓ హీరో బంపరాఫర్ ఇస్తున్నారు. తన ఇంట్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే హోటల్ మాదిరిగానే ఇక్కడ కూడా రోజుకింత అని డబ్బు కట్టి ఉండొచ్చట.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ ఇల్లు ఎక్కడ అనేది పూర్తి కథనంలో చదివేయండి..ఇంటిని అభిమానుల కోసం..మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)కి కేరళ కొచ్చిలోని పనంపిల్లి నగర్లో ఓ ఇల్లుంది. భార్య సుల్ఫాత్, కుమారుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), కూతురు కుట్టి సురుమితో కలిసి 2008 నుంచి 2020 వరకు ఇదే ఇంట్లో నివసించారు. ఆ తర్వాత ఎర్నాకులంలోని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ పాతింటికి వస్తూ వెళ్తుంటారట! అయితే సకల వసతులు ఉన్న ఈ ఇంటిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక.. అభిమానులకు ఆతిథ్యం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ప్లాన్ను అమల్లోకి తెచ్చారు. ఒక్కరోజు ఉండాలంటే..ఇంతకాలం ఇంటిని బయటనుంచే ఫోటోలు తీసుకున్న అభిమానులు ఇప్పుడెంచక్కా ఇంట్లోనే బస చేయొచ్చు. మమ్ముట్టి గదిలో, దుల్కర్ గదిలో సేద తీరొచ్చు. తండ్రీకొడుకుల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ప్రైవేట్ థియేటర్, గ్యాలరీ రూమ్ చూసేందుకు కూడా వీలు కల్పిస్తారట! ఈ ఇంట్లో ఒక్కరోజు బస చేయాలంటే రూ.75 వేలు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి బుకింగ్స్ మొదలుపెడతారట! ఎంత ఖర్చయినా పర్లేదు, మమ్ముట్టి ఇంటికి వస్తాం.. ఆయన్ను కలుస్తాం అనుకునేరు.. కేవలం ఆయన ఇంట్లో బస చేయడానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. మమ్ముట్టిని, దుల్కర్ను కలిసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయరు.దుల్కర్ సల్మాన్ బెడ్రూమ్సినిమా..మమ్ముట్టి.. చివరగా డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ అనే సినిమా చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం మమ్ముట్టి బజూక అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీనో డెనిస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఈయన చివరగా లక్కీ భాస్కర్ చిత్రంతో అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తార, ఐయామ్ గేమ్ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by VKation Experiences (@vkationexperiences) చదవండి: 'ఒకప్పటిలా లేదు.. ప్లాస్టిక్ సర్జరీ'.. పెదవి విప్పిన హీరోయిన్ -
ఫిబ్రవరిలో ఒక్కటి తప్ప అన్నీ ఫ్లాపే.. ఒక సినిమాకైతే రూ.10 వేలే వచ్చాయ్!
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలా మలయాళంలో (Mollywood) గత నెలలో 17 సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని నష్టాల్ని మిగిల్చాయి? అన్న నివేదిక బయటకు వచ్చింది. కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి (కేఎఫ్పీఏ) ఫిబ్రవరి బాక్సాఫీస్ రిపోర్టు (Malayalam Film Industry Report- February 2025)ను విడుదల చేసింది. మాలీవుడ్కు రూ.53 కోట్ల నష్టంఈ నివేదిక ప్రకారం.. గత నెలలో 17 సినిమాలు రిలీజ్ చేస్తే అందులో ఆఫీసర్ ఆన్డ్యూటీ సినిమా (Officer on Duty Movie) మాత్రమే బడ్జెట్కు దగ్గరగా వసూళ్లు రాబట్టింది. మిగతా చిత్రాలన్నీ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 17 సినిమాల బడ్జెట్ అంతా కలిపితే రూ.75 కోట్లు కాగా.. అందులో కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం గమనార్హం. అంటే దాదాపు రూ.53 కోట్ల నష్టం వాటిల్లింది. రూ.13 కోట్లతో నిర్మితమైన ఆఫీసర్ ఆన్డ్యూటీ సినిమా ఇప్పటివరకు రూ.11 కోట్ల షేర్ (రూ.50 కోట్ల గ్రాస్) సాధించింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. కాపాడలేకపోయిన స్టార్ హీరోఅయితే ఈ మూవీ నేడు (మార్చి 20) నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. దీని ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపై పడనుంది. మార్కో వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఉన్నిముకుందన్ హీరోగా నటించిన చిత్రం గెట్ సెట్ బేబీ. రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.1.40 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం కూడా కష్టమే! లవ్ డేల్ అనే సినిమా అయితే రూ.1.60 కోట్లు పెట్టి తీయగా కేవలం రూ.10 వేలు మాత్రమే తెచ్చిపెట్టి నిర్మాతలను నిండా ముంచేసింది.పేరు ఘనం.. కలెక్షన్స్ శూన్యంమలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్నారు. అయినా పేరు ఘనం.. ఫలితం శూన్యం అన్నట్లు ఎప్పుడూ ఈ ఇండస్ట్రీ నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. చాలామంది ఈ చిత్రాలను థియేటర్లలో కన్నా ఓటీటీలోనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీనికి తోడు నిర్మాణ వ్యయాలు పెరగడం, నటీనటులు పారితోషికం పెంచడంతో బడ్జెట్ తడిసిమోపడవుతోంది. కనీసం లాభాలు కాదుకదా పెట్టుబడి వెనక్కి వచ్చినా చాలనుకునే దయనీయ స్థితి మాలీవుడ్లో కనిపిస్తోంది.కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి విడుదల చేసిన నివేదిక నిజంగా షాక్కు గురిచేసింది. ఫిబ్రవరిలో రిలీజైన 17 సినిమాల్లో ఆఫీసర్ ఆన్డ్యూటీ మూవీ మాత్రమే పెట్టిన పెట్టుబడికి సమీపంలో వసూళ్లు రాబట్టింది. అన్నింటికీ కలిపి రూ.73 కోట్లు పెడితే కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం విచారకరం.- శ్రీధర్ పిళ్లై, సినీ విశ్లేషకుడుగ్రాస్: మొత్తం సినిమా టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బునెట్: గ్రాస్ వసూళ్ల నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టగా మిగిలేది నెట్షేర్: నెట్ వసూళ్ల నుంచి థియేటర్ అద్దె, నిర్వహణ వంటి ఖర్చులు తీసేయగా మిగిలేది షేర్చదవండి: హీరో అజిత్ను పేరు పెట్టి పిలిచా.. అందరూ షాకయ్యారు: నటుడు -
శబరిమల అయ్యప్పని దర్శించుకున్న మోహన్ లాల్
మన దగ్గర కొత్త సినిమా రిలీజ్ ఉందనగా చాలామంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. చాలామంది హీరోలకు ఇది సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఇలానే ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. కేరళలోని శబరిమల కొండని కాలినడకన ఎక్కారు. భుజాన ఇరుముడి కూడా కనిపించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)18 మెట్లు ఎక్కి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న మోహన్ లాల్.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అయితే ఇదంతా కూడా త్వరలో రిలీజ్ కాబోతున్న తన సినిమా 'ఎల్ 2: ఎంపురన్' కోసమే అని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ భారీ స్థాయిలో మార్చి 27న రిలీజ్ కానుంది.గతంలో 'లూసిఫర్' అనే సినిమా వచ్చింది కదా! దీనికి సీక్వెల్ 'ఎల్2' మూవీ. సలార్ ఫేమ్ పృథ్వీరాజ్.. దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలోనూ నటించాడు. ఈ సినిమాపై అటు మోహన్ లాల్, ఇటు పృథ్వీరాజ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?)శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ప్రముఖ నటుడు మోహన్లాల్.#Mohanlal #Aadhantelugu #Sabarimala #AyyappaTemple pic.twitter.com/MXkX48lfra— Aadhan Telugu (@AadhanTelugu) March 19, 2025சபரிமலைக்கு திடீர் விசிட் அடித்த நடிகர் மோகன்லால்; நடிகர் மம்முட்டி பெயரில் சிறப்பு பூஜை! #Mohanlal #Mammootty #Sabarimala #Kerala pic.twitter.com/2YMtwZYgrj— Idam valam (@Idam_valam) March 19, 2025 -
రజనీకాంత్ భార్యగా ఛాన్స్ ఇప్పిస్తాం.. కాకపోతే ఒక కండీషన్!
రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ ఇస్తాం.. అనగానే ఎవరైనా ఏం చేస్తారు? ఎగిరిగంతేస్తారు. అందులోనూ రజనీకి భార్యగా అనేసరికి లోలోపలే సంతోషపడిపోయింది మలయాళ నటి శినీ సారా. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. అదేంటి? ఆల్రెడీ రజనీకి భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందిగా అని స్ఫురించింది. కేవలం తన దగ్గర డబ్బు గుంజేందుకే ఇలాంటి కాకమ్మ కహానీలు చెప్పాడని అర్థం కావడంతో నిరాశగా నిట్టూర్పు విడ్చింది.ఆర్టిస్ట్ కార్డ్ ఉందా?ఈ మోసం గురించి శినీ సారా మాట్లాడుతూ.. కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా అందిన మీ అప్లికేషన్ను సెలక్ట్ చేశాం అంటూ వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. జైలర్ 2 మూవీలో రజనీకాంత్ భార్య కోసం నటుల్ని వెతుకుతున్నట్లుగా ఉంది. తర్వాత వారు ఫోన్ చేసి ఆర్టిస్ట్ కార్డు ఉందా? అని అడిగారు. మలయాళంలో అయితే అలాంటి కార్డులు ఏవీ లేవన్నాను. సరే దానికి అవసరమైన ఏర్పాట్లు తామే చూసుకుంటామన్నారు. సురేశ్ కుమార్ అనే వ్యక్తి మీకు ఫోన్లో సంప్రదిస్తాడని చెప్పారు.జైలర్ 2లో రజనీ భార్యగా ఛాన్స్రెండు రోజుల తర్వాత ఆ సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. చీర కట్టుకుని వీడియో కాల్లో ఇంటర్వ్యూకు హాజరవమన్నారు. జైలర్ 2లో రజనీకాంత్ భార్యగా నన్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. నాకసలు అర్థం కాలేదు. అప్పటికే జైలర్ 2లో రజనీ భార్యగా రమ్య కృష్ణ నటిస్తోంది. ఇదే విషయం చెప్పాను. దాంతో అతడు మరో సినిమా కోసం సెలక్ట్ చేశామన్నాడు. అయితే ఆర్టిస్ట్ కార్డ్ తప్పనిసరిగా అవసరం ఉంటుందని.. దానికోసం అప్లై చేయాల్సి ఉంటుందన్నాడు. డబ్బు అడగడంతో అనుమానం మొదలుఇందుకోసం ఓ అప్లికేషన్ కూడా పంపిస్తున్నానని, అందులో అన్ని వివరాలు పొందుపరచమని చెప్పాడు. ఇదంతా నిజమేననుకుని ఆధార్ కార్డ్ వివరాలు, నా ఫోటో షేర్ చేశాను. వెంటనే అతడు రూ.12,500 డబ్బు కట్టమన్నాడు. అందుకోసం నాకు రెండు రోజుల గడువు ఇవ్వమని అడిగాను. దానికతడు.. వీలైనంత త్వరగా కట్టేయాలని, ఇప్పుడే డబ్బు పే చేయమన్నాడు. అప్పుడు నాకు అనుమానం మొదలైంది. తస్మాత్ జాగ్రత్తకోలీవుడ్లో నాకు తెలిసిన స్నేహితులు మాల పార్వతి, లిజొమోల్కు ఫోన్ చేశాను. కానీ వారు నా కాల్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు మరొకరికి కాల్ చేయగా.. ఆర్టిస్ట్ కార్డ్ లేకపోయినా తమిళ ఇండస్ట్రీలో పనిచేయొచ్చని తెలిపారు. దీంతో నాకు జరిగింది స్కామ్ అని తెలిసిపోయింది. ఇలాంటివారిని నమ్మి చాలా మంది డబ్బులు మోసపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది.చదవండి: ప్రేయసి కోసం ముందు జాగ్రత్తలు తీసుకున్న 60 ఏళ్ల హీరో.. అప్పుడే..! -
డెలివరీ తర్వాత కాళ్లు, చేతులు కదల్లేవు.. బతకననుకున్నా: నటి
ప్రెగ్నెన్సీ జర్నీ అంత బాగానే జరిగినా.. డెలివరీ సమయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది నటి దేవిక నంబియార్ (Devika Nambiar). ఇటీవలే ఈమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తన డెలివరీ జర్నీ గురించి దేవిక మాట్లాడుతూ.. నా మొదటి ప్రెగ్నెన్సీ సాఫీగా సాగింది. ఇది కూడా అలాగే ఉంటుందనుకున్నాను. అందుకే బ్యాగ్ కూడా సర్దుకోలేదు. కానీ ఈసారి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే నేను కళ్లు తెరవకపోవడంతో అందరూ చాలా భయపడ్డారు.స్పృహ కోల్పోయిన నటిఒకరోజు తర్వాత స్పృహలోకి వచ్చి నా బిడ్డను చూసుకున్నాను. అప్పటికీ నా కాళ్లు, చేతులు కదలకపోవడంతో చనిపోతానేమో అనుకున్నాను అని చెప్పుకొచ్చింది. దేవిక భర్త, సింగర్ విజయ్ మాట్లాడుతూ.. మాకు బిడ్డను చూపించారు కానీ నా భార్యను కలవనివ్వలేదు. సమయం గడిచేకొద్దీ నాలో భయం ఎక్కువైంది. నేను ఎలాగైనా కలవాల్సిందేనని చెప్పగా దేవిక స్పృహలోనే లేదని చెప్పారు. షాకయ్యాను. ఆమె ముక్కు, నోట్లో పైపులు పెట్టారు.బోరున ఏడ్చేశాతననలా చూడగానే అంతా అయిపోయిందనుకున్నాను. తనను వెంటిలేటర్పై పెట్టారు. ఆమెనలా ఎన్నడూ చూడలేదు. గదిలోకి వెళ్లి ఏదీ తినకుండా బోరుమని ఏడ్చాను అని చెప్పుకొచ్చాడు. కాగా దేవిక కలభ మజా, గల్ఫ్ రిటర్న్స్, పరయాన్ బాకీ వచెత్తు, స్నేహ కాదల్, వికడకుమారన్, కట్టప్పనేయిలే రిత్విక్ రోషన్ వంటి మలయాళ చిత్రాలతో పాటు తమిళంలోనూ నటించింది. ఈమె నటి మాత్రమే కాదు యాంకర్ కూడా! సినిమాల మధ్యలో ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసింది.చదవండి: ఎక్స్ట్రాలు ఎక్కువైతున్నాయ్.. ఇలాంటివారికి బుద్ధి చెప్పాల్సిందే! -
హనీరోజ్ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్ ఉంటుంది: నటి ఫైర్
ఈ మధ్యకాలంలో హనీరోజ్ (Honey Rose) సినిమాలతో కన్నా వివాదాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడిని అరెస్టు చేయగా తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. ఈ విషయంలో కొందరు హనీరోజ్కు మద్దతుగా నిలబడితే మరికొందరు ఆమెను తప్పుపట్టారు.దాని అర్థమేంటి?తాజాగా నటి ఫరా శిబిల (Fara Shibla).. హనీ పోరాటాన్ని ఓపక్క మెచ్చుకుంటూనే మరోపక్క ఆమె తీరుపై విమర్శలు గుప్పించింది. ఫరా మాట్లాడుతూ.. హనీరోజ్ వేషధారణను నేను తప్పుపట్టడం లేదు. కాకపోతే ఆమెను రకరకాల యాంగిల్స్లో తీసిన ఫోటోలను వీడియోలను తనే స్వయంగా షేర్ చేస్తోంది. దీని ద్వారా ఆమె ఏం చెప్పాలనుకుంటోందని మాత్రమే ప్రశ్నించాను. నేను వేసుకునే దుస్తులు అవతలివారికి అసౌకర్యంగా అనిపించకూడదు. అందరూ అదే పని!దేనికైనా కొన్ని హద్దులుంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరూ తమ శరీరాల్ని చూపిస్తూ ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో ఇదే చేస్తున్నారు. నేను కూడా ఫోటోషూట్ చేశాను కదా అని ప్రశ్నిస్తారేమో! ఏదైనా ఐడియా నచ్చితేనే, చూడటానికి బాగుందనిపిస్తేనే ఆయా ఫోటోషూట్ చేస్తాను. కానీ ఇప్పుడు జనాలు కేవలం లోదుస్తులతో కోల్డ్ కాఫీ తయారు చేస్తూ వీడియోలు చేస్తున్నారు.అమాయకురాలేం కాదుహనీరోజ్ అమాయకురాలైతే కాదు.. తను తెలివైనది. తనేం చేస్తుందో తనకు బాగా తెలుసు. డబ్బు సంపాదించడం తప్పు కాదు.. కానీ ఇండస్ట్రీలో కష్టాలు ఎదుర్కొంటున్న ఎంతోమందికి ఆమె ఒక చెత్త ఉదాహరణగా నిలుస్తోంది. సినిమాలు లేకపోతే ఇలా శరీరాన్ని ఎగ్జిబిషన్గా పెట్టి డబ్బు సంపాదించుకోవాలని నేర్పిస్తోంది. మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతిభను నమ్ముకోవాలి తప్ప శరీరాన్ని కాదు అని చెప్పుకొచ్చింది. మలయాళ బ్యూటీ హనీరోజ్ ఆలయం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ వర్షం సాక్షిగా, వీరసింహారెడ్డి చిత్రాల్లో నటించింది.చదవండి: దర్శన్తో గొడవ? ఇలాంటివాడికి ఆస్కార్ ఇవ్వాలంటూ నటి వరుస పోస్టులు! -
ఆ డైరెక్టర్ వల్ల బతకొద్దనుకున్నా.. సింగపూర్లో 13 ఏళ్లు టీచర్గా..: హిట్లర్ నటి
మలయాళ డైరెక్టర్ తనను ఇబ్బందిపెట్టాడంటోంది నటి అశ్విని నంబియార్ (Ashwini Nambiar). సినిమా గురించి మాట్లాడాలని పిలిపించి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడని చెప్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన ఒక పెద్ద డైరెక్టర్. ఒకరోజు సినిమా గురించి ఏదో మాట్లాడాలని ఆఫీసుకు రమ్మన్నాడు. నిజానికి నేనెక్కడికి వెళ్లినా అమ్మ నా వెంటవచ్చేది. ఆమె తోడుంటే వెయ్యి ఏనుగుల బలం ఉండేది. ఆ రోజు తనకు ఆరోగ్యం బాగోలేదు. హెయిర్ డ్రెస్సర్గా పనిచేసే మహిళను తోడు తీసుకెళ్లమంది. అప్పుడు నేనింకా టీనేజర్ను.సినిమా గురించి రమ్మని చెప్పి..అతడి ఇల్లు, ఆఫీస్ అంతా ఒకేచోట ఉంటాయి. నాతోవచ్చిన మహిళ కిందే ఆగిపోయింది. నేను ఆడుతూ పాడుతూ పైగదిలోకి వెళ్లాను. అక్కడెవరూ కనిపించలేదు. ఇంతలో బెడ్రూమ్లో నుంచి ఇటురా.. అన్న పిలుపు వినిపించింది. ఆ డైరెక్టర్ (Malayalam Director)తో అంతకుముందు ఓ మలయాళ సినిమా చేశాను. ఆ చనువుతో దగ్గరకు వెళ్లాను. కూతురి వయసున్న నన్ను అసభ్యంగా తాకాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నా పెదాలపై నవ్వు మాయమైంది. సరదాగా ఉండే నేను మూగబోయాను. నేనేమైనా తప్పు చేశానా? ఆయనకు నేనే అవకాశం ఇచ్చానా? అని రకరకాలుగా ఆలోచించాను. అమ్మ ఏడుపు చూసి..నా ముఖం చూడగానే ఏమైందని అమ్మ ఆరా తీసింది. జరిగిందంతా చెప్పడంతో తాను రాకపోవడం వల్లే ఇలా జరిగిందని ఏడ్చేసింది. నా వల్ల అమ్మ బాధపడటం చూసి తట్టుకోలేకపోయాను. ఏంచేయాలో తెలియక ఆ రోజు రాత్రి నిద్రమాత్రలు మింగాను. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడారు. అప్పుడు మా అమ్మ.. జరిగినదాంట్లో నా తప్పు లేదని అర్థమయ్యేలా చెప్పింది. నేను లేకపోతే తను బతకలేనని బాధపడింది. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయొద్దని ప్రాధేయపడింది. ఆ డైరెక్టర్కు నా తండ్రి వయసుంటుంది. (చదవండి: మహేశ్ వల్లే సినిమాలకు దూరమైన నమ్రత.. రిలేషన్లో ఉన్నప్పుడు)రీఎంట్రీ..అమ్మ మాటలతో ధైర్యం తెచ్చుకున్నాను. తిరిగి షూటింగ్లో అడుగుపెట్టాను. కొన్నిసార్లు అమ్మ లేకపోయినా సెట్కు వెళ్లేదాన్ని. దేన్నైనా ఎదుర్కోగలను అన్న ధైర్యంతోనే ముందడుగు వేశాను అని చెప్పుకొచ్చింది. 18 ఏళ్లపాటు వెండితెరకు దూరంగా ఉన్న అశ్విని ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సుడల్ 2తో రీఎంట్రీ ఇచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. పెళ్లవగానే యాక్టింగ్ మానేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఎప్పటికైనా మళ్లీ సినిమాల్లోకి వస్తానన్న నమ్మకం నాకుంది. ప్రస్తుతం నా కూతురు కాలేజీలో చదువుతోంది. ఇదే సరైన సమయం అనిపించింది. ఇదే సరైన ఛాన్స్ అని..షూటింగ్స్ కోసం సింగపూర్ నుంచి పదేపదే చెన్నై రావడం అంత ఈజీ కాదు. సింగపూర్లో ఉండగా నేను మాస్టర్స్ పూర్తి చేశాను. కాలేజీలో 13 ఏళ్లపాటు టీచర్గా పని చేశాను. ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. గతేడాది నా కూతురు కాలేజీలో జాయిన్ అయింది. ఇదే సరైన సమయం అనుకున్నాను. సరిగ్గా అప్పుడే సుడల్ 2 సిరీస్ నుంచి పిలుపొచ్చింది. ఈ సిరీస్ రచయితలు పుష్కర్- గాయత్రితో అంతకుముందు పనిచేసిన అనుభవం ఉండటంతో సులువుగా ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అశ్విని మొదట సీరియల్స్లో నటించింది. హిట్లర్ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. ఆంటీ, పెళ్లి చేసుకుందాం, పోలీస్ చిత్రాలతో తెలుగువారిని పలకరించింది. మలయాళ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. -
నటుడి నాలుగో పెళ్లి.. ఎవరి దిష్టి తగలకూడదని గుండు గీయించుకున్న అత్త
మలయాళ నటుడు బాలా (Actor Bala) ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉన్నాడు. గతంలో అతడి రెండో భార్య ఆరోపణలు, ఫిర్యాదుల వల్ల పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లొచ్చాడు. ఇటీవల మూడో భార్య తనపై సంచలన ఆరోపణలు చేయగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు బాలా గతేడాది తన చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. వీరి బంధం నూరేళ్లపాటు కొనసాగాలని కోరుతూ కోకిల తల్లి తిరుమలలో గుండు కొట్టించుకుంది.వచ్చే ఏడాది బిడ్డతో..'మీ జంటను చూసి చాలామంది కుళ్లుకుంటున్నారు. అందరి కళ్లు మీ పైనే ఉన్నాయి. అందుకే ఎవరి దిష్టి తగలకుండా మీ దాంపత్యజీవితం సాఫీగా సాగాలని భగవంతుడిని కోరుకుంటూ తలనీలాలు సమర్పించుకున్నాను' అని కోకిల తల్లి చెప్పుకొచ్చింది. కోకిల నానమ్మ అయితే దంపతులను ఆశీర్వదిస్తూ.. వచ్చే ఏడాది బిడ్డను ఎత్తుకుని రావాలని కోరింది. వీరిద్దరూ బాలాకు ఉంగరం, కోకిలకు ముక్కుపుడకను బహుమతిగా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను బాలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.బాలాపై ట్రోలింగ్ఇది చూసిన కొందరు బాలాను విమర్శిస్తున్నారు. నువ్వు ఏం చేసినా సరే ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ నీకు మోక్షం లభించదు. ఈ ప్రపంచంలో సొంత బిడ్డను మోసం చేసిన ఏకైక తండ్రివి నువ్వే.. ముగ్గురు స్త్రీల కన్నీళ్లకు నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. దీనికి బాలా స్పందిస్తూ..నాపై నెగెటివ్ కామెంట్లు చేసే మిత్రులారా.. నేను పెట్టే వీడియోలు చూస్తుంటే మీకెంత కోపం వస్తుందో నాకు తెలుసు. కాబట్టి నా అకౌంట్ను మీరు అన్ఫాలో అయితే సరిపోతుంది. అలా చేయలేకపోతున్నారంటే నా వీడియోలకు మీరు బానిసైపోయారని అర్థం. అయినా నేనెవర్నీ మోసం చేయలేదు అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. చదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?!ఓటీటీలో ముగ్గురు స్టార్స్ నటించిన సినిమా.. డైరెక్ట్గా స్ట్రీమింగ్ -
దర్శకుడి అసత్య ఆరోపణలు.. ఇచ్చిపడేసిన హీరోయిన్
ఇప్పుడంతా ఓటీటీల (OTT Movies) జమానా. భాషతో సంబంధం లేకుండా నటీనటులు అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు. అలా ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న మలయాళ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan). ఈమె నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు ఈమెపై ఆరోపణలు చేశాడు. తానేం తప్పు చేయలేదని ఇచ్చిపడేసిన అనస్వర రాజన్.. దర్శకుడికి అదే రేంజులో ఇచ్చిపడేసింది.(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)అసలేం జరిగింది?ఇంద్రజిత్ సుకుమారన్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్' మూవీ లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. కొన్నిరోజుల క్రితం పలు మీడియా ఛానెళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చిన దర్శకుడు దీపు కరుణాకరన్(Deepu Karunakaran).. హీరోయిన్ అనస్వర రాజన్ అస్సలు ప్రమోషన్ కోసం సహకరించట్లేదని చెప్పాడు. ఆమెపై లేనిపోని ఆరోపణలు చేశాడు.తాజాగా దర్శకుడి కామెంట్స్ పై స్పందించిన అనస్వర రాజన్.. ఆయన అన్ని అబద్ధాలే చెబుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఇచ్చిన ఒకేఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ తనదేనని, సినిమా పోస్టర్స్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చింది. రిలీజ్ డేట్ మార్పు గురించి తనకు అస్సలు సమాచారం ఇవ్వలేదని వాపోయింది.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)ఇలానే తనపై ఆరోపణలు చేస్తూ పరువు తీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తానని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సదరు దర్శకుడిపై అనస్వర ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వివాదం మలయాళ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది.అనస్వర నటించిన చిత్రాల విషయానికొస్తే.. సూపర్ శరణ్య, ప్రణయ విలాసం, గురువాయూర్ అంబలనడయిల్, నెరు తదితర చిత్రాలు ఉన్నాయి. ఈమె నటించిన లేటెస్ట్ హిట్ మూవీ 'రేఖాచిత్రం' ఈ శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) -
విడాకుల తర్వాత పరిచయం.. పిల్లలు ఎందుకు లేరంటే?: నటి సీత
మొండిమొగుడు పెంకి పెళ్లాం, వజ్రం, రావణ బ్రహ్మ.. ఇలా ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది నటి సీత (Actress Seetha). తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి దాదాపు 60 సినిమాలు చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్లో అమ్మ, అత్త పాత్రలు పోషిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. సీత మాట్లాడుతూ.. మూడేళ్ల వయసు నుంచే యాక్టింగ్ చేస్తున్నాను. బాల్యంలో చాలా సినిమాలు చేశాను. పెద్దయ్యాక తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు సీరియల్స్లో బిజీ అవడంతో సినిమాలు చేయట్లేదు.చిన్నప్పుడే నాన్న మరణం..నా వ్యక్తిగత విషయానికి వస్తే చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ నాతోపాటు షూటింగ్స్కు వచ్చేది. ఒకసారి విపరీతంగా దగ్గుతుంటే హాస్పిటల్కు తీసుకెళ్లాను. అప్పుడు తనకు క్యాన్సర్ నాలుగో స్టేజీ అని తెలిసింది. రెండు నెలలకంటే ఎక్కువ బతకదని చెప్పారు. ఆమెను బతికించమని దేవుళ్లను వేడుకున్నా.. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటినుంచి నాకు దేవుడంటేనే నమ్మకం పోయింది. (చదవండి: రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్ రంభ.. ఈసారైనా..?)మొదటి భర్తతో విడాకులునాకు గతంలో పెళ్లయి విడాకులు కూడా అయిపోయాయి. వేరే మతానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నా.. ఆయనక్కూడా ఇది రెండోదే! మొదటి వైవాహిక బంధంలో భర్తతో ఎక్కువగా కలిసుండలేదు. ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండేదాన్ని. ఏదైనా తప్పు జరిగుంటే విడాకులవుతాయి. కానీ నేను ఏ తప్పూ చేయలేదు. అయినా అలాంటి పరిస్థితి వచ్చింది. 2013లో విడాకులయ్యాయి. తర్వాత నా స్కూల్మేట్ పరిచయమయ్యాడు. 2018లో అతడిని పెళ్లి చేసుకున్నాను. గర్భాశయం తీసేశారుపిల్లలు ఎందుకు లేరంటే నాకు గర్భాశయంలో కణతులు (ఫైబ్రాయిడ్స్) ఏర్పడ్డాయి. మొదటి భర్తతో ఉన్నప్పుడే ఈ సమస్య తెలిసింది. టాబ్లెట్స్ వేసుకుంటే కరిగిపోతుందన్నారు. కానీ అప్పటి గొడవల వల్ల పెద్దగా పట్టించుకోలేదు. తీరా రెండో పెళ్లయ్యాక ఆ కణతుల పరిమాణం పెరిగిపోయింది. ఆ గడ్డ వల్ల వేరే సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించారు. అప్పటికే రెండుసార్లు అబార్షన్ అయింది. దాంతో నేను గర్భాశయాన్నే తొలగించుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు పిల్లలు లేరు. అని నటి సీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్లో యాక్ట్ చేస్తోంది.చదవండి: తండ్రితో పోటీపడిన బుడ్డోడు.. ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?! -
నాది రంగుల జీవితం కాదు.. ఎన్నో అవమానాలు..: హీరోయిన్
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న మాటను సెలబ్రిటీలు తు.చ. తప్పకుండా పాటిస్తారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా వివిధ కార్యక్రమాలు, షోరూమ్ల ప్రారంభోత్సవానికి వెళ్తుంటారు. మలయాళ హీరోయిన్ మాళవిక మీనన్ (Malavika C Menon) కూడా ఇదే చేస్తోంది. అయితే అదే పనిగా వరుసపెట్టి కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నందుకు కొందరు విమర్శలు కూడా గుప్పించారు. సినిమాల్లో మంచి పాత్రల కోసం ఆరాటపడకుండా ఇలా ప్రోగ్రామ్ల వెనక పరిగెట్టడం దేనికని బుగ్గలు నొక్కుకున్నారు. ఎన్ని ఖర్చులుంటాయనుకున్నారు!అయితే ఇలాంటి ప్రోగ్రామ్లకు వెళ్తే వచ్చే డబ్బు తనకు ఖర్చులకే సరిపోతోందని చెప్తోంది మాళవిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒక కార్యక్రమానికి వెళ్లాలంటే నువ్వు చాలా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. మొదట నీ దుస్తుల కోసం.. తర్వాత నువ్వు ప్రయాణించడానికి ఓ వాహనం కావాలి. అందులోనూ అమ్మాయైతే ఆ ఖర్చు రెట్టింపవుతుంది. మేకప్ సామాను కొనుక్కోవాలి, డ్రెస్సులు కొనుగోలు చేయాలి. దానిపైకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కొనాలి.(చదవండి: నీ భర్త కంటే విజయ్ నయం.. జ్యోతిక ఏమందో తెలుసా?)కెరీర్ మొదట్లో ఇబ్బందిపడ్డా..కొన్నిసార్లు మనమే రెడీ అయినా సమయం లేకపోతే మేకప్ ఆర్టిస్టును పిలిపించుకోవాలి. అలాగే హెయిర్ స్టయిలిస్ట్. కొన్నిసార్లు మన లుక్ సరిగ్గా ఉండేందుకు స్టయిలిస్ట్ అవసరం కూడా ఉండొచ్చు. వీళ్లందరికీ మనం డబ్బులివ్వాలిగా! తమ పనిని వదిలేసుకుని వచ్చినందుకు వారి డిమాండ్ను బట్టి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ట్రావెలింగ్ ఖర్చులు ఉండనే ఉన్నాయి. కెరీర్ మొదట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డాను.ప్రతి పైసాను గౌరవిస్తా..ఆ సమయంలో కుటుంబమే నా అవసరాలు తీర్చింది. నేను వెనకడుగు వేయకుండా ప్రోత్సహించింది. కొన్నిసార్లు ఇంట్లోనూ పరిస్థితులు కఠినంగా ఉండేవి కానీ అవి నాకు తెలియనిచ్చేవారు కాదు. ఒకసారైతే నేను కనుబొమ్మలు గీయించుకోవడానికి కూడా డబ్బులేదు. ఇప్పుడా పరిస్థితి మారింది. అందుకే ప్రతి పనిని, ప్రతి పైసాను గౌరవిస్తాను. తెరపై సెలబ్రిటీలను చూసి వారిది రంగుల జీవితం అనుకుంటాం కానీ అలా ఏం ఉండదు. వాళ్లకూ ఎన్నో కష్టాలుంటాయి. ఏదీ శాశ్వతం కాదునేను కూడా ఎన్నోసార్లు అవమానాలకు గురయ్యాను. అయితే ఏదీ శాశ్వతం కాదని బలంగా నమ్ముతూ ముందడుగు వేస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. నిద్ర, హీరో, నాదన్, నదేవయానం, ఎంజన్ మరికుట్టి, జోసెఫ్, మామంగం, ఏఐ మల్లు, పెయి మామ వంటి పలు మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో లవ్ కె రన్, అమ్మాయిలు అంతే అదో టైప్ సినిమాలు చేసింది.చదవండి: నాకు పుట్టబోయే పిల్లల్ని కూడా వదల్లేదు: ప్రియమణి -
కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో..: బాలా
నాకు హానికరమైన ఔషధాలు ఇచ్చి నా ఆరోగ్యం చెడగొట్టారు అంటున్నాడు మలయాళ నటుడు బాలా (Actor Bala). రెండేళ్ల క్రితం ఆయనకు కాలేయ మార్పిడి జరిగింది. ఆ సమయంలో తను కోలుకోకుండా చేయాలన్న ప్రయత్నాలు జరిగాయంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలా మాట్లాడుతూ.. నాకు ఇప్పటివరకు రెండు సర్జరీలు జరిగాయి. రెండేళ్ల క్రితం నేను చనిపోయానని వదంతులు పుట్టుకొచ్చాయి. కానీ, చూడండి నేను మీ ముందు ఇలా ఆరోగ్యంగా నిలబడ్డాను.తనెవరో చెప్పనుఅయితే సర్జరీ జరిగాక గతేడాది నాకు మంచి మెడిసిన్ ఇవ్వలేదు. దానికి బదులుగా నా ఆరోగ్యాన్ని దిగజార్చే ఔషధాలు ఇచ్చారు. రాంగ్ మెడిసిన్ ఎవరిచ్చారన్నది నేను చెప్పను. అయితే ఆ విషయం తెలియక గుడ్డిగా అవే ఉపయోగించాను. తీవ్ర అనారోగ్యంతో పదిరోజులపాటు ఆస్పత్రిపాలయ్యాను. అప్పుడు నా బంధువైన కోకిల ఒక తల్లిలా నాకు సేవ చేసింది. అప్పుడే తను నన్నెంత ప్రేమిస్తుందో అర్థమైంది.చనిపోయానని అనుకున్నారునేను ఐసీయూలో ఉన్నప్పుడు మరణించానన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో నాకు వెంటిలేటర్ తీసేయాలనుకున్నారు. అంతర్గత అవయవాలు పని చేయడం లేదన్నారు. కిడ్నీ, లివర్, బ్రెయిన్.. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పని చేయడం ఆగిపోతున్నాయి. అప్పుడు మా అమ్మ చెన్నైలో ఉంది. నా చావు ఖాయమని అర్థమై పోస్ట్మార్టమ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ముఖ్యంగా నా సినిమాలు చూసిన చిన్నపిల్లలు నేను బతకాలని బలంగా కోరుకున్నారు. అలాగే 25 ఏళ్లుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను. అరగంటలో అద్భుతంవీటన్నిటి ఫలితమో ఏమో కానీ.. అరగంటలో అద్భుతం జరిగింది. నాలో ప్రాణం తిరిగి వచ్చింది. నన్ను ఎంతో ప్రేమించిన కోకిలతో నా పెళ్లి జరిగి మూడు నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో కూడా ఒకరికి హార్ట్ సర్జరీ చేయించాను, స్కూల్ కట్టించాను. కోకిల స్థానంలో మరొకరుంటే కచ్చితంగా నాపై ఫిర్యాదు చేసేవారు. కానీ కోకిలకు నా లక్ష్యం ఏంటో తెలుసు. రేపు మాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇదే సేవా మార్గంలో వెళ్లాలని కోరుకుంటాను అని పేర్కొన్నాడు.చిత్రహింసలు పెట్టాడన్న మూడో మాజీ భార్యకాగా మలయాళ నటుడు బాలా ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో మాజీ భార్య అమృత గతేడాది అతడిపై వేధింపుల కేసు పెట్టింది. మూడో మాజీ భార్య ఎలిజబెత్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బాలా తనను చిత్రహింసలు పెట్టాడన్న విషయాన్ని వెల్లడించింది. బాలాకు విషపూరితమైన మెడిసిన్ ఇచ్చారన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. అది నిజమని నిరూపించమని సవాల్ విసిరింది. ఈ క్రమంలోనే బాలా పై కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.చదవండి: అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్ లాక్కున్న హీరో -
అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్ లాక్కున్న హీరో
మార్కో సినిమాతో బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించాడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఈ మూవీలో యాక్షన్ హీరోగా రక్తపాతాన్ని పారించిన ఆయన నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన గెట్ సెట్ బేబీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఓ మల్టీప్లెక్స్కు వెళ్లాడు హీరో. అతడిని చూసిన ఓ అభిమాని హీరోకు దగ్గరగా వెళ్లాడు. ఉన్ని ముకుందన్ నడుస్తూ ఉంటే అతడిని వెంబడిస్తూ ఫోన్లో వీడియో చిత్రీకరించాడు.ఫోన్ లాక్కున్న హీరోఅది చూసి సహనం నశించిన హీరో సదరు అభిమాని దగ్గరి నుంచి ఫోన్ లాక్కున్నాడు. దాన్ని జేబులో పెట్టుకుని కోపంతో అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అభిమాని బతిమాలడంతో ఫోన్ వెనక్కిచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇంకా నయం.. ఫోన్ తీసుకెళ్లిపోలేదులేమీరు హీరోగా ఎదిగే సమయంలో ఎవరైనా మీ అభిమాని అని మీ దగ్గరకు వస్తే సంతోషపడతారు. ఇలా స్టార్డమ్ వచ్చాక మాత్రం ఇరిటేట్ అవుతుంటారు అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. మరికొందరేమో.. హీరోకు మరీ అంత దగ్గరగా వెళ్లి వీడియో షూట్ చేయాలా? అలా చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది.. ఫోన్ను అలాగే తీసుకెళ్లకుండా తిరిగిచ్చేసినందుకు సంతోషించండి. అని కామెంట్లు చేస్తున్నారు. Marco Mode of Unni Mukundan in Real Time.Fan should not take advantage of stars like this.#UnniMukundan#Marco#GetSetBaby pic.twitter.com/mq2AOxLkq2— Deepak Kaliamurthy (@Dheeptweet) February 23, 2025చదవండి: రూ.50 లక్షల ప్రైజ్మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్బాస్ విజేత -
గొడ్రాలిని చేసి పిచ్చిదానిగా చిత్రీకరించాడు: నటుడిపై మూడో మాజీ భార్య ఆరోపణలు
మలయాళ నటుడు బాలా (Actor Bala) గతేడాది కోకిలను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ జంటగా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు కామెంట్స్లో ఈ జంటను ఆశీర్వదిస్తూ అతడి మాజీ భార్యపై అనుచిత కామెంట్లు చేశారు. బాల రెండో మాజీ భార్య, డాక్టర్ ఎలిజబెత్ నటుడిని ప్రలోభపెట్టిందని, అతడు హాస్పిటల్కు వెళ్లినప్పుడు బాలాను వశం చేసుకుందని ఆరోపించారు. ఒకవేళ రోగి ప్రపోజ్ చేసినా డాక్టర్గా దాన్ని అంగీకరించకూడదు. కానీ ఆమె నటుడిని వశపరుచుకుంది. ఇది వైద్య వృత్తికే కళంకం అని కామెంట్స్ చేశారు. దీనిపై ఎలిజబెత్ ఘాటుగా స్పందించింది.అంత డబ్బు లేదునిజంగా నేనలా చేసుంటే నాపై ఫిర్యాదు చేయొచ్చుగా! నేను అతడిని బెదిరించానా? ఇలాంటి ప్రచారం చేయించేందుకు నా దగ్గర అంత డబ్బు లేదు. రాజకీయ నాయకుల సపోర్ట్ అసలే లేదు. అంతెందుకు, ఒకసారి నువ్వు నాపై అత్యాచారం చేశాక.. ఇంటికి తీసుకెళ్లండంటూ చెన్నైలోని ఓ పోలీసాఫీసర్ నా పేరెంట్స్కు ఫోన్ చేశాడు. చచ్చిపోదామని ప్రయత్నించాను. నేను నీ భార్య కాదని చెప్తున్నావు. అలాగైతే నా అనుమతి లేకుండా నువ్వు చేసిన పనిని ఇంకేమంటారు? జనాలు నా గురించి నోటికొచ్చింది వాగుతున్నప్పుడు నేను నోరు విప్పక తప్పడం లేదు.పిచ్చిదాన్నని ప్రచారం..నేను నిజాల్ని వెల్లడిస్తూ పోస్ట్ పెట్టడం నేరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను చట్టపరంగా ముందుకు వెళ్లాలన్నా కూడా గతంలో ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నిస్తారు. నేను ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు. నాకు మానసిక స్థితి సరిగా లేదని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఈ పోస్ట్ను సాక్ష్యంగా పెట్టుకోండి అని ఫేస్బుక్లో రాసుకొచ్చింది.చిత్రహింసలుమరో పోస్ట్లో.. బాలాను నేను ఫేస్బుక్లో కలిశాను. అతడు నాతో రిలేషన్లో ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో చేసిన చాటింగ్, వాయిస్ రికార్డింగ్స్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. పోలీసుల ఎదుట మా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి అతిథులు కూడా వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎలా పెళ్లి చేసుకున్నాడో అర్థం కావడం లేదు. నన్ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడు. నా కుటుంబాన్ని కూడా వేధించాడు. తన గురించి చెప్తే వదిలిపెట్టనని గూండాలతో హెచ్చరించాడు. మా బెడ్రూమ్ వీడియో లీక్ చేస్తానని బెదిరించాడు. అమ్మాయిలతో ఆడుకున్నాడుడిప్రెషన్లోకి వెళ్లిపోయి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. నన్నే కాదు చాలామంది అమ్మాయిలను మోసం చేశాడు. ఇదంతా టైప్ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నేను గొడ్రాలినని అందరి ముందు నానా మాటలన్నాడు అని ఫేస్బుక్లో రాసుకొచ్చింది. కాగా బాలా సినీ నేపథ్యానికి చెందిన కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తాతయ్యకు అరుణాచల స్టూడియో ఉండగా తండ్రి 350కు పైగా సినిమాలు డైరెక్ట్ చేశాడు. బాలా సోదరుడు శివ కంగువా సినిమాను డైరెక్ట్ చేశాడు. బాలా పర్సనల్ లైఫ్బాలా 2మచ్ అనే తెలుగు సినిమాతో నటుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఇతడు చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులిచ్చేసి అమృతా సురేశ్ను పెళ్లాడాడు. ఆమెతోనూ విడిపోయిన తర్వాత డాక్టర్ ఎలిజబెత్ను వివాహం చేసుకున్నాడు. చివరకు ఆమెను కూడా వదిలేసి ఇటీవలే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో -
నేను సంతూర్ మమ్మీలా ఉంటా.. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి?: నటి
మలయాళ నటి చిత్ర నాయర్ (Actress Chitra Nair) రెండో పెళ్లి చేసుకుంది. ఆర్మీ ఏవియేషన్ విభాగంలో పనిచేసే లెనీష్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం విశేషం! ఈ వివాహ వేడుకకు చిత్ర కుమారుడు, లెనీష్ కుమార్తె సహా ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. అలాగే పెళ్లి వీడియోను చిత్ర సోషల్ మీడియాలో షేర్ చేసింది.జాతకాలు చూసే పెళ్లి.. చివరకేమైంది?గతంలో ఓ ఇంటర్వ్యూలో చిత్ర మాట్లాడుతూ.. నా కొడుక్కి పద్నాలుగేళ్లు. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నాకు 36 ఏళ్లు. అందరూ సంతూర్ మమ్మీ అని పిలుస్తుంటారు. నా పక్కన ఉన్న కొడుకుని చూసి నా తమ్ముడనుకుంటారు. 21 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లయింది. అది పెద్దలు కుదిర్చిన సంబంధం. జాతకాలు అన్నీ చూశాకే నాకు పెళ్లి చేశారు. చివరకు ఏమైంది? ఎనిమిదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం.కచ్చితంగా ఆలోచిస్తా..మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అని నన్నడిగితే కచ్చితంగా ఆలోచిస్తానని చెప్తాను. నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే ఎందుకు వదులుకుంటాను? ఈ విషయంలో నా కొడుక్కి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈసారి జాతకాలు కలిసాయా? లేదా? అని మాత్రం చూడను. అయితే ఇప్పుడే పెళ్లి గురించే ఆలోచించడం లేదు అని చెప్పుకొచ్చింది.యాక్టర్గా మారిన టీచర్కేరళకు చెందిన చిత్రనాయర్ గతంలో ఉపాధ్యాయినిగా పని చేసింది. కరోనా సమయంలో తన వృత్తిని వదిలేసి సినిమావైపు ఆసక్తి చూపించింది. ఆడిషన్స్కు వెళ్లి తనకంటూ కొత్తదారి నిర్మించుకుంది. మోహన్లాల్ 'ఆరట్టు' చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైంది. పార్ట్నర్స్, సురేశింతెయుమ్ సుమలతయుదెయుం హృదయహరియయ ప్రణయకథ, పొరట్టు నడకం, క్వీన్ ఎలిజబెత్, ఎన్న తాన్ కేస్ కొడు వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by chithra_nair_L (@chithra_nair_official) చదవండి: ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి -
కేరళలో సినిమా షూటింగులు బంద్
తిరువనంతపురం: మలయాళ సినీ పరిశ్రమ (Mollywood)లో సమ్మె సైరన్ మోగింది. జూన్ ఒకటి నుంచి షూటింగులు ఆపివేయడంతో పాటు థియేటర్ల ప్రదర్శనలు సైతం నిలిపివేస్తున్నామని ఫిలిం ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రకటించింది. మలయాళ సినిమా బడ్జెట్లు మితిమీరిపోతుండగా వాటి సక్సెస్ రేటు మాత్రం తగ్గిపోతూ వస్తున్నాయి. నటీనటులతో పాటు టెక్నీషియన్లు పారితోషికం పెంచడంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దీంతో నిర్మాతలపై భారం పెరిగిపోతోంది. వీటన్నింటినీ పరిష్కరించుకునేందుకే మాలీవుడ్ సమ్మె బాట పట్టింది. అయితే దీని ప్రభావం ఇతర ఇండస్ట్రీల మీద పడనుంది. మలయాళంలో డబ్ అయ్యే ఇతర సినిమాల పరిస్థితి గందరగోళంగా మారనుంది.చదవండి: జాలిరెడ్డిపై బెంగ పెట్టుకున్న తల్లి.. ఐదేళ్ల ఎదురుచూపులకు బ్రేక్.. -
రూ.8 కోట్లు పెడితే రూ.75 కోట్లు.. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్
ఓటీటీ (OTT)లో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు, సిరీస్లు రిలీజవుతూనే ఉన్నాయి. తాజాగా మలయాళ హిట్ మూవీ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. అసిఫ్ అలీ (Asif Ali), అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన రేఖాచిత్రం మూవీ (Rekhachithram Movie) ఓటీటీలో రిలీజవుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ (SonyLiv) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'అందరూ మర్చిపోయిన నేరం.. పాతిపెట్టిన నిజాన్ని వెలికితీసే సమయం ఆసన్నమైంది. మార్చి 7న రేఖాచిత్రం సోనీలివ్లో చూసేయండి' అని ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. జనవరి 9న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన రేఖాచిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసింది.కథేంటంటే?మలక్కప్పర ప్రాంతంలో జరిగే ఘటనలు.. పోలీస్ ఇన్స్పెక్టర్ వివేక్ను కలవరపరిచే ఆత్మహత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే వివేక్ ఆ కేసుని ఎంతకీ ఛేదించలేకపోతాడు. ఎటు వెళ్లినా కేసు ఓ కొలిక్కి రాదు. చివరకు ఈ కేసు.. మరో కేసుకి లీడ్ ఇస్తుంది. సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి ఘటనలతో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేఖాచిత్రం ఓటీటీలో చూడాల్సిందే!రేఖాచిత్రం విషయానికి వస్తే.. అసిఫ్, అనస్వరతో పాటు మనోజ్ కె.జయన్, సిద్దిఖి, జగదీశ్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాఫిన్ టి.చాకో దర్శకత్వం వహించాడు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు.చదవండి: నోరు జారిన రష్మిక.. ఫైర్ అవుతున్న కన్నడ ప్రజలు! -
మమ్మల్ని వదిలేయండి.. చెత్త కామెంట్లు పెట్టొద్దు.. విడాకులపై నటి క్లారిటీ
మనవళ్లతో ఆడుకునే సమయంలో పెళ్లి చేసుకోవడమేంటో.. ఇంతకీ కలిసున్నారా? మొదటి పెళ్లిలాగే ఇది కూడా ముక్కలైందా? అంటూ మలయాళ నటుడు క్రిస్ వేణుగోపాల్ (Kris Venugopal)పై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. అతడు మూడుముళ్లు వేసిన నటి దివ్య శ్రీధర్ (Divya Sreedhar)పైనా ట్రోలింగ్ జరిగింది. ఆస్తి కోసమే ఈ పెళ్లి చేసుకుంది కాబోలంటూ పలువురూ ఆమెను తిట్టిపోశారు. ఆ విమర్శలను తిప్పికొడుతూ ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు. ఎవరి జీవితాల్లోకి తొంగి చూడట్లేదుగతేడాది నవంబర్లో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మొన్నటిదాకా ముసలాడికి పెళ్లేంటన్న జనాలు ఇప్పుడు ఇద్దరూ విడిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా ఈ రూమర్లపై దివ్య శ్రీధర్ స్పందించింది. ఓ వీడియో రిలీజ్ చేసింది. 'మేము ఎవరి జీవితాల్లోకి తొంగిచూడట్లేదు. ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. మరెందుకు మా జీవితాల గురించి ఇష్టారీతిన రాస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు ఏవేవో కథలు అల్లేసుకుంటున్నారు. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం..మా జంట మీకు నచ్చకపోతే మమ్మల్ని వదిలేయండి. చెత్త కామెంట్లు మాత్రం పెట్టకండి. మమ్మల్ని ప్రేమిస్తున్నవారందరికీ థాంక్యూ. ఇప్పుడీ వీడియో చేయడానికి ప్రధాన కారణం.. నా భర్త నాకోసం లిప్స్టిక్, చాక్లెట్స్ వంటి కొన్ని బహుమతులు పంపించాడు. ప్రేమికుల రోజు ఈ వారంలోనే వస్తుండటంతో మా ఆయన ఎన్నో బహుమతులిస్తున్నాడు. అవన్నీ మీకు చూపించాలని, నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ మేము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం మొదలుపెట్టారు.బహుమతులు చూపించాలనుకున్నా..అది చూసి చాలా బాధేసింది. మేము కలిసే ఉన్నాం.. నా జీవితంలో ఇంత ప్రేమ నేనెప్పుడూ పొందలేదు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జ్ఞాపకాలు కూడబెట్టుకుంటున్నప్పుడు అన్నింటినీ మైమరిచిపోతున్నాను' అని చెప్పుకొచ్చింది. క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్ పాతరమట్టు సీరియల్లో కలిసి నటించారు. గతేడాది ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు. పలు సీరియల్స్లో యాక్ట్ చేసిన వేణుగోపాల్ పల్లు రైజింగ్, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్ వంటి చిత్రాల్లోనూ నటించాడు. దివ్య శ్రీధర్ సీరియల్స్లో విలనిజం పండించే పాత్రలు పోషిస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Divya Sreedhar (@divyasreedhar24) చదవండి: చరణ్కు ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉంది: చిరంజీవి -
అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్
బాలనటిగా వెండితెరకు పరిచయమైంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). మలయాళంలో మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. గీతాంజలి సినిమాతో హీరోయిన్గా మారింది. నేను శైలజ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ఇటీవలే బేబీ జాన్తో హిందీ బాక్సాఫీస్కు పరిచయమైంది.అంకుల్ అని పిలవొద్దుసౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న కీర్తిని ఓ హీరో పిలిచి మరీ తనను అంకుల్ అని పిలవొద్దని చెప్పాడట! ఇంతకీ ఆ హీరో ఎవరంటే మలయాళ నటుడు దిలీప్. 2002లో దిలీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం కుబేరన్. ఇందులో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. అందులో ఒకరు కీర్తి సురేశ్. దిలీప్ కూతురిగా నటించిన కీర్తి.. తర్వాతికాలంలో అతడి ప్రేయసిగా నటించింది. రింగ్ మాస్టర్ (2014) మూవీలో దిలీప్ గర్ల్ఫ్రెండ్గా యాక్ట్ చేసింది. హీరోయిన్గా ఇది ఆమెకు రెండో సినిమా. రింగ్ మాస్టర్ సినిమాలో దిలీప్తో కీర్తి సురేశ్ఆయన కూతురిగా, ప్రేయసిగా..ఈ విషయాన్ని కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. దిలీప్ (Dileep) సరసన హీరోయిన్గా నటించేందుకు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూనే ఉన్నాను. తనేమీ మారలేదు, అలాగే ఉన్నాడు. రింగ్ మాస్టర్ మూవీలో నేనే తన గర్ల్ఫ్రెండ్ అని తెలియగానే నన్ను పిలిచి ఓ మాట చెప్పారు. చిన్నప్పుడు అంకుల్ అని పిలిచేదాన్నని.. అలా మాత్రం పిలవొద్దని కోరాడు. కావాలంటే చేట్ట (అన్నయ్య) అని పిలవమన్నాడు. నేను వెంటనే సరే చేట్ట అన్నాను. రింగ్మాస్టర్ నా మొదటి హిట్ సినిమా అని చెప్పుకొచ్చింది.పేరెంట్స్ సలహాపేరెంట్స్ మేనక-సురేశ్ కుమార్ గురించి చెప్తూ.. 'సినిమాల్లోకి వచ్చేస్తానన్నప్పుడు అమ్మానాన్న నాకు కొన్ని సలహాలిచ్చారు. సమయపాలన పాటించాలని అమ్మ చెప్పేది. తను సమయానికి సెట్లో ఉంటానని నేను కూడా దాన్ని అనుసరించాలని నొక్కి చెప్పింది. సెట్లో పనిచేసేవాళ్ల దగ్గరనుంచి డైరెక్టర్ వరకు అందరికీ ఒకేరకమైన గౌరవం ఇవ్వాలంది.అదే చాలా కష్టంఇండస్ట్రీలో నేను మంచి పేరు సంపాదించుకున్నాను. దాన్ని అలాగే కాపాడుకోవాలని నాన్న చెప్పాడు. మా ఇంట్లోని వాళ్లందరూ మంచి విమర్శకులు. అమ్మానాన్న కంటే కూడా నా సోదరి నుంచి ప్రశంసలు అందుకోవడం అత్యంత కష్టతరమైన విషయం. నేనేంటో నిరూపించుకోవాలి, వాళ్ల దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను' అని కీర్తి చెప్పుకొచ్చింది.చదవండి: క్యూట్ గెటప్లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్.. -
మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా..
హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta-kulkarni) సన్యాసం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా ఇదే బాటలో హీరోయిన్ నిఖిలా విమల్ సోదరి అఖిలా విమల్ (Akhila Vimal) అడుగులు వేసింది. ప్రస్తుతం మహాకుంభమేళాలో ఉన్న ఆమె సన్యాసం (Sanyas) తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె గురువు అభినవ్ బాలనందభైరవ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. జూనా పీఠాదీశ్వరులు, అచార్య మహా మండలేశ్వర్ స్వామి అవధేశానంద గిరి మహారాజ్ సమక్షంలో అఖిల సన్యాసం స్వీకరించింది. ఇక మీదట తన పేరు అవంతిక భారతి అని వెల్లడించారు.కొద్ది రోజుల క్రితమే హింట్..కొద్ది రోజుల క్రితం అఖిల కాషాయ వస్త్రాలు ధరించి భక్తిమైకంలో మునిగి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అది చూసిన జనాలు.. తను ఏం చేయబోతుంది? సన్యాసం తీసుకుంటుందా? ఏంటి? అని అనుమానించారు. అందరూ ఊహించినట్లుగానే సాధ్విగా మారిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలోనే మిగిలిన జీవితం గడపనుంది. అఖిల.. హీరోయిన్ నిఖిలా విమల్కు స్వయానా అక్క. చిన్న వయసులోనే నిఖిల సినిమాల్లో ఎంట్రీ ఇవ్వగా.. అఖిల మాత్రం పూర్తిగా చదువుపైనే ధ్యాస పెట్టింది. ఉన్నత చదువులు.. సడన్గా సన్యాసంఅమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో థియేటర్ అండ్ పర్ఫామెన్స్ సబ్జెక్ట్పై రీసెర్చ్ చేసింది. ఉన్నత విద్యనభ్యసించిన ఆమె సడన్గా భక్తి మార్గం పట్టడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. నిఖిల (Nikhila Vimal) విషయానికి వస్తే.. మలయాళంలో పొర్ తొళిల్, అంజూమ్ పాతిరా, తెలుగులో మేడ మీద అబ్బాయి, గాయత్రి సినిమాలు చేసింది. రీసెంట్గా గురువాయూర్ అంబలనాడయిల్, నునక్కుళి చిత్రాల్లో మెప్పించింది.(చదవండి: హీరోగా నటించనున్న తమన్? 22 ఏళ్ల తర్వాత..!)సన్యాసం తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్హీరోయిన్ మమతా కులకర్ణి ఇటీవలే సన్యాసం తీసుకుంది. ఈమె 1990'sలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోలతో జోడీ కట్టింది. కరణ్ అర్జున్, బాజీ, ఆషిఖ్ ఆవారా, దిల్బర్, కిస్మత్, జానే జిగర్ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ మూవీస్తో మెప్పించింది. 2003లో ఓ బెంగాలీ సినిమా చేసిన అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించలేదు.డ్రగ్స్ కేసులో మమత పేరుఆ మధ్య రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో మమతా పేరు ప్రముఖంగా వినిపించింది. అంతేకాక కెన్యాలోనూ ఓ డ్రగ్స్ కేసులో అరెస్టయింది. చాలాకాలంగా కెన్యాలోనే నివసిస్తున్న ఆమె దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నారా అఖాడా(ఆశ్రమం)లో ఆచార్య మహా మండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసిగా మారింది. కారణం ఏమై ఉంటుందో?ఇకపై సాధ్విగా తన ప్రయాగం సాగుతుందన్న ఆమె తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది. అయితే ఆమె సాధ్విగా మారడంపై విమర్శలు కూడా వచ్చాయి. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన నటి సడన్గా సన్యాసిగా మారిపోవడం వెనుక కారణమేంటని ట్రాన్స్జెండర్, జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.చదవండి: మోనాలిసా సరే.. వీళ్ల గ్లామర్ ఎందుకు నచ్చదు..?: కంగనా రనౌత్ -
ది రాజాసాబ్ భామకు క్రేజీ ఆఫర్.. ఆ స్టార్ నటుడితో తొలిసారి!
గతేడాది తంగలాన్తో సూపర్ కొట్టిన హీరోయిన్ మాళవిక మోహనన్. కొత్త ఏడాదిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ సరసన ది రాజాసాబ్లో కనిపించనుంది. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ లైన్లో ఉండాగానే మరో క్రీజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ.మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ చిత్రంలో మాళవిక నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మాలీవుడ్ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ హృదయపూర్వం అనే టైటిల్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మాళవిక మోహనన్ను ఎంచుకున్నట్లు మాలీవుడ్లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాళవిక తొలిసారి మోహన్ లాల్తో జతకట్టనుంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్గా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫిబ్రవరి 10న కొచ్చిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.మాళవిక విషయానికొస్తే పట్టం పోల్ (2013)సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బియాండ్ ది క్లౌడ్స్, పెట్టా (2019), మాస్టర్ (2021) చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది విక్రమ్ మూవీతో విభిన్నమైన పాత్రతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా యుధ్రా సినిమాతో బాలీవుడ్లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం రెబల్ స్టార్ పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్లో కనిపించనుంది. ఇటీవల మాళవిక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం 2025 వేసవిలో గ్రాండ్ రిలీజ్ కానుంది. -
మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు..
హీరోయిన్ స్వాసిక విజయ్ (Swasika Vijay) మళ్లీ పెళ్లి చేసుకుంది. ప్రియుడు, నటుడు ప్రేమ్తో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ గతేడాది జనవరి 26న పెళ్లి జరిగింది. అయితే కేరళ సాంప్రదాయం ప్రకారం ఆ వివాహం జరిగింది. దీంతో తమ మొదటి వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నారు. తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ఆచరణలో పెట్టారు. మరోసారి వేలు పట్టుకుని..వధూవరుడిలా ముస్తాబై మండపంలో కూర్చున్నారు. ప్రేమ్.. మరోసారి అర్ధాంగితో కలిసి ఏడడుగులు వేశాడు. భార్య కాలికి మెట్టలు తొడిగాడు. ఈ వీడియోను దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చూస్తుండగానే ఏడాది అయిపోయింది. మేము తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇందుకోసం సహకరించిన అందరికీ థాంక్యూ. దీన్ని నిజమైన పెళ్లిలా అందంగా, అద్భుతంగా జరిపారు అని ప్రేమ్ రాసుకొచ్చాడు. స్వాసిక, ప్రేమ్ 'మనంపోలే మాంగళ్యం' సీరియల్లో కలిసి నటించారు.(చదవండి: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)హీరోయిన్గా కెరీర్ మొదలుస్వాసిక అసలు పేరు పూజా విజయ్ (Pooja Vijay). వైగై (2009) అనే తమిళ సినిమాతో హీరోయిన్గా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది ఫిడల్ చిత్రంతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ప్రభువింటే మక్కళ్, కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, పొరింజు మరియమ్ జోస్, చతురం, వాసంతి వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత సీరియల్స్లోనూ ఎంట్రీ ఇచ్చింది. పలు రియాలిటీ షోలలోనూ మెరిసింది. చివరగా లబ్బర్ పందు సినిమాతో అలరించింది. సూపర్ హిట్గా లబ్బర్ పందులబ్బర్ పందు సినిమా విషయానికి వస్తే.. రూ.5 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు రాబట్టింది. గల్లీ క్రికెట్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం హాట్స్టార్లో అందుబాటులో ఉంది. హరీశ్ కల్యాణ్, దినేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Prem Jacob (@premtheactor) View this post on Instagram A post shared by Swaswika (@swasikavj) చదవండి: మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్తో బాబీ డియోల్ -
మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఎక్కువ లాభపడింది తెలుగు సినిమానే! బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, హనుమాన్, కల్కి 2898 ఏడీ సినిమాలు సౌత్లోనే కాకుండా నార్త్లోనూ అదరగొట్టాయి. కన్నడ మూవీ కేజీఎఫ్ కూడా ఆలిండియా స్థాయిలో అదరగొట్టింది.వెనకబడ్డ మలయాళ మూవీస్అయితే మలయాళ చిత్రాలు (Malayalam Movies) మాత్రం ఆ స్థాయి రేంజ్ను అందుకోలేకపోతున్నాయి. అన్ని చోట్లా పెద్ద పెద్ద స్టార్స్ను హీరోగా పెట్టి సినిమాల్ని ముందుకు తీసుకువెళ్తే మలయాళంలో మాత్రం కంటెంటే కింగ్ అని, దాని వల్లే కాస్త వెనకబడ్డామంటున్నాడు హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan). హిందీలో మార్కెట్ లేకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడుతూ.. మా దగ్గర బడ్జెట్ అనేది ప్రధాన సమస్య. ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే ఆలోచిస్తారు. ఇంతకుముందెవరైనా ఎక్కువ పెట్టుబడితో హిట్ కొట్టారా? అని ఉదాహరణలు వెతుకుతారు.స్క్రిప్ట్, హీరో.. ఇంకా!సినిమా కమర్షియల్గా హిట్ కావాలంటే అందులో యాక్షన్ ఉండాల్సిందే! ఎందుకంటే యాక్షన్ సినిమాల్ని చాలా మంది ప్రేక్షకులు ఇష్టపడతారు. అలాంటి యాక్షన్ కథా చిత్రాన్ని తీయాలంటే ముందుగా ఒక స్టార్ హీరో కావాలి. అందరూ మెచ్చేటువంటి బలమైన స్క్రిప్ట్ కావాలి. సినిమాను భారీ ఎత్తున నిర్మించే అద్భుతమైన నిర్మాత కావాలి. ఇలా చాలా అంశాలు అనుకూలిస్తేనే అది సాధ్యమవుతుంది అని ఉన్ని ముకుందన్ చెప్పాడు.గతేడాది రూ.700 కోట్ల నష్టం2024లో పలు మలయాళ సినిమాలు సక్సెస్ను చూశాయి. కానీ ఓవరాల్గా మాత్రం మలయాళ ఇండస్ట్రీకి నష్టాలే ఎక్కువగా వచ్చాయి. ఈ మేరకు ఓ నివేదికను కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. 2024లో 199 మలయాళ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కేవలం 26 మాత్రమే హిట్టయ్యాయి. ఓవరాల్గా అన్ని సినిమాలు తెరకెక్కించేందుకు అయిన ఖర్చు రూ.1000 కోట్లు అయితే అందులో రూ.300 కోట్లు మాత్రమే కలెక్షన్ల రూపంలో వెనక్కు వచ్చాయి. ఈ లెక్కన మలయాళ ఇండస్ట్రీ రూ.700 కోట్లు పోగొట్టుకుంది. హిట్ సినిమాల జాబితాలో మంజుమ్మల్ బాయ్స్, ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), ఆవేశం, ప్రేమలు, ఏఆర్ఎమ్, కిష్కింద కాండం, గురువాయూర్ అంబలనడయిల్, వర్షంగళక్కు శేషం సినిమాలున్నాయి.కేరళవాసి.. ఆ సినిమాతో క్లిక్ఉన్ని ముకుందన్ విషయానికి వస్తే.. కేరళలో పుట్టి పెరిగిన ఇతడు సీడన్ (2011) అనే తమిళ సినిమాతో కెరీర్ ఆరంభించాడు. అదే ఏడాది బాంబే మార్చి 12 మూవీతో తన మాతృక భాష మలయాళంలో ఎంట్రీ ఇచ్చాడు. మల్లు సింగ్ మూవీతో సెన్సేషన్ అయిన ఉన్ని.. విక్రమాదిత్య, కేఎల్ 10 పట్టు, స్టైల్, ఒరు మురై వంతు పార్థాయ, అచయన్స్, మాలికాపురం చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు.తెలుగులోనూ..తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఇటీవలే మార్కోతో హిట్ అందుకున్న అతడు గెట్ సెట్ బేబీ అనే సినిమా చేస్తున్నాడు. 2022లో మెప్పడియాన్ మూవీతో ఉత్తమ నిర్మాతగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నాడు. ఈయన చివరగా మార్కో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వయొలెన్స్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మూవీకి హిట్ టాక్ రావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.చదవండి: సైఫ్ అలీఖాన్పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్ -
డబ్బుందన్న గర్వంతో ఎంతకైనా తెగిస్తారా? ఎంతని భరించాలి?: హనీరోజ్
డబ్బుందన్న గర్వంతో ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు అంటోంది హీరోయిన్ హనీ రోజ్ (Honey Rose). కొంతకాలంగా ఓ బిజినెస్మెన్ వేధిస్తున్నాడంటోంది బ్యూటీ. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో వ్యక్తి. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీ (Movie Industry)లో కొనసాగుతున్న నేను ఈ వేధింపుల్ని ఎందుకు సహించాలి? నన్నే టార్గెట్ చేస్తున్నాడునాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అతడి బిజినెస్కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తూ ఉండేవాళ్లం. కానీ అతడు తన ఇంటర్వ్యూలలో నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారీ నా పేరే వాడుకుంటున్నాడు. ఇలా ఒకరిగురించి ఇష్టారీతిన మాట్లాడమనేది సంస్కారమనిపించుకోదు. మొదట్లో అతడి మేనేజర్లు కలిసేవారు. తర్వాత ఇతడినీ కలిశాను. అప్పుడు ఎంతో మర్యాదగా మసులుకున్నాడు. కానీ ఓ పబ్లిక్ ఈవెంట్లో నన్ను డబుల్ మీనింగ్తో పిలిచాడు. (చదవండి: నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు)చులకన వ్యాఖ్యలుఒకసారి అతడి షాప్కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్కు వెళ్లడమే మానేశాను. మళ్లీ అవే దిగజారుడు వ్యాఖ్యలుఅయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్ను తిరస్కరించాను. (చదవండి: 'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్పై మా అసోసియేషన్)ఇలాగే వేధిస్తే ఊరుకునేది లేదునేను కాకపోతే మరో సెలబ్రిటీని వెతుక్కుంటానన్నాడు. అలాంటప్పుడు నేను తప్పుకున్నా పెద్ద నష్టం లేదంటూ రాసుకొచ్చింది. హనీతో నువ్వు హోటల్స్లో ఉంటున్నావా? అంటూ కొందరు అతడిని పిచ్చి ప్రశ్నలు వేసినప్పుడు తనిచ్చే సమాధానాలు కూడా చెండాలంగా ఉంటున్నాయి. మౌనంగా ఉంటున్నానంటే అన్నింటికీ తలాడిస్తున్నట్లు కాదు. ఇంకా ఇలాగే వేధిస్తే పోలీసులను ఆశ్రయిస్తాను అని రాసుకొచ్చింది.సినిమాకాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్! -
ఎవరూ అవకాశాలివ్వలేదు.. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా!
సినిమాలు ఎందుకు చేయడం లేదు? లైమ్ లైట్కు దూరంగా ఉన్న చాలామంది హీరోయిన్లను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నామని పలువురూ బదులిస్తుంటారు. తన విషయంలో మాత్రం అది నిజం కాదని, తనకెవరూ ఆఫర్స్ ఇవ్వకపోవడం వల్లే సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందంటోంది హీరోయిన్ అర్చన కవి (Archana Kavi). తమిళ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈమె తెలుగు(Tollywood)లో హీరోయిన్గా బ్యాక్బెంచ్ అని ఒకే ఒక్క మూవీ చేసింది. తొమ్మిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఈమె ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.బ్రేక్ ఇవ్వలేదు.. వచ్చింది!ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో అర్చన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నా అంతట నేనుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఎవరూ నాకు అవకాశాలివ్వలేదు, అందుకే తొమ్మిదేళ్లలో ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. 2013లో నాకు పెళ్లయింది. తర్వాత విడాకులవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నెమ్మదిగా దాన్నుంచి కోలుకున్నాక ఈ సినిమా ఆఫర్ రావడంతో చేసేశాను' అని అర్చన చెప్పుకొచ్చింది.చదవండి: దిల్రూబా టీజర్: ప్రేమ గొప్పది.. కానీ అదిచ్చే బాధే భయంకరంగా ఉంటుంది! -
పడుచు హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్.. 'తప్పేముంది?'
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు కానీ హీరోలు మాత్రం అలాగే ఉంటారు. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చిందంటే వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారు. ఈ క్రమంలో వారి వయసుకు తగ్గ కథానాయికలతో కాకుండా కుర్ర హీరోయిన్లతోనూ స్టెప్పులేస్తున్నారు. అయితే ఇందులో తప్పే లేదంటున్నాడు మలయాళ స్టార్ మోహన్లాల్ (Mohanlal).అందులో తప్పేం లేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్లాల్ మాట్లాడుతూ.. ఈ పద్ధతి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఎప్పటినుంచో మన ఇండస్ట్రీ ఇలాగే ఉంది. తెలుగు (Tollywood), తమిళంలోనూ ఇదే కొనసాగుతోంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే వంద ఏళ్లు వచ్చినా సరే యాక్ట్ చేయొచ్చు. ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నావనేది నీ చేతిలో ఉంటుంది. నీకు అసౌకర్యంగా అనిపిస్తుందంటే అలాంటి అవకాశాలను వదిలేసుకోవడమే మంచిది. కానీ జనాలు మిమ్మల్ని ఆయా పాత్రల్లో ఇష్టపడుతుంటే వాటిని అంగీకరించడంలో తప్పేం లేదు. యాక్టింగ్ అనేది ఒక పర్ఫామెన్స్ అంతే! దానికి వయసుతో సంబంధం లేదు. కేవలం అక్కడ ఎటువంటి పాత్ర చేస్తున్నావన్నది నీపై ఆధారపడి ఉంటుంది అన్నాడు.చదవండి: 2025 ప్రారంభంలో ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్లు ఇవే!ఏదీ ఆలోచించలేదుభవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు.. ఏదీ చేయాలనుకోవడం లేదు. నా జీవితంలో అన్నీ వాటికవే జరిగిపోతున్నాయి. ఇప్పుడు సినిమాలు (Movies) చేస్తున్నాను. కాబట్టి ఇంకా దేని గురించీ ఆలోచించట్లేదు. ఒకవేళ ఏదైనా జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. జీవితం అనేది ఒక ప్రవాహం.. అది ఎటు తీసుకెళ్తే అటు సాగిపోతూ ఉండాలి అని చెప్పుకొచ్చాడు.అదే పెద్ద మార్పుసినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులపై స్పందిస్తూ.. కాలం వేగంగా గడుస్తోంది. అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఏఐ, వీఎఫ్ఎక్స్ వల్ల సినిమాల్లో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇదే అన్నింటికంటే పెద్ద మార్పు. కానీ ఏ గ్యాడ్జెట్ కూడా ఎమోషన్స్ను మార్చలేవు. మన ఎమోషన్స్ మన చేతిలోనే ఉన్నాయి అని మోహన్లాల్ చెప్పుకొచ్చాడు.చదవండి: టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ -
Mollywood: హిట్టయిన సినిమాలు ఇంతేనా? రూ.700 కోట్ల లాస్!
కథలో కొత్తదనం, సహజత్వం అనగానే చాలామందికి మలయాళ సినిమాలు గుర్తొస్తుంటాయి. అది నిజమేనని ఏయేటికాయేడు మాలీవుడ్ (Mollywood) నిరూపించుకుంటూనే ఉంది. ఈ ఏడాదైతే మంజుమ్మెల్ బాయ్స్, ఆడుజీవితం, ఆవేశం వంటి ఎన్నో సినిమాలు బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచాయి. అయితే 2024లో మాలీవుడ్లో సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉందంటోంది కేరళ చిత్ర నిర్మాతల సంఘం.199 చిత్రాలు రిలీజ్వారి నివేది ప్రకారం.. 2024లో 199 మలయాళ సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. ఇందులో కేవలం 26 చిత్రాలు మాత్రమే సక్సెసయ్యాయి. అయితే మొత్తం అన్ని సినిమాలకు కలుపుకుని రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రూ.300 కోట్లు మాత్రమే తిరిగొచ్చింది. అంటే రూ.700 కోట్లు నష్టపోయారు! బడ్జెట్ పెరగడం, నటీనటుల పారితోషికం పెంపు వంటివి ఈ నష్టానికి ప్రధాన కారణమని తేల్చాయి.రూ.100 కోట్ల క్లబ్లో ఐదు సినిమాలుమంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys), ఆవేశం (Aavesham), ప్రేమలు (Premalu), ఆడుజీవితం (Aadujeevitham: The Goat Life), ARM చిత్రాలు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఈ ఐదింటిలో అత్యధికంగా మంజుమ్మెల్ బాయ్స్ రూ.242 కోట్లు సాధించింది. కిష్కింద కాండం, గురువాయూర్ అంబలనడయిల్, వర్షంగళక్కు శేషం సినిమాలు రూ.50 కోట్లు వసూలు చేశాయి.రీరిలీజ్ మూవీస్ హిట్మోహన్లాల్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన బరోజ్ పెద్దగా ఆక్టటుకోలేకపోయింది. కానీ అతడు నటించిన దేవదూతన్, మణిచిత్రతళు సినిమాలను రీరిలీజ్ చేయగా మరోసారి హిట్టందుకున్నాయి. జనాలు భారీ తారాగణాన్ని చూసి కాకుండా కంటెంట్ను చూసి థియేటర్లకు వస్తున్నారని ఈ ఏడాదితో స్పష్టమైంది. దీన్ని బట్టి ఎడాపెడా ఖర్చుపెట్టకుండా నిర్మాణ వ్యయాలను అదుపులో పెట్టుకుంటే ఇండస్ట్రీకి మంచిది!చదవండి: Tollywood: ‘డిసెంబర్’ రివ్యూ.. హిట్ రాలేదు ‘పుష్పా’ ! -
దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ..
-
ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ!
ఓటీటీ వచ్చాక థియేటర్లకు ప్రేక్షకుల పరుగులు తగ్గిపోయాయి. వెండితెర ప్రదర్శనలు వారాలకే పరిమితమయ్యాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. సినిమా ఎంత బాగున్నా సరే యాభై రోజుల లోపు స్మార్ట్ తెరకు తేవాల్సిందే. అందుకే బెనిఫిట్ షోలు.. అడ్డగోలుగా పెంచుతున్న టికెట్ రేట్లతో సినిమాలకు కలెక్షన్లు రాబడుతున్న రోజులివి. అయినా అనుకున్న ఫిగర్ను రీచ్ కాలేకపోతున్నారు కొందరు నిర్మాతలు. కానీ, కళ్లు చెదిరేరీతిలో కలెక్షన్లతో.. ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమ. వాస్తవికతతో పాటు ఆహ్లాదకరమైన కథలను అందించే చిత్ర పరిశ్రమగా పేరున్న మాలీవుడ్కు పేరు దక్కింది. అంతర్జాతీయంగానూ ఆ చిత్రాలకు అంతే గుర్తింపు దక్కుతోంది. కానీ, ఇదే పరిశ్రమకు వంద కోట్ల చిత్రం ఒక కలగానే ఉండేది. లిమిట్ బడ్జెట్, దానికి తగ్గట్లుగా తెరకెక్కే చిత్రం.. అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టేది మలయాళ సినిమా. ఫలితంగా రూ.20.. 30 కోట్ల కలెక్షన్లు రావడమే కష్టంగా ఉండేది. అయితే.. మలయాళం సినిమా మొదలైన 85 ఏళ్లకు(1928లో తొలి చిత్రం రిలీజ్..).. హాఫ్ సెంచరీ క్లబ్లోకి ‘దృశ్యం’(2013) రూపంలో ఓ చిత్రం అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ‘పులిమురుగన్’ సెంచరీ క్లబ్కి అడుగుపెట్టిన తొలి మల్లు చిత్ర ఘనత దక్కించుకుంది. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు.. 2024 ఏడాదిలో ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపోయేలా చేసింది.ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాల్లో ఐదు సినిమాలు కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించాయి. అందులో మొదటిది.. మంజుమ్మల్ బాయ్స్. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మిస్టరీ గుహల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రమిది. కేరళలో మాత్రమే కాదు.. తమిళనాట సైతం ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కమల్ హాసన్ ‘గుణ’ లోని పాట.. మంజుమ్మల్ బాయ్స్ బ్యాక్డ్రాప్కే హైలైట్. టోటల్ రన్లో ఏకంగా డబుల్ సెంచరీ(రూ.240 కోట్ల వసూళ్లు) రాబట్టి.. ఆ భాషలో కలెక్షన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టి నటించిన సినిమా. విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎడారి దేశంలో ఓ వలసజీవి ఎదుర్కొనే అవస్థలే ఈ చిత్ర కథాంశం. నజీబ్ అనే వ్యక్తి వాస్తవ గాథను బెన్యామిన్ ‘ఆడుజీవితం’గా నవల రూపకంలోకి తీసుకెళ్తే.. దానిని రచయిత కమ్ దర్శకుడు బ్లెస్సీ వెండితెరపైకి తేవడానికి 16 ఏళ్లు పట్టింది. కలెక్షన్లపరంగా 150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అవార్డులను సైతం కొల్లగొట్టింది.ఆవేశం ఫహద్ ఫాజిల్ వన్ మేన్ షో. ముగ్గురు కాలేజీ యువకులకు, ఎమోషనల్ గ్యాంగ్స్టర్ రంగా మధ్య నడిచే కథ ఇది. మలయాళంలో జీతూ మాధవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 156 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో రీల్స్ ద్వారా ఈ చిత్రం మరింత ఫేమస్ అయ్యింది.ఏఆర్ఎం(అజయంతే రంధం మోషణం)మిన్నల్ మురళితో తెలుగువారిని సుపరిచితుడైన టోవినోథామస్ లీడ్లో తెరకెక్కిన చిత్రం. ఓ వంశంలో మూడు తరాలకు.. ఓ విగ్రహ నేపథ్యంతో నడిచే కథ ఇది. జితిన్లాల్ ఈ యాక్షన్ థిల్లర్ను తెరకెక్కించారు. ఫుల్ రన్లో వంద కోట్లు రాబట్టింది ఈ చిత్రం.ప్రేమలుమలయాళంలో చిన్నచిత్రంగా వచ్చి.. కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించింది ఈ చిత్రం.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా గిరిష్ ఏడీ దీనిని తెరకెక్కించాడు. ఏకంగా 136 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రాలు బోనస్..మాలీవుడ్కు నిజంగా ఇది లక్కీ ఇయరే. పై ఐదు చిత్రాలు మాత్రమే కాదు.. కలెక్షన్లపరంగా మరికొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇందులో.. విపిన్ దాస్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్-బసిల్ జోసెఫ్-నిఖిలా విమల్ నటించిన గురువాయూర్ అంబలనాదయిల్, రూ.90 కోట్లతో సెంచరీ క్లబ్కి ఎక్కడం మిస్ అయ్యింది ఈ సినిమా. ఇక.. వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్లో ప్రణవ్ మోహన్లాల్ లీడ్ో నటించిన ‘‘వర్షన్గలక్కు శేషం’’, దింజిత్ అయ్యతాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘‘కష్కింద కాండం’’, మమ్మూటి నటించిన ‘టర్బో’, ‘భ్రమయుగం’ చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. ఇతర చిత్ర పరిశ్రమలు కుళ్లుకునేలా చేశాయి. -
నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్
నాకు నాలుగు పెళ్లిళ్లయ్యాని అందరూ ఈర్ష్యపడుతున్నారు.. పెళ్లి కాని ప్రసాదులైతే నాపై ఎంతో ఏడుస్తున్నారు అని మలయాళ నటుడు బాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ అంతలోనే యూటర్న్ తీసుకున్నాడు. తనకు రెండు పెళ్లిళ్లు మాత్రమే జరిగాయంటున్నాడు.అది నా మొదటి పెళ్లితాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల మాట్లాడుతూ.. నాకు 21 ఏళ్ల వయసులో చందనతో వివాహం జరిగింది. ఆమె నా స్కూల్మేట్. ఇద్దరం ప్రేమించుకున్నాం, గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. కానీ నా దృష్టిలో అది నిజమైన పెళ్లి కాదు. ఎందుకంటే తను మరో వ్యక్తితో వెళ్లిపోకూడదనుకుని ఆవేశంలో అలా చేశాను. మా కుటుంబాలు మమ్మల్నిద్దరినీ విడదీయడంతో కలిసుండలేకపోయాం.కోకిల నా రెండో భార్యకానీ తనతో నాకు ఇప్పటికీ పరిచయం ఉంది. మా మధ్య స్నేహం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో తన భర్తతో సంతోషంగా ఉంది. ఇకపోతే నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నానని జనాలు నమ్మడం ఆశ్చర్యంగా ఉంది. చట్టపరంగా కోకిల నా రెండో భార్య. డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను మూడో పెళ్లి చేసుకున్నట్లు రూమర్స్ ఉన్నాయి. అది లీగల్ మ్యారేజ్ కాదునిజానికి అది చట్టపరమైన వివాహం కాదు. ఇంతకుమించి తనగురించి ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. అయితే ఓ విషయం. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంది, చాలా సాయం చేసింది. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుకుంటాను. ఆమె ఎంతో అద్భుతమైన వ్యక్తి. తనకెప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.బాలా- అమృత విడాకులుసింగర్ అమృతా సురేశ్తో జరిగిన వివాహం గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. ఇకపోతే బాలాకు, అమృతకు 2010లో పెళ్లి జరగ్గా వీరికి అవంతిక అనే కూతురు ఉంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమృత.. బాలాపై కేసు కూడా పెట్టింది.చదవండి: పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్..: నాగార్జున -
మరో వివాదం.. 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలపై ఐటీ రైడ్
ఈ ఏడాది రిలీజైన అద్భుత సినిమాల్లో 'మంజుమ్మెల్ బాయ్స్' ఒకటి. పేరుకే మలయాళ మూవీ గానీ తెలుగు, తమిళంలోనూ కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కానీ ఇదంతా నాణెనికి ఒకవైపు. మరోవైపు చూస్తే నిర్మాతలు.. తమతో పాటు మూవీని నిర్మించిన భాగస్వామిని మోసం చేశారు. లాభాల్లో వాటా ఇవ్వలేదని అతడి కేసు పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్మాణ సంస్థ ఆఫీస్పై రైడ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)స్నేహితుడు గుహలో పడిపోతే మిగిలిన 10 మంది స్నేహితులు కలిసి అతడిని ఎలా కాపాడారు అనే నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. ప్రముఖ మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగానూ వ్యవహరించాడు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే లాభాలకు.. కట్టిన ట్యాక్స్కి ఏ మాత్రం పొంతన లేదని తాజాగా ఐటీ రైడ్లో అధికారులు గుర్తించారు. కొచిలోని పరవ ప్రొడక్షన్ ఆఫీస్లో గురువారం తనిఖీలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్లోనే 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు.. వివాదంలో చిక్కుకున్నారు. తాను కూడా సినిమా నిర్మాణంలో భాగమని.. అయితే లాభాల్లో వాటా ఇచ్చే విషయంలో మోసం చేశారని ఓ వ్యక్తి.. వీళ్లపై మారాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అది కోర్ట్ వరకు చేరుకోవడంతో సదరు నిర్మాతల బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఐటీ రైడ్స్ చేయడంతో మరోసారి 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు హాట్ టాపిక్ అయ్యారు. మరి ఎన్ని కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టారనేది అధికారులు బయటపెట్టాల్సి ఉంది!(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
కొచ్చిలో పుష్ప-2 ఫీవర్.. అల్లు అర్జున్ కొత్త పేరేంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఐకాన్ స్టార్కు తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. లివా మాల్లోని గ్రాండ్ హయత్లో ఈవెంట్ జరగనుంది.ఈ భారీ ఈవెంట్కు హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ కేరళకు వస్తున్న సందర్భంగా కొచ్చి అంతటా భారీ హోర్డింగ్స్ మెరిశాయి. పుష్ప-2 పోస్టర్లతో నగరమంతా నింపేశారు. అంతేకాదు ఎయిర్పోర్ట్ వద్ద ఐకాన్ స్టార్ కోసం ఫ్యాన్స్ ఎంతోమంది పోస్టర్లతో దర్శనమిచ్చారు. అయితే పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసిన పుష్ప-2 వెల్కమ్ పోస్టర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ పేరును ముద్దుగా మల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్పలో మెప్పించిన శ్రీవల్లిగా మరోసారి రష్మిక ఫ్యాన్స్ను అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తున్నారు. ఓవర్సీస్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. Kerala Allu Arjun fans waiting at kochi airport since afternoon 💥Expecting @alluarjun arrival in 15mins #PushpaRulesKeralam KOCHI WELCOMES ALLUARJUN pic.twitter.com/eNwfBwQ3k5— Allu Arjun Devotees 🐉 (@SSAADevotees) November 27, 2024 KERALA WELCOMES MALLU ARJUN 🔥🔥#PushpaRulesKeralam ❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/NPj9CqPQBz— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
మా అక్కను చూశాక పెళ్లంటేనే భయమేస్తోంది: నటి
మలయాళ నటి, సింగర్ అమృత సురేశ్.. నటుడు బాలాను 2010లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు కూడా పుట్టింది. కుటుంబంలో గొడవలు మొదలవడంతో 2019లో అమృత-బాలా విడిపోయారు. విడాకుల తర్వాత కూడా తనతో పాటు, కూతుర్ని వేధించాడని అమృత ఫిర్యాదు చేయగా పోలీసులు బాలను అరెస్ట్ చేశారు. అదృష్టం కూడా ఉండాలితర్వాత బెయిల్పై బయటకు వచ్చిన అతడు ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. అమృత మాత్రం ఒంటరిగానే ఉంటోంది. ఇదంతా చూశాక తనకు పెళ్లంటేనే భయమేస్తోందంటోంది అమృత సోదరి, నటి అభిరామి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విడాకులే లేని పెళ్లి కావాలి. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ.. అందుకు అదృష్టం కూడా కలిసిరావాలి. పెళ్లి అంటేనే భయంపెళ్లికి నేను విరుద్ధం కాదు. కానీ మా అక్క పడ్డ కష్టాలు చూశాక వివాహమంటేనే భయమేస్తోంది. ఆ భయం వల్లే ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలా అని ఎప్పటికీ సింగిల్గానే ఉండిపోను. ఏదో ఒకరోజు కచ్చితంగా మూడు ముళ్లు వేయించుకుంటాను. అయితే గుడ్డిగా తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడటం కంటే ప్రమాదకరం మరొకటి లేదు. మా అక్క పెళ్లయినప్పటినుంచి అంటే దాదాపు 14 ఏళ్లుగా మా కుటుంబం బాధ అనుభవిస్తూనే ఉంది' అని అభిరామి చెప్పుకొచ్చింది.చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ -
కూలీ పనికి వెళ్తున్న స్టార్ హీరో తనయుడు!
మలయాళంలో ఆయనో ఓ పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్లో రికార్డులు సృష్టించాలన్నా.. ఉన్న రికార్డులను బద్దలు కొట్టాలన్నా ఆయన తర్వాతే అందరు. వందల సినిమాలు తీసి వేల కోట్ల ఆస్తిని కూడా కూడబెట్టాడు. కొడుకుని హీరోగా ఇండస్ట్రీగా పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందించాడు. కట్ చేస్తే..ఆ వారసుడు ఇప్పుడు కూలీగా మారాడు. తండ్రి సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ తనయుడి పేరే ప్రణవ్ మోహన్ లాన్. తండ్రి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మోహన్ లాల్ కొడుకు కూలీ పని చేయడం ఏంటని షాకవుతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.ఆల్ రౌండర్ ప్రణవ్మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్క్రీన్ప్లే రైటర్గా మారాడు. కొన్నాళ్లకు మళ్లీ హీరోగా వెండితెరపై మెరిశాడు. ఆయన తీసిన ‘హృదయం’ మూవీ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన తర్వాత ఆయన నటించిన ‘వర్షంగళ్కు శేషం’ మూవీ కూడా ప్రణవ్కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. హీరో కంటే ముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశాడు. ఇలా ఒకవైపు నటనతో పాటు మిగిలిన విభాలన్నింటిలోనూ ప్రణవ్ మంచి పట్టు సాధించి ‘ఆల్ రౌండర్’గా గుర్తింపు పొందాడు. ఇలా కెరీర్లో దూసుకెళ్తున్న ప్రణవ్..సడెన్గా గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైపోయాడు.స్పెయిన్లో కూలీగా..‘వర్షంగళకు శేషం’ తర్వాత ప్రణవ్ కాస్త గ్యాప్ తీసుకొని స్పెయిన్ వెళ్లాడు. స్టార్ హీరో కాబట్టి ఏ వివాహారానికో, ఎంజాయ్ చేయడానికి ప్రణవ్ విదేశాలకు వెళ్లలేదు. స్పెయిన్ వెళ్లి కూలీ పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఫామ్ హౌస్లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడట. ఇందుకుగాను జీతం ఏమి లేదట. కేవలం భోజనం పెట్టి, షెల్టర్ ఇస్తారట.కష్టమైన పని చేయడం ఇష్టంప్రణవ్ కూలీ పనిచేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయకున్నా.. తండ్రి మోహన్ లాన్ సంపాదించిన ఆస్తితో జీవితాంతం కూర్చొని తినొచ్చు. అలా ఉండడం ఇష్టం లేకపోయినా.. తనలో మంచి టాలెంట్ ఉంది. హీరోగానూ రాణించాడు. ఆయన నటిస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇలాంటి లగ్జరీ లైఫ్ని వదిలేసి.. కూలీ పని చేయాల్సిన అవసరం ఏంటి? అంటే.. ప్రణవ్కి అలాంటి పని చేయడం ఇష్టం అట. గొర్రెలు, గుర్రాలను చూసుకునే పనిని ఆస్వాదిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రణవ్ తల్లి, మోహన్ లాల్ సతీమణి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘కష్టమైన పని చేయడం ప్రణవ్కి ఇష్టం. కానీ నాకు మాత్రం ప్రణవ్ హీరోగా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’ అని ప్రణవ్ తల్లి అన్నారు. రంగుల ప్రపంచం(చిత్ర పరిశ్రమ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలా సాధారణ జీవితం గడపడడం నిజంగా గొప్ప విషయమే. View this post on Instagram A post shared by Pranav Mohanlal (@pranavmohanlal) -
ప్రేమమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే?
ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. దుబాయ్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్హిట్గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు. -
నా మొదటి భార్య అలాంటిది.. అందుకే రెండో పెళ్లి: నటుడు
ఈ రోజుల్లో బట్టతల, బయటకు తన్నుకొచ్చిన పొట్ట కామన్ అయిపోయింది. కానీ పెళ్లి చేసుకునేవరకైనా ఆ రెండింటినీ అడ్డుకోవాలని లేదా కవర్ చేసుకోవాలని ప్రయత్నించేవాళ్లు బోలెడు. అయితే మలయాళ బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ మాత్రం నెరిసిన గడ్డం, బట్టతలతోనే పెళ్లి చేసుకున్నాడు. ముసలాడిగానే పెళ్లిపీటలపై కూర్చుని ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు. పిల్లల ఎదుటే రెండో పెళ్లి చేసుకున్నాడు.దంపతులపై ట్రోలింగ్ఇది చూసిన జనం నోరెళ్లబెట్టారు. సోషల్ మీడియా వేదికగా వేణుగోపాల్ను, నటి దివ్య శ్రీధర్ను తిట్టిపోస్తున్నారు. ఈ వయసులో రెండో పెళ్లేంటని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్తో కొత్త జంట ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దివ్య శ్రీధర్ స్పందిస్తూ.. తమ వయసు మరీ ఎక్కువేమి కాదని పెదవి విప్పింది. తన వయసు 40, క్రిస్ వయసు 49 అని పేర్కొంది. తాము శారీరక వాంఛ కోసం పెళ్లి చేసుకోలేదని, ఒకరికొకరం తోడు కోరుకున్నామని వెల్లడించింది.కుటుంబానికి కూడా దూరంక్రిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. మొదటి భార్యతో నేను సంతోషంగా లేను. నా స్వేచ్ఛను దూరం చేసింది. ఆమె నా కుటుంబంతో కూడా మాట్లాడనిచ్చేదికాదు. ఎన్నో షరతులు విధించేది. ఎవరూ మా ఇంటికి వచ్చేవారు కాదు. కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఒప్పుకునేది కాదు. నేను మనిషిలా కాకుండా ఒక పెంపుడు జంతువులా ఉండేవాడిని. జీవితంపైనే విరక్తి వచ్చింది. దాని నుంచి విముక్తి కోరుకున్నాను.అందుకే రెండో పెళ్లి2019లో విడాకులకు దరఖాస్తు చేయగా 2022లో మంజూరయ్యాయి. కానీ కొన్ని నెలలకు ఏ తోడూ లేకుండా బతకడం కష్టంగా అనిపించింది. అందుకే దివ్యను పెళ్లి చేసుకున్నాను. చాలామంది మా రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది అన్నాడు. కాగా క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్.. ఇద్దరికీ ఇది రెండో వివాహమే! క్రిస్ వేణుగోపాల్ పాతరమట్టు సీరియల్లో తాతగా నటించాడు. పలు సీరియల్స్లో యాక్ట్ చేసిన ఇతడు పల్లు రైజింగ్, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్ వంటి చిత్రాల్లోనూ నటించాడు.చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన హర్షసాయి.. కేసు గురించి.. -
లేటు వయసులో పెళ్లి.. 'తండ్రి దొరికినందుకు పిల్లలు హ్యాపీ'
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్లో కలిసి నటించారు.ఫస్ట్ ప్రపోజ్ ఎవరంటే?ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. నాకు మొదట ప్రపోజ్ చేసింది అతడే.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. తీరా.. అతడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించాడు కూడా! దీని గురించి నా కూతురు, కొడుక్కి చెప్తే వాళ్లు ఎంతగానో సంతోషించారు. తమకు తండ్రి దొరికాడని ఖుషీ అయ్యారు అని తెలిపింది.ఇద్దరూ నటులేకాగా క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంటాడు. దివ్య శ్రీధర్.. మలయాళ సీరియల్స్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటుంది. -
మలయాళ రాక్స్టార్ పెళ్లి.. హాజరైన సెలబ్రిటీలు
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ పెళ్లి పీటలెక్కాడు. ప్రేయసి, సింగర్ ఉత్తర కృష్ణన్ మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇకపోతే నటుడు పార్వతీ జయరామ్ చుట్టాలమ్మాయే ఉత్తర. బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా..పార్వతి జయరాం కూతురి పెళ్లిలోనే సుశిన్-ఉత్తర ప్రేమాయణం బయటపడింది. మొదట బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న వీళ్లు తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి భార్యాభర్తలుగా ఓ అడుగు ముందుకు వేశారు. ఈ వివాహానికి సినీనటులు ఫహద్ ఫాజిల్, నజ్రియా, జయరామ్, దర్శకుడు అన్వర్ రషీద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మ్యూజిక్ కెరీర్..సుశిన్ విషయానికి వస్తే.. దీపక్ దేవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మొదట శిక్షణ తీసుకున్నాడు. లార్డ్ లివింగ్స్టన్ 700 కండి, కిస్మత్ వంటి చిత్రాలకు బీజీఎమ్ అందించాడు. వరథాన్, కుంబలంగి నైట్స్ సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భీష్మ పర్వం, మిన్నాల్ మురళి, రోమాంచం, మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, బోగిన్ విల్లా వంటి పలు చిత్రాలకు సంగీతం అందించాడు. Sensational Malayalam music director #SushinShyam got married to AD and singer #UtharaKrishnan ❤️ #fahadhfaasil and wife #Nasriya , #Jayaram were present at this very private ceremony pic.twitter.com/CHR41ApcXL— sridevi sreedhar (@sridevisreedhar) October 30, 2024 చదవండి: అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది! -
అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి
సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్తో తీసిన ఈ చిత్రాన్ని నవంబర్ 14న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇంతలో విషాదం జరిగిపోయింది. ఈ సినిమాకు పనిచేసిన ఎడిటర్ నిషాద్ యూసఫ్ (43).. అనుమానాస్పద రీతిలో చనిపోయి కనిపించాడు. ఇప్పుడీ వార్త అందరినీ షాక్కి గురిచేస్తోంది.(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)కేరళకు చెందిన నిషాద్ యూసఫ్.. ఎడిటర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తల్లుమలా, ఉండా, వన్, సౌదీ వెళ్లక్క, అడియోస్ అమిగోస్ తదితర చిత్రాలకు పనిచేశాడు. ఇవన్నీ గత రెండు మూడేళ్లలోనే రిలీజయ్యాయి. నిషాద్ పనిచేసిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. ఇంతలో ఇలా మృతి చెందడంపై తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.బుధవారం వేకువజామున 2 గంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్లోని తన అపార్ట్మెంట్ శవమై కనిపించాడు. మృతికి కారణాలు ఇంకా తెలిసిరాలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా మరో 15 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని.. ఇలా ఎడిటర్ చనిపోవడం 'కంగువ' టీమ్కి కూడా షాకే.(ఇదీ చదవండి: టాలీవుడ్ సీనియర్ నిర్మాత కన్నుమూత) -
పెళ్లి కాని వాళ్లకు నన్ను చూస్తేనే అసూయ: నటుడు
సమాజంలో పెళ్లికాని ప్రసాదులూ ఉన్నారు.. ముచ్చటగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లూ ఉన్నారు. ఈ మధ్యే మలయాళ నటుడు బాల (బాలకుమార్) సైతం నాలుగో వివాహం చేసుకున్నాడు. చుట్టాలమ్మాయి కోకిల మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరిద్దరికీ దాదాపు 18 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అయితే చాలామంది తనను చూసి కుళ్లుకుంటున్నారంటున్నాడు బాల. రాజులా బతుకుతున్నా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు బాల మాట్లాడుతూ.. 'ఇప్పుడు నా వయసు 42 ఏళ్లు, కోకిలకు 24 ఏళ్లు. అయినా మా సంసార జీవితం సంతోషంగా సాగుతోంది. నేను రాజులా బతుకుతున్నా.. భార్యను రాణిలా చూసుకుంటున్నా.. త్వరలోనే మాకు ఓ బుజ్జి బాబు/పాపాయి రానుంది. ఇదంతా చూసి మీరు అసూయ చెందితే దానికి నేనేం చేయలేను. తప్పులు వెతకడమే మీ పనిమీ దగ్గర డబ్బు లేకనే ఏ అమ్మాయి దొరకడం లేదు. అయినా నా నాలుగు పెళ్లిళ్లపై ఏడుస్తారేమో! ప్రతిదాంట్లో తప్పులు వెతకడమే మీలాంటివారి పని' అని కౌంటరిచ్చాడు. కోకిల మాట్లాడుతూ.. చాలాకాలంగా మామ ఒంటరిగానే ఉంటున్నాడు. ఇప్పుడు నేను అతడికి తోడుగా ఉన్నాను. చిన్నప్పటినుంచి అతడు అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అది చూసే నేను ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చింది.పెళ్లి హిస్టరీ..ఇకపోతే బాల.. కంగువ మూవీ డైరెక్టర్ శివకు తమ్ముడవుతాడు. కాగా బాల 2008లో చందన సదాశివ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఏడాదికే ఆమెకు విడాకులిచ్చేసి 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. తర్వాత పొరపచ్చాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను పెళ్లాడగా ఆమెతోనూ సుదీర్ఘ ప్రయాణం చేయలేదు. పోయిన ఏడాదే విడిపోయాడు. ఈ మధ్యే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. -
పాపులర్ యాంకర్, టీవీ నటి మెటర్నిటీ ఫోటోషూట్
-
కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్
టీవీ సీరియల్స్, టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2 ద్వారా పాపులర్ అయిన మలయాళ కుట్టి మాళవిక కృష్ణదాస్ త్వరలో తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మాళవిక క్లాసికల్ డేన్సర్ కూడా. నటనతోపాటు, శాస్త్రీయ నృత్యంలో కూడా అనేక అవార్డులు రివార్డులుగెల్చుకుంది. 2023లో ‘నాయికా నాయకన్’ కో-కంటెస్టెంట్ తేజస్ జ్యోతిని వివాహం చేసుకుంది. ఇపుడు ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది. -
మరో ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్హిట్గా నిలిచింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో దర్శనమిచ్చింది.తాజాగా ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ హీరోగా నటించారు. ఈ మూవీకి అర్బాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు లెవెల్ క్రాస్ సినిమా చూసేయండి.Unlikely love. Shattered trust. Eternal consequences. Stream #LevelCross on #Aha ▶️https://t.co/NCGmg0REO0 pic.twitter.com/0H57F28kFt— ahavideoin (@ahavideoIN) October 15, 2024 -
ఆ కారణం వల్లే బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది: దుల్కర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నుంచి సినిమా వచ్చి ఏడాదిపైనే అవుతోంది. గతేడాది ఆగస్టులో కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తర్వాత కల్కి 2898 ఏడీ మూవీలో చిన్న పాత్రలో మెరిశాడు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను బ్రేక్ తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.అందుకే గ్యాప్ వచ్చిందినా గత సినిమా అంతగా ఆడలేదు. అందులో ఎవరి తప్పూ లేదు. అయితే నాకు చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. అందుకే గతేడాది ఒకే ఒక్క సినిమా చేయగలిగాను. నేను ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేదు. అది నా తప్పే అని చెప్పుకొచ్చాడు.సినిమాల విషయానికి వస్తే..దుల్కర్ ప్రధాన పాత్లలో నటించిన ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఇతడు పీరియాడికల్ ఫిలిం కాంత సినిమా చేస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. . 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే పవన్ సాధినేని డైరెక్షన్లో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నాడు. -
ప్రముఖ నటుడు అరెస్ట్.. అదే కారణం!
ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువనంతపురంలోని మ్యూజియం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.కాగా.. కారులో బైజూ కుమార్తె కూడా అతనితో ఉన్నట్లు తెలుస్తోంది. బైజు సంతోష్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు. ఆయన మొదట అధవ మణియన్ పిల్ల (1981) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. ఆ తర్వాత పుతన్ పనం (2017), మేరా నామ్ షాజీ (2019) చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా.. ప్రస్తుతం సంతోశ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం ఎల్2 ఎంపురన్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
మాజీ భార్య ఫిర్యాదు.. ప్రముఖ నటుడు అరెస్ట్
మలయాళ ప్రముఖ నటుడు బాల అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని అతడి ఫ్లాట్లో ఉండగా.. సోమవారం ఉదయం పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతోనే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.బాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)ఈ మధ్య సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో తమ పరువు తీసేలా బాలా ప్రవర్తిస్తున్నాడని.. ఇతడి మాజీ భార్య అమృత తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కూతురి వెంటపడటంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొచ్చిలో బాలాతో పాటు అతడి మేనేజర్, ఫిల్మీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానెల్ యజమానికి కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లని వేధించిన కారణంగా జువైనల్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.బాలా తనని వేధిస్తున్నాడని చెప్పి అమృత.. గతంలో రెండు మూడుసార్లు గృహ హింస కేసు పెట్టింది. ఇప్పుడు విడాకుల నిబంధనని మీరి తమని వేధిస్తున్నాడని అమృత కేసు పెట్టడంతో ఈ గొడవ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి) -
ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు టీపీ మాధవన్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో మంగళవారం నాడు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సినిమా..కాగా టీపీ మాధవన్ 40 ఏళ్ల వయసులో సినీ కెరీర్ ఆరంభించారు. దాదాపు 600 చిత్రాల్లో నటించారు. 2016లో వచ్చిన మాల్గుడి డేస్ సినిమాలో చివరిసారిగా నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా సీరియల్స్లో విలన్, కమెడియన్, సహాయక నటుడిగా మెప్పించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'అమ్మ'కు మొట్టమొదటి జనరల్ సెక్రటరీగా పని చేశారు.చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో? -
బెస్ట్ ఫ్రెండ్తో పెళ్లి రద్దు.. మరొకరితో నటి ఏడడుగులు
మలయాళ నటి శ్రీ గోపిక గుడ్న్యూస్ చెప్పింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. వరుణ్దేవ్తో ఏడడుగులు వేశానని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. అందులో నటి ఎంతో సింపుల్గా, క్యూట్గా ఉంది.జూన్లో ఎంగేజ్మెంట్కాగా గోపిక.. గతంలో తన బెస్ట్ ఫ్రెండ్ వైశాఖ్ రవితో పెళ్లికి రెడీ అయింది. వీరిద్దరికీ ఈ ఏడాది జూన్లో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఇరువురూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. కానీ పెళ్లి చేసుకునేలోపే ఇద్దరూ విడిపోయారు. నిశ్చితార్థం ఫోటోలను సైతం డిలీట్ చేశారు. ఇంతలోనే శ్రీగోపిక పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ జంట కలకాలం కలిసుండాలని కోరుకుంటున్నారు.వైశాఖ్తో శ్రీగోపిక ఎంగేజ్మెంట్ ఫోటోసినిమా, సీరియల్స్కాగా శ్రీ గోపిక.. 90 ఎమ్ఎల్ అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. రూల్ నెంబర్ 4, వోల్ఫ్ వంటి తమిళ చిత్రాలతో పాటు నాన్సెన్స్ అనే మలయాళ మూవీలోనూ మెరిసింది. బుల్లితెరపై ఉయిరే సీరియల్తో క్రేజ్ తెచ్చుకుంది. చదవండి: Bigg Boss Tamil: ఎలిమినేషన్లో కొత్త ట్విస్ట్ ఇచ్చిన తమిళ బిగ్బాస్ -
ఎంత ప్రేమించానో తెలుసా?: హీరోయిన్ ఎమోషనల్
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పుట్టెడు దుఃఖంలో ఉంది. పెంపుడు శునకం చనిపోవడంతో ఆ బాధ నుంచి బయటపడలేకపోతోంది. పెట్ డాగ్తో ఆడుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. 'థియో.. ఈ వారమే నన్ను వదిలేసి వెళ్లిపోయింది. తన మరణవార్త నా గుండెను ముక్కలు చేసింది. చూడటానికి చిన్నగా ఉన్నా దానికి ఎంతో ఎనర్జీ ఉండేది. తన ఇంట్లోనే మేమున్నాం..మేము దాన్ని ఇంటి యజమాని అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఇది తనిల్లు.. తన ఇంట్లోనే మేము నివసిస్తున్నాం. అదొక సిల్లీ వాచ్డాగ్ కూడా! స్టూడియో బయట కూర్చోవడం దానికెంతో ఇష్టం. ప్రతి వేసవిలో దానికి హెయిర్ కట్ చేసేవాళ్లం. దానితో చివరిసారి ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుని ప్రేమగా ముద్దుపెట్టుకోవాల్సింది. దానిపై ప్రేమ కురిపించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.ఎంతో ప్రేమించా..అలాగే అది లేదన్న నిజం తట్టుకోలేక డీలా పడిపోయిన నన్ను ఓదార్చి ధైర్యంచెప్పినవారికి కూడా థాంక్స్. థియో.. గత కొన్నేళ్లుగా నీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. కానీ నువ్వు చాలా మంచి అబ్బాయివి. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించానో అర్థం చేసుకో.. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు థియోతో కలిసున్న ఫోటోలు జత చేసింది.కాగా కల్యాణి ప్రియదర్శన్ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తమిళ డైరెక్టర్ అందరిముందు నన్ను కొట్టాడు: హీరోయిన్
ఓ తమిళ దర్శకుడు తనను అందరిముందే కొట్టాడంటోంది హీరోయిన్ పద్మప్రియ జానకిరామన్. కేరళలోని కోజికోడ్లో ఓ ఈవెంట్కు వెళ్లిన ఆమె ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ఓ దర్శకుడు షూటింగ్ పూర్తయ్యాక సెట్లో అందరిముందే నాపై చేయి చేసుకున్నాడు. అసత్య ప్రచారంకానీ నేనే అతడిని కొట్టానని మీడియాలో తప్పుగా ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆ దర్శకుడిపై సినిమా అసిసోయేషన్కు నేనెందుకు ఫిర్యాదు చేస్తాను? అతడు చేసిన తప్పును నాపై రుద్దాలని ప్రయత్నించారు. కానీ నా ఫిర్యాదు వల్ల ఆ దర్శకుడిని 6 నెలలపాటు సినిమాలు చేయకుండా నిషేధించారు. ఇదే సమస్యతప్పు ఎవరివైపు ఉందని కూడా ఆలోచించకుండా ఆడవారినే దోషులుగా నిలబెట్టాలని చూస్తారు.. ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సమస్య ఇదే అని చెప్పుకొచ్చింది. కాగా పద్మప్రియ.. మలయాళంలో టాప్ హీరోయిన్. సీను వాసంతి లక్ష్మి అనే తెలుగు చిత్రంతో 2004లో కెరీర్ మొదలుపెట్టింది. అందరి బంధువయ, పటేల్ సర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈమె తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.చదవండి: మోసం చేశారంటూ తృప్తి డిమ్రీపై ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్! -
అత్యాచార కేసులో ప్రముఖ నటుడికి అరెస్ట్ వారెంట్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సినిమా పరిశ్రమలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఈ కమిటీ బయటపెట్టింది. ఇందులో ప్రముఖ హీరోలు, నటులు, దర్శకులు ఇరుక్కున్నారు. ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన కూడా ఓ మహిళ అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ కేసులోనే సదరు నటుడికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటికే ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ ప్రయత్నించగా.. దాన్ని కోర్టు తిరస్కరించింది.(ఇదీ చదవండి: కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?)కేసు ఏంటి?మాజీ నటి ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. ఓ తమిళ సినిమాలో అవకాశమిస్తానని సిద్ధిఖీ చెప్పాడు. అందుకోసం లైంగిక అవసరాలు తీర్చమన్నాడు. కుదరదనే సరికి బలవంతంగా ఓ హోటల్లో అత్యాచారం చేశాడు. 2016లో తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటన గురించి గతంలో ఇదే నటి మాట్లాడుతూ.. తనతో సిద్ధిఖీ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.ఇప్పుడే ఎందుకు?తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో పలువురు నటీమణులు తమపై జరిగిన అఘాయిత్యాలని బయటపెడుతున్నారు. అలా సదరు నటి.. నటుడు సిద్ధిఖీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే విచారించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కానీ సిద్ధిఖీ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్) -
పనిమనిషిపై దాడి.. హీరోయిన్పై కేసు నమోదు
మలయాళ హీరోయిన్ పార్వతి నాయర్పై కేసు నమోదైంది. దొంగతనం నెపంతో తనపై దాడి చేసిందని ఆమె పనిమనిషి సుభాష్ చంద్రబోస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పార్వతితోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే?సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి కేజేఆర్ స్టూడియోలో హెల్పర్గా పని చేసేవాడు. 2022 నుంచి పార్వతి నాయర్ ఇంట్లో పనిమనిషిగా చేరాడు. అదే ఏడాది అక్టోబర్లో చెన్నైలోని పార్వతి నాయర్ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షలు విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్టాప్ చోరీకి గురైంది. తన పనిమనిషి సుభాషే ఈ దొంగతనం చేశాడని పార్వతి ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సుభాష్ను అరెస్ట్ చేశారు. తర్వాత కొద్దిరోజులకు అతడిని విడుదల చేశారు.స్టూడియోలో రభసతర్వాత సుభాష్.. తిరిగి కేజేఆర్ స్టూడియోలో పనిలో చేరాడు. అయితే స్టూడియోలోనే ఉన్న పార్వతి తనను కొట్టిందని ఆరోపించాడు. ఆమెతోపాటు ఉన్న మరో నలుగురు వ్యక్తులు తనను తీవ్రంగా దుర్భాషలాడారని చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సైదాపేట్ 19 ఎమ్ఎమ్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పార్వతితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.సినిమా..కాగా మలయాళ కుటుంబానికి చెందిన పార్వతి సొంతభాషలోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. పాప్పిన్స్, స్టోరీ కాతే, డి కంపెనీ, యాంగ్రీ బేబీస్ ఇన్ లవ్, ఉత్తమ విలన్, వాస్కోడిగామ, కొడిత్త ఇదంగళై నిరప్పుగ, 83, ధూమం, గోట్.. తదితర చిత్రాల్లో నటించింది.చదవండి: 'దేవర'ఈవెంట్ రద్దుకు కారణం ఇదే.. ఆర్గనైజర్ల వివరణ -
సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం
మలయాళ ప్రముఖ నటి కవియూర్ పొన్నమ్మ (79) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి మలయాళ చిత్రాల్లో ఈమె పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇలా ఈమె మృతి చెందడంపై స్టార్ హీరోహీరోయిన్లతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)'తల్లి పాత్రలతో మలయాళ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపం. ఆమె జీవితం సినిమాకే పరిమితం కాదు. థియేటర్, టెలివిజన్ రంగాలకు కూడా విస్తరించింది' అని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.ఇకపోతే పొన్నమ్మ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కలమస్సేరి మున్సిపల్ టౌన్ హాల్లో ప్రజల సందర్శనార్ధం ఆమె పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. గాయనిగా పొన్నమ్మ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత నాటకరంగంలోకి ప్రవేశించి, అనంతరం నటిగా మారారు. అలా దాదాపు 1000 సినిమాల్లో నటించారు. ఈమె చేసిన తల్లి పాత్రలతో అందరికీ దగ్గరైపోయారు. అలానే విలన్ తరహా పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.ప్రతికూల పాత్రలతో సహా విభిన్న పాత్రలను పోషించింది. మేఘతీర్థం చిత్రాన్ని కూడా నిర్మించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) -
కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్
తెలుగులో అప్పట్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. మధ్యలో రెండో పెళ్లి చేసుకుంది. 2023లో పెళ్లి జరగ్గా.. ఈ జూన్లో కొడుకు పుట్టాడు. తాజాగా ఓనం పండగ సందర్భంగా కొడుకు ముఖాన్ని రివీల్ చేసింది. అలానే క్యూట్ ఫొటోలకు పోజులిచ్చింది.(ఇదీ చదవండి: ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్)తమిళ సినిమాలతో హీరోయిన్గా పరిచయమైన అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది.ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. అలానే భర్తని ముద్దాడింది. ఈ ఫొటోలన్నింటినీ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫ్యామిలీని చూస్తుంటేనే చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
త్రిష బాటలో మరో హీరోయిన్ రీఎంట్రీతో దుమ్మురేపుతున్న బ్యూటీ
-
మాలీవుడ్ సినీ చరిత్ర: దళిత నటి ఇంటినే తగులబెట్టేశారు!
మలయాళంలో హేమ కమిటి రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో మాలీవుడ్ వణుకుతోంది. అయితే మహిళలపై దురాగతాలు, వేధింపులు ఇప్పుడే కాదు.. మాలీవుడ్ పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచే ఉన్నాయి. అప్పట్లోనే స్త్రీలపై దాడులు జరిగాయి. చాలా మంది కుల వివక్షకు గురయ్యారు. మలయాళ తొలి హీరోయిన్కి అయితే కేరళను వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలేంటో చూద్దాం. మలయాళ ఇండస్ట్రీ 1920లో ఏర్పడింది. తొలి సినిమా విగతకుమారన్. ఈ చిత్రంలో పికె రోసీ హీరోయిన్గా నటించింది. మలయాళ తొలి హీరోయిన్, భారతీయ సినిమాల్లోనే మొదటి దళిత నటి రోసీ.ఓ దళిత కుటుంబంలో పుట్టడమే రోసీకి శాపంగా మారింది. ఆమె విగతకుమారన్ చిత్రంలో నాయర్(పెద్ద కులం) మహిళగా నటించడాన్ని ఓ వర్గం ప్రజలు సహించలేకపోయారు. సినిమా విడుదలను అడ్డుకున్నారు. థియేటర్పై రాళ్ల దాడి చేశారు. అంతేకాదు ఆమె ఇంటిని కూడా తగులబెట్టేశారు. అగ్ర వర్ణాలా వేధింపులు తట్టుకోలేక..ప్రాణ భయంలో రోసీ మలయాళ ఇండస్ట్రీని వదిలి వెళ్లింది.సమాజంలోని అనేక వర్గాలలో, ముఖ్యంగా మహిళలకు సాంస్కృతిక కళలలో పెద్దగా ప్రవేశంలేని రోజుల్లోనే రోజీ సినిమాల్లోకి వచ్చి పెద్ద సాహసమే చేసింది. అంతేకాదు తొలి సినిమాలోనే అగ్రవర్ణ మహిళగా నటించి కుల వివక్షకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. రోసీ చేసిన ప్రయత్నం చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఆ సినిమాలో నటించిన కారణంగా రోజీ జీవితాంతం అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.మలయాళంలో ఇప్పటికీ కుల వివక్ష ఉందని చాలా మంది నటీనటులు చెబుతున్న మాట. కులం చూసి అవకాశం ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నారట. తమ కులం వాడు అయితే ఒక పాత్ర.. తక్కువ కులం వాడు అయితే మరో పాత్రలు ఇస్తూ వివక్ష చూపించడం ఇంకా కొనసాగుతుంది.ఇక మహిళలపై జరుగుతున్న దురాగతాలు అంతా ఇంతా కాదు. అయితే నటీమణులెవరు తమకు వస్తున్న వేధింపులపై అంత త్వరగా స్పందించరు. ‘మీటూ’లో భాగంగా ఆ మధ్య కొందరు తమకు వచ్చిన లైంగిక వేధింపులపై పెదవి విప్పారు. ఇప్పుడు ‘హేమా కమిటీ’ వల్ల చాలా మంది తారలు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.2017లో మలయాళ నటి భావనా మీనన్పై లైంగిక దాడి జరిగింది. ఆ దాడి వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని ప్రచారం జరిగింది. దీంతో అప్పటి ప్రభుత్వం జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ రిపోర్ట్ ఆలస్యంగా 2024 ఆగస్టులో బయటకు వచ్చింది. అయితే అప్పట్లో మహిళలు కుల వివక్షకు గురైతే..ఇప్పుడు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సినిమా చాన్స్లు రావాలంటే కాంప్రమైజ్, అడ్జస్ట్ కావాల్సిందే. హేమ కమిటీ రిపోర్ట్తోనైనా మాలీవుడ్ మారిపోయి మంచి పరిశ్రమగా ఎదగాలని కోరుకుందాం. -
జైలర్ నటుడు అరెస్ట్.. కానిస్టేబుల్ను కొట్టడం వల్లే!
సాక్షి, హైదరాబాద్: జైలర్ నటుడు వినాయకన్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామికా భద్రత దళం) కానిస్టేబుల్పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనపై స్పందించిన వినాయకన్ తానే తప్పూ చేయలేదంటున్నాడు. ఎయిర్పోర్టు అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారంటున్నాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అసలు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయాడు. కాగా మలయాళ నటుడు వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. గతేడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తన వల్ల జైలుపాలయ్యాడు. -
నివిన్పై ఆరోపణలు అవాస్తవం
సినిమా అవకాశం ఇప్పిస్తానంటూ దుబాయ్లో తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఓ ఆరుగురి గురించి ఇటీవల ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఆ ఆరుగురిలో మలయాళ నటుడు నివిన్ పౌలీ ఒకరు. అయితే ఏ తేదీల్లో (గత డిసెంబరు 14 నుంచి 16) అయితే తనతో నివిన్ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆ మహిళ పేర్కొన్నారో అదే తేదీల్లో ఆయన ‘వర్షంగళుక్కు శేషమ్’ అనే మలయాళ సినిమా షూట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్రంలో నటించినపార్వతీ ఆర్. కృష్ణ తెలిపారు. అలాగే ఈ చిత్రదర్శకుడు వినీత్ శ్రీనివాసన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నివిన్పై ఆరోపణలు అవాస్తవం అంటున్నారు ఈ ఇద్దరూ. ‘‘ఆ మహిళ చెప్పిన తేదీలో కేరళలోని కొచ్చిలో ‘వర్షంగళుక్కు శేషమ్’ షూటింగ్లో ఉన్నారు నివిన్. అక్కడి న్యూక్లియస్ మాల్ లోపల, బయట కూడా చిత్రీకరణ జరిపాం. అలాగే మా సినిమా షూటింగ్ ముగించుకుని ‘ఫార్మా’ అనే వెబ్ సిరీస్ షూట్కి వెళ్లారు. ఇక నివిన్ మా టీమ్తోనే ఉన్నారనడానికి సీసీటీవీ ఫుటేజ్, మా యూనిట్లోనిపార్వతీ ఆర్. కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ సాబూ రామ్, మా నిర్మాత విశాఖ్ సుబ్రమణియం తదితరులు సాక్ష్యం’’ అని పేర్కొన్నారు వినీత్ శ్రీనివాసన్. ‘‘వర్షంగళుక్కు శేషమ్’లో నేనో చిన్నపాత్ర చేశాను. డిసెంబర్ 14న మా షూటింగ్కి సంబంధించిన వీడియో చూపిస్తాను. ఆ రోజు నివిన్ కాంబినేషన్లో నేను కొన్ని సీన్స్లో నటించాను’’ అంటూ ఇన్స్టాలో వీడియోను షేర్ చేశారుపార్వతీ ఆర్. కృష్ణ. -
తమిళ డైరెక్టర్ నా జీవితంతో ఆడుకున్నాడు: మలయాళ నటి
ఓ తమిళ డైరెక్టర్ తనను కీలుబొమ్మలా వాడుకున్నాడంటోంది మలయాళ నటి సౌమ్య. 18 ఏళ్ల వయసులో అతడు చేసిన పాడుపని, వేధింపుల వల్ల నరకయాతన అనుభవించానంటోంది. ఇప్పటికైనా తన పేరును పోలీసుల ముందు బయటపెడతానని చెప్తోంది.18 ఏళ్ల వయసులో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌమ్య మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో కాలేజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు నా పేరెంట్స్కు సినిమాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. అయితే నటి రేవతి మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. తనను చూసి నేను కూడా ఊహల ప్రపంచంలో తేలిపోయాను. ఆ ఆఫర్కు ఓకే చెప్తూ స్క్రీన్ టెస్ట్కు వెళ్లాను. అప్పుడు నాది చిన్నవయసు కావడంతో నాకంత తెలిసేది కాదు.ఆమెకు బదులుగా అతడు..కానీ ఆ సినిమా డైరెక్టర్ను కలిసిన ఫస్ట్ మీటింగ్లోనే నాకు ఇబ్బందిగా అనిపించింది. ఈ విషయం ఇంట్లో చెప్పాను. అప్పటికే అతడు మా నాన్నను కలిసి స్క్రీన్ టెస్ట్ కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశామంటూ ఒప్పించాడు. తనతో అవుట్డోర్ షూట్కు తొలిసారి వెళ్లినప్పుడు అతడేమీ నాతో మాట్లాడలేదు. నిజానికి ఆ సినిమాకు అతడి భార్య దర్శకురాలు అని అగ్రిమెంట్ పేపర్లో రాసుంది. కానీ రియాలిటీలో మాత్రం ఆమెకు బదులుగా అతడే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అతడి భార్య లేని సమయంలో..తను నన్ను కోపంగా చూస్తూనే కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ దంపతులు వారి ఇంటికి తీసికెళ్లారు. (వారికి ఓ కూతురు ఉండేది కానీ తండ్రి అత్యాచారం చేశాడంటూ ఇంటి నుంచి పారిపోయింది) సడన్గా నన్ను కూతురిలా భావిస్తూ నాతో చాలా మంచిగా ఉన్నారు. రుచికరమైన భోజనం పెడుతూ బాగా చూసుకున్నారు. ఓ రోజు ఆ డైరెక్టర్ అతడి భార్య లేని సమయంలో నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టాడు.బలవంతంగా..ఒక్కసారిగా షాకయ్యాను. నేనే ఏదైనా తప్పు చేశానా? అని భయపడిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అయినా రిహార్సల్స్ కోసం ప్రతిరోజు అక్కడికి వెళ్లేదాన్ని. అలా అతడు నెమ్మదిగా నన్ను అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. ఓ రోజయితే బలవంతంగా నాపై అత్యాచారం చేశాడు. ఇలా చాలాసార్లు నన్నొక బానిసగా చూశాడు.నాతో బిడ్డను కంటానని..నన్ను కూతురిగా పిలుస్తూనే నాతో బిడ్డను కంటానని చెప్పేవాడు. నాతో ఆడుకున్నాడు అని చెప్తూ ఎమోషనలైంది. ఇదంతా నిస్సిగ్గుగా బయటకు చెప్పడానికి 30 ఏళ్లు పట్టిందని, కచ్చితంగా అతడి పేరు పోలీసులకు వెల్లడిస్తానంది. అలాగే తనను వేధించిన ఓ నటుడి పేరు హేమ కమిటీ రిపోర్టులో ఉందని పేర్కొంది. చదవండి: హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్ -
మరో స్టార్ హీరోపై లైంగిక ఆరోపణలు.. ఏమని స్పందించాడంటే?
హేమ కమిటీ.. మలయాళ ఇండస్ట్రీని గత కొన్నిరోజులుగా ఇరుకున పడేసింది. పలువురు ప్రముఖ నటులుపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్తో పాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం తదితర విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు 'ప్రేమమ్' సినిమాతో తెలుగోళ్లకు కూడా తెలిసిన హీరో నివీన్ పౌలీపై ఓ నటి పోలీస్ కేసు పెట్టింది.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి గతేడాది నవంబరులో దుబాయి తీసుకెళ్లారట. అక్కడే లైంగికంగా వేధించారని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. హీరో నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నారు. ఈ జాబితాలో నివిన్ ఆరో వ్యక్తి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వయంగా నివిన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని చెప్పుకొచ్చాడు.'ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టాననే వార్తలు విన్నాను. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. నాపై వచ్చిన నిరాధార ఆరోపణల్ని ఖండిస్తున్నాను. అవన్నీ నిజం కాదు. ఈ విషయమై నేను న్యాయంగా పోరాడుతా' అని ఇన్ స్టాలో నివిన్ పౌలీ పోస్ట్ పెట్టారు. 'ప్రేమమ్' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే!) View this post on Instagram A post shared by Nivin Pauly (@nivinpaulyactor) -
'మా దగ్గర ఆ పరిస్థితి లేదు'.. హీరో కామెంట్స్పై మండిపడ్డ సింగర్!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీనే కాదు.. కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ విషయం తనకేం తెలియదంటూ కామెంట్స్ చేశారు. తాజాగా కోలీవుడ్ నటుడు జీవా సైతం కోలీవుడ్లో హేమ కమిటీ నివేదికపై స్పందించారు. నేను కూడా దాని గురించి విన్నా.. అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు మాత్రం లేవన్నారు. గతంలో మీటూ పార్ట్-1 చూశామని.. ఇప్పుడు పార్ట్-2 వచ్చిందని అన్నారు. వారిపేర్లను బయటికి చెప్పడం తప్పు.. కానీ సినిమాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన జీవా.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.తమిళంలో ఆ పరిస్థితి లేదు..జీవా మాట్లాడుతూ..' నేను ఒక మంచి ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చా. కాబట్టి మంచి విషయాలు అడగండి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. తేనవట్టు అనే సినిమా షూటింగ్ ముగించుకునివస్తున్నా. చాలా సినీ పరిశ్రమలలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మా పని మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం. నటులుగా మేము చాలా మంది వ్యక్తుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తాం. మలయాళంలో లాగా కోలీవుడ్లో జరగడం లేదు. ఈ విషయం గతంలోనూ చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా అయితే అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్తో కాసేపు వాగ్వాదం తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. రంగం సినిమాతో జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చిన్మయి రిప్లై.. కోలీవుడ్లో అలాంటి పరిస్థితులు లేవని జీవా చెప్పడంపై సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. తమిళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేవని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. ఇలా ఎలా మాట్లాడుతారో తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో చాలాసార్లు చిన్మయి ఇండస్ట్రీలో జరుగుతన్న వేధింపులపై మాట్లాడారు. మహిళలపై ఎక్కడా అఘాయిత్యాలు జరిగినా సరే చిన్మయి సోషల్ మీడియా వేదికగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. I really do not understand how they are saying sexual harassment does not exist in Tamil Industry.HOW?! https://t.co/sm9qReErs0— Chinmayi Sripaada (@Chinmayi) September 1, 2024 -
తనపై లైంగిక ఆరోపణలు.. చట్టపరంగానే ఎదుర్కొంటా: నటుడు జయసూర్య
మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక సంచలనంగా మారింది. పలువురు నటులు, డైరెక్టర్లపై ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మలయాళ నటుడు జయసూర్య స్పందించారు. ఇలాంటి ఆరోపణలు తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జయసూర్య ఖండించారు. ప్రస్తుతం తాను యూఎస్లో ఉన్నానని.. త్వరలోనే కేరళకు వస్తానని చెప్పారు.ఆగస్టు 31న తన బర్త్ డేను జయసూర్య సెలబ్రేట్ చేసుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సులభమని.. అబద్ధం ఎల్లప్పుడూ నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుందని అన్నారు. కానీ చివరికీ నిజం గెలుస్తుందని జయసూర్య ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందన్నారు. నా పుట్టినరోజును ఇలాంటి సమయంలో జరుపుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.కాగా.. జయసూర్య తనను లైంగికంగా వేధించారంటూ ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికే మలయాళ ఆర్టిస్టుల సంఘ సభ్యులు మోహన్లాల్తో సహా అందరూ రాజీనామాలు చేశారు. -
షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి
ప్రముఖ నటి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రేవతి.. తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పుడు స్పందించింది. కొద్దిరోజుల క్రితం కోజికోడ్కు చెందిన సజీర్ (33), దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్పై సంచలన ఆరోపణలు చేశాడు. సుమారు పదేళ్ల క్రితం తనపై దర్శకుడు రంజిత్ లైంగిక దాడికి పాల్పడ్డారని చెబుతూనే, రేవతి పేరును కూడా బయటపెట్టాడు. తన వ్యక్తిగత ఫోటోలు రేవతికి రంజిత్ పంపాడని అతడు ఆరోపించాడు. దీంతో ఈ వార్త పెను సంచలనంగా మారింది.(ఇదీ చదవండి: ‘బిగ్ బాస్' కథ పెద్దదే... పురాతనమైంది కూడా!)అవి నిజం కాదు సజీర్ చేసిన ఆరోపణలపై నటి రేవతి ఇప్పుడు స్పందించింది. దర్శకుడు రంజిత్.. యువకుడి నగ్న చిత్రాలని తనకు పంపారనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్లో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. మీడియాలో వస్తున్న వాటిలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే?సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ రంజిత్ని సంప్రదిస్తే ఒక హోటల్కు పిలిపించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సజీర్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో నటి రేవతి పేరును తీసుకొచ్చాడు. 'దర్శకుడు రంజిత్ గదిలోకి నేను వెళ్లినప్పుడు ఆయన ఒక నటితో మాట్లాడుతున్నాడు. ఆ నటి రేవతి అని రంజిత్ నాకు చెప్పాడు. రేవతి, రంజిత్కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. రంజిత్ నా ఫోటో తీసి వారికి పంపాడు. ఎవరికి పంపారు అని నేను అడిగాను. అప్పుడు రేవతికి పంపించానని దర్శకుడు రంజిత్ సమాధానమిచ్చాడు. ఫొటో చూసి రేవతికి నచ్చిందని కూడా నాతో చెప్పాడు. కానీ, అటువైపు నిజంగానే రేవతినే అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. రంజిత్ నాతో చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాను' అని సజీన్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్కుమార్) -
ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మలయాళ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్, నటుడు జయసూర్యలపై కేరళ పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నటి మిను మునీర్ తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. తనను వేధించిన ముకేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇవ్వకూడదని కోరారు.మోహన్లాల్ రాజీనామా.. మంచి నిర్ణయంఅమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టుల)కు మోహన్లాల్ రాజీనామా చేయడంపై స్పందిస్తూ.. ఇది మంచి నిర్ణయమేనన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్కు అమ్మ బాధ్యతలు చేపట్టే అర్హత పుష్కలంగా ఉందన్నారు. కాగా ముకేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య తనను వేధించారంటూ మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. డబ్బు కోసం బ్లాక్మెయిల్వీరి వేధింపుల వల్ల మలయాళ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయానంది. హేమ కమిటీ నివేదిక వెలువడిన సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ముకేశ్, జయసూర్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మరో ఐదుగురిపైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ముకేశ్ కొట్టిపారేశాడు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించాడు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని చెప్తున్నాడు.చదవండి: అలాంటివారిని చెప్పు తీసుకుని కొట్టండి: విశాల్ -
ప్రముఖ నటుడు లిఫ్ట్లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: నటి
మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలను దారుణంగా వేధిస్తున్నారని జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది. లేడీ ఆర్టిస్టులను అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి ఉష తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 1992లో మోహన్లాల్తో కలిసి సినిమా చేస్తున్న రోజులవి.. టీమ్ అంతా కలిసి బహ్రెయిన్ వెళ్లాం. అక్కడ ఓ షో పూర్తవగానే అందరం తిరుగుప్రయాణానికి రెడీ అయ్యాం. లిఫ్ట్లో నాతో అసభ్యంగా..మోహన్లాల్ మా సామాన్లు తెచ్చేసుకోమని చెప్పాడు. నేను గదిలోని నా సామాను సర్దేసుకుని లిఫ్ట్ ఎక్కాను. అప్పటికే అందులో ఓ సీనియర్ నటుడు ఉన్నాడు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే కోపంతో చెంప చెళ్లుమనిపించాను. మలయాళ చిత్రపరిశ్రమలో అందరూ ఎంతగానో అభిమానించే ఆ నటుడు ఇలా చీప్గా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ మాట మోహన్లాల్కు చెప్తే మంచి పని చేశావన్నాడు.ఛాన్సులు తగ్గిపోయాయి..కానీ అందరూ నాకు పొగరు అని ముద్ర వేశారు. ఈ సంఘటన తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడా పెద్ద మనిషి బతికి లేడు కాబట్టి తన పేరు చెప్పదల్చుకోలేదు. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారంటారేమో.. ఈ విషయం నేను గతంలో చెప్పాను. అందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుండటంతో మరోసారి చెప్తున్నాను అని ఉష పేర్కొంది.చదవండి: ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు.. పెదవి విప్పండి: ఖుష్బూ -
మలయాళ ఇండస్ట్రీలో మరో కుదుపు.. ఒకేసారి 17 మంది రాజీనామా
మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రీసెంట్గా ఓ నివేదిక సమర్పించింది. ఇందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మలయాళ సినిమాల్లో పనిచేసే మహిళలు.. క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ముకుమ్మడి రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న 'ప్రేమలు' నటుడు)అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నటుడు మోహన్ లాల్ తొలుత రాజీనామా చేయగా.. పాలక మండలిలోని మిగిలిన సభ్యులందరూ ఇదే ఫాలో అయిపోయారు. ఈ మేరకు 'అమ్మ' సంఘం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడమే దీనికి కారణం. దీంతో వీళ్లంతా నైతిక బాధ్యతగా రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. అలానే రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి, కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.అమ్మ సంఘంలో నటులు జగదీశ్, జయన్ చేర్తలా, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదిక విడుదల చేసిన అనంతరం.. దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో మలయాళ చిత్రసీమలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్
'ప్రేమలు' సినిమాతో తెలుగులోనూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ ప్రతాప్. స్వతహాగా ఎడిటర్ అయిన ఇతడు.. మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే జూలై 27న రాత్రి ఇతడు ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నాడు. అలాంటిది నెలలోనే పూర్తిగా కోలుకున్న సంగీత్ ప్రతాప్.. ఇన్ స్టాలో పెద్ద పోస్ట్ పెట్టాడు. అసలేం జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఏంటనేది క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ)'గత నెలలో ఇదే రోజున కారు ప్రమాదం జరగ్గానే నా జీవితం తలక్రిందులైంది. తొలుత నాకు ఏం కాలేదని అనుకున్నా. కానీ నర్స్ వచ్చి చెప్పిన తర్వాత నేనెంత ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడ్డానో అర్థమైంది. ఆ రోజు నుంచి నాలో బాధ, భయం, డిప్రెషన్ ఇలా చాలా ఎమోషన్స్కి గురయ్యాను. ఈ యాక్సిడెంట్ తర్వాత నా ఆలోచన మారిపోయింది. ఇంతకుముందు భవిష్యత్ గురించి చాలా భయాలుండేవి. కానీ జీవితం మనం కంట్రోల్లో ఉండదని అర్థమైంది. నచ్చినట్లు బ్రతికాలని ఫిక్స్ అయ్యాను''ఇన్ని రోజులు కంటికి రెప్పలా చెప్పాలంటే ఓ పిల్లాడిలా నన్ను చూసుకుంది నా భార్య. దీనికి బదులుగా ఆమెకు ఎంత ప్రేమ తిరిగిచ్చినా తక్కువే. తల్లిదండ్రులు, స్నేహితులు నాకు అండగా నిలిచారు. వాళ్లు చెప్పిన మాటలు, మెసేజులు వల్ల నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. అలా ఈ రోజు మళ్లీ సాధారణ జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. నాకెంతో ఇష్టమైన సెట్కి వెళ్లిపోయాను. కాస్త ఇబ్బందిగానే ఉంది. కొన్నిరోజుల్లో అంతా సెట్ అయిపోతుందిలే. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను' అని సంగీత్ ప్రతాప్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) View this post on Instagram A post shared by Sangeeth Prathap (@sangeeth.prathap) -
ఆ నలుగురి వల్ల ఇండస్ట్రీ వదిలేసి పోయా: మలయాళ నటి
మలయాళ ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని బహిర్గతం చేసింది హేమ కమిటీ. బలం, పలుకుబడి ఉన్నవారు ఇక్కడి ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తారని, మహిళా ఆర్టిస్టులను వేధింపులకు గురిచేస్తున్నారని ఓ నివేదికను బయటపెట్టింది. ఈ క్రమంలో పలువురు నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు.వేధింపులుమాలీవుడ్పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిఖి.. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టు (అమ్మ)లోని తమ పదవులకు రాజీనామా చేశారు. ఇంతలో ఓ మలయాళ నటి ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఇబ్బందులను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. 2013లో ఓ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ముఖేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య నన్ను శారీరకంగా వేధించారు, దూషించారు. నేను సర్దుకుపోయి పని చేసుకుందామని ప్రయత్నించాను.ఇండస్ట్రీ వదిలేశా..కానీ ఆ వేధింపులు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో నేను మలయాళ ఇండస్ట్రీని వదిలేయక తప్పలేదు. అక్కడినుంచి చెన్నైకి మకాం మార్చేశాను. వీళ్ల వల్ల నేను పడ్డ వేదనకు, దాని పర్యవసానాలకు నాకిప్పుడు న్యాయం కావాలి. నా పట్ల దారుణంగా ప్రవర్తించిన ఆ నలుగురిపై చర్యలు తీసుకోవాలి. వారు అడిగినదానికి ఒప్పుకోలేదని నాతో దురుసుగా ప్రవర్తించారు అని రాసుకొచ్చింది.బలవంతంగా..'క్యాలెండర్ సినిమా షూటింగ్లో మణ్యం పిల్ల రాజుకు భార్యగా నటించాను. ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు ఆయన నన్ను వ్యక్తిగత ప్రశ్నలు అడిగాడు. నా భర్త చనిపోయాడని చెప్పినందుకు ఒక్కదానివి సంతోషంగా ఎలా ఉంటున్నావని ఇబ్బందికరంగా మాట్లాడాడు. జయసూర్య అయితే డె ఇంగోట్ నొక్కి(2108) సినిమా టైంలో నన్ను బలవంతంగా వెనకనుంచి హత్తుకుని ముద్దుపెట్టాడు. మరో నటుడైతే రాత్రికి వస్తానంటూ నీచంగా మాట్లాడాడు. ఇంకొకరు హోటల్ గదిలో నాపై అత్యాచారం చేయబోయాడు' అని మిను పేర్కొంది. -
అర్ధరాత్రి తాగొచ్చి నటిని కొట్టేవాడు.. అలాంటి వ్యక్తిని గెలిపించారు!
ఇంటి ఇల్లాలిని చూసుకోలేనోడు సమాజాన్ని మాత్రం ఏం ఉద్ధరిస్తాడు? భార్య కంట నీళ్లు తెప్పించినవాడు ప్రజల గోసలు పట్టించుకుంటాడా? అసలు ఇంటినే గెలవలేనివాడికి అందరి మనసులో స్థానం సంపాదించుకునే అర్హత ఇంకెక్కడిది? కానీ ఇవన్నింటికీ విరుద్ధంగా ఓ వ్యక్తి మాత్రం దర్జాగా ఎమ్మెల్యే పోస్టు సంపాదించాడు. అది కూడా వరుసగా రెండుసార్లు! అతడే ముఖేశ్ మాధవన్..ప్రేమ పెళ్లి విఫలంముఖేశ్ నటుడు, నాయకుడు.. 1988లో సరితను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రానురానూ దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. అవి కాస్తా పెద్దవి కావడంతో 2011లో విడిపోయారు. ఆ తర్వాత 2013లో క్లాసికల్ డ్యాన్సర్ దేవికను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడాకులు తీసుకున్నారు.క్యారెక్టర్ లేనివాడుసీపీఎమ్లో కొనసాగుతున్న ఈయన 2016, 2019లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మాజీ భర్త ముఖేశ్ ఎలాంటివాడో చెప్పిన సరిత పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె ఏమందంటే.. ముఖేశ్కు క్యారెక్టర్ లేదు. ఎదుటివారికి కూసింత గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు. పైగా నన్ను అనునిత్యం వేధించేవాడు. అతడి తండ్రి ముందే తాగొచ్చి కొట్టేవాడు. తండ్రి ముందే తాగొచ్చి..అలాగే అమ్మాయిలను వెంటేసుకుని సరాసరి ఇంటికి వచ్చేవాడు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే పనివాళ్లముందు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొట్టి చీడపురుగులా చూసేవాడు. ఒకసారైతే ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కడుపులో తన్నాడు అంటూ సరిత ఎమోషనలైంది. ఇలాంటి వ్యక్తిని సమాజం నమ్మడం, తమనేదో ఉద్ధరిస్తాడని అందలం ఎక్కించడం నిజంగా విడ్డూరమే!చదవండి: దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్! -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: బిగ్బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
మాలీవుడ్లో హేమ కమిటీ రిపోర్ట్పై పలువురు సినీతారులు రియాక్ట్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరోయిన్స్ సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా దీనిపై మాట్లాడారు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాజాగా హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ సనమ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్ కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తమిళ సినిమాల్లో కూడా ఉందని వెల్లడించింది. ఎవరైనా కమిట్ అవ్వాల్సిందే తప్పా.. నో చెప్పడానికి తమిళ ఇండస్ట్రీలో అవకాశం లేదని తెలిపింది.సనమ్ శెట్టి మాట్లాడుతూ..'హేమ కమిటీ నివేదిక వివరాలు నాకు తెలియవు. కానీ నేను ఈ చర్యను స్వాగతిస్తున్నా. ఇలాంటి నివేదికను రూపొందించినందుకు జస్టిస్ హేమకు, కేరళ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తమిళ సినీ ప్రపంచంలోనూ కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి ఎవరూ బయటికి చెప్పలేరు. నేను నా స్వంత అనుభవంతో దీనిపై మాట్లాడుతున్నా. తాను వ్యక్తిగతంగా కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నా. పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే. సినిమాల్లో అవకాశాల కోసం ఇదొక్కటే మార్గం కాకూడదు. టాలెంట్ ఉంటే.. అవకాశాలు అవే వస్తాయని నేను నమ్ముతా" అని అన్నారు. కాగా.. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై హేమ కమిటీ ఇచ్చిన నివేదికను కేరళ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.హేమ కమిటీ రిపోర్ట్ ఏంటంటే?మలయాళం ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ విచారణ జరిపి రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదికను ఆగస్ట్ 19న కేరళ ప్రభుత్వం బయట పెట్టింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది మహిళలు కమిట్ అవ్వాల్సి వచ్చిందని ఆ రిపోర్టులో స్పష్టంగా చెప్పడం సంచలనంగా మారింది. మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. -
ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి
మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. ఇక్కడ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు. బలం, పలుకుబడి ఉన్నవారు.. మహిళా ఆర్టిస్టులను వేధించి వెంటాడుతున్నారని సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది.ఆడవాళ్లకు మంచి జీవితం ఎక్కడుంది?తెర వెనుక ఆర్టిస్టులు అత్యంత దుర్లభమైన జీవితం గడుపుతున్నారని అందులో నివేదించింది. ఈ రిపోర్టుపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. 'మీ అందరికీ ఓ విషయం చెప్పనా? సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా సరే అమ్మాయిలకు మంచి జీవితమే లేదు. దాన్ని మనం ఎలా మార్చగలం? ముందు మనకోసం మనం నిలబడాలి. ఒకానొక సమయంలో నన్ను కూడా పక్కకు నెట్టేయాలని చూశారు. కానీ నేను తట్టుకుని నిలబడ్డాను.మీటూ ఎలా మొదలైంది?గళం విప్పుతున్న మహిళల్ని అణిచివేయాలనకున్నవారికి వ్యతిరేకంగా పోరాడతాను. మీటూ ఉద్యమం ఎలా మొదలైంది? వేధింపులు భరించలేక అలిసిపోయిన ఓ మహిళ గొంతెత్తి తన గోడు వెల్లబోసుకోవడం వల్లే కదా.. అప్పుడు ఆ గొంతుకు ఎన్ని గొంతులు తోడయ్యాయి..? ఎంతమంది తాము పడుతున్న మనోవేదనను నిర్భయంగా బయటపెట్టారు? అదీ.. అలా ధైర్యంగా ఐకమత్యంగా నిలబడాలి' అని పేర్కొంది.నా పరిస్థితి వేరుమంచు లక్ష్మి రెండేళ్లక్రితం మాన్స్టర్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. నా పరిస్థితి వేరు. ఎందుకంటే నాన్న (మోహన్బాబు), మోహన్లాల్ మంచి ఫ్రెండ్స్. ఆయనతో కలిసి వర్క్ చేశాను. అయితే అక్కడ ఉన్నవాళ్లందరూ నాన్న గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఆ గౌరవం నాపై చూపించేవారు.తెలివిగా నో చెప్పాలిఇకపోతే ఆర్టిస్టులు తెలివిగా నో చెప్పడం నేర్చుకోవాలి. మొదట్లో కొందరు నన్ను అదేపనిగా కొడుతూ ఇబ్బందిపెట్టేవారు. వారిపై గట్టిగా అరిచి నాకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకునేదాన్ని. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో తర్వాత నేర్చుకున్నాను. ఏంటి? నేను అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నానా? కానీ నాకు పెళ్లయిపోయింది. ఆల్రెడీ కమిటెడ్.. అని చెప్పాను. అప్పటికీ అవతలివారు విసిగిస్తే మనం విజృంభించక తప్పదు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా చెత్తగా ఉంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే? -
నెలన్నర నుంచి నిద్ర లేదు, ఏడుపొక్కటే మిగిలింది: గాయని
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్తో తన సత్తా ఏంటో చూపించింది అంజూ జోసెఫ్. 2010లో ఐడియా స్టార్ సింగర్ (మలయాళం) నాలుగో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది. తన గాత్రంతో అందరినీ మెప్పించింది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ సింగర్గా పాడటం మొదలుపెట్టింది. అతి కొద్ది సమయంలోనే కవర్ సాంగ్స్, స్టేజీ షోలు చేసే స్థాయికి ఎదిగింది.ఓసీపీడీబాహుబలి మూవీలోని ధీవర పాటపై ఈమె చేసిన కవర్ సాంగ్ అప్పట్లో ఎంతో వైరలయింది. ఇకపోతే ఆమె షో డైరెక్టర్ అనూప్ జాన్ను పెళ్లాడింది. ఐదేళ్లపాటు అన్యోన్యంగానే ఉన్న ఈ జంట తర్వాత కలిసుండలేకపోయారు, విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో తను పడ్డ మానసిక వేదనను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అంజు మాట్లాడుతూ.. నాకు అబ్సెసివ్ కంపల్సిన్ పర్సనాలిటీ డిజార్డర్ (OCPD.. అంటే ఏ పనైనా పరిపూర్ణంగా చేయాలనుకుంటారు), అలాగే ఆందోళన సమస్యలు ఉన్నాయి. వీటికి మందులు కూడా తీసుకుంటున్నాను.అర్థం కావట్లేగత రిలేషన్షిప్ వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. దాని ఫలితంగా మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలన్నర నుంచి సరిగా నిద్రపోయిందే లేదు. ఎప్పుడూ మెలకువతోనే ఉంటున్నాను. ఏం ఆలోచించాలో కూడా అర్థమవడం లేదు. నిద్రరాకపోయినా బెడ్పై నుంచి లేవబుద్ధి కావట్లేదు. నేను ఎలా ఉన్నా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో షోలు చేశాను. అది నా వృత్తి, పైగా నేను ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాను కాబట్టి ఫేక్ నవ్వుతో కవర్ చేసేశాను. నన్ను నేను తెలుసుకుంటున్నాకానీ నా శరీరంలోనూ సమస్యలు వస్తున్నాయి. నేను ఏడ్చిన తర్వాతే షోకి వస్తున్నానని అక్కడున్నవారికీ తెలిసిపోతుంది. నా భర్తతో బంధం తెగిపోవడానికి ఓసీడీ ఒక్కటే కారణం కాదు. ఇంకా ఇతరత్రా కారణాలున్నాయి. అయితే బంధం ముక్కలైందని నేనేమీ చింతించట్లేదు. దాని నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను. అసలు నేనేంటో లోతుగా తెలుసుకుంటున్నాను. ఎప్పుడూ ఏడుపే..ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాను. అదొక్కటే నాకు మిగిలింది. దీనికి కూడా థెరపీ చేయించుకుంటున్నాను. జీవితం ముందుకు కదలట్లేదు. అలాగని బలవంతంగా చనిపోనూలేను. అయినా విడాకులు తీసుకోవడం పెద్ద నేరమేమీ కాదు. విడాకులు తీసుకున్నవాళ్లందరూ చెడ్డవాళ్లు కాదు అని గాయని చెప్పుకొచ్చింది.చదవండి: రావణుడిపై ప్రేమతో పచ్చబొట్టు వేయించుకున్న బుల్లితెర నటుడు -
జాతీయ అవార్డులు: ఆ స్టార్ హీరో సినిమా ఒక్కటీ పంపలేదు
జాతీయ అవార్డుల కోసం 300 చిత్రాల వరకు పోటీ.. కానీ అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మమ్ముట్టి సినిమా లేదు. ఈ మాట అంటున్నది మరెవరో కాదు జాతీయ అవార్డు జ్యూరీ మెంబర్, దర్శకుడు ఎమ్బీ పద్మకుమార్. మమ్ముట్టి.. 2022 నుంచి గతేడాదివరకు దాదాపు తొమ్మిది సినిమాలతో అలరించాడు. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా జాతీయ అవార్డు కోసం పంపలేదు.ఒక్క సినిమా పంపలేదుదీని గురించి డైరెక్టర్ పద్మకుమార్ మాట్లాడుతూ.. మమ్ముట్టి నటించిన ఒక్క సినిమాను కూడా అవార్డుల కోసం పంపలేదు. జనాలు మాత్రం మళ్లీ ప్రభుత్వాన్ని తప్పుపడతారు. అసలు ఇలా ఎందుకు జరిగిందని మేము అడుగుతున్నాం. మమ్ముట్టి అద్భుత నటన కనబర్చిన సినిమాలను కూడా సబ్మిట్ చేయకపోవడం ఘోర తప్పిదం.మాలీవుడ్కు తీరని లోటుఇది కేవలం మమ్ముట్టికి మాత్రమే లోటు కాదు.. మలయాళ సినిమాకు కూడా తీరని లోటు అని పేర్కొన్నాడు. కాగా 2023లో వచ్చిన నాన్పకల్ నెరటు మయక్కం, కాతల్: ద కోర్ వంటి సినిమాలు మమ్ముట్టికి మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలు జాతీయ అవార్డు కోసం పోటీపడ్డాయి. జాతీయ అవార్డులుమలయాళ మూవీ ఆట్టమ్ ఉత్తమ చిత్రంగా నిలవగా రిషబ్ శెట్టి (కాంతార)ని ఉత్తమ నటుడు అవార్డు వరించింది. తిరుచిత్రాంబళమ్ మూవీకిగాను నిత్యామీనన్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. కార్తికేయ 2 ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. -
ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట!
ఫిలింఫేర్ (సౌత్) 2024 అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో శనివారం రాత్రి జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని సినిమాలకు, నటీనటులకు పురస్కారాలు అందించారు. నాన్పకల్ నెరతు మయక్కమ్ సినిమాకుగానూ మలయాళ స్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.ఇది 15వ అవార్డ్ఈ పురస్కారాన్ని అందుకుంటున్న సమయంలో మమ్ముట్టి ఎమోషనల్ అయ్యాడు. అవార్డు తీసుకుంటున్నందుకు అంత సంతోషంగా ఏమీ లేదన్నాడు. విక్రమ్, సిద్దార్థ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న మమ్ముట్టి.. 'ఇది నా 15వ ఫిలింఫేర్ అవార్డ్.. ఈ మూవీలో నేను ద్విపాత్రాభినయం చేశాను. తమిళ్, మలయాళం మాట్లాడాను. ఈ చిత్రాన్ని నేనే నిర్మించాను. ఈ విజయాన్ని సాధించేందుకు తోడ్పడ్డ టీమ్కు కృతజ్ఞతలు.అందువల్లే ఈ బాధనిజానికి ఈ క్షణం నేనెంతో సంతోషంగా ఉండాలి. కానీ ఆ ఆనందమే లేకుండా పోయింది. కేరళలోని వయనాడ్లో ప్రకృతి సృష్టించిన బీభత్సం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రులయ్యారు. ఆ ప్రమాదం మనసును కలిచివేస్తోంది. మీరు కూడా బాధితులకు ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను' అని పిలుపునిచ్చాడు. కాగా మమ్ముట్టి వయనాడ్ బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.20 లక్షల విరాళం ప్రకటించారు.చదవండి: రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. మ్యాడ్ ట్రైలర్ వచ్చేసింది! -
'కాంతార' బ్యూటీ.. షార్ట్లో భలే అందంగా ఉంది! (ఫొటోలు)
-
చిరునవ్వుతోనే ఫిదా చేసే వర్ష బొల్లమ్మ బర్త్డే ట్రీట్ (ఫోటోలు)
-
చావే దిక్కనుకున్నా.. కూతురి కోసం ఆగిపోయా: లేడీ కమెడియన్
ఆర్య.. లేడీ కమెడియన్. బడాయి బంగ్లా అనే కామెడీ షోతో తన పేరు కాస్తా ఆర్య బడాయిగా మారిపోయింది. నటిగా, హాస్య నటిగా, యాంకర్గా, జడ్జిగా ఇలా వివిధ పాత్రలు పోషించే ఆమె సినిమాలు, రియాలిటీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఆర్య జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. 2008లో ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్ (నటి అర్చన సుశీలన్ సోదరుడు)ను పెళ్లాడగా వీరికి రోయ అనే కూతురు పుట్టింది. కూతురి పేరు మీద ఓ బొటిక్ కూడా ఓపెన్ చేసింది. అయితే ఏమైందో ఏమో కానీ 2019లో భర్తతో విడిపోయి కూతురితో ఒంటరిగా నివసిస్తోంది.బిగ్బాస్ తర్వాత డిప్రెషన్తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను బయటపెట్టింది. బిగ్బాస్ నుంచి వచ్చాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోయాను. చనిపోయేందుకు ప్రయత్నించాను. నిద్రమాత్రలు తీసుకున్నాను. కానీ నా కూతురిని చూసి ఆగిపోయాను. తనే నన్ను ఆ బాధలో నుంచి బయటపడేసింది. ఎప్పుడైనా సరే మనకు తట్టుకోలేనంత బాధ అనిపిస్తే దాన్నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తాం. చావు ఒక్కటే మార్గం అనుకుంటాం. మరణమే మార్గమనుకున్నాలాక్డౌన్లో నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. చావే సరైన నిర్ణయమనుకున్నాను. కానీ నా కూతురు.. తన పరిస్థితి ఏం కావాలి? తనను చూసుకోవడానికి మా నాన్న కూడా లేరు. ఆయన ఉండుంటే కూతుర్ని ఆయన చూసుకుంటాడన్న ధీమాతో ఎప్పుడో ప్రాణాలు వదిలేసేదాన్ని. నేను, అమ్మ, వదిన, పాప.. వాళ్లకంటూ ఉన్నది నేనేగా! అందరినీ వదిలేసిపోతే వాళ్లుం ఏం చేస్తారు? నా కూతురు జీవితం ఏమైపోతుంది? పాపను తన తండ్రి బాగానే చూసుకుంటాడు.కూతురి కోసం ఆలోచించి ఆగిపోయాకానీ చుట్టూ ఉన్న సమాజం ప్రేమలో ఓడిపోయి మీ అమ్మ బలవన్మరణానికి పాల్పడిందంటూ కాకుల్లా పొడిచి మరీ చెప్తారు. అవన్నీ ఆలోచించి ఆగిపోయాను. నా కుటుంబంతో, ఫ్రెండ్స్తో మాట్లాడాను. మళ్లీ సరైన దారిలోకి వచ్చాను. పెళ్లి విఫలమవడాన్ని భరించాను, తర్వాత బ్రేకప్ బాధనూ తట్టుకున్నాను, ఆఖరికి నాన్న మరణాన్ని సైతం తట్టుకుని నిలబడ్డాను. అందుకే అందరూ నన్ను బోల్డ్ అని పిలుస్తుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్.. అని ఆర్య చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) చదవండి: నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం.. -
నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం..
ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిఖికి వారసుడొచ్చాడు. ఆయన కుమారుడు, నటుడు షాహీన్- డాక్టర్ అమృత దంపతులు జూలై 10న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆలస్యంగా వెల్లడించారు. మా ఇల్లు పెద్దదైపోయింది. మా కుటుంబంలోకి చిన్నారి దువా షాహీన్ వచ్చేసింది అని అమృత ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. కాగా షాహీన్, అమృత 2022 మార్చిలో పెళ్లి చేసుకున్నారు.ఇదిలా ఉంటే సిద్ధిఖి పెద్ద కుమారుడు రషీన్ (37) శ్వాసకోస సమస్యలతో జూన్లో కన్నుమూశాడు. ఈయన బాల్యం నుంచి బుద్ధిమాంధ్యంతో బాధపడుతున్నాడు. ఇంట్లోనివారంతా ఈయన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. ముద్దుగా సప్పి అని పిలుచుకుంటారు. అమాయకంగా తిరుగుతూ కనిపించే రషీన్ జూన్ 27న కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో మరణించాడు. ఇతడి మరణంతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా షాహీన్ సిద్దిఖి.. పతేమరి సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. శశియుమ్ శాంకుతలయుమ్, ఒరు కడతు నాదన్ కద, శేషం మైక్ ఇల్ ఫాతిమా, కద పరంజ కద, కసాబా వంటి పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: సీరియల్స్, రియాలిటీ షో వల్ల రాగద్వేషాలు.. ఇక నా వల్ల కాదు: నటి -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 'ప్రేమలు' నటుడు
మలయాళ నటులు అర్జున్ అశోకన్, సంగీత్ ప్రతాప్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎమ్జీ రోడ్డుపై వెళ్తున్న వీరి కారు రెండు బైక్స్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు, నటుడు అర్జున్కు స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగంలో కూర్చున్న నటుడు సంగీత్ మెడకు ఫ్రాక్చర్ అవడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బైక్పై ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కారు యాక్సిడెంట్బ్రొమాన్స్ సినిమాలోని ఛేజింగ్ సీన్ చిత్రీకరించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్లో కారు వెనకభాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో షూటింగ్ను తాత్కాలికంగా ఆపేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.సినిమా..అర్జున్ అశోకన్.. ఈ ఏడాది అబ్రహాం ఒజ్లర్, భ్రమయుగం, వన్స్ అపాన్ ఎ టైమ్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం బ్రొమాన్స్ సహా మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. సంగీత్ ప్రతాప్.. హృదయం, ప్రేమలు సినిమాలతో అలరించాడు.చదవండి: మాస్ డ్యాన్సర్.. పోలకి విజయ్ -
నటికి సర్జరీ? ట్రాన్స్జెండర్లా ఉందంటూ ట్రోల్స్
సాంప్రదాయమైన దుస్తులు మాత్రమే ధరించే సెలబ్రిటీలు అరుదుగా కనిపిస్తారు. దాదాపు అందరు సినీతారలు మోడ్రన్, గ్లామర్గా కనిపించడానికే ఓటేస్తున్నారు. ఆఫర్లు రావాలంటే అందాల ప్రదర్శన తప్పనిసరి అన్నట్లుగా మారింది. మలయాళ బ్యూటీ సానియా ఇయప్పన్ కూడా ఇదే నమ్మింది. కొన్నిసార్లు చీర కడుతూనే ఎక్కువ సార్లు మోడ్రన్ దుస్తుల్లో కనువిందు చేస్తోంది.ఇలా అయిపోయిందేంటి?ఈ మధ్యే ఓ మాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఇది చూసిన కొందరు నటి సర్జరీ చేయించుకుందని విమర్శిస్తున్నారు. తన ముఖమేంటి మగవాడిలా కనిపిస్తోంది? సడన్గా చూసి ట్రాన్స్జెండర్ అనుకున్నాను. ఆమెకు ఆ హెయిర్ స్టైల్ అస్సలు సెట్టవ్వలేదు. తన ముక్కు, పెదాలకు ఏదో సర్జరీ చేయించుకున్నట్లుగా ఉంది.. దీనివల్ల ఆమె సహజ అందం కోల్పోయింది అని కామెంట్లు చేస్తున్నారు.అలాగైతే హాలీవుడ్కు వెళ్లేదాన్నిఇలా తనను ట్రోల్ చేయడం ఇది కొత్తేం కాదు. సానియా పొట్టి బట్టలు, కురచ దుస్తులు ధరించిన ప్రతిసారి నెటిజన్లు ఇలానే ట్రోల్ చేస్తుంటారు. అయితే ఈ నెగెటివ్ కామెంట్లను అస్సలు లెక్క చేయనని, తన జీవితం తన ఇష్టమని, తనకు నచ్చినట్లుగానే బతుకుతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.డ్యాన్సర్ నుంచి నటిగాకాగా సానియా ఇయప్పన్.. చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది. 2014లో వచ్చిన సూపర్ డ్యాన్సర్ అనే రియాలిటీ షోలో పాల్గొని విన్నర్గా నిలిచింది. D ఫర్ డ్యాన్స్: రెండో సీజన్లో సెకండ్ రన్నరప్గా సరిపెట్టుకుంది. చిన్న వయసులో డ్యాన్స్ స్టెప్పులతో మైమరిపించిన సానియా మలయాళ క్వీన్ మూవీతో హీరోయిన్గా మారింది. లూసిఫర్, ప్రేతమ్ 2, కృష్ణకుట్టి పని తుడంగి, సెల్యూట్, సాటర్డే నైట్ వంటి మలయాళ చిత్రాల్లో మెరిసింది. View this post on Instagram A post shared by 𝐕𝐀𝐍𝐈𝐓𝐇𝐀 (@vanithamagazine) చదవండి: రాజమౌళి ఓ పిచ్చోడు.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
సింగర్కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్జెండర్ అంటూ కామెంట్స్
కొందరు పురుషులకు స్త్రీ గొంతుతో మాట్లాడటం వచ్చు. ఆడవారి గొంతును అనుకరించి పాటలు కూడా పాడతారు. అయితే విడ్డూరంగా ఓ మహిళ అబ్బాయిలా మాట్లాడగలదు, పాటలూ పాడగలదు. ఆవిడే సింగర్ లక్ష్మి జయన్. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఈమె మలయాళ బిగ్బాస్ మూడో సీజన్లోనూ పాల్గొంది. రేడియో హోస్ట్గానూ పని చేసిన ఈమె అనేక కార్యక్రమాల్లో హాజరై తన గొంతుతో అందరినీ అబ్బురపరుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలోనూ తన టాలెంట్ చూపించింది.రెండు వర్షన్లు తానే..రోజా సినిమాలోని పరువం వానగా పాట మలయాళ వర్షన్ను ఆలపించింది. ఈ సాంగ్లో వచ్చే మేల్, ఫిమేల్ వర్షన్ రెండింటినీ తనే పాడింది. సెకన్లలోనే తన గొంతును మార్చుతూ అద్భుతంగా పాట పాడుతున్న ఆమె వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన కొందరు ఆమె ప్రతిభను మెచ్చుకుంటుండగా మరికొందరు మాత్రం ట్రాన్స్జెండర్ అని తప్పుగా అభిప్రాయపడుతున్నారు. దీంతో లక్ష్మి అభిమాని ఒకరు ఇటువంటి కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.తెలీకుండా మాట్లాడొద్దుసింగర్ లక్ష్మి వందశాతం మహిళే. తనకు ఓ బాబు కూడా పుట్టాడు. ఆమె బిగ్బాస్ స్టార్, వయొలనిస్ట్, టీవీ యాంకర్, రేడియో జాకీ.. ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. తనెవరో తెలియకపోతే తెలుసుకోండి. అంతేకానీ ఏది పడితే అది మాట్లాడొద్దు అని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. இதுபோல சில பெண்கள் இரு குரல்களில் பாடுகிறார்கள். ஆனா இந்தப் பெண்ணின் ஆண் வாய்ஸ் செம கம்பீரம் pic.twitter.com/wRoKB8NXjM— 𝗙𝗶𝗹𝗺 𝗙𝗼𝗼𝗱 𝗙𝘂𝗻 & 𝗙𝗮𝗰𝘁 (@FilmFoodFunFact) July 19, 2024 చదవండి: ఆ విషయంలోనే మాకు తరచూ గొడవలు: హీరోయిన్ -
కట్నం ఇచ్చి మరీ పెళ్లి.. అతడు డబ్బు తీసుకుని వెళ్లిపోతే?: హీరోయిన్
ఈ రోజుల్లో వైవాహిక బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. పెళ్లి ఆల్బమ్ వచ్చేలోపే విడాకులంటున్నారు. దశాబ్దాలు కలిసున్న జంటలు సైతం విడిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే హీరోయిన్ భామ కూడా విడాకులు తీసుకుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. భర్తతో కలిసున్న ఫోటోలు డిలీట్ చేయడం, తాను సింగిల్ మదర్నని ప్రకటించడంతో విడాకులు నిజమేనని అంతా ఫిక్సయ్యారు.కట్నం ఇచ్చి మరీ పెళ్లితాజాగా ఈ నటి పెళ్లి గురించి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. అమ్మాయిలు పెళ్లెందుకు చేసుకోవాలి? తన దగ్గరున్న డబ్బు కట్నంగా ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవాలా? అవసరమే లేదు. పెళ్లయ్యాక ఆ భర్త మనల్ని వదిలేస్తే? మన డబ్బుతో వాళ్లు సుఖంగా బతుకుతారు. కానీ మనం మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తాం. అసలు మన జీవితంలోకి వచ్చేవాళ్లతో మనం ఎలా మసులుకోవాలనేది తెలుసుకునేలోపే అంతా అయిపోతుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.పెళ్లితో సినిమాలకు దూరంకాగా భామ, అర్జున్ 2020 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత భామ సినిమాలకు గుడ్బై చెప్పింది. వీరికి గౌరి అనే కూతురు పుట్టింది. దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భామ తన కూతురే ప్రపంచంగా బతుకుతోంది. నివేద్యం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన భామ మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగులో మంచివాడు అనే ఒకే ఒక్క సినిమాలో కనిపించింది.చదవండి: Nawazuddin Siddiqui: సౌత్ సినిమాలు అందుకే చేస్తున్నా.. -
30 ఏళ్లలోపు పెళ్లి.. కల నెరవేరిందంటున్న లియో నటి (ఫోటోలు)
-
ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్
మలయాళ హీరోయిన్ పుణ్య ఎలిజబెత్ గుడ్న్యూస్ చెప్పింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. టోబి కోయిపల్లి అనే వ్యక్తిని పెళ్లాడినట్లు తెలిపింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది. 'నాకు 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకున్న నా ప్రియుడు గతవారమే పెళ్లి ముహూర్తం పెట్టేశాడు. అలా మేమిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాక ఈరోజు 30వ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు పుణ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ పెళ్లి కోసం ఫ్యామిలీ అంతా కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతా కలిసి ఈ మ్యారేజ్ వేడుకలను రెట్టింపు సంతోషంతో ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ బ్యూటీ 2018లో తోబమ అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది. గౌతమంటే రాధం అనే మాలీవుడ్ సినిమాలోనూ కథానాయికగా మెరిసింది. మార, గెట్ సెట్ బేబీ, లియో వంటి తమిళ చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Punya Elizabeth (@punya_elizabeth) View this post on Instagram A post shared by Magic Motion Media | Photography & Films (@magicmotionmedia) View this post on Instagram A post shared by Punya Elizabeth (@punya_elizabeth) View this post on Instagram A post shared by Punya Elizabeth (@punya_elizabeth) చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే? -
అల్లు అర్జున్ ని వెనక్కి నెట్టిన ప్రభాస్..
-
కొత్త కారు కొన్న హీరోయిన్.. భర్తతో విడిపోయిందా?
కన్నడ హీరో దర్శన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గజ ఒకటి. ఈ మూవీ హీరోయిన్ నవ్య నాయర్ అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఈమె అసలు పేరు ధన్య వీణ. కానీ సినిమాల్లోకి వచ్చేవారికి ఈ పేరేం బాగుంటుందని దర్శకుడు శిబి మలయిళ్ తనకు నవ్య నాయర్ అని నామకరణం చేశాడు. ఈ హీరోయిన్ మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసి అక్కడే స్థిరపడిపోయింది. కొత్త కారుకన్నడలో దృశ్యం 1, 2 చిత్రాల్లోనూ నటించింది. తాజాగా ఈమె కొత్త కారు కొనుక్కుంది. బీఎమ్డబ్ల్యూ కారు కొన్న ఆమె అందుకోసం రూ.1.3 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ కారు ముందు కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే యూట్యూబ్లో వ్లాగ్ పెట్టింది. ఈ ఫోటోలు, వీడియోలలో ఎక్కడా ఆమె భర్త కనిపించలేదు. ఇది చూసిన జనాలు నీ భర్త ఎక్కడంటూ నటిని నిలదీస్తున్నారు. అదేంటి? నువ్వు సింగిల్ మదర్వా? నీ భర్తతో కలిసున్నావా? లేక విడిపోయావా? అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి దీనికి నవ్య ఏమని సమాధానమిస్తుందో చూడాలి!పాత చీరల బిజినెస్నవ్యకు 2010లో బిజినెస్మెన్ సంతోష్ మీనన్తో పెళ్లయింది. వివాహం తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె కేరళ నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. కరోనా, లాక్డౌన్ పరిణామాల తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య చీరల బిజినెస్ కూడా ప్రారంభించింది. తను వాడిన చీరలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. అటు డ్యాన్స్ క్లాసుల ద్వారానూ సంపాదిస్తోంది. View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) చదవండి: కత్రినా లేకుండానే ఫంక్షన్కు.. నటితో హీరో స్టెప్పులు.. -
'జై బోలో తెలంగాణ' హీరోయిన్ పెళ్లి (ఫొటోలు)
-
'పుష్ప' విలన్పై సుమోటో కేసు.. అసలేం జరిగిందంటే?
ఫహాద్ ఫాజిల్ పేరు చెబితే కొందరు గుర్తుపట్టకపోవచ్చేమో గానీ 'పుష్ప' విలన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా చివర్లో 'పార్టీ లేదా పుష్ప' అని హంగామా చేసే ఇతడు స్వతహాగా మలయాళ నటుడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీసి హిట్ కొడుతున్నాడు. రీసెంట్గానే 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇతడిపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు కూడా బుక్ చేసింది.ఇంతకీ ఏమైంది?మలయాళంలో నిర్మాతగా ఫహాద్ పలు సినిమాలు చేస్తున్నారు. అలా ప్రస్తుతం 'పింకేలీ' షూటింగ్ని అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో చిత్రీకరించారు. గురువారం రాత్రంతా షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎమర్జెన్సీ రూంలోనూ షూటింగ్ చేయడంతో పాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. అసలు అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ అయ్యారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిన హీరో విశ్వక్ సేన్.. అదే కారణమా?)ఓవైపు ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నప్పుడే మరోవైపు షూటింగ్ కూడా చేశారని, దీని వల్ల రోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని పలువురు పేషెంట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిర్మాతల సంఘం మాత్రం ఆరోపణల్ని కొట్టేసింది. రాత్రి షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామని చెప్పుకొచ్చింది.అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం.. నిర్మాత ఫహాద్ ఫాజిల్పై కేసు పెట్టింది. దీంతో ఇతడు త్వరలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్) -
పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. సింపుల్గా గుడిలో ఏడడుగులు వేసింది. శనివారం ఉదయమే జరిగిన ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం ఈ నటి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)మలయాళ బ్యూటీ మీరా నందన్.. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సింగర్ అయింది. 2008లో ఈమెకు సొంత భాషలో తొలి అవకాశమొచ్చింది. అనంతరం తమిళ, తెలుగు, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో 'జై బోలో తెలంగాణ', హితుడు, 4th డిగ్రీ తదితర చిత్రాల్లో యాక్ట్ చేసింది. వీటిలో 'జై బోలో తెలంగాణ'తో ఈమెకు హిట్ దక్కినా ప్రయోజనం లేకుండా పోయింది.గతేడాది 'ఎన్నలుమ్ ఎంటే ఆలియా' అనే మలయాళ సినిమాలో చివరగా నటించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. ఇప్పుడు శ్రీజు అనే యూకేకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ని పెళ్లి చేసుకుంది. ప్రముఖ గురువాయుర్ దేవాలయంలో వీళ్లు ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని మీరానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?) View this post on Instagram A post shared by Meera Nandhaa (@nandan_meera) -
హనీరోజ్ని ఇలా చూస్తే ఉక్కిరిబిక్కిరే.. రింగుల జట్టుతో అలా! (ఫొటోలు)
-
నా జుట్టు నా ఇష్టం.. మీకేంటి సమస్య?: జై భీమ్ నటి
ఈరోజుల్లో సెలబ్రిటీలు ఏం చేసినా తప్పయిపోతోంది. నచ్చిన డ్రెస్ వేసుకున్నా, హెయిర్ కట్ చేసుకున్నా, ఏదైనా కొత్తగా ట్రై చేసినా.. జనాలకు నచ్చలేదంటే చాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జై భీమ్ నటి లిజొమోల్ జోస్ను ఇలాగే విమర్శించారట.లిజొమోల్ జోస్దాని గురించి ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్యే నేను నా హెయిర్ కట్ చేసుకున్నాను. అది నా ఇష్టం. కానీ అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. కొందరైతే నీ జుట్టు ఎందుకు కత్తిరించుకున్నావు? అని ప్రశ్నిస్తున్నారు. చిన్నగా ఉంటే బాగుంటుందనిపించింది, కట్ చేసుకున్నాను. దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది.శృతి రామచంద్రన్అదే ఇంటర్వ్యూలో ఉన్న నటి శృతి రామచంద్రన్ మాట్లాడుతూ.. జనాలతో ఇదే సమస్య.. నేను, మా ఆయన కనిపిస్తే చాలు, మీకు పిల్లలెందుకు లేరు? అని అడుగుతారు. వాళ్ల జీవితాల గురించి వాళ్లు ఎంత ఆలోచిస్తారో తెలీదు కానీ పక్కవారి గురించి మాత్రం మరీ ఎక్కువ ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చింది. కాగా శృతి రామచంద్రన్.. తెలుగులో డియర్ కామ్రేడ్ మూవీలో యాక్ట్ చేసింది. -
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
నేడు (జూన్ 16న) ఫాదర్స్ డే. అందరూ తమ తండ్రితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సెలబ్రిటీలైతే నాన్నను తలుచుకుని ఎమోషనలవుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ నేహా సక్సేనా.. తనకు తల్లయినా, తండ్రయినా అన్నీ అమ్మేనంటూ ఓ వీడియో షేర్ చేసింది.హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా.. నాన్న లేడన్న లోటు తెలియకుండా పెంచావు. పుట్టినప్పటినుంచీ నువ్వే నా ప్రపంచం. అమ్మ, నాన్న, ఫ్రెండ్.. అన్నీ నువ్వే అయ్యావు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినందుకు థాంక్యూ అమ్మా. నా చివరి శ్వాస వరకు నువ్వు గర్వపడేలా కృషి చేస్తాను. ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ నువ్వే ఇష్టం. లవ్ యూ మా.. అని రాసుకొచ్చింది.కాగా నేహా సక్సేనా.. రిక్షా డ్రైవర్ అనే తుళు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ప్రేమకు చావుకు అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. తమిళ, కన్నడ, మలయాళ, సంస్కృత, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం వృషభ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Neha Saxena (@nehasaxenaofficial) చదవండి: గుండు గీయించుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా? -
ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..
మలయాళ దర్శకుడు రథీశ్ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్ డిజైనర్ లిజి ప్రేమన్. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులు..ఈ సినిమా ప్రీపొడక్షన్ దగ్గరి నుంచి షూటింగ్ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ రథీశ్కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. నాకు క్రెడిట్ ఇవ్వలేదుతీరా చూస్తే సినిమా క్రెడిట్స్లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్ అని రాశారు. కాస్ట్యూమ్ డిజైనర్గా మరో వ్యక్తికి క్రెడిట్ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్ అయ్యేవరకు ఆగాను. ఓటీటీలో అయినా..ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్ డిజైనర్గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.చదవండి: గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే! -
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
గెలుపోటములు సాధారణం.. కానీ కొన్ని విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి.. చరిత్రనే తిరగరాస్తాయి. అలా తన సక్సెస్తో అందరి దృష్టినీ ఆకర్షించాడు నటుడు సురేశ్ గోపి. అవును మరి! 1952లో లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా కేరళలో బీజేపీ గెలిచిందే లేదు. ఇంతకాలంగా అసాధ్యమనుకున్న కమలం విజయాన్ని తన గెలుపుతో సుసాధ్యం చేసి చూపించాడు.ప్రాణం కాపాడుఈ సక్సెస్తో సురేశ్ గోపీ గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో! కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తయినా తగ్గుతుందేమో! 1992 జూన్ 6న భార్యాబిడ్డతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. స్పృహలోకి వచ్చేసరికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాడు. కళ్లు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు. నా ప్రాణం కాపాడు స్వామీ అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. ఇక్కడ తన ప్రాణం అంటే ఆయన కూతురు లక్ష్మి. గుండెలో గూడు కట్టుకున్న బాధగాయాలు బాధిస్తున్నా ఎలాగోలా సత్తువ కూడదీసుకుని ఏడాదిన్నర వయసున్న కూతురిని చూసేందుకు ఐసీయూలోకి వెళ్లాడు. కొనప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లిపోయాడు. అతడి కన్నీరు చూసి భగవంతుడు చలించలేదు. ఆమెను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అందుకే జూన్ మాసం అంటేనే ఆయనకు భయం, అయిష్టత! ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు సైతం నొప్పులు లేస్తాయట!జూన్ నెలలోనే..అయినా ఆ నొప్పి భరించడం తనకిష్టమేనంటాడు. అదే తన కూతురితో ఉన్న చివరి జ్ఞాపకాలని జీవం లేని నవ్వు విసురుతాడు. నలుగురు పిల్లలున్నా సరే లక్ష్మి లేని లోటును ఎవరూ పూడ్చలేడంటాడు. విధి ఎంత విచిత్రమో కదా! జూన్ నెలలో అతడి కూతుర్ని తీసుకెళ్లిపోయింది. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఇదే నెలలో అతడికి ఊహించని విజయాన్ని అందించింది.రాజకీయ నేపథ్యం..సురేశ్ గోపి 2016లో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. తర్వాత బీజేపీలో చేరాడు. 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసినా విజయం వరించలేదు. నిరాశతో వెనుదిరగలేదు. ముచ్చటగా మూడోసారి పోటీ చేసి త్రిసూర్ ఎంపీగా గెలిచాడు. నటుడిగా వందల సినిమాలు చేసిన సురేశ్ గోపి తెలుగులో అంతిమ తీర్పు, ఆ ఒక్కడు, ఐ వంటి చిత్రాలతో మెప్పించాడు.చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ -
లవ్ మ్యారేజ్.. పిల్లలెప్పుడని ఒత్తిడి తెచ్చారు.. ఎనిమిదేళ్లకు..
పెళ్లయిన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏదైనా విశేషముందా? ఈ మాట వినీవినీ విసుగెత్తిపోయే జంటలెన్నో! కొందరు దంపతులు తమ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటారు. మరికొందరికేమో ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలవదు.. మిస్క్యారేజీ(గర్భస్రావం) అవుతుంటుంది. మలయాళ బుల్లితెర నటి సెంథిల్ శ్రీజకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.ప్రెగ్నెన్సీ నిలవలేదుపదవ పెళ్లి రోజు సందర్భంగా శ్రీజ భర్త సెంథిల్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు మూడుసార్లు గర్భస్రావమైంది. మేము ఏ విషయమైనా ఇంట్లోవాళ్లతో షేర్ చేసుకుంటాం. అలా ప్రెగ్నెన్సీ గురించి చెప్పి వాళ్లు సంతోషించేలోపే మిస్క్యారేజ్ అయిందని చెప్పేవాళ్లం. పిల్లల కోసం ఎంత ఎదురుచూశామో! మా కలలు నీరుగారిపోయిన సమయంలో తను మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అంతకుముందు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ నిలవలేదు కాబట్టి అప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోలేదు.ఈసారి కూడా..ఒకవేళ ఈసారి కూడా గర్భం నిలవకపోతే పిల్లలు లేరని బాధపడకూడదని శ్రీజ నాతో అంది. కానీ మా కన్నా ముందు చుట్టుపక్కల వారి బాధ భరించలేకపోయాం. ఎప్పుడూ దాని గురించే అడుగుతూ ఒత్తిడికి గురి చేసేవారు. మా అదృష్టం కొద్దీ ఆ ప్రెగ్నెన్సీ నిలబడి దేవ్ జన్మించాడు. పెళ్లైన కొత్తలో మా ఇద్దరికీ కొంత కన్ఫ్యూజన్ ఉండేది. పెళ్లికి ముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. కానీ వివాహం తర్వాత మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం కొంత తగ్గిపోయింది. కొంతకాలం తర్వాత మళ్లీ మంచి స్నేహితులుగా మారిపోయాం. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం. మొదటి మూడేళ్లు..లవ్ మ్యారేజ్ అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా సరే.. మొదటి మూడేళ్లు ఎలాగోలా మ్యానేజ్ చేసుకుంటే తర్వాత జీవితమంతా సాఫీగా ఉంటుంది. మేము ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. బాబు పుట్టాక పోట్లాడుకునేంత తీరిక దొరకడం లేదు అని చెప్పుకొచ్చాడు. సెంథిల్, శ్రీజ.. సూపర్ హిట్ తమిళ సీరియల్ 'శరవణన్ మీనాక్షి'లో కలిసి నటించారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో దేవ్ అనే కుమారుడు జన్మించాడు.చదవండి: 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో.. -
కెమెరామెన్తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్
చిత్రపరిశ్రమలో హీరోయిన్ల పెళ్లి అంటేనే పెద్ద వార్తగా మారుతున్న పరిస్థితి. కొంత కాలం పాటు డేటింగ్ చేసి కొందరు పెళ్లి పీటలెక్కుతే.. మరికొందరు మాత్రం పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఓ యంగ్ హీరోయిన్ తన ప్రియుడ్ని పరోక్షంగా పరిచయం చేసింది. త్వరలో పెళ్లితో శుభం కార్డు వేయాలని ఆ బ్యూటీ చూస్తుందట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..?రజీషా విజయన్ గుర్తుందా. మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని పాపులర్ అయిన ఈ కేరళ భామ.. 2016లో మలయాళంలో కథానాయకిగా రంగప్రవేశం చేశారు. మాతృభాషలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా పొందింది. 2021లో తమిళంలో కర్ణన్ చిత్రంలో ధనుష్కు జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జైభీమ్, సర్దార్ వంటి చిత్రాల్లో మెప్పించింది. సర్దార్ చిత్రం తరువాత కోలీవుడ్ లో కనిపించని రజీషా తెలుగులో రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇలా బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తాజా సమాచారం. మలయాళ ప్రముఖ చాయాగ్రహకుడు టోపిన్ థామస్తో కలిసి ఏడడుగులు వేయనున్నట్లు తెలిసింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. అయితే దీనికి సబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) -
హీరోయిన్ మడోన్నా కూడా మారిపోయింది!
సినిమాకు గ్లామర్ ముఖ్యమే. కానీ ఇప్పుడు హీరోయిన్లకు కూడా గ్లామరే ప్రధానంగా మారిపోతోంది. ఇంతకు ముందు పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్న చాలామంది బ్యూటీస్.. ఇప్పుడు గ్లామర్ పాత్రలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు మడోన్నా సెబాస్టియన్ కూడా చేరినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)పలుమార్లు స్టేజీపై పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న మడోన్నా.. 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేసింది. కానీ ఎందుకనో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. గతేడాది వచ్చిన విజయ్ 'లియో'లో అతడికి చెల్లెలిగా చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.అయితే ఇప్పటివరకూ గ్లామర్కి దూరంగా ఉంటూ వచ్చిన మడోన్నా.. ఇప్పుడు మాత్రం రూట్ మార్చేసినట్లు అనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా గ్లామర్ చూపిస్తూ రెచ్చిపోతోంది. అయితే దర్శకనిర్మాతలకు తాను కూడా గ్లామర్ బ్యూటీనే అనే హింట్ ఇస్తోందా అని సందేహం వస్తుంది. ఇలా అయినా సరే ఈమెకు కమర్షియల్ మూవీస్లో ఛాన్సులొస్తాయేమో చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
అయ్యో మాలికాపురం.. ట్రోలింగ్తో మానసిక వేదన
మాలికాపురం ఓటీటీలో అదరగొట్టిన మలయాళ సినిమా. ఇందులో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద ప్రధాన పాత్రలో మెప్పించింది. ఈ బాలనటి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2018, నైమర్, అరణ్మనై 4 వంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన గు అనే హారర్ మూవీ ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ చిన్నారి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కూడా తన ఇంటి దగ్గరే ఇంటర్వ్యూ ఇచ్చింది.నటిపై ట్రోలింగ్అయితే సదరు యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన వీడియోను కొందరు ఇష్టారీతిన కట్ చేస్తూ తప్పుడు థంబ్నైల్స్ పెడుతున్నారట! తను అన్న మాటలను వక్రీకరిస్తున్నారట! దీనిపై నటి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూలోని ఒక పార్ట్ను మాత్రమే కట్ చేసుకుని తన కూతురిపై బురద చల్లుతున్నారని మండిపడ్డాడు. విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మానసికంగా..ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో తన కూతుర్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారని పేర్కొన్నాడు. దీనివల్ల తన పదేళ్ల చిన్నారి మానసిక ఆవేదనకు లోనవుతోందని తెలిపాడు. తన కూతురిపై ద్వేషం చిమ్మిన వీడియోలును వెంటనే సదరు ఛానల్స్ డిలీట్ చేయాలని డిమాండ్ చేయాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.సినిమా కోసం ఉపవాసంకాగా దేవానంద ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. తొట్టప్పన్(2019) చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె మై సాంటా, మిన్నాల్ మురళి, టీచర్, మాలికాపురం వంటి అనేక చిత్రాల్లో నటించింది. మాలికాపురం సినిమాలో ఈ బాలనటి ఎలాగైనా శబరిమల వెళ్లాలనుకుంటుంది. చివరకు పేరెంట్స్ సాయం లేకుండా అనుకున్నది సాధిస్తుంది. అయితే ఈ సినిమా కోసం 75 రోజులపాటు ఉపవాసం ఉంది. పైగా తను శబరిమల వెళ్లడం కూడా అదే తొలిసారి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. View this post on Instagram A post shared by Deva nandha jibin (@devanandha.malikappuram) చదవండి: పెళ్లయి మూడు నెలలు కాలేదు.. వెడ్డింగ్ పిక్స్ డిలీట్ చేసిన నటి -
తెలుగు సినిమా హీరోయిన్.. ముచ్చటగా మూడో పెళ్లి
హీరోయిన్ మీరా వాసుదేవన్ పెళ్లిపీటలెక్కింది. ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. ఈ శుభవార్తను మీరా సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్ చేసింది. అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.సింపుల్గా పెళ్లివిపిన్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఒక సినిమాటోగ్రాఫర్. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు. విపిన్, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్ నుంచి సినిమాల్లోకి..కాగా మీరా వసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్మాల్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారింది. అంజలి ఐ లవ్ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.రెండు పెళ్లిళ్లుతన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ తనయుడు విశాల్ అగర్వాల్ను 2005లో వివాహం చేసుకుంది. పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. సీరియల్ షూటింగ్లో లవ్..తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది. 2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్ మదర్గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్ షూటింగ్లో ఆ ధారావాహిక కెమెరామన్ విపిన్తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. View this post on Instagram A post shared by Meera Vasudevan (@officialmeeravasudevan)చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి -
మాలీవుడ్లో 1000 కోట్ల క్లబ్ సినిమాలు
-
నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్
సోషల్ మీడియా వల్ల ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. చాలామంది నెటిజన్లు.. హీరోయిన్లని ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేసేస్తుంటారు. దీని వల్ల అవతలి వ్యక్తులు ఏమనుకుంటారో అనేది మాత్రం అస్సలు ఆలోచించరు. తాజాగా తన ఫొటోలపై చాలా అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని యువ హీరోయిన్ అనికా సురేంద్రన్ ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. గ్లామర్ కనిపించేలా డ్రస్ వేసుకోవడం నా వ్యక్తిగతం. ఎవరెన్ని అనుకున్నా సరే నా ఇష్టాన్ని పక్కన పెట్టలేను. ఈ విమర్శలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ జీవితంలో ఓ భాగం మాత్రమే. కామెంట్ చేయాలనే ఉద్దేశం ఉన్నోడు.. చీర కట్టినా సరే అలానే అంటాడు. అయితే నా డ్రస్సింగ్ గురించి కొందరు చేసే కామెంట్స్ మాత్రం నన్ను చాలా ప్రభావితం చేస్తున్నాయి. నేను కూడా మనిషినే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. దయచేసి కామెంట్స్ చూసుకుని పెట్టండి. పర్సనల్ విషయాలు వద్దు' అని అనికా తన బాధని చెప్పుకొచ్చింది.చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన అనికా.. 'విశ్వాసం'లో అజిత్ కూతురిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో 'బుట్టబొమ్మ' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళ, మలయాళంలో నటిస్తున్న ఈమె.. అప్పడప్పుడు గ్లామరస్ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి వచ్చిన కామెంట్స్ తట్టుకోలేక తన బాధని బయటపెట్టింది.(ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!) -
ఓటీటీలో ఆవేశం.. ఆ సీన్పై చర్చ!
ఫహద్ ఫాజిల్.. అప్పుడే హీరోగా చేస్తాడు.. అంతలోనే విలన్గా నటిస్తాడు. ప్రాధాన్యతను బట్టి ఏ పాత్రలో అయినా దూరేస్తాడు. ఇటీవల అతడు హీరోగా నటించిన మలయాళ మూవీ ఆవేశం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఓటీటీలో ఆవేశంబాక్సాఫీస్ దగ్గర హిట్టందుకున్న మూవీ ఓటీటీలోకి రావడంతో సినీప్రియులు ఆత్రుతగా ఆవేశం సినిమా చూసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సినిమాలోని ఓ సీన్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందీ భాషను కావాలని పక్కన పడేశారని కామెంట్లు చేస్తున్నారు.ఫైట్ సీన్లో వార్నింగ్ఇంతకీ ఏమైందంటే.. ఓ ఫైట్ సీన్లో రంగ(ఫహద్ ఫాజిల్) తన కాలేజీలోని సీనియర్లు అజు, బిబి, షాంతన్కు వార్నింగ్ ఇస్తుంటాడు. మలయాళం, కన్నడ భాషల్లో వార్నింగ్ ఇస్తాడు. హిందీలో కూడా ఇద్దామనుకునేసరికి హిందీలో అవసరం లేదులే అంటూ రంగ రైట్ హ్యాండ్ అంబాన్ (సాజిన్ గోపు) అతడిని వారిస్తాడు. హిందీ అక్కర్లేదా?అందరికీ చెప్పింది అర్థమైందిగా.. ఇక వెళ్లిపోండి అని ఆదేశిస్తాడు. హిందీలో అవసరం లేదా? అని హీరో అడిగితే అంబాన్ వద్దని బదులిస్తాడు. ఇది చూసిన కొందరు అధికార భాష హిందీని గౌరవించాలి కదా అని అభిప్రాయపడగా.. అయినా ప్రాంతీయ భాషా చిత్రంలో హిందీ అవసరం ఏముందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.చదవండి: ఓ మంచి దెయ్యం టీజర్ చూశారా? -
టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
తెలుగు సినిమాలపై స్టార్ హీరో సంయుక్త మేనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక్కడ నటించాలంటే చాలా కష్టమని చెప్పింది. అలానే టాలీవుడ్లో తనకెదురైన కష్టాల్ని, అనుభవాల్ని బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు చిత్రసీమపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. అలానే మలయాళ ఇండస్ట్రీతో పోల్చి చూస్తే ఇక్కడ ఎలా ఉంటుందనేది కూడా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)'మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టం. భాష రాకపోవడమనేది ఓ కారణమైతే.. మేకప్ మరో రీజన్. వినడానికి సిల్లీగా ఉన్నాసరే నా వరకు ఇది చాలా పెద్ద విషయం. మలయాళ చిత్రాల్లో మేకప్ త్వరగా అయిపోతుంది. చాలా నేచురల్గా వేస్తారు. యాక్టింగ్ కూడా మనకు నచ్చినట్లు చేసేయొచ్చు. కానీ టాలీవుడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రీన్పై ఎలా కనిపిస్తున్నామనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. దానికి తోడు ఎక్కువ మేకప్ వేస్తారు. చాలా చిరాగ్గా.. ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది' అని సంయుక్త తన కష్టాల్ని చెప్పుకొచ్చింది.2016లోనే నటిగా మారిన సంయుక్త మేనన్... తొలుత మలయాళ, తమిళ చిత్రాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో అడుగు పెట్టింది. 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'విరూపాక్ష', 'సర్' చిత్రాలతో వరస హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ కల్యాణ్ రామ్ 'డెవిల్'తో ఫ్లాప్ అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభు' మూవీతో పాటు శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే కొత్త చిత్రాల్లో నటిస్తోంది. అలానే హిందీలోకి కూడా అడుగుపెట్టాలని ప్లాన్స్ చేసుకుంటోంది.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి పర్సనల్ వీడియో లీక్) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ దర్శకుడు సంగీత శివన్ (61) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ క్రమంలోనే మలయాళ, హిందీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?)కేరళకు చెందిన సంగీత్ శివన్.. 1990లో 'వ్యూహం' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యోధ, గంధర్వం, నిర్ణయం, స్నేహపూర్వం అన్న లాంటి మలయాళ సినిమాలతో పాటు అప్నా సప్నా మనీ మనీ, క్లిక్, యమ్ల పగ్ల దీవానా 2 తదితర హిందీ మూవీస్ చేశారు. చివరగా 2019లో 'భారం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు వయసుతో వచ్చిన అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు.సంగీత శివన్ సోదరుడు సంతోష్ శివన్.. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్గా చాలా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడిగానూ కొన్ని మూవీస్ చేశారు. ఇక సంగీత్ శివన్ చనిపోయారని వార్త తెలిసిన తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్)Deeply saddened and shocked to know that Sangeeth Sivan Sir is no more. As a newcomer all you want is someone to believe in you and take a chance.. can’t thank him enough for Kya Kool Hai Hum & Apna Sapna Money Money. Soft spoken, gentle and a wonderful human being. Am heart… pic.twitter.com/kvTkFJmEXx— Riteish Deshmukh (@Riteishd) May 8, 2024 -
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
పెళ్లి చేసుకునేది కలకాలం కలిసుండటానికే! విడిపోతారని ముందే తెలిస్తే పెళ్లెందుకు చేసుకుంటారు? ప్రేమ దగ్గరే ఆగిపోతారు. అయినా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న ఎంతోమంది పలు కారణాల వల్ల ఆ బంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అందులో మలయాళ హీరోయిన్ భామ కూడా చేరింది. భర్తతో విడిపోయిన విషయాన్ని తొలిసారి అధికారికంగా వెల్లడించింది.సింగిల్ మదర్ అయ్యాకే..ప్రస్తుతం తాను సింగిల్ పేరెంట్ అని తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'నేను చాలా స్ట్రాంగ్ అని ఇంతవరకూ తెలీలేదు. సింగిల్ మదర్ అయిన తర్వాతే ఈ విషయం తెలిసొచ్చింది. ఇప్పుడు ధృడంగా నిలబడటమే నా ముందున్న ఏకైక ఛాయిస్. నా కూతురికి నేను.. నాకు నా కూతురు' అంటూ తన పాపతో ఆడుకుంటున్న ఫోటో పోస్ట్ చేసింది. ఇది చూసిన జనాలు నువ్వు చాలా ధైర్యవంతురాలివి.. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అని కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంకాగా భామ.. 2020లో అరుణ్ జగదీశ్ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే మానేసింది నటి. ఇంతలోనే తను భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈమె తెలుగులో మంచివాడు అనే మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) చదవండి: తమిళంలో ఇటీవలే రిలీజ్.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి! -
ప్రేమలు బ్యూటీ అసలు పేరేంటో తెలుసా? చిన్న పొరపాటు..
మమితా బైజు.. ఇప్పటివరకు 15కు పైగా సినిమాలు చేసింది. కానీ సౌత్లో ఒక్కసారిగా ట్రెండ్ అయింది మాత్రం 16వ సినిమా ప్రేమలుతోనే! ఇప్పటివరకు అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ప్రేమలు మూవీతో వచ్చింది. ప్రస్తుతం రెబల్ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇవ్వనుంది. అసలు పేరు అది కాదు!తెలుగులోనూ అవకాశాలు తలుపుతడుతున్నాయి. అయితే ఈమె అసలు పేరు మమిత కాదట.. నమిత! హాస్పిటల్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్లో ఎన్ అనే అక్షరానికి బదులుగా ఎమ్ అని రాసేశారు. దీంతో నమిత కాస్త మమిత అయిపోయింది. పేరెంట్స్ కూడా దీన్నసలు చూసుకోనేలేదు.ఒక్క అక్షరంబడిలో చేర్పించే సమయంలో మమిత అని పడిందని గమనించారు. అయినా ఈ పేరు కూడా బానే ఉందని అలాగే ఉంచేశారు. మమిత అంటే మలయాళంలో మిఠాయి అని అర్థం. ఈ విషయాన్ని ప్రేమలు బ్యూటీయే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక్క పొరపాటుతో తన జాతకమే మారిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారుచదవండి: ఓటీటీల్లోకి ఏకంగా 17 మూవీస్.. ఆ రెండు స్పెషల్ -
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో వచ్చామా, పనిచేశామా, వెళ్లిపోయామా అనేలా ఉంటారు. మరికొందరు మాత్రం ఊహించని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. భావన అలాంటి హీరోయిన్ అని చెప్పొచ్చు. 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ జీవితంలో కాంట్రవర్సీలు బోలెడు ఉన్నాయి. కిడ్నాప్, లైంగిక దాడికి గురవడం, అబార్షన్ అయిందని రూమర్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించింది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు కిడ్నాప్ అయింది. ఓ స్టార్ హీరోని ఈమెని ఎత్తుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసులో మలయాళ హీరో దిలీప్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ రచ్చ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈమె నటించిన 'నడికర్' అనే మలయాళ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. అప్పట్లో తన అబార్షన్ గురించి వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది.'అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలువాలో గర్భస్రావం అయిందని, కొచ్చి-చెన్నైలోనూ అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. ఇలా పలుమార్లు జరగడం వల్ల నేను చనిపోయానని కూడా మాట్లాడారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చిరాకేస్తోంది. అప్పుడు నా గురించి వచ్చిన రూమర్స్ విని మెంటల్గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్గా నిలబడ్డాను' అని భావన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి) -
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
సినిమా నచ్చనప్పుడు బాలేదని విమర్శించడం తప్పు కాదు. కానీ కొందరు వారిని వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా దూషిస్తుంటారు. లుక్కు బాలేదని, లావైపోయావని.. ఇలా ఎన్నో మాటలంటారు. మరీ ముఖ్యంగా నటీమణులపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతుంటారు. దాదాపు ప్రతి హీరోయిన్, నటీమణులు ఎప్పుడో ఓసారి ఇలాంటి పరిస్థితుల బారిన పడినవారే!నటిపై ట్రోలింగ్తాజాగా మలయాళ నటి అన్నా రేష్మ రాజన్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నువ్వు ఎంత లావున్నావో తెలుసా? ఆ బరువుతో డ్యాన్స్ కూడా చేయలేకపోతున్నావ్.. నీకసలు స్టెప్పులేస్తూ రీల్స్ చేయడం అవసరమా? అని వెక్కిరించారు. తాజాగా ఈ ట్రోలింగ్పై నటి స్పందించింది. తాను ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది.వీడియో నచ్చకపోతే..ఇప్పటికే కీళ్లనొప్పులతో బాధపడుతున్నానని, ఇప్పుడిలాంటి కామెంట్స్ చేసి తనను మరింత బాధపెట్టొద్దని కోరింది. నేను లేదా నా డ్యాన్స్ వీడియో నచ్చకపోతే చెప్పండి.. అంతేకానీ హద్దులు దాటి కామెంట్స్ చేయొద్దని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజ్ఞప్తి చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల ప్రేమకు మురిసిపోయిన అన్నా మరో పోస్ట్లో ఇలా రాసుకొచ్చింది. సరిగా డ్యాన్స్ చేయలేకపోయా..నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఓపక్క టైట్ డ్రెస్, మరోపక్క ఎండ వల్ల సరిగా డ్యాన్స్ చేయలేకపోయాను. అలాగే నేనేమీ పెద్ద ప్రొఫెషనల్ డ్యాన్సర్ని కూడా కాదు. కాకపోతే ఇలా స్టెప్పేయడమంటే ఇష్టం. అందుకే నాకు వచ్చినంతలో డ్యాన్స్ చేశాను. నెక్స్ట్ టైమ్ మరింత బాగా చేసేందుకు ప్రయత్నిస్తాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అని రాసుకొచ్చింది. నటి కెరీర్..కాగా అన్నా రాజన్ 2017లో 'అంగమలి డైరీస్' చిత్రంతో మలయాళ చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'వేలిపడింతె పుస్తకం' సినిమాలో నటించింది. సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీలో పృథ్వీరాజ్ భార్యగా యాక్ట్ చేసింది. ఇటీవల రండు, తిరిమలై సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Anna Reshma Rajan (@annaspeeks) చదవండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి -
ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
హీరోయిన్ కావాలంటే గ్లామర్ చూపించాలి. డ్యాన్స్ చేయాలి. అందంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ వాటితో అవసరం లేకుండా కొందరు స్టార్స్ అవుతుంటారు. ఈ పాప కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈ మధ్య ఓ మూవీతో హిట్ కొట్టి కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మమిత బైజు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. రీసెంట్గా 'ప్రేమలు' సినిమాలో హీరోయిన్ ఈమెనే. ఇది మమిత చిన్నప్పటి ఫొటో. ఇందులో నాన్నతో కలిసి అమాయకంగా చూస్తోంది కదా! చిన్నప్పటి నుంచి అదే క్యూట్నెస్ మెంటైన్ చేస్తూ వచ్చింది. సేమ్ ఇలాంటి ఫొటోనే ఇప్పుడు కూడా ఒకటి తీసుకుంది. దిగువన ఉన్న ఫొటో అదే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)కేరళలోని కిడంగూర్ అనే ఊరిలో పుట్టి పెరిగిన మమిత.. ప్రస్తుతం సైకాలజీ డిగ్రీ చదువుతోంది. ఓవైపు చదువుతూ మరోవైపు సినిమాల్లో నటించేస్తోంది. 2017లో 'సర్వోపరి పాలక్కరన్' అనే మలయాళ మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం పలు చిత్రాలు చేసింది. కానీ 'కోకో' అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈమెకు గుర్తింపు దక్కింది. 'సూపర్ శరణ్య', 'ప్రణయ విలాసం' చిత్రాలతో హీరోయిన్ అయిపోయింది. 'ప్రేమలు'తో సోలో హీరోయిన్గా సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ఓవరాల్గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.మమిత బైజు వ్యక్తిగత విషయానికొస్తే.. తండ్రి డాక్టర్, తల్లి హౌస్ వైఫ్, ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లే. కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అలానే 'ప్రేమలు' హిట్ వల్ల విజయ్ దేవరకొండ కొత్త మూవీలోనూ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని అన్నారు. కానీ అందులో నిజం లేదని తెలిసిపోయింది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) -
గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
క్లాసికల్ డ్యాన్సర్, ప్రముఖ నటి కపిల వేణుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ గుడిలో తన ఫ్రెండ్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటానికి వెళ్లగా.. ఊహించని అనుభవం తనకు ఎదురైందని చెప్పుకొచ్చింది. ఈ మేకరు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అసలేం జరిగిందో చెబుతూనే తనే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందని తనని తాను సముదాయించుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)'నా స్నేహితురాలి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటం కోసం లోకల్గా ఉండే ఓ గుడికి ఒంటరిగా వెళ్లాను. అక్కడ ఆల్రెడీ ఉత్సవం జరుగుతోంది. దారి తెలియక అందరూ బయటకు వచ్చే దారి నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను. అయితే అక్కడే ఉన్న ఓ వాలంటీర్.. నన్ను టచ్ చేసి ఆపాడు. చాలా రూడ్గా మాట్లాడాడు. ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా ఇలా చేయడం ఏంటని కాస్త గట్టిగానే అడిగాను. ఇద్దరు మధ్య కాస్త వాదన జరిగింది. ఈ టైంలో మరో ఆరుగురు వాలంటీర్లు మేమున్న చోటుకు వచ్చారు. వాళ్లందరూ కూడా నాదే తప్పన్నట్లు చెప్పారు. సీన్ చేయకుండా, వెంటనే వెళ్లిపోవాలని కామెంట్ చేశారు''దీంతో ఏడుస్తూ పోలీసుల దగ్గర వెళ్లాను. ఆ తర్వాత కమిటీ మెంబర్లలో ఒకాయన వచ్చి వాలంటీర్లతో మాట్లాడి, నా తండ్రి పేరు తెలుసుకుని నన్ను లోపలికి పంపించేశాడు. ఇంకేదో జరుగుతుందనుకుంటే నాన్న పేరు తెలుసుకుని లోపలికి పంపేయడం నాకు నిజంగా నచ్చలేదు. అయినా గుడికి ఒంటరిగా వెళ్లాలనుకోవడం నాది తప్పు. జనాలు ఎక్కువగా వచ్చారు. వాళ్లని కంట్రోల్ చేయడం వాలంటీర్లకు కష్టమే. అయినా సరే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది' అని వేణు కపిల ఇన్ స్టాలో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య) View this post on Instagram A post shared by Kapila Venu (@kapilavenu) -
ఉల్లిపొర లాంటి చీరలో మాళవిక అందాల జాతర (ఫొటోలు)
-
నటుడితో ప్రేమ? అవమానిస్తున్నారంటూ నటి భావోద్వేగం
సెలబ్రిటీల చుట్టూ పుకార్లు వైఫైలా ఉంటాయి. దాదాపు ప్రతి సెలబ్రిటీ ఎప్పుడో ఓసారి ఇలాంటి గాసిప్ల బారిన పడినవారే! మలయాళ నటి రేఖ రతీశ్ కూడా 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిపై మనసు పారేసుకుందని, అతడిని మనువాడబోతుందంటూ పుకార్లు వెలువడ్డాయి. తన కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేశాడని రకరకాలుగా కథనాలు అల్లేశారు. ఇది చూసిన రేఖకు ఒళ్లు మండిపోయింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను ఈ మధ్యే కొత్త కారు కొన్నాను.కారు కొన్నా..మీడియా నావెంట వెంటపడతుందనే షోరూమ్కు వెళ్లలేదు. నా కుమారుడు, మేనల్లుడు కలిసి షోరూమ్కు వెళ్లి కారు తీసుకున్నారు. నా సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాను. అది చూసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టారీతిన కథనాలు అల్లేశాయి. నా కుటుంబంలోకి కొత్త వ్యక్తిని స్వాగతించానంటూ నాతో పని చేసిన ఓ నటుడి ఫోటోను జత చేసి ఏదేదో రాశారు. ఇంత నీచానికి దిగజారుతారా?ఓపక్క చెత్త కామెంట్లు..నాకంటూ ఓ కుమారుడున్నాడు. వీళ్ల వార్తలు చూసి చుట్టూ ఉన్నవాళ్లు అతడిని ఎంత హేళన చేస్తారో మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పటికే ఆన్లైన్లో చెత్త కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడిలా ఏది పడితే అది రాయడం వల్ల నా కుటుంబసభ్యులే నన్ను అనుమానిస్తూ అవమానించారు. ఎంతో బాధేసింది. నాతో లింక్ పెట్టిన ఆ నటుడు నన్ను చెల్లి అని పిలుస్తాడు. మీరు నా రిలేషన్షిప్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. నా కుమారుడే నా ప్రపంచం' అని నటి కుండ బద్ధలు కొట్టింది. View this post on Instagram A post shared by RekhaRatheesh (@rekharatheesh3) చదవండి: చాహల్.. ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్! 'వీడియోలో అతడెవరు?' -
సినిమాయే జీవితం కాదు.. నన్ను లైట్ తీస్కోండి: పుష్ప విలన్
ఫహద్ ఫాజిల్.. తెలుగు, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితుడే! సొంత (మలయాళ) ఇండస్ట్రీలో హీరోగా నటించే ఈయన ఇతర భాషా చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు, విలనిజం పాత్రలు పోషిస్తుంటాడు. ఇటీవల ఈయన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ 'ఆవేశం' రూ.100 కోట్ల క్లబ్బులో చేరింది.సినిమానే జీవితం కాదుఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఫహద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూస్తున్నంతసేపే తనను పట్టించుకోవాలే తప్ప తర్వాత తన గురించి ఆలోచించొద్దన్నాడు. అలాగే సినిమాయే జీవితం కాదని ఉపదేశించాడు. అతడు ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఏదీ అనుకున్న సమయానికి మొదలుపెట్టను.. పూర్తి చేయను. నేను చేసే సినిమాలు కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నవి కాదు. ఎగ్జయిట్గా అనిపిస్తే వెంటనే చేసేస్తానంతే! ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించేందుకు నా వంతు నేను కృషి చేస్తాను.నా గురించి ఆలోచించొద్దువాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్టైన్ అవ్వాలి.. అంతేకానీ తర్వాత నేనేం చేస్తున్నాను? నా లైఫ్ ఎలా ఉంది? అని నాగురించి ఆలోచించకూడదు. థియేటర్ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించండి.. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నన్ను సీరియస్గా తీసుకోకండి. ఖాళీ సమయాల్లోనో లేదా తినేటప్పుడో నటీనటుల గురించి వారి పర్ఫామెన్స్ గురించి జనాలు మాట్లాడుకోవడం నాకస్సలు ఇష్టం ఉండదు.ఇంట్లో ఎందుకు చర్చ?కావాలంటే సినిమా చూసి ఇంటికి తిరిగెళ్లే సమయంలో దాని గురించి డిస్కషన్ చేయండి.. అంతే కానీ ఇంట్లో కూడా దాని గురించే ఎందుకు చర్చ? సినిమాను కూడా ఓ హద్దులో ఉంచాలి. కేవలం మూవీస్ చూడటమే కాకుండా జీవితంలో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని గుర్తుంచుకోండి' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహద్.. పుష్ప 2 సినిమాతో పాటు వేటయ్య, మారీషన్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: మూడో పెళ్లి గురించి ప్రశ్న.. స్టార్ హీరో ఆన్సరిదే..! -
వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
మరో ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది. కుర్రాళ్ల మనసుల్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ నటుడితో ఏడడుగులు వేసింది. హల్దీ, సంగీత్ లాంటి వాటిని గ్రాండ్గా చేసుకున్నారు. పెళ్లి మాత్రం సంప్రదాయ పద్ధతిలో ఓ గుడిలో సింపుల్గా చేసేసుకున్నారు. తాజాగా బుధవారం ఈ పెళ్లి జరగ్గా ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లి కొడుకు ఎవరంటే?(ఇదీ చదవండి: అతని పెళ్లి కోసం కుటుంబంతో సహా వెళ్లిన విజయ్ దేవరకొండ)దళపతి 'బీస్ట్' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా దాస్.. ఆ తర్వాత హీరోయిన్గా ఫేమ్ సంపాదించింది. 'దాదా' అనే తమిళ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది తెలుగులో వచ్చిన 'ఆదికేశవ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళంలోనే హీరోయిన్గా ఓ సినిమా చేస్తోంది.సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. కానీ అపర్ణ దాస్ మాత్రం కేవలం 28 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టేసింది. 'మంజుమ్మల్ బాయ్స్'తో పాటు పలు మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీపక్ పరంబోల్ని అపర్ణ పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు హాజరైన పలువురు నటీనటులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కారు కొన్న 'బిగ్బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Siju Wilson (@siju_wilson) -
అక్కడ స్టార్ హీరోయిన్.. తెలుగులో ఒకే ఒక్క సినిమా!
ఎంత టాలెంట్ ఉన్నా సరే.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో లక్ కలిసొస్తేనే అవకాశాలు, ఆర్భాటాలు.. లేదంటే ఇక్కడ పట్టించుకునే నాధుడే ఉండడు. అయితే గుర్తింపు తెచ్చుకోవడం ఒక సాహసమైతే.. ఆ క్రేజ్ను కాపాడుకోవడం కూడా అంతకుమించిన సాహసం. కొందరికి అన్నీ కలిసొచ్చి స్టార్స్గా వెలిగిపోతుంటారు. అది ఎంతకాలమన్నది వారి చేతుల్లోనే ఉంటుంది. పైన కనిపిస్తున్న నటి ఒకప్పుడు మలయాళంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? అదే తొలి, చివరి సినిమా తన పేరు సంవృత సునీల్. కేరళలో పుట్టిపెరిగిన ఈమె 2004లో రాసికన్ సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఉయిర్ మూవీతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగులో రాజశేఖర్ సరసన 'ఎవడైతే నాకేంటి' సినిమా చేసింది. టాలీవుడ్లో అదే ఆమె తొలి, చివరి సినిమా. మలయాళంలోనే ఎక్కువ మూవీస్ చేసిన ఆమె 2012లో అమెరికాకు చెందిన ఇంజనీర్ అఖిల్ జయరాజ్ను పెళ్లాడింది. వీరికి అగస్త్య, రుద్ర అని ఇద్దరు కుమారులు సంతానం. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంవృత 2019లో ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి గుడ్బై చెప్పింది. 2008లో ఆమె నటించిన కాల్చిలంబు 2021లో రిలీజ్ అవడం విశేషం. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈమె ఆమధ్య బుల్లితెరపై జడ్జిగా కనువిందు చేసింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటోంది. అక్కడే మలయాళీల కొత్త సంవత్సరం విషును సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Samvritha Akhil (@samvrithaakhil) చదవండి: మరో అమ్మాయితో నా భర్త ప్రేమ వ్యవహారం.. ఆ ఏడాది మానసికంగా ఎంతో ఒత్తిడి! -
లేడీ సూపర్స్టార్కు గట్టి పోటీ.. ఆమె దెబ్బకు మాలీవుడ్కు!
ప్రస్తుతం నయనతార మాలీవుడ్ వైపు మళ్లుతున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. లేడీ సూపర్స్టార్గా వెలుగుతున్న నయనతారకు ఇప్పుడిప్పుడే ఆ పేరు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చైన్నె సుందరి త్రిష నుంటి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో త్రిష కోలీవుడ్లో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకోనుందా? ప్రస్తుతం కోలీవుడ్లో గత కొద్దికాలంగా హాట్ టాపిక్ ఇదే. నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇక తమిళంలో ఇటీవల ఈమె నటించిన ఇరైవన్, అన్నపూరణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచాయి. ప్రస్తుతం నవ దర్శకుడు టూయుటూ విక్కీ దర్శకత్వం వహిస్తున్న మన్నాగట్టి, సెంథిల్కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, మాధవన్తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు నయన్కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్నాయి. నటి త్రిష వైపు వెళుతున్నాయని చెప్పక తప్పడం లేదు. ఆ తరువాత తెలుగులోనూ స్టార్ హీరోలైన చిరంజీవి, అల్లుఅర్జున్లతో కలిసి నటించే అవకాశాలను దక్కించుకున్నారు. అంతేకాకుండా మలయాళంలోనూ నటిస్తున్నారు. దీంతో నయనతార కూడా మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తన మాతృభాష అయిన ఈ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందే మమ్ముట్టి, నివిన్బాలీ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. అలా ఈమె మలయాళంలో నటించిన చివరి చిత్రం గోల్డ్. అల్పోన్స్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2022లో విడుదలై పెద్దగా ఆడలేదు. దీంతో కొంతకాలం మాలీవుడ్కు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి డియర్ స్టూడెంట్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో నయనతార టీచర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నటుడు నివిన్ బాలి హీరోగా నటిస్తున్నారు. -
మోలీవుడ్ గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసిన మోలీవుడ్ హీరోలు
-
విలన్ను కాస్తా కమెడియన్ను చేసేశారు!
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మాతృభాషలో హీరోగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్లో మాత్రం విలన్గా నటిస్తున్న ఈయన ఇటీవల తెలుగులో పుష్ప చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన మామన్నన్ చిత్రంలో విలనిజాన్ని పండించారు. అలాగే కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రంలోనూ కీలక పాత్రలో మెప్పించారు. కమెడియన్ను చేసేశారు తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో తన పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ.. వేట్టైయాన్ చిత్రంలో దర్శకుడు జ్ఞానవేల్ తనను కమెడియన్గా మార్చారని చెప్పారు. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ మూవీలో తననే హీరోగా పలువురు భావించారని, అంత ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించిన తనను వేట్టైయాన్ చిత్రంలో కమెడియన్గా చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అప్పుడే ఒప్పుకున్నా రజనీకాంత్ చిత్రంలో కమెడియన్గానా? అని తాను ఆశ్చర్యపోయానని, అయితే అందులో తన పాత్ర గురించి దర్శకుడు వివరించగా ఆ పాత్రలో నటించడానికి అంగీకరించానని ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. కాగా ఈ క్రేజీ చిత్రం అక్టోబర్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిశ్చితార్థం రోజే నటుడి దుర్మరణం! -
పండగ వేళ మేలిముసుగులో కవ్విస్తున్న ఈ భామ ఎవరు?
-
‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ
టైటిల్: మంజుమ్మల్ బాయ్స్ నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు నిర్మాణ సంస్థలు: పరవ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి రచన, దర్శకత్వం: చిదంబరం సంగీతం: సుశీన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ ఎడిటర్: వివేక్ హర్షన్ విడుదల తేది(తెలుగులో): ఏప్రిల్ 6, 2024 కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తే..ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగులో మలయాళ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. గతవారం సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ రిలీజ్ చేశారు. ఇక ఈ వారం అదే జోనర్లో మరో సినిమాను విడుదల చేశారు. అదే మంజుమ్మల్ బాయ్స్. ఇటీవల మలయాళంలో రిలీజై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అదే పేరుతో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా? రివ్యూలో చూద్దాం. ‘మంజుమ్మల్ బాయ్స్’ కథేంటంటే.. ఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్కి వెళ్తారు. అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించి, హిట్ సాధించడంలో మలయాళ ఇండస్ట్రీయే మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఎక్కువగా యథార్థ కథలతోనే సినిమాను తీసి, దాన్ని ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేస్తారు. మంజుమ్మల్ బాయ్స్ కూడా ఓ యథార్థ కథే. 2006లో జరిగిన సంఘటన ఇది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు కోడైకెనాల్ టూర్కి వెళ్తే..అందులో ఒకరు లోయలో పడిపోతాడు. ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ సాహసం చేసి మరీ తమ స్నేహితుడిని రక్షించుకుంటారు. దీన్నే కథగా అల్లుకొని మజ్ముమల్ బాయ్స్ని తెరకెక్కించాడు దర్శకుడు చిదంబరం. కథగా చూసుకుంటే మంజుమ్మల్ బాయ్స్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే తరచు పేపర్లో కనిపించే ఓ చిన్న ఆర్టికల్ అని చెప్పొచ్చు. లోయలో పడిపోయిన తన స్నేహితుడిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతాడు. ఇదే మంజుమ్మల్ బాయ్స్ కథ. ఈ యథార్థ సంఘటనకి దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్ ఉత్కంఠకు గురి చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ లోయలో చిక్కుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల భయం కలిగితే.. మరికొన్ని చోట్ల ‘అయ్యో.. పాపం’ అనిపిస్తుంది. లోయలో పడిపోయిన సుభాష్ పరిస్థితి చుస్తుంటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సుభాష్ని కాపాడడం కోసం తోటి స్నేహితులు చేసే ప్రయత్నం, వారు పడే ఆవేదన గుండెల్నీ పిండేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరించే తీరును కూడా చాలా సహజంగా చూపించారు. కథనం నెమ్మదిగా సాగడం కొంతమేరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ నేపథ్యాన్ని పరిచయం చేస్తు సినిమా ప్రారంభించాడు దర్శకుడు. కొడైకెనాల్ టూర్ ప్లాన్ చేసే వరకు కథంతా సింపుల్గా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కూడా కాకపోవడంతో ఒకనొక దశలో కాస్త బోర్ కొడుతుంది. ఎప్పుడైతే కొడైకెనాల్కి వెళ్తారో అక్కడ నుంచి కథనంలో వేగం పుంజుకుంటుంది. సుభాష్ లోయలో పడిన తర్వాత ఉత్కంఠ పెరుగుతుంది. ఫస్టాఫ్లో కథేమీ లేకున్నా.. మంజుమ్మల్ బాయ్స్ చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ఉత్కంఠను పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్ అంతా ఉత్కంఠ భరితంగా, ఎమోషనల్గా సాగుతుంది. మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సుభాష్, కుట్టన్ పాత్రల స్వభావం ఎలాంటివో ఆ సన్నివేశాల ద్వారా చూపించారు. సుభాష్కి ఇరుగ్గా ఉండే ప్రాంతాలు అంటే చిన్నప్పటి నుంచే చాలా భయం..అలాంటిది దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోతాడు. చిన్నప్పటి సీన్స్ చూపించిన తర్వాత సుభాష్పై మరింత జాలి కలుగుతుంది. ఇలా మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి స్టొరీని సర్వైవల్ డ్రామా లింక్ చేస్తూ చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్లో ఆకట్టుకుంటుంది. కథనం నెమ్మదిగా సాగడం మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తనమదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లు నటించారని చెప్పడం కంటే జీవించారనే చెపొచ్చు. తెరపై వాళ్లను చూస్తుంటే మనకు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే బాగుండనిపిస్తుంది. వాళ్లు చేసే అల్లరి పనులు అందరికి కనెక్ట్ అవుతుంది. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాషి పోషించిన పాత్రలు గుర్తిండిపోతాయి. టెక్నికల్గా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. గుణ కేవ్స్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. వాటిని షైజు ఖలీద్ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కాస్త ఓపికతో చూస్తే ఈ సర్వైవల్ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Kalyani Priyadarshan Unseen Photos: క్యూట్గా కవ్వించే ఈ హీరోయిన్ ఎవరో తెలుసా...! (ఫోటోలు)
-
మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం
హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) అనారోగ్యంతో గురువారం (ఏప్రిల్ 4న) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో మీరా జాస్మిన్ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. జోసెఫ్ ఫిలిప్ భార్య పేరు ఎలియమ్మ. వీరికి సారా, జేని, జార్జ్, జాయ్, మీరా అని ఐదుగురు సంతానం. మీరా జాస్మిన్ అందరిలో కంటే చిన్నది. రీఎంట్రీ మీరా జాస్మిన్.. సూత్రధారన్ అనే మలయాళ చిత్రంలో కెరీర్ ఆరంభించింది. రన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పందెం కోడి, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా అనేక సినిమాలు చేసింది. 2014లో దుబాయ్ ఇంజనీర్ అనిల్ జాన్ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించేసిన మీరా.. గతేడాది విమానం చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: రౌడీ హీరో కామెంట్స్పై ట్రోలింగ్.. నచ్చితే చూడు, లేదంటే మానేయ్ అన్న నిర్మాత -
Aishwarya Lekshmi: చీరలో ఐశ్వర్య లక్ష్మి.. సోయగాలు (ఫొటోలు)
-
రెండో భర్తకు విడాకులిచ్చిన నటి
ప్రముఖ మలయాళ నటి మంజు పిళ్లై విడాకులు తీసుకుంది. 24 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్కు విడాకులిచ్చింది. ఈ విషయాన్ని వాసుదేవ్ స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. '2020వ సంవత్సరం నుంచి మంజు, నేను విడివిడిగానే జీవిస్తున్నాం. విడాకుల ప్రక్రియ పూర్తయింది. తను ఇప్పుడు నాకు భార్య కాదు. అయితే మా మధ్య స్నేహం మాత్రం కొనసాగుతుంది. తనను నా స్నేహితురాలిగానే భావిస్తాను. ప్రస్తుతం మంజు కెరీర్ గొప్ప స్థాయిలో ఉంది. క్లోజ్ ఫ్రెండ్ సక్సెస్ అవుతుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది' అని చెప్పుకొచ్చాడు. ఇది రెండోసారి కాగా మంజు గతంలో నటుడు ముకుందన్ మీనన్ను పెళ్లాడింది. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. తర్వాత 2000వ సంవత్సరంలో మంజు.. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా దయ అనే కూతురు పుట్టింది. గత కొంతకాలంగా వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తుండగా ఇన్నాళ్లకు అవి నిజమేనని ధ్రువీకరించాడు వాసుదేవ్. కెరీర్ సాగిందిలా 1992లో నట ప్రస్థానం ఆరభించింది మంజు పిళ్లై. గోలంతర వార్త, నీ వరువోళం, ఆయుష్మాన్ భవ, నింజగల్ సంతుస్తరను, మిస్టర్ బట్లర్, రావణప్రభు, తేజ్ భాయ్ అండ్ ఫ్యామిలీ, లవ్ 24x7, ఓ మై డార్లింగ్, ద టీచర్, జయ జయ జయ జయహే తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. తమిళంలోనూ రెండు చిత్రాలు చేసింది. వాసుదేవ్ విషయానికి వస్తే కేరళ కేఫ్ చిత్రంతో సినిమాటోగ్రాఫర్గా ప్రయాణం మొదలుపెట్టాడు. అయాల్, మెమొరీస్, దృశ్యం, అమర్ అక్బర్ ఆంటోని, అనార్కలీ వంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు. తెలుగులో మిస్ ఇండియా, ఖిలాడీ, బ్రో, ద వారియర్ సినిమాలకు పని చేశాడు. చదవండి: OTT: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
ఐశ్వర్య లక్ష్మి.. కిర్రాక్ లుక్స్.. (ఫోటోలు)
-
సింగర్ సుజాత మోహన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
దూత నటి హోంటూర్.. వాటికి తనే తల్లినంటూ..
పార్వతి తిరువోతు.. మలయాళీ ముద్దుగుమ్మ. ఔట్ ఆఫ్ సిలబస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కేవలం మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. బెంగళూరు డేస్, చార్లీ, ఎన్ను నింటె మొయిదీన్, టేకాఫ్ వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇంట్లోనే మామిడి, నిమ్మ.. గతేడాది రిలీజైన దూత అనే వెబ్ సిరీస్తో తెలుగువారికి పరిచయమైంది. తాజాగా ఆమె తన హోంటూర్ చేసింది. 'నా ఇంట్లో మామిడి చెట్టు ఉంది. నిమ్మకాయ చెట్టు కూడా ఉంది. ఆ చెట్ల నుంచి ఫలాలు తెంపుకుని వాటినే సలాడ్లో వాడుతూ ఉంటాను. ఇది చూసి జనాలు షాక్ అవుతూ ఉంటారు. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈ ఇల్లు నన్ను హత్తుకున్నట్లుగా అనిపిస్తుంది. పడేయడం నచ్చదు నాకంటూ ఓ లైబ్రరీ కూడా ఉంది. నటిగా నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలీదు కాబట్టి ఇంట్లో అన్ని వస్తువులు తెచ్చి నింపేసుకోను. వస్తువులు పాతగైపోగానే పడేయడం ఇష్టముండదు. 19 ఏళ్లుగా ఓ చిన్న మొక్క కూడా నాతోనే ఉంది. దాదాపు 36 మొక్కలకు నేను తల్లినైపోయాను. ఈ బాల్కనీలో ఉండటం ఎంతో ఇష్టం' అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు హీరోయిన్ తన బాల్కనీని పచ్చదనంతో నింపేసింది, పెద్దగా సామాన్లు లేకుండా చాలా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by ArchPro (@arch.kerala) చదవండి: 'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్ చేసిన మరాఠీ బ్యూటీ -
గొంతు పోగొట్టుకున్న నటి.. మాట్లాడలేని స్థితిలో!
మలయాళ నటి, క్లాసికల్ డ్యాన్సర్ తారా కల్యాణ్ స్పాస్మోడిక్ డిస్ఫోనియా అనే గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీని వల్ల ఆమె మాట్లాడలేకపోతోంది. బలం కూడదీసుకుని ఒక్క పదం పలకాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటోందట! తాత్కాలికంగా ఆమె గొంతును కోల్పోయిందని తారా కల్యాణ్ కూతురు సౌభాగ్య వెంకటేశ్ వెల్లడించింది. తన యూట్యూబ్ ఛానల్లో తల్లి సమస్యను బయటపెట్టింది. 'రెండేళ్ల క్రితం అమ్మకు థైరాయిడ్ సంబంధిత సర్జరీ జరిగింది. దాని వల్లే ఇప్పుడు గొంతు పోయిందనుకున్నాం. పైగా చాలా ఏళ్లుగా తన వాయిస్ను ఉపయోగించే డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తూ ఉంటుంది. ఎక్కువగా గొంతును ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చనుకున్నాం. కానీ స్పాస్మోడిక్ డిస్ఫోనియా అనే వ్యాధి వచ్చిందని, దానివల్లే గొంతు మూగబోయిందని తెలిసింది. బొటాక్స్ చేయిస్తే అమ్మ కోలుకుంటుందన్నారు. ఆ సర్జరీ చేసే సమయంలోనే అమ్మమ్మ(తారా తల్లి) చనిపోయింది. వైద్యులు తనను పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ అమ్మమ్మ చనిపోయిన బాధ ఒకవైపు అమ్మను కుంగదీస్తోంది. ప్రస్తుతం మంచినీళ్లు తాగడానికి కూడా అమ్మ ఇబ్బందిపడుతోంది. తగిన విశ్రాంతి తీసుకుంటే వీలైనంత త్వరగానే అమ్మ ఎప్పటిలా మాట్లాడగలదు' అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Thara Kalyan (@tharakalyan) చదవండి: హీరోయిన్ నయా బిజినెస్! వాడిపడేసిన చీరలు అమ్మకానికి.. -
పాత చీరలు అమ్ముతున్న హీరోయిన్.. ఒక్కోటి వేలల్లోనే!
నవ్య నాయర్.. ఈమె ఒక మలయాళ హీరోయిన్. చిన్నప్పుడే డ్యాన్స్ నేర్చుకుంది. క్లాసికల్ డ్యాన్స్లో శిక్షణ తీసుకుంది. ఈమె అసలు పేరు ధన్య వీణ. కానీ స్క్రీన్పై ఆ పేరు బాగోదని నవ్య నాయర్గా మార్చుకుంది. 2001లో ఇష్టం సినిమాతో హీరోయిన్గా మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమా సక్సెస్ కావడంతో ఆఫర్లు క్యూ కట్టాయి. నచ్చిందల్లా చేసుకుంటూ పోయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. అలా తమిళ, కన్నడ భాషల్లోనూ చిత్రాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె రెండేళ్ల క్రితమే రీఎంట్రీ ఇచ్చింది. వాడిన చీరలు అమ్మకానికి.. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క మాతంగి స్కూల్ పేరిట క్లాసికల్ డ్యాన్స్లో శిక్షణ ఇస్తోంది నవ్య. తాజాగా మరో బిజినెస్ మొదలుపెట్టింది. తన చీరలను అమ్మేందుకు ప్రీలవ్డ్ బై నవ్యనాయర్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచింది. ఇందులో కట్టుకుని వదిలేసిన చీరలను అమ్మకానికి పెట్టింది. కాంచీపురం, బనారస్ సహా అనేక రకాల చీరలు ఇందులో అమ్మకానికి ఉన్నాయి. రూ.2,500 నుంచి రూ.5000 పై చిలుకు ఖరీదైన చీరలున్నాయి. డెలివరీ చార్జీలు అదనం! ఒక్కో చీర ఖరీదు.. ప్రస్తుతానికైతే ఆరు చీరల ఫోటోలు అప్లోడ్ చేశారు. అందులో ఒక చీర ఖరీదు రూ.2500 కాగా బ్లౌజ్ కూడా కావాలంటే రూ.5000 చెల్లించాలని చెప్తున్నారు. షిప్పింగ్ చార్జీలు అదనమని రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు నటిపై సెటైర్లు వేస్తున్నారు. ఇంత రేటు పెట్టి పాత చీర కొనాలా? అయినా పేదవారికి ఫ్రీగా ఇవ్వొచ్చుగా.. ఇక్కడ కూడా డబ్బులు సంపాదించాలనే తాపత్రయమేనా? అని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Pre-Loved By Navya Nair (@prelovedbynavyanair) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) చదవండి: సూర్యను ఇచ్చేయమన్న వీరాభిమాని.. జ్యోతిక ఏమందంటే? అమ్మ నాగబాబు.. ఇంత కడుపు మంట? -
ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్.. పారితోషికం పెంచేసిన బ్యూటీ!
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఈ తరం తారలు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. మలయాళ భామ మమితా బైజు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది. 2017లో నటిగా రంగప్రవేశం చేయగా.. ఈమె నటించిన కోకో, సూపర్ శరణ్య వంటి మలయాళ చిత్రాలు విజయం సాధించాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన ప్రేమలు మూవీ మలయాళంలోనే కాకుండా, తమిళం, తెలుగు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఆ సినిమా నుంచి అవుట్ కాగా ఆ మధ్య బాలా దర్శకత్వంలో సూర్యకు జంటగా వణంగాన్ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యింది. అయితే అనివార్య కారణాల వల్ల సూర్య ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తర్వాత మమితా బైజు కూడా ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది. దర్శకుడు బాలా తనను కొట్టారని, చాలా సార్లు తిట్టారని ఆరోపణలు చేసింది. ఈ సంఘటన కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇది తన కెరీర్పై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని భయపడిందో ఏమోకానీ వెంటనే మాట మార్చేసింది. దర్శకుడు బాలా ఎప్పుడూ కొట్టలేదని, ఆయన దర్శకత్వంలో నటించిన సమయంలో చాలా నేర్చుకున్నానని, ఇతర చిత్రాల కారణంగా వణంగాన్ చిత్రం నుంచి తప్పుకోవలసి వచ్చిందని కవర్ చేసింది. క్రేజీ హీరోయిన్గా.. ప్రస్తుతం ఈమె జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా రెబల్ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అవుతోంది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శుక్రవారం తెరపైకి రానుంది. తదుపరి నటుడు విష్ణువిశాల్కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రేమలు మూవీ తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. దీంతో మమితా బైజు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా మారనున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకుంటోంది బ్యూటీ. మరిన్ని అవకాశాలు వస్తుండటంతో ఈ అమ్మడు తన పారితోషికాన్ని పెంచేసినట్లు టాక్. ఇప్పటివరకు ఒక్క సినిమాకు రూ. 30 లక్షలు పుచ్చుకుందట. దాన్ని కాస్తా రూ.50 లక్షలు చేసిందని ప్రచారం నడుస్తోంది. చదవండి: తమన్నా..పెళ్లెప్పుడో? -
స్కూటీపై వెళ్తుండగా యాక్సిడెంట్.. ఐసీయూలో హీరోయిన్..
హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్పై హీరోయిన్ ఈ విషయాన్ని నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 'అరుంధతి వెంటిలేటర్పై పోరాడుతోంది. ఆమె కుటుంబానికి ఆస్పత్రి ఖర్చులు భరించే స్థోమత లేదు. మా వంతు మేము సాయం చేశాం. కానీ అది సరిపోవడం లేదు. మీరు కూడా తోచినంత సాయం చేస్తే అది ఆమె మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది. కెరీర్.. కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఒట్టకోరు కాముకన్ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్ థింక్ అనే వెబ్ సిరీస్ల్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Gopika Anil (@gops_gopikaanil) చదవండి: ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఏవి ఎందులో అంటే? -
స్కూల్లో హేళనలు.. అన్నింటినీ అధిగమించి నటిగా!
కనీ కుశ్రుతి.. మలయాళ నటి. కానీ వెబ్ సిరీస్ల వల్ల దేశవ్యాప్తంగా వెండితెర, వెబ్తెర అభిమానులకు పరిచయమైంది. నటనలోనే కాదు అసలు ఆమె పెరిగిన విధానంలోనే ప్రత్యేకత ఉంది. కనీ కుశ్రుతి సొంతూరు తిరువనంతపురం. తల్లిదండ్రులు.. జయశ్రీ ఏకే, మైత్రేయ మైత్రేయన్. ఇద్దరూ హేతువాదులు, సామాజిక కార్యకర్తలు. కులాన్ని సూచించే ఇంటిపేరును తొలగించుకున్నారు. ఇంటి పేరు లేదు తమ కూతురుకీ ఇంటిపేరునివ్వలేదు. ఈ పెంపకం బయట సమాజానికి చిత్రంగా ఉండటంతో స్కూల్లో.. తోటి వాళ్ల మధ్య ఎన్నో హేళనలకు గురైంది కనీ. అయినా తమ తీరును మార్చుకోలేదు ఆమె తల్లిదండ్రులు. ఏటికి ఎదురీదే ధైర్యాన్ని నూరిపోశారు కూతురికి. అమ్మానాన్న పెట్టిన తొలిపేరే అసలు పేరని.. కులాన్ని సూచించే తోక పేరు అవసరంలేదని చెప్పి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద కనీకి చిన్నప్పుడే అవగాహన కల్పించారు. కానీ టెన్త్ క్లాస్లో చివరి పేరు కచ్చితంగా కావాల్సి వచ్చింది కనీకి. అప్పుడు తెలుసుకుంది ఆమె తమ చివరిపేరు కుశ్రుతి(ఆకతాయి, అల్లరచిల్లర అని తెలుగు అర్థం) అని! సర్కారు బడిలో కాన్వెంట్ స్కూల్కి పంపే ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ కనీ తల్లిదండ్రులు ఆమెను సర్కారు బడిలోనే చదివించారు. స్కూల్లో ఉన్నప్పుడు వర్క్షాప్ కోసం ఒక మోడర్న్ స్కూల్కి వెళ్లిందట కనీ. ఆ స్కూల్.. అందులోని క్లాస్ రూమ్స్ చూసి ఆశ్చర్యపోయిందట. ఆ స్కూల్తో తమ బడిని పోల్చుకుని ‘నన్నెందుకు అలాంటి స్కూల్లో చేర్పించలేదు’ అని అమ్మానాన్నలను అడిగిందట. ‘సామాన్యులు సర్కారు బడికే వెళ్తారు. నువ్వూ సామాన్యురాలివే. ఇక్కడి నుంచే ప్రపంచాన్ని చదవాలి’ అని చెప్పారట. అన్నట్టుగానే ఆ బడి తనకు ప్రపంచాన్ని చూడ్డం నేర్పింది అంటుంది కనీ. పారిస్లో థియేటర్ ఆర్ట్స్ చదివింది. వేధింపుల వల్ల సినిమాలకు దూరం! 2000 సంవత్సరంలో అభినయ థియేటర్ రీసెర్చ్ సెంటర్లో చేరి.. 2006 వరకు ఆ గ్రూప్తోనే ఉంది. ఆమె ప్రతిభకు ముచ్చటపడిన మలయాళ ఫిలిం ఇండస్ట్రీ .. ‘మనుష్యపుత్రి’ మూవీతో ఆమెకు వెల్కమ్ చెప్పింది. ఆ తర్వాత ‘కేరళ కేఫ్’ లోనూ నటించింది. గుర్తింపు వచ్చింది మాత్రం ‘బిర్యానీ’ చిత్రంతోనే. అయితే సినీపరిశ్రమలో తనకెదురైన లైంగిక వేధింపులను భరించలేక ఒకానొక దశలో సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుని కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. మంచి పాత్రలు రావడంతో మళ్లీ సినిమాలు చేస్తోంది. చదవండి: రెండు ఓటీటీల్లో హనుమాన్.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో! -
21 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. నాన్నకు ఇప్పటికీ కోపమే!
మొదట్లో బిగ్బాస్ షోలో కేవలం సెలబ్రిటీలే ఎక్కువగా కనిపించేవారు. సీరియల్, సినిమా, మోడలింగ్కు చెందినవారినే ఎక్కువగా తీసుకువచ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న జనాలకు సైతం బిగ్బాస్ ఆఫర్ ఇస్తున్నారు. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నోరా ముస్కాన్ మలయాళ బిగ్బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. తాజాగా ఆమె హౌస్లో తన కష్టాలను ఏకరువు పెట్టింది. వేరేవేరే పేర్లతో.. 'నా అసలు పేరు సైబాల్ సదత్. పొన్నుస్ అనే నిక్నేమ్తో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాను. కానీ అదేం పేరని మా ఫ్రెండ్ ఏడిపించడటంతో నోరాగా మార్చుకున్నాను. నా అసలు పేరు వాడితే ఎక్కడ మా పేరెంట్స్కు తెలిసి పెద్ద గొడవ అవుతుందోననే ఇలా పేరు మార్చుకున్నాను. నాకు 21 ఏళ్ల వయసులోనే పెళ్లయింది. కానీ మా బంధం వర్కవుట్ కాకపోవడంతో విడాకులు అడిగాను. నేను విడాకులు తీసుకోవడం నా తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు. నా భర్త కూడా విడాకుల ప్రక్రియ మరింత ఆలస్యం కావాలనే చూశాడు. విడాకులు తీసుకుంటే తప్పా? ఎందుకని అందరూ డివోర్స్ను పెద్ద తప్పులా చూస్తారు? ఇద్దరు మనుషులు కలిసుండలేనప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవాలనుకోవడంలో తప్పేముందో అర్థం కాదు. పైగా ఇక్కడ కూడా తప్పంతా అమ్మాయిదే అన్నట్లు మాట్లాడతారు. ఇక నాకు ఎప్పుడైతే విడాకులు మంజూరయ్యాయో అప్పుడే నేను స్వతంత్రంగా, నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నాను. అలా సోషల్ మీడియాను ఉపయోగించి ఇన్ఫ్లూయెన్సర్గా ఎదిగాను. దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కూడా కొన్నాను. మా నాన్న పట్టించుకోవట్లే కానీ మా నాన్నకు ఇదంతా ఇష్టం లేదు. ఇలా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం తనకు ఏమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు నా ఇంటివైపే రాలేదు. ఈ మూడేళ్లలో మా నాన్నను కలిసిందే లేదు. ఏదేమైనా నేను వాళ్లను నిందించడం లేదు. వాళ్ల ఆలోచనా విధానం వేరు. కానీ ఎవరూ నా ప్రయాణాన్ని ఆపలేరు' అని చెప్తూ ఎమోషనలైంది సైబాల్. చదవండి: చాలా సింపుల్గా స్టూడియోలో కూతురి పెళ్లి చేసిన వెంకటేశ్.. ఫోటోలు వైరల్ -
100 కోట్ల కలెక్షన్ సూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీ సంస్థ కొనట్లేదు!
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ సంస్థల లెక్కలు మారిపోయాయి. అప్పట్లో ఎగబడిపోవట్లేదు. కోట్లు పెట్టి సినిమాలు కొనేసి చేతులు కాల్చుకోవట్లేదు. ఇప్పుడు దీని వల్ల కొన్ని హిట్ చిత్రాలకు కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయి. కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చిన మలయాళ చిత్రం 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ దీని ఓటీటీ లెక్క మాత్రం ఇంకా తెగట్లేదట. ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర 'హనుమాన్' రచ్చ లేపింది. ఫిబ్రవరిలో మాత్రం టాలీవుడ్ సౌండ్ పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు ఇదే ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్నాయి. వీటిలో ఒకటే 'మంజుమ్మల్ బాయ్స్'. కేరళలోని మంజమ్మల్ అనే ఊరిలోని కొందరు కుర్రాళ్లు.. కొడైకెనల్ ట్రిప్కి వెళ్తారు. ఇందులో ఒకడు అనుకోకుండా ఓ గుహలో పడిపోతాడు. మిగతా వాళ్లందరూ కలిసి ఈ ఒక్కడిని ఎలా కాపాడారు ఏంటనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) స్టోరీ సింపుల్గా అనిపిస్తున్నప్పటికీ.. సర్వైవల్ డ్రామా సినిమాగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంంటోంది. కేరళ, తమిళనాడులో దీనికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ వసూళ్లు, ఓవరాల్గా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఓటీటీ డీల్ మాత్రం ఇంకా తెగలేదట. మూవీ టీమ్ ఏమో రూ.20 కోట్ల వరకు అడుగుతుంటే.. పలు ఓటీటీ సంస్థలు మాత్రం రూ.10 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే థియేటర్లలో 'మంజుమ్మల్ బాయ్స్'ని చాలామంది చూసేశారు. కాబట్టి ఓటీటీలో ఓ మాదిరి రీచ్ ఉంటుందని ఆయా సంస్థలు కారణాన్ని చెబుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాని తెలుగులో మార్చి 15న రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ సౌండ్ పెద్దగా లేదు. తెలుగు డబ్బింగ్ విడుదలపై, అలానే ఓటీటీ స్ట్రీమింగ్పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) -
పెళ్లిచూపులు హీరోయిన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు..
-
ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. నడవలేని స్థితిలో నటుడు..
మలయాళ సీరియల్ నటుడు కార్తీక్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది. వారం రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. గత వారం మౌనరాగం సీరియల్ షూటింగ్ ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ(కేఎస్ఆర్టీసీ) బస్సు ఆయనను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిపోయిన ఆయనను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. తలకు, కాలికి బలమైన గాయాలు తగిలినట్లు వైద్యులు గుర్తించారు. తాజాగా నటి బీనా ఆంటోని.. కార్తీక్ హెల్త్ అప్డేట్ వెల్లడించింది. 'కార్తీక్ పరిస్థితి ఎలా ఉందని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. నిజంగా తన పరిస్థితి ఏమీ అంత బాగోలేదు. నడవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. రెండు కాళ్ల చర్మం ఊడిపోయింది. అక్కడ మాంసం ముద్ద కూడా లేదట! ఇప్పటికే రెండు, మూడు ప్లాస్టిక్ సర్జరీలు చేశారు. ఇంకా చేయాలంటున్నారు. కార్తీక్తో మాట్లాడలేదు కానీ అతడి భార్యతో మాట్లాడాను. భరించలేనంత నొప్పి ఉండటంతో పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారట!' అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. -
డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్
మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది ప్రేమలు మూవీ. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రేమలు చిత్రంలో హీరోయిన్గా నటించింది మమిత బైజు. ఈ మూవీ కంటే ముందు వణంగాన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనను దూషించడంతో పాటు కొట్టాడని వెల్లడించింది హీరోయిన్. ఎక్స్పర్ట్లా యాక్ట్ చేయాలి.. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమిత బైజు మాట్లాడుతూ.. వణంగాన్ మూవీలో ఓ సంగీతపరికరాన్ని వాయించే సన్నివేశం ఉంటుంది. నేను అప్పటికే ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్ చేయాలా? అని అడిగాను. డైరెక్టర్ బాలా.. అనుభవం ఉన్న కళాకారిణిగా నటించమన్నాడు. అప్పుడు నేను డ్రమ్స్ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిగా పాట పాడాలి అంతేగా అనుకున్నాను. కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు.. కానీ ఇంతలో ఆయన నన్ను ఆపి నా వెనకాల ఉన్న అమ్మాయిని చూపించి అలా చేయమన్నాడు. ఇంతలోనే రెడీ అన్నాడు. నేను షాకయ్యాను. ఎందుకంటే వాళ్లు ఏం పాడుతున్నారో నాకసలు అర్థం కావట్లేదు. మూడు టేకులయ్యాయి. మధ్యలో కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు. అయితే సెట్లో ఎప్పుడైనా కోప్పడతానని, దాన్ని సీరియస్గా తీసుకోవద్దని నాకు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి నేను దానికి మానసికంగా రెడీ అయ్యే సెట్లోకి వచ్చాను. కానీ ఆయన దూషణతో ఆగిపోలేదు, కొట్టాడు కూడా! తిట్టడమే కాదు కొట్టాడు కూడా! హీరో సూర్య సర్కు ఇదంతా తెలుసు. వారు ఎంతోకాలంగా కలిసి పని చేస్తున్నారు. వారి మధ్య ఆ అనుబంధం ఉంది. కానీ నాకిదంతా కొత్త కదా' అని చెప్పుకొచ్చింది. కాగా వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
వరుస బ్లాక్ బస్టర్స్ తో దుమ్మురేపుతున్నారు..!
-
కాసేపట్లో డెలివరీ.. డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లిన నటి
ప్రెగ్నెన్సీ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే కాలు తీసి అడుగు ముందుకువేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. మరికొందరేమో వ్యాయామాలు, రన్నింగ్లు చేస్తూ సర్ప్రజ్ చేస్తుంటారు. తాజాగా మలయాళ బుల్లితెర నటి లక్ష్మి ప్రమోద్ కూడా ఇలాంటి పనే చేసింది. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో లేబర్ రూమ్కు వెళ్లేముందు చిందులేసింది. నిండు గర్భిణి అన్న విషయాన్ని మర్చిపోయి హాయిగా డ్యాన్స్ చేసింది. దీన్ని ఆమె భర్త అజర్ మహ్మద్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను నటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. లేబర్ రూమ్కు వెళ్లేముందు ఒక రీల్ చేస్తే బాగుంటుందనిపించింది. అయినా డ్యాన్స్ చేసుకుంటూ లేబర్ రూమ్కు వెళ్తావా? అని అడిగారుగా.. వారికోసమే ఈ వీడియో అని రాసుకొచ్చింది. ఇది చూసిన కొందరు డెలివరీ తర్వాత కూడా ఇలాగే డ్యాన్స్ చేయ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తర్వాత నటికి పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Lekshmi Pramod (@laxmi_azar) చదవండి: ఆ సినిమా 14 సార్లు చూశా.. డైలాగ్ చెప్తూ తడబడ్డ నందమూరి హీరో! -
గ్రాండ్గా దివంగత సింగర్ కూతురి పెళ్లి
దివంగత మలయాళ టాప్ సింగర్ రాధిక తిలక్ కూతురు దేవిక సురేశ్ పెళ్లిపీటలెక్కింది. అడ్వకేట్ అరవిందన్ సుచింద్రన్ను పెళ్లాడింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో బెంగళూరులో ఫిబ్రవరి 19న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో రాధిక కజిన్, సింగర్ సుజాత మోహన్ తన కుటుంబంతో కలిసి సందడి చేసింది. దేవిక పెళ్లి ఫోటోలసు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కొత్త జంటను ఆశీర్వదించమని అభిమానులను కోరింది. ఫిబ్రవరి 25న కొచ్చిలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనునట్లు వధువు తండ్రి సురేశ్ వెల్లడించాడు. కాగా రాధిక తన అద్భుత గాత్రంతో దాదాపు 70 పాటలు పాడింది. సినిమా పాటలే కాకుండా 200 భక్తిగీతాలు ఆలపించింది. టీవీ యాంకర్గానూ రాణించింది. కానీ క్యాన్సర్ మహమ్మారి ఆమెను బలి తీసుకుంది. 45 ఏళ్ల వయసులో క్యాన్స్తో పోరాడుతూ కన్నుమూసింది. 2015లో ఆమె మరణించినా త గొంతు మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. తల్లి బాటలోనే కూతురు కూడా పాటలు పాడుతూ ఆ వీడియోలను నెట్టింట అప్లోడ్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Sujatha Mohan (@sujathamohanofficial) చదవండి: షణ్ముఖ్ కేసులో జరిగింది ఇదే.. అరెస్ట్కు అసలు కారణం చెప్పిన దిలీప్ సుంకర -
సీరియల్ హీరోయిన్తో పెళ్లి.. విడాకులిచ్చిన విలన్
ప్రేమ-పెళ్లి-విడాకులు సర్వసాధారణమైపోయాయి. జీవితకాలం ప్రేమించడం, కలిసుండటం కష్టమే అని చేతులెత్తేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మలయాళ సెలబ్రిటీ జంట జిషిన్ మోహన్- వరద వచ్చి చేరింది. వీరు విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా మాలీవుడ్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇది నిజమేనని ధ్రువీకరించాడు జిషిన్. తాము విడిపోయామని వెల్లడించాడు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అంత టైం లేదు తాను ఓ సీరియల్ నటిని పెళ్లాడినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నాడు. దేవుడి దయ వల్ల సీరియల్స్తో బిజీగా ఉన్నాను. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేంత సమయం లేదు అని చెప్పుకొచ్చాడు. రీల్ లైఫ్లో హీరోయిన్- విలన్గా ఉన్న వీరు రియల్ లైఫ్లో మాత్ం జోడీ కట్టారని సంతోషించేలోపే ఇలా జరిగిందేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏడుస్తూ ఉండనక్కర్లే! తాజాగా వరద సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ పెట్టింది. 'నిన్న నవ్వాను, ఈ రోజు నవ్వుతూనే ఉన్నాను. రేపు కూడా నవ్వులు చిందిస్తూనే ఉంటాను. జీవితం చాలా చిన్నది. ఏడుస్తూ గడపడం కాదు జీవితమంటే..!' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. మీ ఇద్దరి మధ్య ఏమైంది? ఎందుకని విడిపోయారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అమల అనే సీరియల్లో వరద హీరోయిన్గా, జిషిన్ విలన్గా నటించాడు. ఆ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2014లో పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు విడాకులు తీసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చదవండి: కథ వినలేదు, జోక్యం చేసుకోలేదు.. ఫ్రెండ్ కోసం ఫ్రీగా.. అదీ అతడి గొప్పతనం! -
ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఎందరో ఇంట్ల పెళ్లి బాజాలు మోగనున్నాయి. సెలబ్రిటీలు కూడా బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెడుతూ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు, రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ రెడ్డి వాలంటైన్స్ డే రోజే పెళ్లి చేసుకోగా రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 21న ప్రియుడితో మెడలో మూడు ముళ్లు వేయించుకోనుంది. నిశ్చితార్థం అయిన ఏడాదిన్నరకు పెళ్లి తాజాగా మరో బ్యూటీ ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. నారాయణ అండ్ కో సినిమా హీరోయిన్ ఆరతి త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 26న వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలిపింది. కాగా ఈ జంట గతేడాది ఫిబ్రవరి 16న నిశ్చితార్థం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజు తమ పెళ్లి తేదీని వెల్లడించడం విశేషం. అప్పటినుంచే లవ్.. మోడల్, నటి ఆరతి.. మలయాళ బిగ్బాస్ కంటెస్టెంట్ డాక్టర్ రాబిన్ రాధాకృష్ణన్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన రాధాకృష్ణన్ను ఇంటర్వ్యూ చేసింది ఆరతి. అప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆరతి హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. View this post on Instagram A post shared by Dr Robin Radhakrishnan (@dr.robin_radhakrishnan) చదవండి: విశ్వక్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకు నాగచైతన్య హీరోగా.. -
హీరోయిన్తో స్టార్ హీరో పెళ్లి?
మలయాళంలోని హ్యాండ్సమ్ హీరోల్లో ఉన్ని ముకుందన్ ఒకరు. జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి, యశోద సినిమాలతో తెలుగువారికీ ఈయన సుపరిచితుడయ్యాడు. 36 ఏళ్ల వయసున్న ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న అనుశ్రీతో కొత్త జీవితం ఆరంభించబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు ఓ ఈవెంట్లోనూ కలిసి కనిపించడంతో ఇది నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ వార్తలపై ఉన్నిముకుందన్ స్పందించాడు. తన పెళ్లి గురించి తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన వ్యక్తిని ఉద్దేశిస్తూ.. 'ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకుండా ఆపడానికి నీకెంత డబ్బివ్వాలో చెప్పు..' అని మండిపడ్డాడు. దీంతో హీరోహీరోయిన్ల పెళ్లంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. చదవండి: మొదటి భార్యకు అందుకే విడాకులు.. ఆమె రెండో భర్త నా కొడుకును.. -
రెండోసారి ఆడపిల్ల.. సంతోషంలో నటి.. ఘనంగా ఫంక్షన్
పర్ల్ మానే.. మొదట్లో పాటల ప్రోగ్రామ్కు, తర్వాత వంట ప్రోగ్రామ్, డ్యాన్స్ షో.. ఇలా దాదాపు అన్ని రకాల కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరించింది. యాంకర్గా వచ్చిన గుర్తింపుతో సినిమా ఛాన్సులూ అందుకుంది. సహాయ నటిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ మలయాళ బిగ్బాస్ షోలోనూ పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. ఈమె తెలుగులో ఓ సినిమాలో నటించింది. నాగశౌర్య 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో వైదేహి అనే పాత్రలో యాక్ట్ చేసింది. బిగ్బాస్ షోలో లవ్ ఇకపోతే ఈమె బిగ్బాస్ షోలో బుల్లితెర నటుడు శ్రీనిష్ అరవింద్తో లవ్లో పడింది. షో అయిపోగానే పెళ్లి కూడా చేసుకున్నారు. 2019లో పెళ్లి పీటలెక్కగా 2021లో నీల అనే కూతురు జన్మించింది. ఈ ఏడాది జనవరి 13న మరోసారి కూతురు పుట్టింది. తాజాగా ఈ పాపకు నామకరణం చేశారు. రెండో కూతురికి 'నితారా శ్రీనిష్' అన్న పేరు ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. పాప పుట్టి 28 రోజులు.. 'నితారా శ్రీనిష్ జన్మించి 28 రోజులవుతోంది. ఇది తన బారసాల. మా మనసులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి. మీ ఆశీర్వాదాలు కావాలి..' అంటూ ఫ్యామిలీ ఫోటోలను పర్ల్ మానే, శ్రీనిష్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ కుటుంబం చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pearle Maaney (@pearlemaany) View this post on Instagram A post shared by Pearle Maaney (@pearlemaany) చదవండి: 'దేవర'లో ఎన్జీఆర్కు జోడీగా శ్రుతి మరాఠే.. ఇన్స్టాలో వెరీ పాపులర్ -
కెమెరామ్యాన్తో ప్రేమలో పడిన రవితేజ హీరోయిన్?
హీరోయిన్లు ఈ మధ్య కాలంలో వరసగా పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే నిశ్చితార్థం కానిస్తున్నారు. మరికొందరైతే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని పరోక్షంగా బయటపెడుతున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ అలానే ప్రియుడ్ని పరిచయం చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈమె రిలేషన్లో ఉన్నది కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఇంతకీ ఎవరీ హీరోయిన్? ఏంటా ప్రేమకథ? (ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?) మలయాళ నటి రజిషా విజయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్త తెలుసు. ఎందుకంటే ఓటీటీ సినిమాల కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో ఓ హీరోయిన్గా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఫ్లాప్ కావడంతో ఈమెకు ఇక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. ప్రస్తుతానికైతే సొంత భాషతో పాటు తమిళంలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. రజిషా విజయన్ ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నేరుగా బయటపెట్టనప్పటికీ టోబిన్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వీళ్ల ప్రేమ నిజమేనేమో అనిపిస్తోంది. రజిషాతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన టోబిన్.. 1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ, సంతోషం.. ఇద్దరి అల్లరిని భరిస్తూ.. మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం అని రాసుకొచ్చాడు. టోబిన్ పోస్టుకు రజిషా రిప్లై కూడా ఇచ్చింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) View this post on Instagram A post shared by Tobin Thomas (@tobin_thomas7) -
మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్
మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలుసు. సొంత భాషలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తమిళంలోనూ సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. ధనుష్ 'అసురన్' మూవీతో కోలీవుడ్కు పరిచయమైన మంజు.. ఆ తర్వాత అజిత్తోనూ నటించి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ కొత్త మూవీలో యాక్ట్ చేస్తోంది. (ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?) ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్న మంజూ వారియర్.. గతంలో మలయాళ నటుడు దిలీప్ని పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు.. కొంతకాలం తర్వాత విడిపోయారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు మంజూ వారియర్ దగ్గరే ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భర్త గురించి మంజూ వారియర్కి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన ఈ హీరోయిన్.. 'ఆ ఒక్కటి అడగొద్దు' అని క్లారిటీ ఇచ్చేసింది. తన బిడ్డతో కలిసి తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈమె తమిళంలో పాటు మలయాళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) -
నేను హీరోయిన్గా పనికిరానని అవమానించారు.. ఇప్పుడు..
ప్రతిభ కలిగిన నటీమణుల్లో నటి ఇనయ ఒకరు. వాంగ చుడవా చిత్రంలో హీరోయిన్గా నటించి తానేమిటో నిరూపించుకుందీ బ్యూటీ. మాతృభాష మలయాళం అయినా తమిళంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇనయ ఎలాంటి పాత్రనైనా చాలెంజ్గా తీసుకుని నటించగలదు. ఒక పక్క హీరోయిన్గా బిజీగా ఉంటూనే, మరో పక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. ఈమె అనోరా ఆర్ట్ స్టూడియో పేరుతో మహిళా దుస్తుల వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తోంది. ఈమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదయ్యింది. బర్త్డే సెలబ్రేషన్స్ ఈ సందర్భంగా తన షాపు తొలి వార్షికోత్సవాన్ని, తన పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు, తన సంస్థ సిబ్బంది పాల్గొని ఇనయాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో ఇనయ మాట్లాడుతూ.. తాను హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ తుక్కుదురై. ఇందులో యోగిబాబు హీరోగా నటించారు. ఇది వినోదభరిత కథా చిత్రంగా ఉంటుంది. నేను పనికిరానన్నాడు ఈ తరహా కామెడీ కథా చిత్రంలో నటించడం నాకు ఇదే తొలిసారి! తొలి రోజుల్లో ఒక దర్శకుడు నేను సినిమాకు పనికి రానని అవమానించారు. అలాంటిది ఇప్పుడు తమిళం, మలయాళం భాషల్లో హీరోయిన్గా అలాగే వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాను. నాకు దర్శకత్వం వహించాలని ఆసక్తి ఉంది. అందుకు కథలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే డైరెక్టర్గా మారడానికి ఇంకా సమయం ఉంది' అని ఇనయ పేర్కొంది. చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా -
అలా చేస్తే ఈ సమాజం నన్ను బతకనిస్తుందా?: నటి
మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్. గురువారం (జనవరి 25న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది బిగ్బాస్ బ్యూటీ సుచిత్ర నాయర్. మలయాళ ఇండస్ట్రీలో ఇదే తనకు తొలి సినిమా కావడం విశేషం. తాజాగా ఈ నటి తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. బోలెడు కథలు విన్నాను.. 'బిగ్బాస్ షోలో నన్ను చూసిన డైరెక్టర్ లిజో సర్.. తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. అదే 'మలైకొట్టై వాలిబన్'. నా తొలి సినిమా ఇంత పెద్ద బడ్జెట్లో ఉండటం, గొప్ప నటీనటులతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య ఈ మూవీలో నుంచి విడుదలైన పాటలో మోహన్లాల్తో పాటు నేనూ ఉన్నాను. అది చూసి చాలామంది నాకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. బోలెడన్ని కథలు విన్నాను కానీ ఇంతవరకు ఏదీ ఓకే చేయలేదు. వాలిబన్ రిలీజయ్యాక మంచి కథలు సెలక్ట్ చేసుకుంటాను. మలయాళంలో మంచి సినిమాలు చేయాలనుంది. గాఢంగా ప్రేమించాను.. బ్రేకప్.. ఇక పెళ్లంటారా? వివాహంపైన నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. కానీ పెళ్లి చేసుకోకపోతే నా కుటుంబం, ఈ సమాజం ఊరుకుంటుందా? పదేపదే గుర్తుచేస్తూనే ఉంటుంది. పెళ్లి అవసరం లేదనుకున్నాను కానీ జీవితాంతం ఈ ఒత్తిడి భరించడం నా వల్ల కాదు. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడు దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. అయినా ఇప్పటికీ నేను నా బ్రేకప్ బాధలో నుంచి పూర్తిగా బయటపడలేదు. మొదట్లో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ అతడు నాకు చాలా కండీషన్స్ పెట్టేవాడు. నచ్చిన దుస్తులు వేసుకోనిచ్చేవాడు కాదు, బయట తిరగనిచ్చేవాడే కాదు. నేను ఏం మాట్లాడినా అడ్డుపడేవాడు. తనకోసం ఎంతో చేశా.. నాకు నచ్చినట్లుగా బతకనివ్వలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా తన అనుమతి తప్పనిసరి. నన్ను నన్నుగా ఉండనివ్వలేదు. మా మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయాం. పంజరంలో నుంచి బయటకు వచ్చినట్లుగా అనిపించింది. తన కోసం ఎన్నో అవకాశాలను వదిలేసుకున్నాను. చేయాల్సిన పనులు వాయిదా వేసుకున్నాను. ఇలాంటి వ్యక్తిని ప్రేమించానా? అని నన్ను నేనే అసహ్యించుకున్నాను' అని చెప్పుకొచ్చింది సుచిత్ర. కాగా సుచిత్ర నాయర్.. వానంబడి సీరియల్తో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో విలన్గా మెప్పించిన ఆమె మలయాళ బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. View this post on Instagram A post shared by 𝙎𝙪𝙘𝙝𝙞𝙩𝙝𝙧𝙖 𝙉𝙖𝙞𝙧 (@suchithra_chanthu) చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న 'నెరు' సినిమా ఎలా ఉందంటే? -
ఓటీటీలో మోహన్లాల్ సూపర్ హిట్ మూవీ.. నెలరోజులకే..
ఓటీటీలు వచ్చాక ఇక్కడి సినీప్రియులు తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలనూ ఆదరిస్తున్నారు. అటు సినిమా మేకర్స్ కూడా తమ చిత్రాన్ని ఓటీటీలో వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఫలితాలతో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలు చూసేందుకు జనాలు గత కొంతకాలంగా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతున్నాయి. ఓటీటీలోకి నేరు తాజాగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'నేరు' మూవీ ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి, అనస్వర రాజన్, శాంతి మాయాదేవి, సిద్దిఖి జగదీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన నేరు గతేడాది డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ఓటీటీలో రిలీజ్ ఇప్పటివరకుప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్లో రిలీజైన నెలరోజులకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 23 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార