MPTC Election 2014
-
ముగిసిన ‘స్థానిక’ సమరం
* ప్రశాంతంగా సాగిన తుదివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు * తుది దశలో 82 శాతం పోలింగ్ * మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలకు మరో నెల నిరీక్షించాల్సిందే * తుది విడతకు సంబంధించి కొన్నిచోట్ల ఈనెల 13న రీపోలింగ్ * మే 10న మున్సిపల్, 12న ప్రాదేశిక ఫలితాల * వెల్లడికి ఎన్నికల సంఘం కసరత్తు * సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం జరిగిన తుది విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ దశలో 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ప్రాదేశిక ఎన్నికల సమరం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ఫలితాలు తెలియాంలంటే మరో నెలకు పైగా అభ్యర్థులు, ప్రజలు నిరీక్షించాల్సిందే..! సాధారణ ఎన్నికల తరువాత ఓట్ల లెక్కింపు జరిగే ఈ ఎన్నికల ఫలితాలను ఒకరకంగా రిజర్వ్ చేసినట్లు లెక్క! మే 10న మున్సిపల్, 12వ తేదీన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీమాంధ్రలో మే ఏడో తేదీన సాధారణ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. అప్పటి వరకు వరుస ఎన్నికలతో అలసిపోయిన పోలీసు బలగాలకు రెండురోజుల విరామం కల్పించిన అనంతరం మే 10న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, మరో రోజు విరామం తర్వాత 12వ తేదీన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెల్లడించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే ఈ తేదీలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడి రాష్ట్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రాదేశిక ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించినందున వాటి లెక్కింపు, ఫలితాలు వెలువడడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. తర్వాత సాధారణ ఎన్నికల ఫలితాల వెల్లడికి మూడు రోజుల గడువు ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేశారు. స్థానిక సంస్థల ఫలితాల వెల్లడితో సాధారణ ఎన్నికల్లో తవు గెలుపు అవకాశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని భయపడిన రాజకీయ పార్టీలు.. ఆ ఎన్నికల తరువాతే స్థానిక ఫలితాలు ప్రకటించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్నాయి. కాగా శుక్రవారం 536 జెడ్పీటీసీ, 7,975 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన తుది విడత ప్రాదేశిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 82 శాతం పోలింగ్ నమోదైంది. 2006లో నిర్వహించిన ఎన్నికల్లో పోలైన శాతం కంటే ఈసారి దాదాపు తొమ్మిది నుంచి పదిశాతం అధికంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. శుక్రవారం ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్రెడ్డి ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్మిట్టల్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తుదివిడత ఎన్నికలకు సంబంధించి ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఈనెల 13న రీపోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఇందులో విశాఖపట్టణం జిల్లా బూసిపట్టు పంచాయతీలోని 27వ పోలింగ్ కేంద్రంలో మావోయిస్టులు బ్యాలెట్ బాక్స్ను ఎత్తుకెళ్లడంతో అక్కడ మాత్రం 16వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని రమాకాంత్రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిరలోని పోలింగ్ కేంద్రం 35లో కేవలం జెడ్పీటీసీ స్థానం కోసం రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ 86 బ్యాలెట్ పత్రాలు మరో జెడ్పీటీసీ స్థానానికి సంబంధించినవి వచ్చాయని వివరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి-2లోని ఆరో పోలింగ్ కేంద్రం, నెల్లూరులోని కాలువోయ-2 ఎంపీటీసీ 18, 21 కేంద్రాలు, డక్కిలి మండలంలోని శ్రీపురం ఎంపీటీసీ పోలింగ్ కేంద్రం 43లో, విజయనగరం జిల్లా రావివలస ఎంపీటీసీలోని పోలింగ్ కేంద్రాలు 41,42లలో ఆదివారంనాడు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సంతృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రమాకాంత్రెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో అత్యధికం 90 % తుది దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యల్పంగా కర్నూలులో 74 శాతం పోలింగ్ నమోదుకాగా... అత్యధికంగా ఖమ్మంలో 90 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి దశలో 81 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. -
జేసీ స్వగ్రామంలో పోలీసుల ఓవరాక్షన్
అనంతపురం : మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్వగ్రామం జూటూరులో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ హేమనాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో వైఎస్ఆర్ సీపీ ఏజెంట్ లేకుండానే పోలింగ్ ఏకపక్షంగా కొనసాగుతోంది. జిల్లాలో 32 జెడ్పీటీసీ, 399 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. కాగా ఫ్యాక్షన్ గ్రామాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రాదేశిక ఎన్నికల తుది సమరానికి తెర లేచింది. రాష్ట్రంలోని సగం పల్లెల్లో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది విడతలో 536 జడ్పీటీసీ స్థానాలకు 2,469 మంది, 7,975 ఎంపీటీసీ స్థానాలకు 25,621 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను శాసనసభ ఎన్నికల ఫలితాల కంటే రెండు మూడు రోజుల ముందుగా ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకుంది. -
నేడు తుది విడతస్థానిక సమరం
-
నేడు తుది విడతస్థానిక సమరం
* అసెంబ్లీ ఫలితాలకు రెండు మూడు రోజుల ముందే స్థానిక ఫలితాలు * పరోక్ష పద్ధతిలో మేయర్, చైర్పర్సన్ల ఎన్నికలు * 536 జెడ్పీటీసీలకు 2,469 మంది, 7,975 ఎంపీటీసీలకు 25,621 మంది పోటీ * ఓటర్ల జాబితాలో పేరు లేనివారు పోలింగ్ కేంద్రాలకు రావద్దు: రమాకాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల తుది సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని సగం పల్లెల్లో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది విడతలో 536 జడ్పీటీసీ స్థానాలకు 2,469 మంది, 7,975 ఎంపీటీసీ స్థానాలకు 25,621 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను శాసనసభ ఎన్నికల ఫలితాల కంటే రెండు మూడు రోజుల ముందుగా ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి. రమాకాంత్రెడ్డి వెల్లడించారు. ముందుగా మున్సిపల్ ఫలితాలు, ఆ తరువాత ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. స్థానిక ఫలితాల తరువాత పరోక్ష పద్ధతిలో మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు చైర్పర్సన్లు, వైస్-చైర్పర్సన్ల ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై గడువేమీ లేదని తెలిపారు. పరోక్ష ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల ముందు ఎన్నికైన సభ్యులకు నోటీసు ఇస్తే సరిపోతుందన్నారు. ఆయన గురువారం ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్మిట్టల్, సంయుక్త కార్యదర్శి సత్య రమేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయనేం చెప్పారంటే... * ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసే నాటికి ఓటర్ల జాబితాలో పేర్లున్న వారు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. మార్చి 10 తరువాత ఓటర్ల జాబితాలో చేరిన వారు ఓటు వేయడానికి అనర్హులు. వారి పేరు స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉండదు. ఓటర్ల జాబితాలో పేరు లేని వారు అనవసరంగా పోలింగ్ కేంద్రాలకు రావద్దు. పోలింగ్ సిబ్బందితో ఘర్షణ పడవద్దు. * ఓటరు స్లిప్పులు లేకపోయినా.. తాము ఇది వరకు జారీ చేసిన 21 ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని తీసుకుని వచ్చినా ఓటు వేయవచ్చు. * ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించాం. * తుది విడత ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా భారీ బందోబస్తు ఏర్పాటుచేశాం. మొదటి విడతకు వినియోగించిన 95,031 సిబ్బందితోపాటు, అదనంగా 45 ప్లాటూన్ల ఎపీఎస్పీ, ఏసీబీ, విజిలెన్స్, జైలు, ట్రాన్స్కో పోలీసులు, అటవీ, ఎక్సైజ్ అధికారులను వినియోగిస్తున్నాం. * 25,758 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం 1.31 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 3,089 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాం. 3,206 కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, 5,078 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించాం. * సున్నిత పోలింగ్ కేంద్రాలు 6057 ఉంటే, 6463 అతిసున్నిత, నక్సల్స్ ప్రభావిత కేంద్రాలు 558గా గుర్తించాం. నక్సల్స్ ప్రభావిత కేంద్రాల్లో సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ కొనసాగుతుంది. * స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ. 84.47 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3.48 లక్షల కిలోల నల్లబెల్లం కూడా స్వాధీనం చేసుకున్నారు.