nabil
-
నబీల్ మృతదేహానికి ఆరుచోట్ల గాయాలు
-
నబీల్ మృతదేహానికి ఆరుచోట్ల గాయాలు
హైదరాబాద్: నగరానికి చెందిన ఫంజెషాలో జరిగిన స్ట్రీట్ ఫైట్లో మృతి చెందిన నబీల్ మహ్మద్(17)కు బార్కాస్లోని బడా శ్మశాన వాటికలో సోమవారం పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అతని మృతదేహంపై ఆరుగాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఉదయం 11 గంటలకు బండ్లగూడ మండల తహసీల్దార్ మహ్మద్ జహురుద్దీన్, కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఇంక్వెస్ట్ డిప్యూటీ తహసీల్దార్ అమర జ్యోతిలు పోలీసుల సమక్షంలో శవ పంచనామా జరిపారు. అనంతరం 12.30 గంటల సమయంలో శ్మశాన వాటికకు వచ్చిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవరాజు బృందం నబీల్ మృతదేహానికి పోస్ట్మార్టం జరిపారు. ఈ సందర్భంగా నబీల్ శరీరంపై ఆరు ప్రదేశాలలో గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. గాయపడ్డ భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నామని మంగళవారం ఉదయానికి నివేదికను సిద్ధంచేసి పోలీసులకు అందజేస్తామని వైద్యుల బృందం తెలిపింది. పోస్ట్మార్టం జరుగుతున్న సమయంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబూరావు, చార్మినార్ ఏసీపీ కె.అశోక చక్రవర్తిలు శ్మశాన వాటికకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోస్ట్మార్టం పూర్తయ్యాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతదేహాన్ని తిరిగి పూడ్చారు. నివేదిక అందగానే హత్య కేసు నమోదు చేస్తామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. కాగా ఈ కేసులో ప్రేమ వ్యవహారం అన్న కోణంలో ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. పోలీసుల అదుపులో 9మందిఙఞ్చటకాగా నబీల్ కేసులో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), మహ్మద్ ఉమర్ బేగ్ (20), ఇర్ఫాన్ పఠాన్ (22), సుల్తాన్ మీర్జా (22), ఎం.ఎ. కవి ఆలియాస్ ఓబేద్ (18), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (20), అబుబాకర్ (19), సులేమాన్ (18), సయ్యద్ యూసుఫ్ అహ్మద్ (19)లపై పోలీసులు ఐపీసీ 302, 201, 109, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి తన కుమారుడికి మరో రెండు నెలల్లో మైనార్టీ తీరనుండడంతో అతడ్ని దుబాయికి పంపాలని భావించాననీ నబీల్ తండ్రి దస్తగిర్ తెలిపారు. ఈ నెల మూడో తేదీ తెల్లవారు జాము 3 గంటల వరకూ తమ కుమారుడు తమ బంధువుల ఇంటి వద్దే ఉన్నాడనీ, అతని స్నేహితులు స్ట్రీట్ ఫైటింగ్ పేరిట తీసుకెళ్లి హత్యచేశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇందులో ఉమర్ బేగ్ అనే అతని ప్రమేయ ముందని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన ఒక్కగానొక్క కుమారుడికి ఇలా జరగడం పట్ల కన్నీరు పెట్టారు. -
స్ట్రీట్ ఫైట్ ఘటనలో ఎనిమిదిమంది అరెస్టు
హైదరాబాద్: పాత బస్తీ స్ట్రీట్ ఫైట్ ఘటనలో మొత్తం ఎనిమిదిమందిని సౌత్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నబీల్ను హత్య చేశారినవారందరిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ నెల 3నఫజర్ నమాజ్ అనంతరం ఉదయం 5.30 గంటలకు ఫంజేషాలోని ఇండో-అమెరికన్ స్కూల్ వద్దకు నబీల్తోపాటు అతని స్నేహితులు మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), ఉమర్ బేగ్ (20), సుల్తాన్ మీర్జా (22), ఇర్ఫాన్ పఠాన్ (22), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (31), అబూబకర్ (19), మరో ఇద్దరు యువకులు చేరుకొని స్ట్రీట్ ఫైట్ చేసిన ఘటనలో నబీల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఒవేస్... నబీల్పై ముష్టిఘాతాలు కురిపించడంతో తల ఎడమ కణతకు ఐదు బలమైన పంచ్లు తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. -
నబీల్ మృతదేహానికి పోస్టుమార్టం
-
నబీల్ మృతదేహానికి పోస్టుమార్టం
హైదరాబాద్: పాతబస్తీలో స్ట్రీట్ఫైట్ పేరిట సాగించిన ముష్టియుద్ధంలో మరణించిన నబీల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తన కొడుకును ఉద్దేశపూర్వకంగానే కొట్టి చంపారనే ఆరోపణలపై పోలీస్ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నా.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. దీనిలో భాగంగా నబీల్ మృతదేహాన్ని వెలికితీయనున్నారు. ఉస్మానియా నుంచి శ్మశానానికి చేరిన డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఆ నివేదిక వచ్చిన అనంతరం తమ దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 3నఫజర్ నమాజ్ అనంతరం ఉదయం 5.30 గంటలకు ఫంజేషాలోని ఇండో-అమెరికన్ స్కూల్ వద్దకు నబీల్తోపాటు అతని స్నేహితులు మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), ఉమర్ బేగ్ (20), సుల్తాన్ మీర్జా (22), ఇర్ఫాన్ పఠాన్ (22), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (31), అబూబకర్ (19), మరో ఇద్దరు యువకులు చేరుకొని స్ట్రీట్ ఫైట్కు సిద్ధమయ్యారు. గెలిచే వ్యక్తి మిగతా వాళ్లకు బిర్యానీ తినిపించాలని షరతు పెట్టుకున్నారు. ఈ పోరుకు ఓ యువకుడు రన్నింగ్ కామెంటరీ చేయగా, డాలర్ వసీం రెఫరీగా, ఉమర్ బేగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. మహ్మద్ ఒవేస్తో మొదటగా అబూబకర్ తలపడ్డాడు. అబూబకర్ మట్టి కరవడంతో లూజర్...లూజర్ అంటూ రన్నింగ్ కామెంట్రీ చేసిన యువకుడు ఆట పట్టించాడు. వెంటనే ఒవేస్తో మరో యువకుడు సుల్తాన్ ఫైట్ చేశాడు. ఫైట్ చేస్తుండగానే సుల్తాన్ చొక్కా చిరగడంతో లూజర్ అంటూ అతన్ని కూడా కామెంట్ చేశాడు. మూడో ఫైటర్గా ఓవేస్తో తలపడేందుకు స్నేహితులంతా కలసి నబీల్పై ఒత్తిడి తెచ్చారు. నబీల్ సుముఖంగా లేకున్నా బలవంతం చేసి ఫైట్కు దించారు. ఈ సమయంలో సుల్తాన్ అనే యువకుడు ఒవేస్ చెవిలో ఏదో చెప్పాడు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన ఒవేస్... నబీల్పై ముష్టిఘాతాలు కురిపించాడు. నబీల్ తల ఎడమ కణతకు ఐదు బలమైన పంచ్లు తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. -
డేంజర్ ఫైట్...
నిండు ప్రాణాన్ని బలిగొన్న వీధి పోరు ⇒ పాతబస్తీలో విషాదం ⇒ బైక్ యాక్సిడెంట్గా నమ్మించిన స్నేహితులు ⇒ వాట్సాప్ వీడియో ద్వారా బయటపడ్డ ఘటన ⇒ పోలీసుల అదుపులో నిందితులు హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లోని పెడధోరణులు హైదరాబాద్ యువతలో బుసలు కొడుతున్నాయి. విదేశాల్లోని స్ట్రీట్ఫైట్ విష సంస్కృతి ఇక్కడా జడలు విప్పింది. చివరకు ఓ నిండు ప్రాణాన్నే బలిగొంది. హైదరాబాద్ పాతబస్తీలో స్ట్రీట్ఫైట్ పేరిట సాగించిన ముష్టియుద్ధం ఒకరిని మృత్యుఒడికి చేర్చింది. ఒక కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మీర్చౌక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మీరాలం మండి పోలీస్ లేన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ దస్తగిర్ కుమారుడు నబీల్ (17) ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. ఈ నెల 3నఫజర్ నమాజ్ అనంతరం ఉదయం 5.30 గంటలకు ఫంజేషాలోని ఇండో-అమెరికన్ స్కూల్ వద్దకు నబీల్తోపాటు అతని స్నేహితులు మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), ఉమర్ బేగ్ (20), సుల్తాన్ మీర్జా (22), ఇర్ఫాన్ పఠాన్ (22), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (31), అబూబకర్ (19), మరో ఇద్దరు యువకులు చేరుకొని స్ట్రీట్ ఫైట్కు సిద్ధమయ్యారు. గెలిచే వ్యక్తి మిగతా వాళ్లకు బిర్యానీ తినిపించాలని షరతు పెట్టుకున్నారు. ఈ పోరుకు ఓ యువకుడు రన్నింగ్ కామెంటరీ చేయగా, డాలర్ వసీం రెఫరీగా, ఉమర్ బేగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. మహ్మద్ ఒవేస్తో మొదటగా అబూబకర్ తలపడ్డాడు. అబూబకర్ మట్టి కరవడంతో లూజర్...లూజర్ అంటూ రన్నింగ్ కామెంట్రీ చేసిన యువకుడు ఆట పట్టించాడు. వెంటనే ఒవేస్తో మరో యువకుడు సుల్తాన్ ఫైట్ చేశాడు. ఫైట్ చేస్తుండగానే సుల్తాన్ చొక్కా చిరగడంతో లూజర్ అంటూ అతన్ని కూడా కామెంట్ చేశాడు. మూడో ఫైటర్గా ఓవేస్తో తలపడేందుకు స్నేహితులంతా కలసి నబీల్పై ఒత్తిడి తెచ్చారు. నబీల్ సుముఖంగా లేకున్నా బలవంతం చేసి ఫైట్కు దించారు. ఈ సమయంలో సుల్తాన్ అనే యువకుడు ఒవేస్ చెవిలో ఏదో చెప్పాడు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన ఒవేస్... నబీల్పై ముష్టిఘాతాలు కురిపించాడు. నబీల్ తల ఎడమ కణతకు ఐదు బలమైన పంచ్లు తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గమనించిన వారంతా వెంటనే నబీల్ను పక్కకు తీసుకొచ్చి నీళ్లు తాగించారు. ఫలితం లేకపోవడంతో మూర్ఛగా భావించి తాళం చెవులను అతని చేతిలో ఉంచారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న నబీల్ నోరు తెరిచి ఊపిరి పీల్చుకునేందుకు ఆయాస పడుతుండడంతో ఆసుపత్రికి తరలించారు. బైక్ ప్రమాదంగా చిత్రీకరణ... నబీల్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్నేహితులంతా కేసు తమపైకి రాకుండా ఉండేందుకు దీన్ని బైక్ ప్రమాదంగా చిత్రీకరించారు. బైక్పై ఫీట్లు చేస్తున్న సమయంలో నబీల్ కింద పడిపోయాడని అతని కుటుంబ సభ్యులకు తెలిపి నబీల్ను పురానీ హవేలీలోని దుర్రు షెహవార్ ఆసుపత్రికి తరలించారు. నబీల్ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తేల్చారు. కుమారుడి మరణవార్త తెలుసుకొని విదేశాల నుంచి 5న హైదరాబాద్కు చేరకున్న నబీల్ తండ్రిని కూడా ఇలానే నమ్మించారు. పోలీస్స్టేషన్కు వెళితే మైనర్ బండి నడిపినందుకు కేసుతోపాటు తల్లిదండ్రులపైనా కేసు నమోదవుతుందని, పోస్ట్మార్టం కూడా చేస్తారంటూ దస్తగిర్ను భయపెట్టారు. ఇది నిజమేనని నమ్మిన దస్తగిర్ అదే రోజు బార్కాస్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. వెలుగులోకి తెచ్చిన వాట్సాప్ నబీల్ అంత్యక్రియలు పూర్తయ్యాక కుమారుడి మృతిపై అనుమానాలు తలెత్తిన దస్తగిర్... నబీల్ను ఆసుపత్రికి తరలించిన స్నేహితులందరినీ తన ఇంటికి పిలిపించి వాకబు చేయగా పొంతన లేని సమాధానాలిచ్చారు. దీంతో తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయంటూ ఈ నెల 7న దస్తగిర్ మీర్చౌక్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నబీల్ స్నేహితులదరినీ స్టేషన్కు పిలిపించి విచారించగా ఓ యువకుడి ఫోన్లోంచి వాట్సాప్ ద్వారా పంపిన వీడియో స్ట్రక్ అయి కనిపించింది. యువకులు స్ట్రీట్ ఫైట్ చేయడం... ఈ క్రమంలోనే నబీల్ కుప్పకూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నబీల్ మృతదేహానికి బార్కాస్ శ్మశానవాటికలో సోమవారం ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. పోస్ట్మార్టం నివేదిక అందాక నిందితులపై 302 కింద కేసు నమోదు చేస్తామన్నారు. ప్రస్తుతం నిందితులపై పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు గాను 201 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కూడా కారణం కావచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
'నబిల్ ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం'
-
'నబిల్ ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం'
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో సంచలనం సృష్టించిన స్ట్రీట్ ఫైట్ ఘటన పథకం ప్రకారమే జరిగిందనే అనుమానం కలుగుతోందని డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. నబిల్ ను కొట్టేందుకు ముందుగానే కుట్ర పన్నినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నబిల్ ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ ఘటన జరిగింది మే 3 న అయితే.. తమకు ఫిర్యాదు అందింది మాత్రం ఏడవ తేదీన అని తెలిపారు. నబిల్ ను కొట్టి చంపిన వ్యక్తి అబేజ్ అహ్మద్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. అతన్ని కొట్టమని అబేజ్ కు సుల్తాన్ అనే విద్యార్థి సూచించినట్లు తెలిపారు. ఆ స్ట్రీట్ ఫైట్ కు రిఫరీగా ఉన్నది డాలర్ వసీం అని డీసీపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి ఐదుగుర్ని అరెస్ట్ చేశామని.. దీంతో పాటు కొంతమంది మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు.కాగా పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. ఈ ఘటనలో అబేజ్, సుల్తాన్, వసీం, ఉమర్, ఇర్ఫాన్ లు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
స్ట్రీట్ ఫైట్ ఘటనలో నలుగురు విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్: నగరంలో విషాదం నింపిన స్ట్రీట్ ఫైట్ ఘటనకు సంబంధించి నలుగురు విద్యార్థులను ఆదివారం మధ్యాహ్నం సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో జరిగిన స్ట్రీట్ ఫైట్ లో నబిల్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటన వారం రోజుల క్రితమే జరిగినా.. దాన్ని బైక్ యాక్సిడెంట్ గా చిత్రీకరించారు అతని స్నేహితులు. అయితే తాజాగా బయటకు వచ్చిన వీడియోలో మాత్రం నబిల్ ను కొట్టిచంపినట్లు స్పష్టంగా కనబడింది. కొడుకు చనిపోయిన తీరుపై తండ్రి యూసఫ్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ వీడియోను ఒక తండ్రిగా తాను మాత్రం చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిందితులనకు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. -
'అలాంటి వీడియో ఓ తండ్రిగా చూడలేను'
-
'అలాంటి వీడియో ఓ తండ్రిగా చూడలేను'
హైదరాబాద్: తన కొడుకుపై పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోను ఓ తండ్రి స్థానంలో ఉండి తాను చూడలేనని నబిల్ తండ్రి యూసుఫ్ అన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో నబిల్ అతడి స్నేహితుడి మధ్య బాక్సింగ్ ఫైటింగ్ జరిగి నబిల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నబిల్ తల్లిదండ్రులు స్పందించి నబిల్ చనిపోయిన అనంతరం తమకు బైక్ యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పారని అన్నారు. ఇంట్లో ఉన్నవాడిని ఏ విషయం చెప్పకుండా తీసుకెళ్లారని, ఒక్కగానొక్క బిడ్డను పొట్టన పెట్టుకున్నారని చెప్పారు. ఇప్పటికే దానికి సంబంధించిన వీడియో మీరంతా చూశారని, కొడుకు చనిపోయే వీడియోను ఒక తండ్రిగా తాను మాత్రం చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిందితులనకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.