nancy
-
నాన్సీ త్యాగీ
లైఫ్స్టయిల్ అండ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఉత్తరప్రదేశ్కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ప్రిపరేషన్ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్ ఫ్యాషన్ అని. ‘కాల్ మి బే’ సిరీస్ కోసం నటి అనన్య పాండేకి అవుట్ ఫిట్స్ డిజైన్ చేసి బాలీవుడ్ని, కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్ కోసం గౌన్ను డిజైన్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ వరల్డ్లోని తన అనుభవాలను, లైఫ్స్టయిల్ థింగ్స్ని, ఫ్యాషన్ టిప్స్ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @nancytyagi లో షేర్ చేస్తూ సోషల్ మీడియా జర్నీనీ స్టార్ట్ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్కి దేశంలోని స్మాల్ టౌన్ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్ అయ్యి తక్కువ టైమ్లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్.. 2024కు గాను ఇండియా టాప్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రకటించింది. -
లవ్ యూ అంబులెన్స్!
‘అంబులెన్స్ డ్రైవర్ కావాలనేది నా కల’ అని ఎవరైనా అంటే ఆశ్చర్యంగా చూస్తారు. నాన్సీ కట్నారియా (22) విషయంలోనూ ఇదే జరిగింది. ఎట్టకేలకు నాన్సీ తన కలను నెరవేర్చుకుంది. ఒకప్పుడు ఆమె పేరు పక్కన ఎలాంటి విశేషణాలు లేవు. ఇప్పుడు రెండు చేరాయి. అవి: హిమాచల్ప్రదేశ్ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్, మనదేశంలో రెండో మహిళా అంబులెన్స్ డ్రైవర్. ఒకరికి ఒక వృత్తి మీద ఎందుకు ఇష్టం ఏర్పడుతుందంటే బోలెడు కారణాలు చెప్పుకోవచ్చు. నాన్సీ అంబులెన్స్ డ్రైవర్ కావాలనుకోవడానికి ఒక కారణం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం... దగ్గరి బంధువు ఒకరికి తన కళ్లముందే యాక్సిడెంట్ అయింది. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. దేవుడు పంపిన వాహనంలా మెరుపువేగంతో దూసుకువచ్చి బాధితుడిని హాస్పిటల్లో చేర్పించింది అంబులెన్స్. ‘గోల్డెన్ టైమ్లో తీసుకువచ్చారు. ఏమాత్రం ఆలస్యం అయినా ప్రాణాలు దక్కేవి కావు’ అన్నారు వైద్యులు. తన బంధువు బతికి ఉన్నాడంటే కారణం... అంబులెన్స్. అప్పటి నుంచి ఆమెలో అంబులెన్స్ అంటే ఒక ఆరాధన లాంటిది ఏర్పడింది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసి) స్కూల్లో డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న నాన్సీ నర్పూర్ సివిల్ హాస్పిటల్ 102 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ డ్రైవర్గా విధుల్లో చేరింది. ‘నేను చేస్తున్నది ఉద్యోగం మాత్రమే కాదు సేవ కూడా’ అంటోంది నాన్సీ. -
డివైడర్ను ఢీకొట్టిన కారు: యువతి మృతి
చిట్యాల(నల్లగొండ): విజయవాడ- హైదరాబాద్ జాతీయరహదారిపై సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సుమో చిట్యాల వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, రోడ్డుపై బోల్తా పడింది. ఆ వెనుకే వేగంగా వచ్చిన కారు కూడా డివైడర్ను, సుమోను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో సుమోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడగా, కారులో ఉన్న బెంగళూరుకు చెందిన నాన్సీ(22) అక్కడికక్కడే చనిపోగా ఆమె తల్లి అనిత తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. -
'టెన్త్ లో లక్ ,ఇంటర్ లో కిక్ , బిటెక్ లో ..?' స్టిల్స్