Nani
-
అందుకే బతిమాలుతున్నా: నాని
‘‘నా కెరీర్లో ఎప్పుడూ దయచేసి ఓ సినిమా చూడండి అని అడగలేదు. కానీ ‘కోర్టు’( Court Movie) లాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు మిస్ కాకూడదని చెబుతున్నాను.. అందరూ చూడాలని బతిమాలుతున్నాను’’ అని హీరో నాని(Nani ) చెప్పారు. ప్రియదర్శి ప్రధాన ΄ాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్టు’. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవ కట్టా అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ–‘‘కోర్టు’ సినిమాకి వెళ్లాక నా మాటలు మీ అంచనాలకి సరిపోలేదనిపిస్తే... రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా ‘హిట్ 3’ సినిమాని ఎవరూ చూడొద్దు’’ అని కోరారు. ‘‘బలగం’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ‘కోర్టు’ చేయమని నాని అన్న చెప్పారు’’ అని ప్రియదర్శి తెలిపారు. ‘‘ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగ్ అశ్విన్, శ్రీకాంత్ ఓదెల. ‘‘నానీగారు వాల్ పోస్టర్ సినిమా ద్వారా నన్ను డైరెక్టర్గా పరిచయం చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి’’ అని ప్రశాంత్ వర్మ ఆకాంక్షించారు. ‘‘కోర్టు’ ట్రైలర్ చూశాక సినిమా అద్భుతంగా వచ్చిందనిపిస్తోంది’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘ఈ సినిమాని ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని దేవ కట్టా తెలిపారు. ‘‘కోర్టు’ చాలా అందమైన సినిమా’’ అన్నారు నిర్మాత దీప్తి. ‘‘కోర్టు’ మనందరికీ జీవితం. అందరూ థియేటర్స్కి రండి’’ అన్నారు రామ్ జగదీశ్. ‘‘ఈ సినిమా ప్రోమోస్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. అందరూ థియేటర్స్లో చూడాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. నటీనటులు శ్రీదేవి, రోహిణి, సురభి ప్రభావతి, హర్ష రోషన్, శ్రీనివాస్ భోగిరెడ్డి, శివాజీ, డైరెక్టర్ శౌర్యువ్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, లిరిక్ రైటర్ పూర్ణాచారి తదితరులు మాట్లాడారు. -
'కోర్ట్' సినిమా నచ్చకుంటే.. నా 'హిట్ 3'ని చూడొద్దు: నాని
ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది. హీరో నాని ప్రోడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో నానితో పాటు నాగ్ అశ్విన్, మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, శైలేశ్ కొలను, శౌర్యువ్ తదితరులు పాల్గొన్నారు.'కోర్ట్' సినిమా సమర్పకుడు నాని ట్రైలర్ను విడుదల చేసిన అనంతరం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16ఏళ్లు దాటింది. దయ చేసి ఈ సినిమా చూడండి అని నేనెప్పుడూ అడగలేదు. తొలిసారి ఈ మాట ప్రేక్షకులను అడుగుతున్నాను. ఈ సినిమా నిర్మాతగా చెప్పడం లేదు, నా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా మిస్ అవ్వొద్దని కోరుకుంటున్నా. దయచేసి కోర్టు చిత్రాన్ని ఇంటిల్లిపాది చూడండి. కోర్టు చిత్రం చూసిన వారంతా గర్వంగా థియేటర్ల నుంచి బయటికి వస్తారు.'కోర్టు' సినిమా కంటే హిట్ 3పై పది రెట్లు ఖర్చుపెట్టాను. ఈ చిత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోకపోతే నా నెక్స్ట్ మూవీ 'హిట్3'ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా మీకు చెప్పలేను. ఈ సినిమాతో మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలోని పాత్రలతో ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్తో కనెక్ట్ అయిపోతారు. ఆ పాత్రలతో పాటుగా మీరు కూడా నవ్వడమే కాకుండా ఏడిపించేస్తారు.' అని నాని అన్నారు. -
సినిమాకి ఆ టైటిలే పెట్టొచ్చుగా నాని
-
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న నాని పారడైస్ గ్లిమ్స్
-
సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న ది ప్యారడైజ్
-
నాని వర్సెస్ విజయ్ మార్చిలో మాస్ జాతర
-
నాని 'ప్యారడైజ్' గ్లింప్స్.. ఇది కాకుల కథ
'దసరా' నుంచి రూట్ మార్చిన నాని.. మాస్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'హిట్ 3' చేస్తున్నాడు. రీసెంట్ గా నాని పుట్టినరోజు టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలతో తీస్తున్న 'ప్యారడైజ్' గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ వీడియో ప్రారంభంలోనే బూతులు కూడా ఉంటాయనే వార్నింగ్ ఇచ్చారు. 'ప్యారడైజ్' ప్రపంచం ఎలా ఉండబోతుందనే చూపించేశారు. వీడియో మొత్తంలో ఆ కాకుల రిఫరెన్సులు గట్టిగాన ఉన్నాయి.(ఇదీ చదవండి: ఆస్కార్ ఉత్తమ చిత్రం ఓ బోల్డ్ మూవీ.. ఏంటి 'అనోరా' స్పెషల్?)ఇది కడుపు మండిన కాకుల కథ.. జమానా జమానా కెల్లి నడిచే శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పెంచి పోసిన ఓ జాతి కథ అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంది. నాని ఫేస్ చూపించలేదు గానీ పిలకలు వేసుకుని, మెడలో చైన్లతో చేతిలో గన్స్ తో చాలా వైవిధ్యంగా ఉన్నాడు.ఇందులో నాని తల్లిపాత్రలో సోనాలి కులకర్ణి అనే సీనియర్ నటి కనిపించబోతుంది. ఒకప్పటి సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇది. గ్లింప్స్ చూస్తుంటే బహుశా ఇందులో హీరోయిన్ పాత్ర ఉండకపోవచ్చనిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్ గానే ఉంది. 2026 మార్చి 26న మూవీ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
తెలుగు 'ఛావా' రిలీజ్ ఎప్పుడంటే..!
-
నాని వయొలెన్స్.. దెబ్బకు విజయ్ దేవరకొండ రికార్డ్ బ్రేక్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'హిట్-3'. హిట్ సిరీస్లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయగా యూట్యూబ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో హిట్-3 టీజర్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 21 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించింది. ఈ చిత్రంలో నాని మునుపెన్నడు కనిపించని పాత్రలో నటించారు. టీజర్లో సన్నివేశాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. ఇంతకుముందెన్నడు చేయని మోస్ట్ వయొలెంట్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు.అయితే ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ మూవీకి 24 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఎన్టీఆర్ వాయిస్ అందించిన ఈ టీజర్కు ఇప్పటి వరకు 15 మిలియన్ల వీక్షణలు సాధించింది. కానీ నాని మూవీ హిట్-3 టీజర్ కేవలం 24 గంటల్లోనే కింగ్డమ్ వ్యూస్ రికార్డ్ను అధిగమించింది. దీంతో హీరో నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వేసవి కానుకగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. -
HBD Nani: అసలు పేరు 'నాని' కాదు.. తొలి రెమ్యునరేషన్ 4 వేలు! (ఫోటోలు)
-
'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!
హీరో నాని అంటే పక్కంటి కుర్రాడి తరహా పాత్రలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలు చేస్తూ తనలో డిఫరెంట్ యాంగిల్ పరిచయం చేస్తూ వస్తున్నాడు. దసరా, సరిపోదా శనివారం చిత్రాలు.. ఆ తరహా ప్రయత్నాలే. ఇప్పుడు వాటిని మించిపోయేలా బ్రూటల్ మాస్ చూపించబోతున్నాడు.నాని ప్రస్తుతం 'హిట్ 3' చేస్తున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ఇదివరకే రెండు మూవీస్ వచ్చాయి. విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా నటించిన ఈ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథలతో వీటిని తెరకెక్కించారు. వీటిని నిర్మించిన నాని.. మూడో భాగాన్ని నిర్మిస్తూ హీరోగా నటించాడు. ఇతడి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)'హిట్ 3' సినిమా చాలా వయలెంట్ గా ఉంటుదని నాని కొన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే టీజర్ ఉంది. లాఠి పట్టుకుంటే రెచ్చిపోయే అర్జున్ సర్కార్ అనే పోలీస్ గా కనిపించాడు. వైట్ కోట్ తో ఓ వ్యక్తిని చంపే సీన్ అయితే భయం కలిగించింది.టీజరే ఇలా ఉందంటే సినిమా ఇంకెలా ఉండబోతుందో అర్థమైపోతుంది. మే 1న థియేటర్లలోకి రాబోతుంది. శైలేష్ కొలను దర్శకుడు కాగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
హారర్ చిత్రానికీ కన్నీళ్లొస్తాయనుకోలేదు: నాని
‘‘శబ్దం’ సినిమాని ఎంజాయ్ చేశాను. ఎమోషనల్గా చాలా హై ఇస్తుంది. హారర్ సినిమాకీ కన్నీళ్లొస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథ, భావోద్వేగాలున్న హారర్ సినిమా ఇది. హారర్ మూవీస్ని ఇష్టపడే వారైతే పది మంది ఫ్రెండ్స్తో కలసి వెళ్లండి... చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో నాని తెలిపారు. ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వం వహించిన తెలుగు–తమిళ చిత్రం ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.శివ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఎన్ సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నైజాంలో రిలీజవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘నిన్ను కోరి’ సినిమా నుంచి ఆది, నేను ఫ్రెండ్స్. ‘శబ్దం’ సినిమాపై తను ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడో నాకు తెలుసు. సౌండ్ ఒక ఆయుధం అని ఒక రకమైన కొత్త యాంగిల్ని సినిమాలో చూపించారు.థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. అందరూ థియేటర్స్లో చూసి ఆదికి, ‘శబ్దం’ టీమ్కి మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలి’’ అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘శబ్దం’ ప్రయాణం 16 ఏళ్ల క్రితం మొదలైంది. ‘వైశాలి’ లేకపోతే ‘శబ్దం’ ఉండేది కాదు. మా డైరెక్టర్ అరివళగన్కి ధన్యవాదాలు. హారర్ ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది’’ అని చెప్పారు. అరివళగన్ మాట్లాడుతూ– ‘‘వైశాలి’ తర్వాత ఆది, నేను మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు సౌండ్ని హారర్ థీమ్గా తీసుకోవాలనుకున్నాం. సౌండ్ని విజువలైజ్ చేసి, హారర్ క్రియేట్ చేయడం సవాల్గా అనిపించింది. తమన్ పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న సంగీతం ఇచ్చారు’’ అన్నారు. -
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్కు 'మెగా' ఆఫర్
'భోళాశంకర్' పరాజయం తర్వాత చిరంజీవి చాలా సినిమాలను లైన్లో పెట్టారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, దసరా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్లో ఒకప్పుడు అందాలభామగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా గతంలో పంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను కూడా ఆయన షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ను విడుదల చేసి ఫ్యాన్స్లో హైప్ పెంచారు. అయితే, ఈ మూవీలో చిరు సరసన నటించే హీరోయిన్ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యతను ఇస్తుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే సెట్ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరుతో చెప్పగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టు సరిజోడీగా రాణీ ముఖర్జీ మంచి సెలక్షన్ అని చిరు కూడా అన్నారట. ఇదే వార్త బాలీవుడ్ సర్కిల్లో ట్రెండ్ అవుతుంది. -
‘శబ్దం’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా హీరో నాని (ఫొటోలు)
-
కోర్ట్లో హీరో ఎవరో చెప్పడం కష్టం: నాని
‘‘కోర్ట్’ చాలా అందమైన సినిమా. ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి అద్భుతంగా నటించారు. డైరెక్టర్ జగదీష్ బాగా తీశారు. ఈ సినిమా చూశాను... ఇందులో హీరో ఎవరో చెప్పడం కష్టం. ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను’’ అని హీరో నాని చెప్పారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో నాని మాట్లాడుతూ– ‘‘ఈ కథ సున్నితమైనది. చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాం. జగదీష్ చాలా పరిశోధన చేశారు. ఇది అద్భుతమైన కోర్టు రూమ్ డ్రామా. గొప్ప సందేశం ఉంటుంది. ఈ సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు నిలబడి క్లాప్స్ కొడతారు... ఇందుకు నాదీ గ్యారెంటీ.ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఒక అడుగు ముందుకేసినట్లే’’ అన్నారు. ‘‘నాని అన్న బ్యానర్లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రియదర్శి చెప్పారు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నానీగారికి థ్యాంక్స్. ఒక్క డౌట్ లేకుండా స్క్రిప్ట్ని నమ్మి ఆయన సినిమా నిర్మించారు’’ అని రామ్ జగదీష్ తెలిపారు.‘‘నాని, ప్రశాంతి ప్రోడక్షన్ హౌస్లో కథ నచ్చితే ఎంత అయినా ఖర్చు పెడతారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు సహ నిర్మాత దీప్తి గంటా. ‘‘ఇలాంటి మంచి సినిమాలో చాన్స్ ఇచ్చిన దర్శక– నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని రోషన్, శ్రీదేవి పేర్కొన్నారు. -
క్రైమ్ థ్రిల్లర్
నానీ(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. యునానిమస్ ప్రోడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. కాగా ఈ నెల 24న నానీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ మూవీలో అర్జున్ సర్కార్గా పవర్ఫుల్ పోలీస్గా కనిపించనున్నారు నానీ.‘హిట్’ సిరీస్లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం గ్లింప్స్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), లైన్ప్రోడ్యూసర్: అభిలాష్ మాంధదపు. -
విచారణకు వర్మ టైం అడిగారు
-
'హాయ్ నాన్న' కాపీ సినిమా.. నాని ఇంత చీపా?: కన్నడ నిర్మాత
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా (Hi Nanna Movie) బాక్సాఫీస్ను షేక్ చేసింది. రూ.75 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 2023 డిసెంబర్లో విడుదలైంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య (Pushkara Mallikarjunaiah) సంచలన ఆరోపణలు చేశాడు. తన సినిమా కథను దొంగిలించారని ఆరోపించాడు. తాను తెరకెక్కించిన భీమసేన నలమహారాజ మూవీ ఒరిజినల్ స్టోరీ అని.. తమ అనుమతి లేకుండా హాయ్ నాన్న పేరిట తెలుగులో రీమేక్ చేశారని మండిపడ్డాడు. ఇంత చీప్గా ప్రవర్తిస్తావనుకోలేదంటూ హీరో నానిని ట్యాగ్ చేశాడు. దీంతో హాయ్ నాన్న సినిమా టీమ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఒరిజినల్ కథ అని నమ్మించారు, తెలుగు ఇండస్ట్రీ తలదించుకునేట్లు చేస్తున్నారు కదా.. తిట్టిపోస్తున్నారు.భీమసేన మూవీ ఎప్పుడొచ్చింది?భీమసేన నలమహారాజ సినిమా (Bheemasena Nalamaharaja Movie) విషయానికి వస్తే ఇది కన్నడ చిత్రం. కార్తీక్ సరగుర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్ అయ్యర్, ఆరోహి నారాయణ్, ప్రియాంక, ఆద్య, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. చరణ్ రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం 2020 అక్టోబర్లో డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. ఈ మూవీని హీరో రక్షిత్ శెట్టితో పాటు పుష్కర మల్లికార్జునయ్య, హేమంత్ ఎమ్ రావు నిర్మించారు. మల్లికార్జునయ్య.. కిరిక్ పార్టీ, గోధీ బన్నా సాధారణ మైకట్టు, హంబుల్ పొలిటీషియన్ నోగరాజ్, జీరిజింబె, అవతార పురుష, 10 వంటి పలు చిత్రాలను నిర్మించాడు.చదవండి: మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా -
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్పై ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్బాబు. రాజమౌళి డైరెక్షన్లోని కొత్త సినిమా కోసమే మహేశ్బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్తో మరో గెటప్లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్చరణ్ క్లీన్ షేవ్ లుక్స్తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్చరణ్ హెయిర్ స్టైల్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్లో ఫుల్ వైట్ హెయిర్తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్తో, కరెక్ట్ ఫిజిక్తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్గా చాలా హార్డ్వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్లో.. మాసీ లుక్స్తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్లో నటించాలంటే స్పెషల్గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్తో, స్ట్రాంగ్ ఫిజిక్తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
హిట్ 3 షూటింగ్లో విషాదం.. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మృతి
హీరో నాని (Nani) సినిమా షూటింగ్లో విషాదం చోటు చేసుకుంది. హిట్ 3 మూవీ (HIT: The Third Case) షూటింగ్లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కేఆర్ కృష్ణ (30) మృతి చెందింది. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో షూటింగ్ జరుగుతుండగా కృష్ణకు గుండెపోటు రావడంతో మరణించింది.కాగా హిట్ సిరీస్లో వస్తోన్న మూడో భాగమే హిట్: ది థర్డ్ కేస్. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ జరుగుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే1 విడుదల చేయనున్నారు.చదవండి: ఎలా గౌరవించాలో మీరు నేర్పించనక్కర్లేదు.. బాలీవుడ్కు నాగవంశీ కౌంటర్ -
ఫ్యాన్స్కి ‘స్టార్స్’ న్యూ ఇయర్ విషెస్
కొత్త సంవత్సరం వచ్చేసింది. 2024కు గుడ్బై చెప్పి 2025కి వెల్కమ్ చెప్పేశారు. దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇక తెలుగు స్టార్ హీరోల్లో చాలా మంది విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. యూరప్లో మహేశ్, ప్రభాస్..లండన్లో ఎన్టీఆర్ కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే తామ ఎక్కడున్నా..అభిమానులను మాత్రం మరిచిపోమంటున్నారు మన హీరోలు. న్యూ ఇయర్ సందర్భంగా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. ‘అందరికి నూత సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు మరింత ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ లండన్లో ఉన్నారు. ఇటీవల వార్ 2 షూటింగ్కి గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి రాగానే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.Wishing you all a very Happy New Year 2025. May this year bring you joy and success.— Jr NTR (@tarak9999) December 31, 2024 ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తన అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ‘ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను’ అని బన్నీ ట్వీట్ చేశారు. Happy New Year to each and every one of you . Happy New year to all my Fans . I l love you all 🖤— Allu Arjun (@alluarjun) December 31, 2024ఇక నేచురల్ స్టార్ నాని కాస్త భిన్నంగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్. 2025 ‘సర్కార్’ ఇయర్’ అంటూ ‘హిట్: ది థర్డ్ కేస్’ కొత్త పోస్టర్ని వదిలాడు.శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాల్పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఇది వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Happy new year.2025. pic.twitter.com/CDLQ6DgieO— Nani (@NameisNani) December 31, 20242025వ సంవత్సరం మనందరికీ కొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, భారతీయ సినిమా వైభవం మరింత విస్తరించి ప్రకాశవంతంగా వెలగాలని కోరకుంటూ మెగాస్టార్ చిరంజీవి నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.Bye Bye 2024 & Welcome 2025 !! 🎉🥳🎊🍾May the year 2025 give all of us New Hopes,Aspirations, Life & Career goals and the Drive & Energy to realise them all. May the Glory of Indian Cinema spread farther and shine brighter!!Happy New Year to All ! May Love, Laughter and Joy…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 1, 2025Happy New Year ❤️❤️! May we all thrive in greater harmony, peace, and positivity. Om Namah Shivaya 🙏🙏🙏.— Dhanush (@dhanushkraja) December 31, 2024Wishing you all a fantastic New Year ahead, filled with joy, growth, and success ❤️❤️🤗Let’s make 2025 a great one 👍👍#HappyNewYear2025— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2025Wishing you all a fantastic New Year ahead, filled with joy, growth, and success ❤️❤️🤗Let’s make 2025 a great one 👍👍#HappyNewYear2025— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2025 View this post on Instagram A post shared by jetpanja (@sai_dharam_tej_43) -
కశ్మీర్లో యాక్షన్
కశ్మీర్లో విలన్లను రఫ్ఫాడిస్తున్నారు నాని. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్గా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు నాని. ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్తో పాటు టాకీ పార్ట్ని చిత్రీకరిస్తున్నాం. 2025 మే 1న సినిమాని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
కీర్తి సురేశ్ పెళ్లికి ఇంతమంది హీరోహీరోయిన్లు వెళ్లారా? (ఫొటోలు)
-
బచ్చలమల్లి హిట్ అవుతుంది: నాని
‘‘బచ్చలమల్లి’ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. నరేష్ హిట్ కొడతాడనే నమ్మకం ఆడియన్స్ లో కూడా వచ్చేసింది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఏ రేంజ్ బ్లాక్బస్టర్ అనేది కాలమే నిర్ణయిస్తుంది’’ అని నాని అన్నారు. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిచన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఈ నెల 20న విడుదల కానుంది.ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగాపాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ చూసి, నరేశ్కి ఫోన్ చేశాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలని ఉందని చెప్పి, నాకు నేనుగా ఈ ఈవెంట్కు వచ్చాను. ట్రైలర్లోనే సుబ్బు కథ చె΄్పాలనుకున్నాడంటే, సినిమాలో ఇంకా నిజాయతీగా ప్రయత్నించి ఉంటాడని ఊహించగలను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ క్రిస్మస్ మనదే’’ అన్నారు. ‘‘నాని మా ఫ్యామిలీ మెంబర్. 16 ఏళ్ల నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. నా ప్రతి సినిమా రిలీజ్కు ముందు నాకు కొంత టెన్షన్ ఉంటుంది. కానీ, ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘మజ్ను’ టైమ్ నుంచి నానిగారు నాకు తెలుసు.ఆయన ఈవెంట్కి రావడమే ఓ బ్లాక్బస్టర్ కొట్టేశామనే ఫీలింగ్ కలుగుతోంది. నేను రాసిన దాన్ని నరేశ్గారు అర్థం చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’’ అని పేర్కొన్నారు. దర్శకుడు సుబ్బు మంగాదేవి. ‘‘ఈ క్రిస్మస్కి బచ్చలమల్లి మోత మోగిపోద్ది. సినిమా విజయం పట్ల టీమ్ అంతా నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపారు రాజేష్ దండా. -
అత్యుత్సాహం సినిమా వాళ్లపై మాత్రమే కాదు.. వారిపై కూడా ఉండాలి: హీరో నాని!
అల్లు అర్జున్ అరెస్ట్పై టాలీవుడ్ హీరో నాని స్పందించారు. సినిమా వ్యక్తులకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరుల పట్ల కూడా ఉండాలన్నారు. ఇలాంటి హృదయ విదారకమైన ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి వాటి నుంచి మనందరం నేర్చుకోవాలని.. మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి ఏ ఒక్కరూ బాధ్యులు కాదని.. ఇది మనందరి తప్పు అని నాని ట్వీట్ చేశారు.పోలీసుల తీరు దారుణం: డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణఅల్లు అర్జున్ను శుక్రవారం అరెస్టు చేయడం చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఉందని టాలీవుడ్ డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ అన్నారు. అల్లు అర్జున్ కావాలని తప్పు చేయలేదని.. ఈ రోజు అరెస్ట్ చేయడం సరైంది కాదని అన్నారు. బన్నీని పోలీసుస్టేషన్కు తీసుకెళ్లొచ్చు.. కానీ బెడ్ రూమ్ వరకు వచ్చి అరెస్ట్ చేసి పెద్ద క్రిమినల్లా చూపించడం ముమ్మాటికీ తప్పే అవుతుందని విమర్శించారు. తెలుగు సినీ పరిశ్రమని ఒక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పోలీసులను తల్లాడ సాయి కృష్ణ ప్రశ్నించారు. I wish the kind of enthusiasm government authorities and media show in anything related to people from cinema was also there for the regular citizens. We would have lived in a better society. That was an unfortunate incident and it was heart breaking. We should all learn from the…— Nani (@NameisNani) December 13, 2024 -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ నాని
పోర్చుగీస్ స్టార్ ఫుట్బాలర్, మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఆటగాడు నాని రిటైర్మెంట్ ప్రకటించాడు. 32 ఏళ్ల నాని సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. నాకు ఇష్టమైన క్రీడకు వీడ్కోలు చెప్పే సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ ప్లేయర్గా నా కెరీర్ను ముగించాలని నిర్ణయించుకున్నాను.నా ఈ 20 ఏళ్ల అద్భుత ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు. నా కొత్త లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తాను. మళ్లీ మనం కలుద్దాం అని ఇన్స్టాగ్రామ్లో నాని రాసుకొచ్చాడు. కాగా నాని 2007 మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున తన కెరీర్ను ఆరంభించాడు. ఈ ప్రతిష్టాత్మక క్లబ్ తరపున 230 మ్యాచ్లు ఆడి 41 గోల్స్ చేశాడు. గోల్స్ సమయంలో మరో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కీలక సహచరుడిగా నానికి పేరుంది. నాని తన వాలెన్సియా, లాజియో, ఓర్లాండో సిటీ, వెనిజియా, మెల్బోర్న్ విక్టరీ అదానా డెమిర్స్పోర్ల వంటి మొత్తం 10 క్లబ్ల తరపున ఆడాడు.నాని తన జాతీయ జట్టు పోర్చుగల్ తరపున 112 మ్యాచ్లు ఆడి 24 గోల్స్ చేశాడు. అదే విధంగా 2016లో యూరోపియన్ ఛాంపియన్షిప్ విజేత నిలిచిన పోర్చుగల్ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు.చదవండి: ENG vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్కు భారీ షాక్ -
'దసరా' దర్శకుడితో చిరంజీవి సినిమా.. నిర్మాతగా హీరో నాని (ఫొటోలు)
-
అఫీషియల్: మెగాస్టార్తో జతకట్టిన హిట్ డైరెక్టర్.. హీరో నాని కూడా!
దసరా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీతో మరింత క్రేజ్ దక్కించుకున్న శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. అంతా ఊహించినట్లుగానే వీరి కాంబోలో మూవీ ఖరారైంది.ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న చిత్రానికి దసరా హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను కూడా షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంపై ఫ్యాన్స్లో మరింత ఆసక్తి నెలకొంది.నాని తన ట్వీట్లో రాస్తూ..'ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఆయన కోసం గంటల తరబడి క్యూలైన్స్లో వెయిట్ చేశా. నా సైకిల్ను కూడా కోల్పోయా. కానీ ఆయన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇదంతా ఒక చక్రం లాంటిది. దర్శతుడు శ్రీకాంత్తో కలిసి ఆ కల నెరవేరబోతోంది' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.మెగాస్టార్ రిప్లైశ్రీకాంత్ ఓదెల, నానితో కలిసి పనిచేయడం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోందంటూ మెగాస్టార్ రిప్లై ఇచ్చారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాతే చిరంజీవి- శ్రీకాంత్ కాంబోలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.Thrilled at this collaboration and looking forward to this one my dear @NameisNani 🤗@odela_srikanth#ChiruOdelaCinema Natural Star @NameisNani @UnanimousProd@sudhakarcheruk5 @SLVCinemasOffl https://t.co/AGfKjrwjDL— Chiranjeevi Konidela (@KChiruTweets) December 3, 2024 -
‘సలామ్...పోలీస్’ అంటున్న టాలీవుడ్ స్టార్స్
వెండితెరపై కనిపించే ‘సూపర్ హీరో’ తరహా పాత్రల్లో పోలీస్ పాత్ర గురించి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు సమాజం మేలు కోసం ఓ సూపర్ హీరో చేసే అన్ని సాహసాలు పోలీస్ ఆఫీసర్లు చేస్తుంటారు. ఇలా పోలీసాఫీసర్లకు ‘సలామ్’ కొట్టేలా కొందరు హీరోలు వెండితెరపై పోలీసులుగా యాక్షన్ చేస్తున్నారు. ఆ హీరోలపై కథనం.హుకుమ్...రజనీకాంత్ కెరీర్లో ఈ మధ్యకాలంలో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్గా నిలిచిన చిత్రాల్లో ‘జైలర్’ ఒకటి. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2023లో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో రజనీకాంత్ మేజర్ సీన్స్లో మాజీ పోలీస్ ఆఫీసర్గా, కొన్ని సీన్స్లో పోలీస్ డ్రెస్ వేసుకున్న జైలర్గా స్క్రీన్పై కనిపించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కనుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేశారు నెల్సన్ దిలీప్ కుమార్. ‘జైలర్ 2’కి సంబంధించి రజనీకాంత్ లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. డిసెంబరు 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ‘జైలర్’ సీక్వెల్ అప్డేట్ ఉండొచ్చనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. అంతేకాదు... ‘జైలర్’ సినిమా సీక్వెల్కు ‘హుకుమ్’ టైటిల్ను పరిశీలిస్తున్నారట. ‘జైలర్’లోని ‘హుకుమ్’ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ పాటనే సీక్వెల్కు టైటిల్గా పెడితే ఆడియన్స్కు సినిమా మరింత బాగా రీచ్ అవుతుందని, ‘హుకుమ్’ అనే టైటిల్ అన్ని భాషలకు సరిపోతుందని టీమ్ భావిస్తోందట. కళానిధి మారన్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ పోలీస్ ‘సూపర్ పోలీస్, సూర్య ఐపీఎస్, ఘర్షణ’ వంటి సినిమాల్లో సీరియస్ పోలీసాఫీసర్గా వెంకటేశ్ మెప్పించారు. ‘బాబు బంగారం’ సినిమాలో కామిక్ టైమ్ ఉన్న పోలీస్గా వెంకీ నటించారు. అయితే ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ పోలీసాఫీసర్గా కనిపించనున్నారాయన (‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్లో మనోజ్ బాజ్పేయి చేసిన రోల్ తరహాలో...) ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలో మాజీ పోలీసాఫీసర్గా వెంకటేశ్ కనిపిస్తారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్లో వెంకీ ఆన్ డ్యూటీ పోలీసాఫీసర్గా కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. మీనాక్షీ చౌదరి కూడా ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్గానే కనిపిస్తారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఫస్ట్ టైమ్ పోలీస్గా... ప్రభాస్ వంటి కటౌట్ ఉన్న హీరో పోలీస్ ఆఫీసర్గా స్క్రీన్పై కనిపిస్తే ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. తనను పోలీసాఫీసర్గా స్క్రీన్పై చూపించే అవకాశాన్ని ‘అర్జున్రెడ్డి, యానిమల్’ వంటి సినిమాలు తీసిన సందీప్రెడ్డి వంగా చేతుల్లో పెట్టారు ప్రభాస్. ‘స్పిరిట్’ టైటిల్తో రానున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సీరిస్లపై భూషణ్ కుమార్ నిర్మించ నున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. కేసు నంబరు 3 సూపర్హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి ‘హిట్: ద థర్డ్ కేస్’ రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్గా నాని నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. ‘హిట్ 1, హిట్ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కోలనుయే మూడో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు సినిమాలను నిర్మించిన నాని, ‘హిట్ 3’లో హీరోగా నటిస్తూ, నిర్మిస్తుండటం విశేషం. నాని వాల్పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ చిత్రం 2025 మే 1న విడుదల కానుంది. బంధూక్ హీరో విశ్వక్ సేన్ తుపాకీ పట్టుకుని చాలాసార్లు స్క్రీన్పై కనిపించారు. కానీ రియల్ పోలీస్ ఆఫీసర్గా కాదు... అయితే ‘బంధూక్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా కోసం విశ్వక్ సేన్ పోలీసాఫీసర్గా ఖాకీ డ్రెస్ ధరించి, తుపాకీ పట్టారు. ఈ పోలీస్ యాక్షన్ డ్రామాకు శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంపద హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. ఎస్ఐ యుగంధర్ ఈ మధ్య కాలంలో పోలీసాఫీసర్ రోల్స్కే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లున్నారు హీరో ఆది సాయికుమార్. ఆయన హీరోగా విడుదలైన గత ఐదు సినిమాల్లో రెండు పోలీసాఫీసర్ సినిమాలు ఉన్నాయి. ఈలోపు మరో పోలీసాఫీసర్ మూవీ ‘ఎస్ఐ యుగంధర్’కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎస్ఐ యుగంధర్గా ఓ కొత్త క్యారెక్టరైజేషన్ ఉన్న పోలీస్ ఆఫీసర్గా ఆది సాయికుమార్ కనిపిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో మేఘా లేఖ హీరోయిన్గా నటిస్తున్నారు. యశ్వంత్ దర్శకత్వంలో ప్రదీప్ జూలురు నిర్మిస్తున్న ఈ చిత్రం 2025లో రిలీజ్ కానుంది. మర్డర్ మిస్టరీ ఓ మర్డర్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు హీరో త్రిగుణ్ (అరుణ్ అదిత్). స్క్రీన్పై ఓ పోలీసాఫీసర్గా ఈ కేసును పరిష్కరించే క్రమంలో త్రిగుణ్కు ఓ టర్నింగ్ ΄ాయింట్ దొరికింది. ఇది ఏంటీ అంటే...‘టర్నింగ్ ΄ాయింట్’ సినిమా చూడాల్సిందే. హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కుహాన్ నాయుడు దర్శకుడు. సురేష్ దత్తి నిర్మించారు. ఇలా పోలీసాఫీసర్ రోల్స్లో నటించే హీరోలు మరికొంతమంది ఉన్నారు. మరికొందరు స్క్రిప్ట్స్ వింటున్నారని తెలిసింది.– ముసిమి శివాంజనేయులు -
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం. నాటి దూరదర్శన్ టాక్ షోల నుండి నేటి ఓటీటీ టాక్ షోల వరకు ఇంచుమించుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా నేటి తరం నేటివిటీకి దగ్గరగా ‘ది రానా దగ్గుబాటి షో’ ఉంది. దీనికి హోస్ట్గా పేరుకు తగ్గట్టే నేటి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమం స్ట్రీమ్ అయ్యేకన్నా ముందు ప్రముఖ యాంకర్ సుమతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషనల్ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.ఆప్రోమోలోనే ఈ షోకి సంబంధించిన కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. ప్రోమోలో సుమ స్టూడియోకి వచ్చి రానాను కలుస్తుంది. ‘టాక్ షో అన్నావు కదా... గెస్టులు ఎవరు? దానికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ ఇలా ఉండాలి’ అని రానాకి సూచిస్తుంటే, ‘నేను టాక్ షో అన్నాను కానీ అనౌన్స్మెంట్, ఇంట్రో అని చెప్పలేదు కదా... చాలా షోస్ ఇలానే రొటీన్గా చేస్తున్నావు కదా.. మా టాక్ షో వాటన్నిటికీ విభిన్నం’ అని రానా చెబుతారు. రానా అన్నట్టే ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన టాక్ షోస్ సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’ బ్రేక్ చేసిందనే చెప్పాలి.ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్ అనే కంటే వచ్చిన గెస్ట్లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ క్యాజువల్గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్లో భాగంగా ప్రముఖ తెలుగు హీరో నాని, ‘హను– మాన్’ ఫేమ్ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్ అతిథులుగా వచ్చారు. వారిని షోలకి పిలవడం దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడడం, ఆటలాడడం అంతా సరికొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి అభిరుచిని కనిపెట్టడం మీడియాలో దర్శకులకు తెలిసినంత మరెవరికీ తెలిసుండదు. అలా వాళ్లు ప్రేక్షకుల నాడిని పడతారు కాబట్టే వారి కాన్సెప్ట్స్ ప్రేక్షకాదరణ పొందుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ‘ది రానా దగ్గుబాటి షో’. ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో వర్తబుల్... వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ మూవీ సత్తా.. అవార్డులు కొల్లగొట్టేసింది!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న. గతేడాది థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. శౌర్యువ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సలార్ పోటీని తట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది.తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. మెక్సికోలో జరిగిన ఐఎఫ్ఏసీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్కోర్, బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సెట్ డిజైన్, బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ ఫీచర్ సౌండ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సౌండ్ విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. కాగా.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ చిత్రంగా హాయ్ నాన్న తెరకెక్కించారు. గతంలో న్యూయార్క్లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్- 2024 ఎడిషన్లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది.కథ విషయానికి వస్తే..ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు.అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! Congratulations to the entire team of #HiNanna 🫶 This film truly deserves all the love it's receiving, nd it's heartwarming to see it being celebrated🥺❤️ pic.twitter.com/oAIJDNSMRX— Vyshuuᴴᴵᵀ ³ (@vyshuuVyshnavi) November 26, 2024 -
శివరాజ్ కుమార్ 'భైరతి రణగల్' మాస్ ట్రైలర్
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'భైరతి రణగల్' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీని దర్శకుడు నర్తన్ తెరకెక్కిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే, ఇప్పటికే ఈ సినిమా కన్నడలో నవంబర్ 15న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్లో కూడా విడుదల కానుంది. నవంబర్ 29న తెలుగుతో పాటు తమిళ్లో రిలీజ్ కానుంది.గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ 'భైరతి రణగల్' చిత్రాన్ని నిర్మించారు. 2017లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన మఫ్తీకి ప్రీక్వెల్గా ఈ చిత్రం రానుంది. శివరాజ్ కుమార్కు టాలీవుడ్లో కూడా మార్కెట్ ఉండటంతో ఆయన చిత్రాలు ఇక్కడ విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో 'భైరతి రణగల్' తెలుగు ట్రైలర్ను హీరో నాని విడుదల చేశారు. చిత్ర యూనిట్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. -
ఆ లీక్ వీరులెవరో నాకు తెలుసు.. దసరా డైరెక్టర్ ఆగ్రహం!
దసరా మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆయన నానితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి సంబంధించి టైటిల్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై దర్శకుడు శ్రీకాంత్ మండిపడ్డారు.నా మూవీ టైటిల్ లీక్ చేసింది ఎవరో తనకు తెలుసని శ్రీకాంత్ ఓదెల అన్నారు. మా టీమ్తో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నా సినిమాకు మాత్రమే కాదు.. ఏ సినిమాకైనా లీకుల బెడద ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిదని ఆయన హితవు పలికారు. వాళ్లు సినిమా రంగంలో క్రియేటర్స్ అని కొనియాడారు. సినిమాలకు వారు అందించే నిస్వార్థమైన సేవలను గౌరవించాలని.. అంతేగానీ కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లపై నిందలు మోపడం సరికాదని శ్రీకాంత్ అన్నారు.కాగా.. శ్రీకాంత్.. నానితో తెరకెక్కిస్తోన్న చిత్రానికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ మూవీ యూనిట్ ప్రకటించకముందే సోషల్ మీడియాలో లీకైంది. దీంతో ఈ విషయంపై శ్రీకాంత్ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశారు. To whomever it may concern,నా సినిమాకే కాదు, ఎవరి సినిమా లో ఏ లీక్ అయినా ASSISTANT DIRECTORS or WRITERS ని blame చేయడం మానేస్తే better.These people are the future creators and their selfless contribution to cinema deserves utmost RESPECT!Change the habit of blaming it on… pic.twitter.com/xoO3gLCANp— Srikanth Odela (@odela_srikanth) November 10, 2024 -
నాని కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా
-
అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్'
‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు వెల్లడించి, టైటిల్ లోగోను ‘ఎక్స్’లో షేర్ చేశారు నాని. పీరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని, ఇందులో సికింద్రాబాద్ కుర్రాడిగా నాని నటిస్తారని టాక్. హీరోయిన్ గా జాన్వీకపూర్ లేదా శ్రద్ధాకపూర్ నటిస్తారనే ప్రచారం ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నాని ‘హిట్ 3’ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్ లో జరుగుతోంది. 2025 మే 1న ‘హిట్ 3’ రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
ఎమోషనల్ రైడ్
‘‘రోటి కపడా రొమాన్స్’ ట్రైలర్ బాగుంది. యూత్కి ఏదో కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ప్రతి సంవత్సరం యంగ్ జనరేషన్ చేసిన సినిమా సెన్సేషన్ హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా ఆ కోవలో చేరాలని కోరుకుంటున్నాను. న్యూ టాలెంట్ని ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్న బెక్కెం వేణుగోపాల్లాంటి నిర్మాతలు సక్సెస్ అవ్వాలి’’ అని హీరో నాని అన్నారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం నవంబరు 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నానీతో ట్రైలర్ రిలీజ్ చేయించారు. ‘‘యువతరానికి నచ్చే అంశాలకు కుటుంబ భావోద్వేగాలను మేళవించి ఎమోషనల్ రైడ్ మూవీలా రూపొందించాం’’ అని నిర్మాతలు తెలిపారు. -
బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే స్కెచ్ వేసిన నాని
-
ముచ్చటగా మూడోసారి...
‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.కాగా ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. ‘‘ఈ చిత్రంలోని మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్ అవుతున్నారు. ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ చిత్రాల తర్వాత నానీతో ముచ్చటగా మూడోసారి అనిరుథ్ సినిమా చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ వెల్లడించింది. -
దసరా కాంబినేషన్ షురూ
‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో ‘నాని ఓదెల 2’ (వర్కింగ్ టైటిల్) చిత్రం ఆరంభమైంది. ‘‘మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్లో నానీని చూపించే గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే, ఆకట్టుకునే కథని తయారు చేశారు శ్రీకాంత్ ఓదెల.భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ‘దసరా’ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం, పలు అవార్డులు అందుకోవడంతో పాన్ ఇండియా చిత్రం ‘నాని ఓదెల 2’ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
మీలాంటి వారిని చూస్తుంటే అసహ్యమేస్తోంది: కొండా సురేఖపై నాని ఫైర్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులు మనకు ఉండడం దురదృష్టకరం అన్నారు. ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించుకోవచ్చవనుకోవడం చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. మీ మాటలు చాలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు.. మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివితక్కువ పని ట్వీట్ చేశారు.(ఇది చదవండి: మీ హెడ్లైన్స్ కోసం మా జీవితాలే దొరికాయా?: నాగచైతన్య)నాని తన ట్వీట్లో రాస్తూ..'ఇది కేవలం నటులు, సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనందరం ఖండించాలి.' అంటూ నాని పోస్ట్ చేశారు. కాగా.. సమంత-నాగచైతన్య విడాకులను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్పై సినీ ప్రముఖులంతా మండిపడుతున్నారు. Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…— Nani (@NameisNani) October 2, 2024 -
సెంట్రల్ జైలులో హీరో నాని...ఎందుకో తెలుసా..?
కొమ్మాది : అడవివరం సెంట్రల్ జైలులో ఆదివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్–3 సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఈ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం నుంచి విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. -
ఒకటి..రెండు..మూడు.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!
ఒకటో సారి... రెండో సారి... మూడోసారి... అంటూ వేలం పాట నిర్వహించడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒకటో భాగం.. రెండో భాగం... మూడో భాగం... ఇలా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలు మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం తీస్తున్నారు. సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ అయ్యిందంటే మూడో భాగం రూపొందిస్తున్నారు. మరికొన్నేమో రెండో భాగం షూటింగ్ దశలో ఉండగానే ముందుంది మూడో భాగం అంటూ ప్రకటించేస్తున్నారు. మూడో భాగం సీక్వెల్స్ విశేషాల్లోకి వెళదాం... పుష్ప: ది రోర్ ‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. తాము కూడా తగ్గేదే లే అంటూ ఆ సినిమాకి పాన్ ఇండియా హిట్ని అందించారు ఆడియన్స్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ వంటివారు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్ కావడంతో సేమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమాని పక్కాగా తీసుకురావాలని అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీమ్ కష్టపడుతున్నారు. లేటుగా వచ్చినా బ్లాక్బస్టర్ కొట్టాలనే ఆలోచనతో పని చేస్తోంది టీమ్. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి మూడో భాగం ఉంటుందని, ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్ని కూడా ఖరారు చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అక్కడ ‘పుష్ప: ది రైజ్’ని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘అన్నీ అనుకూలంగా ఉంటే ‘పుష్ప’ మూడో భాగం తీసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇలా మూడో భాగంపై ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. అయితే ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్ ఇతర ప్రాజెక్టులు చేశాక ‘పుష్ప’ మూడో భాగం చేస్తారని, ఇందుకు చాలా టైమ్ పట్టవచ్చని టాక్. ఆర్య 3 అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ (2004) హిట్ అయింది. వారి కాంబినేషన్లో ఆ మూవీకి సీక్వెల్గా వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం అందుకుంది. ఈ సినిమాకి మూడో భాగం కూడా రానుంది. ఓ సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆర్య 3’ సినిమా ఉంటుంది... అయితే ఎప్పుడు సెట్స్కి వెళుతుందనేది చెప్పలేను’’ అని పేర్కొన్నారు. నాలుగింతల వినోదం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 2– ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. సేమ్ కాంబినేషన్లో ఈ మూవీకి సీక్వెల్గా రెండో భాగం ‘ఎఫ్ 3’ని తెరకెక్కించారు. 2022 మే 27న రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ‘ఎఫ్–3’కి కొనసాగింపుగా ‘ఎఫ్– 4’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రకటన ‘వెంకీఅనిల్03’ (వర్కింగ్ టైటిల్) రావడంతో అందరూ ‘ఎఫ్–4’ అనుకున్నారు. అయితే ఇది ‘ఎఫ్–4’ కాదని చిత్రయూనిట్ స్పష్టత ఇచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న ‘వెంకీఅనిల్03’ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని ఫిల్మ్నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’తో పోలిస్తే ‘ఎఫ్–4’ లో వినోదం నాలుగింతలు ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మూడో కేసు ఆరంభం ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), ‘హిట్: ది సెకండ్ కేస్’(2022) వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ‘హిట్: ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ‘హిట్: ది సెకండ్ కేస్’లో అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన హీరో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో తానే లీడ్ రోల్లో నటిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆఫీసర్ అర్జున్ సర్కార్గా కనిపించబోతున్నారు నాని. 2025 మే 1న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ కొలను స్పష్టం చేశారు. వేసవిలో భారతీయుడు కమల్హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 3’ (‘భారతీయుడు). కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా జూలై 12న విడుదలైంది. అయితే తొలి భాగం అందుకున్న విజయాన్ని మలి భాగం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రెండో భాగం సమయంలోనే ‘భారతీయుడు 3’ చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి చేసిందట యూనిట్. 2025 వేసవిలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.కేజీఎఫ్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ (2018) సినిమా పాన్ ఇండియా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చివర్లో రెండో భాగం ఉంటుందని ముందే ప్రక టించింది యూనిట్. యశ్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోనే వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ 2022లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీలో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ ప్రీ ్ర΄÷డక్షన్ పనుల్ని దాదాపు పూర్తి చేశారట ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాలు బ్లాక్బస్టర్గా నిలవడంతో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ పై కర్నాటకలోనే కాదు... పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్గా నిలవడంతో సెకండ్ పార్ట్ ‘కార్తికేయ 2’ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో నిఖిల్, చందు కలయికలో రానున్న ‘కార్తికేయ 3’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కార్తికేయ 3’ ఉంటుందంటూ ఈ ఏడాది మార్చి 16న సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘చందు మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీ (‘కార్తికేయ 3’) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై పని చేస్తున్నారు. స్పాన్, స్కేల్ పరంగా ‘కార్తికేయ 3’ చాలా పెద్దగా ఉండబోతోంది. డా. కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ మూవీ తీస్తున్నారు చందు మొండేటి. అటు నిఖిల్ ‘స్వయంభూ’, ఇటు చందు ‘తండేల్’ పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. 'నవ్వులు త్రిబుల్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి సీక్వెల్గా వచ్చిన రెండో భాగం ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాది మార్చి 29న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ. 125 కోట్ల వసూళ్లు సాధించి సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘టిల్లు పాత్రపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ‘టిల్లు క్యూబ్’లో టిల్లు పాత్రను సూపర్ హీరోగా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఫిల్మ్నగర్ టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మత్తు కొనసాగుతుందిశ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలై, హిట్గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూడా రితేష్ రానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. మొదటి, ద్వితీయ భాగాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అటు ఇంటర్వ్యూలో, ఇటు సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ రితేష్ రానా ‘మత్తు వదలరా 3’ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. పొలిమేరలో ట్విస్టులు‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్గా నిలవడంతో ‘పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. ‘సత్యం’ రాజేష్, బాలాదిత్య, కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొలిమేర 3’. మొదటి రెండు భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చేతబడితో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రేజీ థ్రిల్లర్గా రూపొందిన తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పొలిమేర 3’లో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేష్ తెలిపారు. – డేరంగుల జగన్ -
నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్
అనుకున్నట్లుగానే జరిగింది. నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నెలలోపే స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా 'పేకమేడలు')నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'సరిపోదా శనివారం'. వారంలో శనివారం మాత్రమే కోపాన్ని చూపించే వ్యక్తిగా నాని నటించాడు. కథ పరంగా ఓ మాదిరి కొత్తదనం ఉన్నప్పటికీ నాని-ఎస్జే సూర్య అద్భుతమైన యాక్టింగ్తో అదరగొట్టేశారు.ఆగస్టు 29న థియేటర్లలోకి ఈ సినిమాకు వర్షాలు అడ్డంకిగా మారాయి. రిలీజైన రెండు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో నెలలోపో అంటే సెప్టెంబరు 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం)Ippati dhaaka @NameisNani rendu kaalle choosaru… moodo kannu choodataniki meeru ready ah?#SaripodhaaSanivaaram is coming to Netflix on 26th September in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi!#SaripodhaaSanivaaramOnNetflix pic.twitter.com/b0CrfvMb94— Netflix India South (@Netflix_INSouth) September 21, 2024 -
దసరా కాంబినేషన్ షురూ
‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో ‘నాని ఓదెల 2’ (వర్కింగ్ టైటిల్) చిత్రం షురూ అయింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై ఈ సినిమా రూపొందనుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ– ‘‘నా ఫస్ట్ సినిమా ‘దసరా’కి 2023 మార్చి 7న చివరిసారిగా కట్, షాట్ ఓకే అని చెప్పాను. 2024 సెపె్టంబర్ 18న ‘నాని ఓదెల 2’ ప్రకటన వీడియో కోసం మళ్లీ యాక్షన్ చెప్పాను.48,470,400 సెకన్లు గడిచాయి. ప్రతి సెకను ఈ ్రపాజెక్ట్ కోసం సిన్సియర్గా ఉన్నాను. ‘దసరా’ చిత్రం స్థాయిని ‘నాని ఓదెల 2’తో వంద రెట్లు పెంచుతానని మాట ఇస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘నానీని ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టర్లో చూపిస్తూ, యునిక్ అండ్ ఎగ్జయిటింగ్ నెరేటివ్తో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ‘నాని ఓదెల 2’ చిత్రం అందించనుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
నాని 'సరిపోదా శనివారం' ఓటీటీ రిలీజ్ డేట్ లాక్?
నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. దాదాపు 20 రోజులకు రూ.100 కోట్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, తుపాన్ ధాటికి ఈ మూవీ పరిస్థితి దారుణం అయిపోయింది. తొలి వీకెండ్ ఓ మాదిరి వసూళ్లు వచ్చాయి కానీ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా థియేట్రికల్ రన్ దాదాపు చివరకొచ్చేసింది. ఈ క్రమంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే ఓ వ్యక్తి కథతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ఎస్జే సూర్య సూపర్ యాక్టింగ్ చేశారు. కానీ వర్షాల వల్ల ఈ సినిమాని చాలామంది థియేటర్లలో చూడలేకపోయారు. అయితే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఇప్పుడు అనుకున్న టైం కంటే ముందే దీన్ని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు)ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమా.. సెప్టెంబరు 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నాని మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది మరికొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.'సరిపోదా శనివారం' స్టోరీ విషయానికొస్తే సూర్య(నాని)కి కోపమెక్కువ. కానీ తల్లి చెప్పడంతో శనివారం మాత్రమే కోపాన్ని చూపిస్తుంటాడు. పెద్దయిన తర్వాత కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్)తో ప్రేమలో పడతాడు. ఇదలా ఉండగా దయానంద్ (ఎస్జే సూర్య) అనే సీఐ క్రూరుడు, మహా కోపిష్టి. ఇతడు సోకులపాలెం అనే ఊరి ప్రజల్ని తెగ హింసిస్తుంటాడు. అలాంటి దయాకి సూర్య ఎలా అడ్డు నిలబడ్డాడు? చివరకు ఏమైందంనేదే మిగిలిన కథ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
ఇకపై 'నాని అన్నా' అని పిలుస్తా: విజయ్ దేవరకొండ
సైమా అవార్డుల వేడుక (#SIIMA2024) అట్టహాసంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా, హాయ్ సినిమాలు ఎక్కువ అవార్డులు కొల్లగొట్టేశాయి. దసరా సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నాని సైమా అవార్డు గెలిచాడు. ఈ పురస్కారాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నానిని హత్తుకుని కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. కంగారుపడ్డా..'ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో మొదటిసారి నేను కీలకపాత్ర పోషించాను. ఈ సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి నాని ఆఫీస్కు వెళ్లాను. ఓపక్క సంతోషపడుతూనే తను ఎలా మాట్లాడతాడో అని కాస్త కంగారుపడ్డాను. కానీ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు. నానీ.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇండస్ట్రీలో అందర్నీ అన్నా అని పిలుస్తుంటాను. అలా ఎందుకు పిలుస్తానో నాకే తెలియదు. కానీ నానీని మాత్రం నేను అన్నగా భావించాను, కాబట్టి ఇకనుంచి తనను నానీ అన్నా అని పిలుస్తాను. నువ్వు వరుస హిట్స్ అందుకోవడం చాలా సంతోషం. ఈ అవార్డు వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది' అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఫిక్స్ అయిపో..తర్వాత నాని మాట్లాడుతూ.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపన పడే వ్యక్తి విజయ్. కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. ఈ రోజు నువ్వు నాకు అవార్డు ఇచ్చావు. వచ్చే ఏడాది ఇదే స్టేజీపై మా గౌతమ్ తిన్ననూరి సినిమాకు నేను అవార్డు ఇస్తాను. ఇది ఫిక్స్ అయిపో అని తెలిపాడు. కాగా నాని, విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇకనైనా గొడవలకు చెక్!కాగా నాని, విజయ్ దేవరకొండ మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు. తాజాగా హీరోల వ్యాఖ్యలతో వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్పష్టమైపోయింది. దీంతో ఇకనైనా ఫ్యాన్స్వార్కు చెక్ పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.చదవండి: 'పుట్టబోయే బిడ్డ నీకంటే మంచి రంగు ఉండాలి, అందుకోసం..' -
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
సైమా అవార్డ్స్లో నాని చిత్రాల హవా.. ఉత్తమ చిత్రం ఏదంటే..?
సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా కొనసాగింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు అవార్డులు కొల్లగొట్టాయి. దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో టాలీవుడ్ విజేతలను ప్రకటించారు. తెలుగులో ఉత్తమ నటుడిగా నాని నిలవగా.. ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ అవార్డ్ను సొంతం చేసుకుంది. నాని నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డ్స్ దక్కాయి. ఈ వేడుకల్లో హీరోయిన్స్ వేదికపై సందడి చేశారు.టాలీవుడ్లో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి నిలిచింది. సైమా-2024 విన్నర్స్ వీళ్లే.. ఉత్తమ నటుడు: నాని (దసరా) ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (దసరా) ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా) ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా) ఉత్తమ సహాయ నటి: బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్న) ఉత్తమ హాస్య నటుడు: విష్ణు (మ్యాడ్) ఉత్తమ పరిచయ నటి: వైష్ణవి చైతన్య (బేబీ) ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహబ్ (హాయ్నాన్న) ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (సలార్) ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం) ఉత్తమ డెబ్యూ యాక్టర్: సంగీత్ శోభన్ (మ్యాడ్) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: శౌర్యువ్ (హాయ్ నాన్న) ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్: వైరా ఎంటర్టైన్మెంట్స్ (హాయ్ నాన్న) ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆనంద్ దేవరకొండ (బేబీ) ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాళ్ ఠాకూర్ ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేశ్ 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బన్నీ, నాని స్టోరీస్ తో నితిన్ సినిమా..
-
ఆఫీసర్ అర్జున్ ఆన్ డ్యూటీ
నాని హీరోగా నటిస్తున్న ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ప్రారంభమైంది. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని తెరకెక్కిస్తున్నారు. యునానిమస్ప్రోడక్షన్స్తో కలిసి వాల్పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లోప్రారంభమైంది. ఈ షూటింగ్లో ఆఫీసర్ అర్జున్గా డ్యూటీ ఆరంభించారు నాని. ‘‘ఈ సినిమాలో ఆఫీసర్ అర్జున్ సర్కార్గా ఫెరోషియస్ క్యారెక్టర్లో నాని కనిపించబోతున్నారు. ఈపాత్ర కోసం నాని కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. 2025 మే 1న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
'సరిపోదా' అయిపోయింది.. కొత్తది మొదలుపెట్టిన నాని
'సరిపోదా శనివారం' సినిమాతో మొన్నీ మధ్యే హీరో నాని.. ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇది ఇంకా థియేటర్లలో ఉండగానే కొత్త మూవీ మొదలుపెట్టేశాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'హిట్ 3' రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో శుక్రవారం మొదలైపోయింది. నానిపై సన్నివేశాల్ని చిత్రీకరించారు.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)విశ్వక్ సేన్, అడివి శేష్.. తొలి రెండు భాగాల్లో హీరోలుగా నటించారు. ఇక మూడో పార్ట్లో అర్జున్ సర్కార్ అనే రూత్లెస్ పోలీస్గా నాని కనిపించబోతున్నాడు. రీసెంట్గా నాని పాత్ర ఎలా ఉంటుందో తెలియజెప్పేలా చిన్న వీడియో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమా తర్వాత నాని.. తనతో 'దసరా' సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెలతో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. ఇది ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉండబోతుంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: నెల వ్యవధిలో మరో లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో అజిత్) -
నాని - సాయిపల్లవి కాంబినేషన్ రిపీట్.. డైరెక్టర్ ఎవరు అంటే?
-
కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో నాని..
-
నాని కెరీర్లో పెద్ద మల్టీస్టారర్...
-
టాలీవుడ్ సూపర్ 'హిట్' సిరీస్.. పార్ట్-3లో హీరో ఎవరంటే?
సరిపోదా శనివారం అంటూ ఇటీవలే సినీ ప్రియులను అలరించిన టాలీవుడ్ హీరో నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. అంతలోనే మరో కొత్త మూవీని ప్రకటించారు. ఈ సినిమా నాని కెరీర్లో 32వ చిత్రంగా నిలవనుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేయండి.గతంలో టాలీవుడ్లో హిట్ సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ రెండు సినిమాలకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హిట్ పేరుతో వచ్చిన మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. ఆ తర్వాత హిట్-2లో లీడ్ రోల్లో అడివి శేష్ కనిపించారు. ఈ సిరీస్లో వస్తోన్న మూడో చిత్రం హిట్-3. ఇందులో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.కాగా.. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్లో మే 1న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందించనున్నారు. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. -
ఫ్లాప్ డైరెక్టర్ తో హిట్ కొడుతున్న నాని
-
35ని మిస్ కాకండి : హీరో నానీ
‘‘నేను ‘35: చిన్న కథ కాదు’ సినిమా చూశాను. ఒక్కరోజు స్కూల్కి సెలవు పెట్టి థియేటర్కి వెళ్లి ఈ సినిమా చూసినా ఫర్వాలేదు. ‘35’ తరహా సినిమా మాత్రం మళ్లీ రాదు. పొరపాటున కూడా మిస్ కాకండి’’ అని నానీ అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘35: చిన్న కథ కాదు’. నందకిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘నేను కొత్త ప్రతిభను ప్రొత్సహిస్తానని అంటున్నారు. చె΄్పాలంటే రానా ముందు నేను నథింగ్. ఏ రంగంలో ఉన్న ప్రతిభవంతుల్నైనా రానా ప్రొత్సహిస్తారు. ఇండస్ట్రీలో నాకు ఉన్న ఓ మంచి ఫ్రెండ్ రానా. యాక్టర్స్ నుంచి మంచి పెర్ఫార్మె న్స్ ను రాబట్టుకుంటాడు దర్శకుడు నందకిశోర్’’ అని అన్నారు. ‘‘నేను టెన్త్లో మ్యాథమేటిక్స్లో ఫెయిల్ అయ్యాను. 35 మార్క్స్ నాకు పెద్ద టాస్క్లా అనిపించేది. సినిమాలో అమ్మానాన్నలుగా విశ్వ, నివేదా బాగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లొచ్చాయి’’ అని వెల్లడించారు రానా. ‘‘ఈ సినిమా మనల్ని ప్రశ్నిస్తుంది.. ఆలోజింపజేస్తుంది’’ అని పేర్కొన్నారు ప్రియదర్శి. ‘‘థియేటర్లలో మీ పిల్లల చెవులు, కళ్లు మూయక్కర్లేదు’’ అని తెలిపారు నందకిశోర్. -
నాని సినిమా.. పిల్లలకు నో ఎంట్రీ!
హీరో నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియెన్సే మెయిన్ టార్గెట్. కానీ మెల్లమెల్లగా పంథా మార్చుకుంటున్న నాని.. యాక్షన్ మూవీస్ చేస్తూ మిగతా ప్రేక్షకులకు కూడా దగ్గరవుతున్నాడు. అలా ఇప్పుడు తన తర్వాత మూవీ గురించి హింట్ ఇచ్చేశాడు. వయలెన్స్ ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పిల్లలని థియేటర్లలోకి అనుమతించడం కుదరదని చెప్పాడు.(ఇదీ చదవండి: వరదలతో ఇబ్బందులు.. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)నాని చెప్పిన దానిబట్టి చూస్తే హిట్ 3 గురించే అయ్యింటుందని అనిపిస్తుంది. ఎందుకంటే 'హిట్' ఫ్రాంచైజీలో ఇదివరకే వచ్చిన రెండు సినిమాల్లో హీరో పోలీస్గా చేస్తే సైకో పాత్రలు విలన్. ఇందులోని మూడో భాగంగా సైకో పాత్ర ఎంత కృూరంగా ఉంటుందో.. నాని చేయబోయే అర్జున్ సర్కార్ పాత్ర అంతకు మించి అనేలా ఉంటుందట. దీని గురించే నాని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడా అనిపిస్తుంది.ఇది కాకుండా 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో మూవీకి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో నడిచే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇదని తెలుస్తోంది. ఇందులో కూడా యాక్షన్ డోస్ గట్టిగానే ఉండబోతుంది. దీనిబట్టి చూస్తుంటే ఇప్పటివరకు తనకు బలమైన ఫ్యామిలీ ఆడియెన్స్ని నాని ఏమైనా దూరం చేసుకుంటున్నాడా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?) -
‘సరిపోదా శనివారం’ మూవీ థాంక్స్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వీకెండ్లో దూసుకెళ్లిన సరిపోదా శనివారం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్- వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం సరిపోదా శనివారం. ఆగస్టు 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.23.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.9 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.52.18 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పోస్టర్ ద్వారా పంచుుకంది. కాదా.. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లతో ఉత్తర అమెరికాలో తొలి బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొదటి రోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సరిపోదా శనివారం వీకెండ్లోనూ అదే జోరు కొనసాగించింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. హీరోయిన్గా ప్రియాంక మోహన్ ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అభిరామి, అదితి బాలన్, పి సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు.Bhaga Bhaga Bhaga..Bhaga Bhaga Bhaga 🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/zsVDRl772X— DVV Entertainment (@DVVMovies) September 1, 2024 -
సరిపోదా శనివారం టీమ్కు సారీ చెప్పిన ఎస్జే సూర్య.. ఎందుకంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్లోనూ కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా నటుడు ఎస్జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. నాకు సూపర్ హిట్ అందించిన చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, డీవీవీ ఎంటర్టైన్మెంట్, తెలుగు ప్రేక్షకులకు నా గుండెల నుంచి ధన్యవాదాలు అంటూ తెలుగులో రాసుకొచ్చారు. అదేవిధంగా సక్సెస్ ప్రెస్ మీట్కు హాజరు కాకపోవడంపై సారీ చెప్పారు. బిజీ షూటింగ్ షెడ్యూల్ వల్లే హాజరు కాలేకపోయానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. Telugu prayakshalaku , dir #VivekAthreya gari ki , Natural star @NameisNani gariki , @DVVMovies dhanaya gariki gundal nunchi Dhanyawadalu 🙏🙏🙏 for this great opportunity & accepting this actor with immense love sjsuryah 🥰🙏 sorry couldn’t attend press meet due to unavoidable…— S J Suryah (@iam_SJSuryah) August 31, 2024 -
సరిపోదా శనివారం బాక్సాఫీస్.. నాని మూవీకి ఊహించని కలెక్షన్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్హిట్ ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన సరిపోదా శనివారం మూవీకి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. గురువారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.24.11 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే అత్యధికంగా రూ.12 కోట్ల నెట్ రాట్టింది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. అంతే కాకుండా అభిరామి, అదితి బాలన్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి జేక్స్ బేజాయ్ సంగీతమందించారు. -
పాతబస్తీలో పంజా విసరనున్న నాని
-
ఆ ఓటీటీకి సరిపోదా శనివారం.. భారీ ధరకు రైట్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్హిట్ ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భారీ ధరకు ఓటీటీ రైట్స్?అయితే ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఓటీటీ రైట్స్ గురించి చర్చ మొదలైంది. ఓటీటీకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో వస్తుందని సినీప్రియులు తెగ ఆరా తీస్తున్నారు. అయితే సరిపోదా శనివారం మూవీ హక్కులను ఇప్పటికే నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సౌత్ రైట్స్ను మాత్రమే దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.ఓటీటీకి అప్పుడేనా??ఈ మూవీ రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీకి రానుందని క్రేజీ టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచే స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముందని సమాచారం. అదే రోజు రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సరిపోదా శనివారం నెల రోజుల్లోపే ఓటీటీలో చూసే అవకాశం ఉంటుంది. కాగా.. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఎస్జే సూర్య విలన్ పాత్రలో మెప్పించారు. -
రివ్యూ: ‘సరిపోయిందా’ శనివారం!
టైటిల్: 'సరిపోదా శనివారం' నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులునిర్మాణ సంస్థ: డివీవీ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరిరచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మురళి జిఎడిటర్: కార్తీక శ్రీనివాస్విడుదల తేది: ఆగస్ట్ 29, 2024కథేంటంటే.. సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అన్యాయాన్ని సహించడు. అయితే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ వారమే శనివారం. మిగతా ఆరు రోజులు ఎల్ఐసీ ఏజెంట్గా పని చేస్తూ.. తనకు కోపం వచ్చేలా చేసిన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు. శనివారం ఆ డైరీలో రాసుకున్న వాళ్ల భరతం పడతాడు. కట్ చేస్తే.. దయానంద్ అలియాస్ దయా(ఎస్జే సూర్య) క్రూరమైన పోలిస్ ఆఫీసర్. తనకు కోపం వస్తే చాలు.. సోకులపాలెం గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు. దయా చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేకపోతుంది కానిస్టేబుల్ చారులత(ప్రియాంక అరుల్ మోహన్). తన పైఅధికారి కావడంతో అతన్ని ఏమి చేయలేక.. సోకులపాలెం ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు సూర్య కూడా సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సోకులపాలెం ప్రజలను దయా నుంచి విముక్తి కల్పించేందుకు సూర్య, చారులత కలిసి వేసిన ప్లాన్ ఏంటి? శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్య.. క్రూరమైన సీఐ దయాను ఎలా ఎదిరించాడు? దయాకు సోకులపాలెం గ్రామ ప్రజలపై కోపం ఎందుకు? చిన్నప్పుడే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన సూర్య మరదలు కల్యాణికి చారులతకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు సోకులపాలెం ప్రజలకు దయా నుంచి విముక్తి లభించిందా లేదా అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని విలన్ పట్టి పీడిస్తుంటాడు. అతను చేసే అన్యాయాలను ఎదిరించి, ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి హీరో వస్తాడు. తనకు సంబంధం లేకున్నా.. వారికి అండగా నిలిచి చివరకు విలన్ నుంచి ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పిస్తాడు.. ఈ కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సరిపోదా శనివారం కథ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లో మాదిరి హీరో ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకుండా.. కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కొట్టడం ఈ సినిమా స్పెషల్. అంతకు మించి ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని చిత్రబృందం ముందు నుంచి చెబుతూ రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రైలర్లోనే కథ ఏంటో చెప్పి ముందే ఆడియెన్స్ మైండ్ సెట్ చేశారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొత్త కథను చెప్పేందుకు ప్రయత్నం చేయలేదు కానీ.. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్మూలతో పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ ఫార్మెట్లో కథనాన్ని నడిపించాడు. మొదలు.. మలుపు... దాగుడు మూతలు.. ముగింపు అంటూ కథను విడదీసి చెప్పాడు. నాని, ఎస్జే సూర్యల నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. కానీ స్క్రీన్ప్లే విషయంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. సినిమా నిడివి కూడా ఎక్కువగా(174 నిమిషాలు) ఉండడం, ఊహకందేలా కథనం సాగడం ఉండడం సినిమాకు మైనస్. హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించడానికి గల కారణం సినిమా ప్రారంభంలోనే చూపించి.. ఆడియన్స్ మైండ్ని సెట్ చేశాడు. ఆ తర్వాత ఒకవైపు సూర్యకు, మరోవైపు సీఐ దయాకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ..వీరిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆలోచించేలా చేశాడు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్లో మొత్తం నాని-సూర్యల చుట్టే కథనం సాగుతుంది. అయితే సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. ఊహకందేలా కథనం సాగినా..నాని, సూర్యలు తమ నటనతో బోర్ కొట్టకుండా చేశారు. కొత్తదనం ఆశించకుండా వెళ్తే ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇందులో కూడా ఓ డిఫరెంట్ పాత్ర చేశాడు. వారం మొత్తం ప్రశాంతంగా ఉండి.. ఒక్కరోజు మాత్రమే కోపం ప్రదర్శించే యువకుడు సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రం బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐ దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. సూర్య పాత్రను మలచిన తీరు..అతని నటన సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర గుర్తిండిపోతుంది. ఇక కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక అరుళ్ మోహన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా సాయి కుమార్, కార్పెరేటర్ కుర్మానంద్గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
సరిపోదా శనివారంకు సీక్వెల్ గా.... అదిరిపోదా ఆదివారం..
-
నాని ‘సరిపోదా శనివారం’ మూవీ స్టిల్స్
-
‘సరిపోదా శనివారం’ టాక్ ఎలా ఉందంటే..?
‘అంటే సుందరానికి’తర్వాత నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘సరిపోదా శనివారం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 29) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘సరిపోదా శనివారం కథేంటి?, నాని-వివేక్ ఆత్రేయ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. . ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. నాని, ఎస్జే సూర్య తమ నటనతో అదరగొట్టేశారని, వారి కోసమే ఈ సినిమా చూడాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రొటీన్ స్టోరీయే అయినా.. వివేక్ తెరపై డిఫరెంట్గా చూపించాడని అంటున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. స్క్రీన్ప్లే ఫేలవంగా ఉందని, సెకండాఫ్ కాస్త సాగదీతగా ఉందని అంటున్నారు. చాలా మంది జేక్స్ బిజాయ్ నేపథ్య సంగీతంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజీఎం అదరగొట్టేశాడని.. సినిమాకు అదే ప్లస్ అని కామెంట్ చేస్తున్నారు. Review : Screenplay🕵️♂️ VivekAthreya Not upto The Mark ..1st Half - SJ Surya & Nani Don't Miss it Theatre Interval 🥵🥵🥵 🔥🔥🔥🔥Potharu Motham Potharu2nd Half Bit booring bit lengthy & a Mass entertainment .BGM 🥵🔥🥵🔥🥵🔥 Over all 3.5/5#SaripodhaaSanivaaram pic.twitter.com/DJstRjHcOu— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐑𝐞𝐝𝐝𝐲 (@_NaveenReddy_14) August 28, 2024 వివేక్ ఆత్రేయ స్క్రీన్ప్లే గొప్పగా ఏమీ లేదు. కానీ ఫస్టాఫ్ ఎస్జే సూర్య, నానిల యాక్టింగ్ అదుర్స్. వారి కోసమే సినిమా చూడాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. పోతారు.. మొత్తం పోతారు. ఇక సెకండాఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్. బీజీఎం అదిరిపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.#SaripodhaaSanivaaram is a satisfactory action drama that had moments of excellence but at the same time had moments where the film was too dragged out and predictable. The introduction block, interval block, climax block, and few confrontation scenes between Nani and SJ Surya…— Venky Reviews (@venkyreviews) August 28, 2024 #SaripodhaaSanivaaram@JxBe yem taagi kottav bro ah BGM mad antey mad mind lo nundi povatle #SaripodhaasanivaaramMovie nundi bayata ochinapati nundi vintune unna movie hittuuuu 💯 @NameisNani Recent ga chusina movies lo satisfying ga unna movie ede @DVVMovies pic.twitter.com/TU2f5aZqaS— Subbu (@allam700423) August 28, 2024Interval To Climax okate RaMp 🔥🔥🔥🔥🔥🙏🔥🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🔥🔥🔥🔥Biggest Blockbuster on Cards 🎴 🎯💪Congratulations to the Natural Star @NameisNani gaaru 🙏🔥😍and @DVVMovies 🙏🤝🥳#SaripodhaaSanivaaram #Nanipic.twitter.com/88WtCAy6hQ— JACK 𝕏 (@JACK_2K02) August 29, 2024#SaripodhaaSanivaaram : “Block-Buster”👉Rating : 3.5/5 ⭐️ ⭐️Positives:👉 #Nani👉 #SjSurya Performance👉BGM👉ScreenplayNegatives:👉 Lengthy👉Bit Routine Story#SaripodhaSanivaaram— CRICKET & CINEMA (@CRICKETCINEMAA) August 29, 2024Hat trick kottesamu 🔥🔥🥁Dasara 🥇hi Nanna 🥈Saripodhaasanivaaram🥉❤️ @NameisNani Anna nee story selection ki 🫡😍🔥🔥🔥 @iam_SJSuryah @priyankaamohan @SVR4446 @DVVMovies 💐💐#SaripodhaaSanivaaram #Nani pic.twitter.com/2iloeFm1H9— KADAPA SREENU (@SREENU_24) August 29, 2024#SaripodhaaSanivaaram First Half:- One of the most unique intros in TFI that only #Nani can pull off ❤️- Followed by an engaging screenplay with good moments and fun elements 👌- Then comes the interval – Potharu Mottham Potharu 🥵❤️🔥- #JakesBejoy on steroids 🥵🔥Yes, it… pic.twitter.com/6FWRllhusO— Movies4u Official (@Movies4u_Officl) August 28, 2024#SaripodhaaSanivaaramReview:Positives:- Vivek Athreya's writing with well-placed moments 💥- Jakes Bejoy's BGM 🔥- Interval 💥🔥- SJ Suryah's kickass acting 🙌- Nani's natural performance 💥- Characterizations 👌- A few repetitive setup scenes in the first half. pic.twitter.com/xGwG5YEOwi— Vikram_90 (@CiritSanthosh) August 29, 2024 -
నాని, ఝాన్వి కలిసి పని చేస్తారా లేక ఇది పుకార్లేనా?!
-
రాజమౌళి, ఈగ 2 కి నేను అవసరం లేదన్నారు
-
ఈగ సీక్వెల్.. నానితో పనిలేదన్న రాజమౌళి!
రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఈగ’. 2012లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రావాలని సినీ ప్రియులతో పాటు హీరో నాని కూడా కోరుకుంటున్నాడు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గురించి నాని మాట్లాడారు. రాజమౌళి ఫిక్స్ అయితే ఈ సీక్వెల్ కచ్చితంగా వస్తుందని.. చిన్న ఈగతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. అయితే ఇప్పట్లో ఈ సీక్వెల్ ఆలోచన రాజమౌళికి లేదని చెబుతూ.. వారిద్దరి మధ్య ఈగ2పై జరిగిన సరదా సంభాషణను పంచుకున్నాడు.ఓ సారి రాజమౌళితో ఈగ సీక్వెల్ గురించి మాట్లాడాను. సీక్వెల్ పనులు ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను. అప్పుడు దానికి ఆయన ‘మేము ఈగ 2 చేసినా..నీతో పనిలేదు.మాకు ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది’ అని చెప్పారు. ఒక చిన్న ఈగతో సినిమా తీయాలని ఆలోచన రావడమే గొప్ప విషయం. రాజమౌళి ధైర్యాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ ఆయన ఈగ 2 చేస్తే.. అది కచ్చితంగా మరో అద్భుతమైన విజయం సాధిస్తుంది. ప్రస్తుతం ఆయనకు అయితే సీక్వెల్ చేయాలని ఆలోచన లేదు. కానీ ఏదో ఒకరోజు కచ్చితంగా ఈగ 2 గురించి ఆలోచించి..మంచి కథతో సీక్వెల్ తీస్తాడని అనుకుంటున్నాను’ అన్నారు. నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అప్పుడు రాజమౌళి ఒక్కరికే పని ఉంటుంది – నాని
‘‘నా సినిమా రిలీజైన వెంటనే బ్లాక్బస్టర్, సూపర్ హిట్ అని చెబుతుంటారు. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ టాక్ కనిపిస్తుంది. కానీ వీటిని నేను సక్సెస్గా భావించను. నా సినిమాలో భాగస్వామ్యులైన అందరూ సంతోషంగా ఉండాలి. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా సినిమా సక్సెస్ ఇవ్వాలి. అప్పుడు నేను సక్సెస్ అని భావిస్తాను. చెప్పాలంటే.. మన నిజమైన సక్సెస్ మనకు మాత్రమే తెలుస్తుంది’’ అని నాని అన్నారు. ‘అంటే.. సుందరానికీ!’ తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నాని చెప్పిన సంగతులు.» ఓ సినిమా కథ నన్ను ఎగ్జైట్ చేసి, నాకో చాలెంజ్ విసిరి, ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తుందని నాకనిపిస్తే ఆ స్క్రిప్ట్కు ఓకే చెబుతాను. ప్రతి సినిమాకు కొత్తదనాన్ని ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ ‘సరిపోదా శనివారం’ చేశాను. ఇందులో నేను ఎల్ఐసీ ఏజెంట్ సూర్య పాత్రలో కనిపిస్తాను. సినిమాలో యాక్షన్ ఇరవై శాతమే ఉంటుంది. కానీ యాక్షన్ మోడ్తో కథ ముందుకెళ్తుంటుంది. ఈ సినిమాలోని దయా పాత్రను ఎస్జే సూర్యగారే చేయగలరు. ఈ క్యారెక్టర్తో తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గర కావాలని ఆయన ఏడు రోజులు తెలుగులోనే డబ్బింగ్ చెప్పారు. కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక నటన అలరిస్తుంది. అలాగే ఈ సినిమాలో అదితీ బాలన్ నాకు సిస్టర్గా నటించారు. మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. ఇక సోకులపాలెంతో సూర్య, దయాల కనెక్షన్ ఏంటో సినిమాలో చూడండి. » ‘అంటే.. సుందరానికీ!’ సినిమా పేరు విన్నన్నసార్లు నా హిట్ సినిమాల పేర్లు కూడా వినలేదు. మనం ఓసారి చరిత్రను గమనిస్తే మంచి సినిమాలన్నీ ఆడాయి.. చెడ్డ సినిమాలన్నీ ఆడలేదు అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. మనం ఓ చెడ్డ సినిమా చేసి సక్సెస్ కాలేకపోయామంటే ఈసారి సక్సెస్ చేసి హిట్ సాధించాలని అనుకుంటాం. మేం గతంలో మంచి సినిమానే (‘అంటే.. సుందరానికీ!’ని ఉద్దేశించి) చేశాం. మళ్లీ మంచి సినిమా చేశాం. కాకపోతే ‘అంటే.. సుందరానికీ!’ ఓ జానర్ వాళ్లకు మాత్రమే నచ్చింది. ఆ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంది. ‘సరిపోదా శనివారం’ది కూడా దాదాపు మూడు గంటల నిడివి. కానీ ఈ సినిమా కథ, జానర్ వేరు. » ఓ హీరోకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మళ్లీ నో చాన్స్ అనే లాజిక్ కరెక్ట్ కాదు. ఒకవేళ ఇలా అనుకుంటే ఇండస్ట్రీలో ఏ దర్శకుడికీ, ఏ హీరోకీ సినిమాలు ఉండకూడదు. మన ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు ఫ్లాప్స్ ఉన్నాయి. ఈ లాజిక్ అప్లై అయితే ఇండస్ట్రీలో ఎవరికీ పని ఉండకూడదు... ఒక్క రాజమౌళికి తప్ప. నిజం చెప్పాలంటే వరుస సక్సెస్లు వచ్చినప్పుడు కాస్త ఉదాసీనంగా ఉంటారు. అప్పుడప్పుడూ వైఫల్యాలు చూసినవాడే మరింత కష్టపడతాడు. ఈ సినిమాలో వివేక్ మంచి రేసీ స్క్రీన్ప్లే రెడీ చేశాడు... సినిమా పరిగెడుతుంటుంది. నా ప్రతి సినిమా నిర్మాత బాగుండాలని కోరుకుంటాను. అందుకే దానయ్యగారు నా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లోపాజిటివ్గా మాట్లాడారు. » కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్కు రావడం లేదనే చర్చలు జరుగుతున్నాయి. చెప్పాలంటే... కోవిడ్కు ముందు వెయ్యి కోట్ల రూ΄ాయల కలెక్షన్స్ సాధించిన సినిమా ఒకటే ఉంది. కోవిడ్ తర్వాత మూడు సినిమాలు ఉన్నాయి. అయితే గతంలో పది సినిమాలు వస్తే ఐదారు సినిమాలు ఆడియన్స్కు ఫర్వాలేదనిపించేవి. కానీ ఇప్పుడు పదిలో ఒకట్రెండు సినిమాలే ఆడియన్స్ను అలరిస్తున్నాయి. మంచి కథలతో వస్తే... ఆడియన్స్ థియేటర్స్కి వస్తారు. » లైఫ్లో మెమొరబుల్ మూమెంట్స్ అంటే సినిమాల పరంగా చాలానే ఉన్నాయి. అయితే వ్యక్తిగతంగా మాత్రం నా కొడుకు అర్జున్ పుట్టిన క్షణం నా ఫేవరెట్ మెమొరబుల్ మూమెంట్. -
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది: హీరో నాని కామెంట్స్
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ చిత్రం హిట్టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని మలయాళ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన హేమ కమిటీ నివేదికపై స్పందించారు. అంతే కాకుండా అలాగే కోల్కతా వైద్యవిద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన తనను కలిచివేసిందన్నారు.నాని మాట్లాడుతూ..' ఢిల్లీ నిర్భయ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. మహిళలపై జరుగుతున్న దారుణాలు నిరంతరం కలవరపెడుతున్నాయి. కోల్కతాలో వైద్యవిద్యార్థిని సంఘటన నన్ను కలచివేసింది. మొబైల్ను స్క్రోలింగ్ చేయాలంటే భయంగా ఉంది. సోషల్ మీడియాలో ఎలాంటి వార్త చూడాల్సి వస్తుందో అన్న భయమేస్తోంది. హేమకమిటీ నివేదిక చూసి నేను షాకయ్యా. మహిళలపై లైంగిక వేధింపులు చూస్తుంటే ఎంత దారుణమైన స్థితిలో బతుకుతున్నామో అర్థమవుతోంది. తన సెట్స్లో ఇలాంటి సంఘటనలు జరగడం తానెప్పుడూ చూడలేదు. 20 సంవత్సరాల క్రితం పరిస్థితి మెరుగ్గా ఉండేది. అప్పటి రోజుల్లో మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పటి పరిస్థితులు తలచుకుంటేనే చాలా దారుణంగా ఉందనిపిస్తోంది' అని అన్నారు. కాగా..నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. -
'పోతారు.. మొత్తం పోతారు..' హీరో నాని ఆసక్తికర కామెంట్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి చిత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మరోసారి వీరిద్దరు జతకట్టడంతో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.నాని మాట్లాడుతూ.. 'కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమానే సరిపోదా శనివారం. ఇది చాలా నమ్మకంగా చెబుతున్నా. కొవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని చాలామంది అంటున్నారు. కానీ మంచి సినిమా తీస్తే తప్పకుండా వస్తారు. వస్తూనే ఉంటారు. ఆడియన్స్ ఎప్పుడూ మిస్ అవ్వరు. మనమే అప్పుడప్పుడు మిస్సవుతుంటాం. పోతారు.. మొత్తం పోతారు.. ఆగస్టు 29 అందరూ థియేటర్లకే పోతారు. వివేక్ ఆత్రేయ కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. -
ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు: హీరో నాని
‘‘ఈ మధ్య కొన్ని చోట్ల గమనించాను. ఏంటి సార్... కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమాలకు రావడం లేదంటున్నారు. మంచి సినిమాలు ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు సార్. వస్తూనే ఉంటారు. మనమే అప్పుడప్పుడు మిస్ అవుతుంటాం. ఈసారి మిస్ అయ్యేదే లేదు. డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కు ఏదైనా మాట చెప్పాల్సి వస్తే మనదో సామెత ఉంది. ‘కలిసొచ్చే కాలం వస్తే... నడిచొచ్చే సినిమా వస్తుంది’’ అంటారు కదా. సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు... థియేటర్స్కు పోతారు’’ అని నాని అన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘దయా పాత్రను మేం ఊహించినదానికన్నా ఎక్కువగా చేశారు ఏస్జే సూర్యగారు. దానయ్యగారు పాజిటివ్ పర్సన్ . అందుకే మంచి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిర్మాత కల్యాణ్కు ఈ సినిమా ట్రైనింగ్ గ్రౌండ్ అనుకోవచ్చు. వివేక్ ఆత్రేయ శివతాండవం ఏంటో థియేటర్స్లో చూస్తారు. ఈ సినిమా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పారు. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ!’ సినిమా రిలీజ్ డే రోజు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కొందరు ల్యాగ్ అన్నారు. మరికొందరు బాగుంది అన్నారు. అయితే నానీగారు నాకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. చాన్స్ అన్నది చాలా చిన్న పదం. నానీగారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు’’ అని తెలిపారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘కథల ఎంపికలో నానీగారు నంబర్ వన్ . కథ నచ్చితే కొత్త దర్శకులకూ అవకాశం ఇస్తారు. నానీగారితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. సాధారణంగా నేను ఏ సినిమా వేదికపైనా ఇంత మాట్లాడలేదు. సినిమా మాట్లాడిస్తుంది. ‘సరిపోదా శనివారం’ సినిమా చూశాను. పెద్ద బ్లాక్బస్టర్ అవుతుంది. ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ ఓ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు’’ అని చెప్పారు. ‘‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పాను. తెలుగు ప్రేక్షకుల కోసం సొంత డబ్బింగ్ చెప్పాను’’ అని వెల్లడించారు ఎస్జే సూర్య. ‘‘సూర్య (నాని పాత్ర), చారులత (ప్రియాంక పాత్ర)లను గుర్తు పెట్టుకుంటారు’’ అని తెలిపారు ప్రియాంకా అరుళ్. ‘‘నాని కష్టపడి స్టార్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై మన ఖ్యాతి చాటారు డీవీవీ దానయ్య, రాజమౌళిగార్లు’’ అని పేర్కొన్నారు నటుడు అలీ. అతిథులుగా పాల్గొన్న దర్శకులు దేవా కట్టా ప్రశాంత్ వర్మ , శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. నాని తండ్రి రాంబాబు, సంగీత దర్శకుడు జేక్స్, కెమెరామేన్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
నాని సినిమా 'సరిపోదా శనివారం' రన్టైమ్ ఇదే
నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగష్టు 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అయితే, తాజాగా ‘సరిపోదా శనివారం’ సెన్సార్ పూర్తి చేసుకుంది.భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా సెన్సార్ వచ్చేసిందని ఒక వీడియో ద్వారా నాని, ఎస్జే సూర్య,ప్రియాంక మోహన్ కాస్త డిఫరెంట్గా తెలిపారు. సెన్సార్ బోర్డ్ U/A సర్టీఫికెట్ ఇచ్చిందని వారు చెప్పారు. సినిమా రన్టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉన్నట్లు నాని ప్రకటించారు. అయితే, వెంటనే తెరపైకి ఎస్జే సూర్య ఎంట్రీ వచ్చి ప్లస్ 15 మినిట్స్ అంటాడు. దీంతో సినిమా మొత్తం 2 గంటల 50 నిమిషాలు ఉన్నట్లు ప్రకటించారు. అంటే సుందరానికి.. కూడా ఇదే రన్ టైం కదా అంటూ ఎస్జే సూర్య గుర్తు చేసే ప్రయత్నం చేస్తుండగా.. అంటే కాదు ‘సరిపోదా శనివారం’ యాక్షన్ ఫిల్మ్ అని నాని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ వెంటనే ప్రియాంక ఎంట్రీ ఇచ్చి లవ్స్టోరీ కూడా అంటూ కామెంట్ చేస్తుంది. ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంటే సుందరానికి, సరిపోదా శనివారం.. రెండు చిత్రాలకు దర్శకుడు వివేక్ ఆత్రేయ కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి సినిమా రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.🥶#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/lsfX1uQevb— Nani (@NameisNani) August 23, 2024 -
కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని
టాలీవుడ్ హీరో నాని.. కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఇతడి కూడా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఉంది. వీళ్లిద్దరూ జంటగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శ్రీవారిని దర్శించుకున్నారు.(ఇదీ చదవండి: విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?)శుక్రవారం రాత్రి తిరుపతి చేరుకున్న నాని కుటుంబం.. అలిపిరి మెట్ల మార్గాన తిరుమల చేరుకున్నారు. కొండపైన రాత్రి బస చేసి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొక్కులు కూడా చెల్లించుకున్నారు. దర్శనానంతరం బయటకు రాగా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.(ఇదీ చదవండి: ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్) -
చిరంజీవి గారితో నన్ను పోల్చడం.. కల్కి 2 లో నాని..?
-
ప్రభాస్ను చిన్నచూపు చూసిన బాలీవుడ్ నటుడు.. నాని ఏమన్నాడంటే?
హీరో ప్రభాస్ను చులకన చేస్తూ మాట్లాడిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పేరు గత కొద్దిరోజులుగా మారుమోగిపోతోంది. పాన్ ఇండియా స్టార్ను పట్టుకుని కల్కిలో తన లుక్ జోకర్లా ఉందని హేళన చేస్తావా? అంటూ సినీ తారలు, అభిమానులు అతడిని ఏకిపారేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన నాని.. అతడికి జీవితంలో ఇంత పబ్లిసిటీ ఎప్పుడూ వచ్చి ఉండదు. మీరు అనవసరంగా ప్రాముఖ్యత లేని విషయాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారని మీడియాతో అన్నాడు. హిందీలో రిలీజ్ చేస్తున్నారని మర్చిపోయావా?సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్ల సమయంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఉత్తరాది నటుడు అర్షద్.. ప్రభాస్ను ఏమీ అనలేదు, ఆయన లుక్ను మాత్రమే విమర్శించాడు. అంతదానికే ఇలా సెటైర్లు వేయాలా? అని కొందరు ఆగ్రహించారు. నీ సినిమా హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడంటూ నార్త్ ఆడియన్స్ నానికి కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో నేచురల్ స్టార్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. తప్పుగా అర్థం చేసుకున్నారుకొన్నిసార్లు మనం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు దాని భావాలే మారిపోతాయి. సోషల్ మీడియాలో ఇదే జరుగుతుంది. అనవసరమైన విషయాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని ఇంగ్లీష్లో చెప్పాను. అది జనాలకు మరోలా అర్థమైంది. నిజానికి అర్షద్ మంచి నటుడు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరూ మున్నాభాయ్ సినిమాలో అతడి పాత్రను ప్రేమించారు.జాగ్రత్తగా ఉండాలిఅయితే మనం ఇంట్లోనో, ఫ్రెండ్స్తోనో ఉన్నప్పుడు సినిమాలు, యాక్టర్స్ గురించి ఎలా మాట్లాడుకున్నా పర్లేదు. కానీ బయటకు వచ్చినప్పుడు ఒక నటుడిగా పదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా అర్షద్ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అభిప్రాయపడ్డాడు. -
నాని సినిమా ఇప్పట్లో లేనట్టేనా..?
-
గేమ్ ఛేంజర్ సెట్లో ఈ సినిమా గురించే చర్చ: దిల్ రాజు కామెంట్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ 'సరిపోదా శనివారం'. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. దసరా, హాయ్ నాన్న తర్వాత నాని నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆర్జే సూర్య గురించి ప్రస్తావించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'గేమ్ ఛేంజర్ షూటింగ్లో ఎక్కువగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. గ్యాప్ వచ్చినప్పుడల్లా నానికి, ఎస్జే సూర్య మధ్య సీన్స్ గురించి చెప్పేవారు. నానికి కూడా విలన్గా ఎస్జే సూర్య దొరకడం చూస్తుంటే ఫుల్ మజా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తున్నందుకు ఎస్జే సూర్యకు థ్యాంక్స్. సరిపోదా శనివారం చిత్రంలో నాని, ఎస్జే సూర్య, ట్రైలర్ చాలు. ఈ మూవీ దసరాను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.' అని అన్నారు. "Aug 29th na #Nani garu malli #Dasara records anni badhalu kodtaru ani korukuntunna"💥Producer #DilRaju garu at the #SaripodhaaSanivaaram Press Meet ❤️🔥 #NaturalStarNani #SJSuryah #YouWeMedia pic.twitter.com/YsmDl6nxtL— YouWe Media (@MediaYouwe) August 21, 2024 -
హీరో నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
టాలీవుడ్ ఆశలన్నీ నాని 'శనివారం' పైనే..
ఆగస్టు 15 లాంటి లాంగ్ వీకెండ్ని తెలుగు సినిమా సరిగా ఉపయోగించుకోలేకపోయింది. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలు ఫెయిలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన 'ఆయ్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ షోలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో ఎప్పటిలానే ఓ మాదిరి వసూళ్లతో సర్దుకోవాల్సి వస్తుంది.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)సంక్రాంతికి 'హనుమాన్'.. మార్చిలో 'టిల్లు'.. జూన్లో 'కల్కి' తప్పితే టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగా ఉంది. చిన్న సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ గట్టిగా నిలబడలేకపోతున్నాయి. కొన్ని మంచి చిత్రాలు ఉన్నప్పటికీ థియేటర్లకి ఇవి జనాల్ని తీసుకురాలేకపోతున్నాయి. దీంతో నెక్స్ట్ పెద్ద మూవీ ఏంటా అని చూస్తే నాని 'సరిపోదా శనివారం' కాస్త గట్టిగా కనిపిస్తోంది.యాక్షన్ ప్లస్ డ్రామా స్టోరీతో తీసిన ఈ సినిమా ఆగస్టు 29న రానుంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కూడా ప్రామిసింగ్గా ఉంది. దీంతో టాలీవుడ్ ప్రస్తుతం దీనిపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఇది హిట్ కావడం నానితో పాటు ఇండస్ట్రీకి కూడా ముఖ్యమే. ఆపై నెలల్లో 'దేవర', 'పుష్ప', 'గేమ్ ఛేంజర్' తదితర సినిమాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: 'బాడ్ల్యాండ్ హంటర్స్' రివ్యూ..ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోలు) -
సుదర్శన్ థియేటర్లో ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది: నాని
‘‘హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. ఈ థియేటర్లో మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) కలసి ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ లాంచ్ వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది. మీ ప్రేమను నాపై ఇలానే చూపిస్తూ ఉంటే వంద శాతం కష్టపడి మరిన్ని మంచి చిత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’’ అని హీరో నాని అన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘29న థియేటర్స్లో ‘సరిపోదా శనివారం’ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు.నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘చాలా మంచి కంటెంట్ ఉన్న చిత్రం ఇది.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘గ్యాంగ్ లీడర్’ సినిమా తర్వాత నానీగారితో ‘సరిపోదా శనివారం’ చేశాను. అందరూ కుటుంబంతో వెళ్లి మా సినిమా చూడండి’’ అని ప్రియాంకా అరుళ్ మోహన్ చెప్పారు. ‘‘మా సినిమా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది’’ అన్నారు డీవీవీ దానయ్య. -
'నాకు కోపం వచ్చిందంటే.. ఇది నా సమస్య'.. 'సరిపోదా శనివారం' ట్రైలర్ వచ్చేసింది!
హాయ్ నాన్న మూవీ తర్వాత నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందెన్నడు చేయని పాత్రలో నాని కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే నాని యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తోన్న ఈ సినిమాలో నాని ఫ్యాన్స్కు మరోసారి ఫుల్ మాస్ యాక్షన్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఎస్జే సూర్య పోలీస్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. -
'సరిపోదా శనివారం ట్రైలర్ ఈవెంట్' .. స్పెషల్ అట్రాక్షన్గా 70 ఏళ్ల బామ్మ!
హాయ్ నాన్న మూవీ తర్వాత నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందెన్నడు కనిపించని పాత్రలో నాని నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సరిపోదా శనివారం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 70 ఏళ్ల భామ తన అభిమాన హీరో నాని చూసేందుకు వచ్చింది. ఆమెను గమనించిన హీరో నాని సంతోషం వ్యక్తం చేశారు. మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ బామ్మను హీరో నాని పలకరించాడు. ఈ ఈవెంట్లో మీరు ఎంతో స్పెషల్ అని ఆయన అన్నారు. అనంతరం అభిమానులతో సెల్ఫీ తీసుకున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. 70 years old lady cheers got #Nani at #SaripodhaaSanivaaram Grand Trailer Launch Event💥 #NaturalStarNani #SaripodhaaSanivaaramTrailer pic.twitter.com/jouQRl0L1L— YouWe Media (@MediaYouwe) August 13, 2024 -
ఇస్మార్ట్ గా మారబోతున్న నాని..
-
అవార్డులు తీసుకోవడంపై ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది: హీరో నాని
ఏ నటుడికైనా అవార్డులు తీసుకోవడం అంటే అదో పెద్ద అచీవ్మెంట్. కానీ ప్రముఖ హీరో నాని మాత్రం తనకు ఇలా అవార్డులు తీసుకోవడంపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని అన్నాడు. తాజాగా శనివారం హైదరాబాద్లో జరిగిన 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఇతడు ఈ కామెంట్స్ చేశాడు. 'దసరా' చిత్రానికి గానూ ఉత్తమ నటుడు అవార్డ్ తీసుకున్న టైంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్)'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టేజీపై అవార్డులు తీసుకుంటున్న యాక్టర్స్ని చూసినప్పుడు ఏదో ఓ రోజు ఆ స్థాయికి వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. రోజురోజుకీ అది తగ్గిపోతూ వచ్చింది. అవార్డులపై ఇప్పుడంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే.. నా సినిమా దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్, నటీనటులతో పాటు నా నిర్మాణ సంస్థలో పరిచయమైన కొత్త యాక్టర్స్ అవార్డులు తీసుకుంటే అందరితో కలిసి చూడాలనుకుంటున్నాను. ఈ రోజు కూడా నేను అవార్డు తీసుకోవడానికి రాలేదు. శౌర్యువ్ (హాయ్ నాన్న దర్శకుడు), శ్రీకాంత్ ఓదెల్ (దసరా దర్శకుడు) అవార్డులు తీసుకుంటే చూడాలని''ఉత్తమ పరిచయ దర్శకుల విభాగంలో వాళ్లిద్దరూ అవార్డులు దక్కించుకోవడం, వాటిని నేను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ప్రతిభావంతమైన కొత్త ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ప్రయాణంలో నేను భాగమైతే అది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ తొలి అడుగులో నేనో ఇటుకగా మారితే అది నాకు పెద్ద అవార్డ్. అది చాలు నాకు. 2023 నాకెంతో ప్రత్యేకం. థ్యాంక్యూ సో మచ్' అని నాని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల లగ్జరీ కారు కొనేసిన ప్రముఖ సింగర్) -
నాని సెట్ చేసుకున్న లైన్ అప్ మొత్తం చేంజ్
-
నాని కొత్త పోస్టర్.. సమంత వైరల్ ఫోటో.. గ్లామర్తో ఇచ్చిపడేసిన ప్రగ్యా జైస్వాల్
త్రీడీలో మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్సరిపోదా శనివారం చిత్రం నుంచి నాని వదిలిన కొత్త పోస్టర్బ్లూ కలర్ డ్రెస్లో గ్లామర్తో ఇచ్చిపడేసిన ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Nani (@nameisnani) View this post on Instagram View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Shweta Tripathi Sharma (@battatawada) View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) -
రైటర్ నాని?
హీరో నాని రైటర్గా మారనున్నారా? అంటే అవుననే మాట ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై దర్శకుడు శైలేష్ కొలనుతో ‘హిట్, హిట్ 2’ సినిమాలను నిర్మించారు నాని. ఈ రెండు చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ‘హిట్ 2’ సినిమా చివర్లో ‘హిట్ 3’లో నాని హీరోగా పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాదిలోనే ‘హిట్ 3’ చిత్రీకరణప్రారంభం కానుందట.‘హిట్, హిట్ 2’ సినిమాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలనే ‘హిట్ 3’ని తెరకెక్కించనున్నారు. కానీ ఈ సినిమాకు నాని కథ–స్క్రీన్ప్లే అందించనున్నారని భోగట్టా. మరి.. ఈ సినిమాతో నాని రైటర్గా మారతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్టు 29న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇంకా ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరో సినిమా కమిటైన సంగతి తెలిసిందే. -
మళ్లీ ఎటో వెళ్లిపోయింది మనసు...
ప్రేమకథలను ఇష్టపడే వారి జాబితాలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ (2012) సినిమా కూడా ఉంటుంది. నాని, సమంత లీడ్ రోల్స్లో నటించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రేష్మా, ఎస్. వెంకట్, సి. కల్యాణ్, సీవీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఇళయరాజా అందించిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కాగా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా రీ రిలీజ్ కానుంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ ఆగస్టు 2న ఈ సినిమాను మళ్లీ విడుదల చేయనున్నారు. ‘‘ప్రస్తుతం తెలుగులో రీ–రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఈ ఫీల్ గుడ్ లవ్స్టోరీ సినిమా మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
రీరిలీజ్కి రెడీ అయిన సమంత సినిమా!
టాలీవుడ్లో ఇప్పుడు రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోహీరోయిన్ల హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజ్ అయి..మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు సమంత నటించిన ఓ సినిమా కూడా రీరిలీజ్ కాబోతుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత, నాని జంటగా నటించిన చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను క్లాసిక్గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ చిత్రాన్ని వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. -
సరితూగే సమరమే...
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సరిపోదా శనివారం’. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఎస్జే సూర్య, సాయికుమార్ లీడ్ రోల్స్లో నటించారు.శనివారం (జూలై 20) ఎస్జే సూర్య బర్త్ డే సందర్భంగా ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త వీడియోను రిలీజ్ చేశారు. ‘సరితూగే సమరమే... సంహారం తథ్యమే’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు నాని. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న రిలీజ్ కానుంది. -
శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. పేరుకి తగ్గట్లే అప్డేట్స్ అన్నీ ఒక్కో శనివారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇందులో విలన్గా నటిస్తున్న ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. టీజర్ కానీ టీజర్ అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది?(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?)ప్రతి శనివారం.. హీరో రకరకాలుగా ప్రవర్తించడం అనే స్టోరీతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్ కాగా.. తమిళ నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడు. కృూరమైన పోలీస్ అధికారిగా చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది.నాని-ప్రియాంక శ్రీకృష్ణుడు-సత్యభామగా.. ఎస్జే సూర్య నరకాసురుడు అని చెప్పడం లాంటి రిఫరెన్సులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. టీజర్ కాని టీజర్ అంటూనే ఆసక్తి రేకెత్తించారు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?) -
నాని కొత్త సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్!
-
టాలీవుడ్ పై కన్నేసిన జాన్వీ..
-
సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. టాలీవుడ్ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్ 2018, దర్శన్ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి.ఉత్తమ చిత్రం కోసం బరిలో ఉన్న సినిమాలు సలార్: సీజ్ ఫైర్దసరాహాయ్ నాన్నమిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిబేబీబలగంసామజవరగమనఉత్తమ నటుడి అవార్డ్ లిస్ట్లోచిరంజీవి (వాల్తేర్ వీరయ్య)బాలకృష్ణ (భగవంత్ కేసరి)ఆనంద్ దేవరకొండ (బేబీ)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ధనుష్ (సర్)నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)ఉత్తమ నటి కోసం పోటీ పడుతున్న హీరోయిన్లుకీర్తిసురేశ్ (దసరా)సమంత (శాకుంతలం)అనుష్క (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)వైష్ణవీ చైతన్య (బేబీ)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న) ఉత్తమ దర్శకుడు కోసం బరిలో ఉన్న డైరెక్టర్స్ ప్రశాంత్నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)వేణు యెల్దండ (బలగం)శ్రీకాంత్ ఓదెల (దసరా)అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)శౌర్యువ్ (హాయ్ నాన్న)కార్తిక్ దండు (విరూపాక్ష)సాయి రాజేశ్ (బేబీ) -
ఈ దశాబ్దంలో నా ఫేవరేట్ మూవీ అదే: హీరో నాని కామెంట్స్
టాలీవుడ్ హీరో నాని గతేడాది హాయ్ నాన్నతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ నటుడు ఎస్జే సూర్య, సాయికుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలోకి రానుంది.అయితే తాజాగా హైదరాబాద్లో జరిగిన డార్లింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలోనే తనకిష్టమైన సినిమా బలగం అని నాని అన్నారు. బలగం హీరో ఫ్యాన్గా ఈవెంట్కు వచ్చానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. డార్లింగ్ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని.. నీ కెరీర్లో ఒక మైల్స్టోన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.అనంతరం ప్రియదర్శి సైతం నాని గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో నాలాంటి వారికి నాని అన్ననే ఆదర్శమని అన్నారు. ఎలాంటి బ్యాగ్గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. సినిమాల్లో నువ్వు కృష్ణుడు అయితే.. నేను అర్జునుడిని అంటూ నానిపై ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన డార్లింగ్ మూవీ ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. Grandfather time lo #SrNTR Inspiration,Nanna time lo #Chiranjeevi Inspiration,Aa tarwtha #RaviTeja Inspiration.Ma generation ki @NameisNani Inspiration.#Nani Anna, A Genuine Person❤️.Can’t wait for #SaripodhaaSanivaaram @DVVMovies #VivekAthreya pic.twitter.com/PPf7HhxjEP— Saikumar Devendla (@saidevendla) July 16, 2024#Nani About #Balagam and #Darling Film 💥💥💥💥pic.twitter.com/fH1HSAhYrG— GetsCinema (@GetsCinema) July 15, 2024 -
తొలి సినిమా రిలీజ్ కాలేదు.. జాన్వీకి తెలుగులో మూడో ఛాన్స్?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతోనే ఈమె బాగా ఫేమస్. చాన్నాళ్ల క్రితమే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న దేవర, RC 16 ప్రాజెక్టులపై బోలెడు ఆశలు పెట్టేసుకుంది. ఈ రెండు ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే మూడో అవకాశం కూడా పట్టేసిందట.శ్రీదేవి కుమార్తెగా అందరికీ తెలిసిన జాన్వీ.. 'దఢక్' సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు కమర్షియల్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ ఫేమ్ ఓ మాదిరిగా వచ్చింది. యాక్టింగ్ పరంగా ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నారు. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'దేవర'లో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. సెప్టెంబరులో మూవీ రిలీజైతే ఈమె భవిష్యత్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)దీనితో పాటు రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో మూవీలోనూ హీరోయిన్ జాన్వీనే. దీని షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. ఈ రెండు సెట్స్పై ఉండగానే ఇప్పుడు జాన్వీని మరో ఛాన్స్ వరించిందట. 'దసరా'తో హిట్ కొట్టిన నాని-శ్రీకాంత్ ఓదెల.. మరో మూవీ కోసం పనిచేస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలవనుంది. ఇందులోనే హీరోయిన్గా జాన్వీని అనుకుంటున్నారట. ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.తెలుగులో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇంతలోనే జాన్వీకి మూడో ఛాన్స్ అంటే ఆశ్చర్యమే. అయితే జాన్వీని తీసుకుంటే తమ సినిమాకు పాన్ ఇండియా వైడ్ మరింత రీచ్ వస్తుందని బహుశా నాని-శ్రీకాంత్ ఓదెల భావించి ఉండొచ్చు. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది.(ఇదీ చదవండి: మ్యూజీషియన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
Darling Movie Pre Release Event: ప్రియదర్శి ‘డార్లింగ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తున్నాం: నాని
‘‘ఈ మధ్య సినిమాల్లో యాక్షన్ ఎక్కువైపోయి ప్రేమకథలు, వినోదం చాలా మిస్ అవుతున్నాం. చిన్నప్పుడు అన్నిరకాల జానర్స్ మూవీస్ వచ్చేవి.. అన్నింటినీ ఎంజాయ్ చేసేవాళ్లం. థియేటర్స్కి వెళ్లడానికి ఎక్కువ కారణాలుండేవి. కానీ, ఇప్పుడు మనకు తెలియకుండానే ఒకే జానర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తున్నాం. అందరం కామెడీ, లవ్స్టోరీ, ఎమోషనల్, యాక్షన్.. ఇలా అన్ని జానర్స్ టచ్ చేయాలి. ప్రియదర్శిలాంటి ప్రతిభ ఉన్న నటుడు వైవిధ్యమైన జానర్స్ ఎంచుకోవడం గర్వంగా ఉంది’’ అని హీరో నాని అన్నారు.ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనన్య నాగళ్ల కీలక పాత్ర చేశారు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ–‘‘డార్లింగ్’ మూవీ టీజర్, ట్రైలర్ చాలా వినోదాత్మకంగా ఉంది. సినిమా పెద్ద బ్లాక్బస్టర్ కావాలి. ‘హను–మాన్’ మూవీ స్థాయిలో ‘డార్లింగ్’ విజయం సాధించాలి.వివేక్ సాగర్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే అశ్విన్ రామ్ ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తోంది. నభా నటేశ్.. ప్రమాదం తర్వాత నీ కొత్త అధ్యాయం ‘డార్లింగ్’ తో ప్రారంభమైంది. దర్శి అంటే నాకు చాలా ఇష్టం. తన నటన, చేసే పాత్రలు ఇష్టం. అందుకుని ‘డార్లింగ్’ ఈవెంట్కి రాలేదు. నాకు ఇష్టమైన ‘బలగం’ మూవీ హీరో అని, ‘బలగం’ మూవీ అభిమానిగా వచ్చా. ‘బలగం’ స్థాయిలో ‘డార్లింగ్’ విజయం సాధించాలి.ఈ మూవీ తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలి. నా వాల్పోస్టర్ ప్రొడక్షన్లో నేను నిర్మించనున్న తర్వాతి సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తాడు. జగదీశ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తాడు’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ నరేశ్ రామదురై, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అనన్య నాగళ్ల, డైరెక్టర్స్ వీఐ ఆనంద్, వేణు యెల్దండి పాల్గొన్నారు. -
మనకే మనమే ఎవరో..!
‘అరె ఏమైయ్యింది ఉన్నట్టుండి ఇవ్వాళే... అలవాటే లేని ఏవో ఆనందాలే..’ అంటూ మొదలవుతుంది ‘సరిపోదా శనివారం’ సినిమాలోని ‘ఉల్లాసం’ పాట. నాని, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘సరిపోదా శనివారం’ సినిమాలోని ‘ఉల్లాసం’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఉల్లాసం ఉరికే ఎదలో... ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో... ఉప్పుంగే ఊహల జడిలో... మనకే మనమే ఎవరో...’ అంటూ సాగే ‘ఉల్లాసం’ పాటను సినరే రాయగా, సంజిత్ హెగ్డే–ముత్యాల కృష్ణ లాస్య పాడారు. ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్. -
హింసకు బీమా!
సూర్య కోపంగా ఉంటే ఎలా ఉంటాడో చూశాం. కానీ కూల్గా ఉంటే ఇలా ఉంటారంటూ చూపిస్తున్నారు ‘సరిపోదా శనివారం’ సినిమా మేకర్స్. నాని హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఇందులో నాని పాత్ర పేరు సూర్య. గురువారం ఈ సినిమా నుంచి సూర్య సెకండ్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘సండే టు ఫ్రైడే.. వయొలెన్స్కి ఇన్సూరెన్స్ (హింసకు బీమా) సూర్య’ అంటూ తన సెకండ్ లుక్ను ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాని.అంటే... మిగతా రోజుల్లో కూల్గా ఉండే సూర్య శనివారం శత్రువుల భరతం పడతాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న విడుదల కానున్న ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: జి. మురళి. -
కాంబినేషన్ కుదిరేనా?
హీరో నాని, దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ కొత్త కథను సిద్ధం చేశారట. ఈ కథలోని హీరో పాత్రకు నాని అయితే సరిపోతారని ఆయన భావిస్తున్నారట. దీంతో ఈ దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన అధికారికంగా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.కాగా ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాతో బిజీగా ఉన్నారు నాని. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. మరోవైపు నాగార్జున, ధనుష్ హీరోలుగా నటిస్తున్న ‘కుబేర’ సినిమాతో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా నాని, శేఖర్ల ప్రస్తుత కమిట్మెంట్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత వీరి కాంబినేషన్లోని సినిమా గురించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి.. ఈ కాంబి నేషన్ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. -
‘బలగం’వేణుకి షాకిచ్చిన నాని.. ‘ఎల్లమ్మ’ రానట్లేనా?
హీరో నాని సినిమా ప్లానింగ్ గురించి అందరికి తెలిసిందే. చేతిలో ఒక్క సినిమా ఉండగానే..మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేసుకుంటాడు. అందుకే హిట్, ఫ్లాప్ తేడా లేకుండా ఈ నేచురల్ స్టార్ నుంచి వరుస సినిమాలు వస్తుంటాయి. గతేడాది డిసెంబర్లో ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులను పలకరించిన నాని..ఇప్పుడు ‘సరిపోదా శనివారం’తో రాబోతున్నాడు. ఆగస్ట్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. (చదవండి: నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను)ఈ చిత్రం తర్వాత వరుసగా మూడు సినిమాలు చేయాల్సింది. అందులో ఒకటి బలగం వేణుతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కాలి. నాని కోసం ‘ఎల్లమ్మ’ టైటిల్తో వేణు ఓ కథను కూడా రెడీ చేశాడట. ‘సరిపోదా శనివారం’ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. (చదవండి: రిలీజ్కు ముందే కల్కి మరో రికార్డు.. )కానీ ఇప్పుడు ఈ చిత్రం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. నానినే ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. బలగం వేణు చెప్పిన కథకు, శ్రీకాంత్ ఓదెల చెప్పిక కథల మధ్య సారూప్యత ఉండడంతో..నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు సాహో ఫేం సుజిత్ సినిమాను కూడా నాని రిజెక్ట్ చేశాడు. మంచి కథ దొరికితే భవిష్యత్తులో నాని-వేణు కాంబినేషన్ కొనసాగే అవకాశం ఉంది. -
బలగం వేణుకి షాక్ ఇచ్చిన నాని..?
-
గరం గరం యముడయో...
అతనితో పెట్టుకున్నవారి పాలిట యమడవుతాడు... గొడ్డలి చేత పట్టాడా అంతే సంగతులు. శత్రువులను పరుగులు పెట్టించి మరీ రఫ్ఫాడేస్తాడు. ‘సరిపోదా శనివారం’లో నాని చేస్తున్న సూర్య క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘గరం గరం... ’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. ‘గరం గరం యముడయో.. సహనాల శివుడయో..’ అంటూ ఈ పాట సాగుతుంది.హీరో ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చుతాడో ఈ పాటలో నాని లుక్స్, చేసే ఫైట్ ద్వారా చూపించారు. సంగీతదర్శకుడు జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటకు సహపతి భరద్వాజ్ సాహిత్యం అందించగా విశాల్ దద్లానీ పాడారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జె సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
తొలి పాటలోనే 'గరం గరం' అంటూ నాని రచ్చ
నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'గరం గరం' అంటూ సాగే ఈ పాట నాని అభిమానుల్లో జోష్ను నింపుతుంది. హై బడ్జెట్తో యూనిక్ అడ్వంచర్గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజోయ్ అందించారు. -
సమ్మర్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక మోహన్
సమ్మర్ వచ్చిందంటే సినీ తారల్లో చాలా మంది విదేశీ ట్రిప్కు రెడీ అయిపోతారు. అలాంటి ట్రిప్ను నటి ప్రియాంక మోహన్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషతోపాటు, తెలుగు, తమిళం భాషల్లోనూ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. తెలుగులో 'నాని' సరసన 'గ్యాంగ్లీడర్' చిత్రంలో నటించిన ఈమె ఆ తరువాత తమిళంలో శివకార్తీకేయన్కు జంటగా డాక్టర్, డాన్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి హిట్ కావడంతో ఈ వెంటనే నటుడు సూర్యకు జంటగా ఎదుర్కు తుణిందవన్ (ET) చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రియాంక మోహన్కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఇటీవల ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తొలి రోజుల్లో పక్కింటి అయ్యాయి ఇమేజ్ను తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు గ్లామరస్ ఫొటోలతో హల్చల్ చేస్తూ అలాంటి పాత్రలకు రెడీ అనే సిగ్నల్ను పంపుతున్నారు. కాగా ప్రస్తుతం మరోసారి తెలుగులో నాని సరసన సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో యువ నటుడు కవిన్తో జత కట్టే అవకాశం తలుపు తట్టింది. ఇలా నటిగా బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ ప్రస్తుతం సమ్మర్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏ దేశంలో ఉన్నారో గానీ అక్కడ దిగిన ఫొటోలను సామాజక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
ఎల్బీ స్టేడియంలో ఘనంగా ‘డైరెక్టర్స్ డే’ సెలబ్రేషన్స్ ( ఫొటోలు)
-
బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
రూ.100 కోట్ల కలెక్షన్స్.. ఒకప్పుడు టాలీవుడ్కి ఇది రికార్డు కలెక్షన్స్. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. మాములు హీరోల సినిమాలకు రూ.20 కోట్లు వస్తేనే అది సూపర్ హిట్. కానీ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి మారింది. కుర్రహీరోలు సైతం బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రికార్డు స్థాయి కలెక్షన్స్ని రాబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ కలెక్షన్స్ని యంగ్ హీరోస్ రాబడుతున్నారు. మన టాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న యంగ్ హీరోలపై ఓ లుక్కేయండి -
క్లైమాక్స్లో సరిపోదా
నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ కనిపించని ఇంటెన్స్ పవర్–ప్యాక్డ్ క్యారెక్టర్లో నాని కనిపించనున్నారు. హై బడ్జెట్తో యూనిక్ అడ్వంచర్గా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ను ప్రారంభించాం. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అద్భుతమైన సెట్ను నిర్మించాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న ఈ సినిమా విడుదల కానుంది’’ అన్నారు. సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
-
పేర్ని కిట్టు నామినేషన్ కార్యకర్తగా మారిన పేర్ని నాని
-
నేను లేనుగా.. ఎవరితో చేస్తారో చేసుకోండి: నాని
ప్రస్తుతం అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 'పుష్ప 2', 'సలార్ 2'.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మూవీస్ లైన్లో ఉన్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలే కాదు మ్యాడ్ 2, ప్రేమలు 2 లాంటివి కూడా సెట్స్పైకి వెళ్లాయి. దీంతో ఆటోమేటిక్గా హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి రిక్వెస్ట్ హీరో నానికి ఎదురైంది. దీనికి అతడు ఇచ్చిన సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా అనిపించింది. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) నేచురల్ స్టార్ నాని కెరీర్లో బెస్ట్ మూవీ అంటే 'జెర్సీ' అని చెప్పొచ్చు. క్రికెట్ బ్యాక్ డ్రాప్తో తీసిన ఈ చిత్రం ఎలాంటి కమర్షియల్ అంశాలు లేనప్పటికీ అద్భుతమైన హిట్గా నిలిచింది. ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని రీసెంట్గా హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో రీ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే 'జెర్సీ' మూవీకి సీక్వెల్ కావాలని నానికి అభిమానుల నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తాజాగా 'ఆ ఒక్కటి అడక్కు' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న నానికి ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో.. 'నేను లేనుగా, ఎవరితో చేస్తారో చేసుకోండి' అని నాని సమాధానమిచ్చాడు. నాని చెప్పిన దానిబట్టి చూస్తే 'జెర్సీ' సీక్వెల్ కష్టమే. ఎందుకంటే సినిమాలో నాని పాత్ర చనిపోతుంది. ఒకవేళ సీక్వెల్ తీయాలన్నా ఈ పాత్ర లేకుండా సాధ్యం అవుతుందా లేదా దర్శకుడికే తెలియాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్) -
వేడుకలో...
నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ కథానాయిక. సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నాని, సాయికుమార్ ఉన్న కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. సూర్యగా నాని, శంకరంగా సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో ఏదైనా వేడుకకు సంబంధించిన ఫొటో అన్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ‘‘హై బడ్జెట్తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 29న రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
హాయ్ నాన్నకు అవార్డుల పంట.. ఏకంగా 11 విభాగాల్లో!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. గతేడాది రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్తో శౌర్యవ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. న్యూయార్క్లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఒనిరోస్ ఫిల్మ్ ప్రకటించిన విభాగాల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్ ట్రాక్, ఉత్తమ ఎడిటింగ్ల్లో 11 అవార్డులు గెలుచుకుంది. కాగా.. ఈ చిత్రాన్ని హాయ్ డాడీ పేరుతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు అవార్డ్స్ దక్కడం పట్ల డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. -
గుర్తింపు అవసరం లేదు!
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గత ఏడాది మార్చి 30న విడుదలైన ‘దసరా’ చిత్రం హిట్గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. నాని కెరీర్లోని ఈ 33వ సినిమాను ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరియే నిర్మించనున్నారు. ‘దసరా’ విడుదలై, ఏడాది పూర్తయిన సందర్భంగా తాజా చిత్రాన్ని శనివారం (మార్చి 30)న అధికారికంగా ప్రకటించింది యూనిట్. ‘లీడర్ కావాలనుకుంటే నీకు గుర్తింపు అవసరం లేదు’ అని అర్థం వచ్చేలా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ పై ఓ ఇంగ్లిష్ కోట్ ఉంది. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇక ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. అలాగే సుజిత్ డైరెక్షన్లో హీరోగా నాని ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. -
టాలీవుడ్ హీరోను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్.. ఎందుకంటే!
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్ కొట్టిన హీరో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక ఆరుల్ మోహన్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో డిఫెరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎస్జే సూర్య కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా నేచురల్ స్టార్ నానిని బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కలిశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్లోని నాని నివాసానికి వెళ్లిన గారెత్ విన్ ఓవెన్ నానితో కాసేపు ముచ్చటించారు. నాని సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్నానని ఆయన పోస్ట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్ సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాని నటించిన ఏవైనా రెండు సినిమాలు చూసేందుకు సలహా ఇవ్వమని నెటిజన్లను కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. సరిపోదా శనివారం మూవీని తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Absolute pleasure to meet @NameisNani to talk about his career behind and in front of the camera and how we can strengthen 🇬🇧 links with #Tollywood. He suggested a couple of his movies to watch. Which Natural Star movie would you recommend? pic.twitter.com/0cGFWNock2 — Gareth Wynn Owen (@UKinHyderabad) March 25, 2024 -
టాలీవుడ్ హీరోలు అందరూ ఒకే దారిలో వెళ్తున్నారా
-
రెడీ... యాక్షన్
యాక్షన్ మోడ్లోకి వెళ్లనున్నారు హీరో నాని. ‘అంటే.. సుందరానికీ..’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ ఏడాది ఆగస్టు 29న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 18న హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు నాని అండ్ కో రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో సూర్య పాత్రలో కనిపిస్తారు నాని. ఈ చిత్రంలో వారంలో మిగతా ఆరు రోజులు శాంతంగా ఉండి, ఆ రోజుల్లో జరిగే ఘటనలను పేపర్ మీద రాసు కుని, శనివారం మాత్రమే శత్రువులను వేటాడే సూర్య పాత్రలో నాని కనిపిస్తారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్. -
పద్దతిగా ఉంటేనే పని అవుద్ది.. నానిని ఫాలో అవుతున్న రౌడీ
-
నాని బర్త్ డే సెలబ్రేషన్స్.. తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చిన తనయుడు!
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే హాయ్ నాన్న చిత్రం ద్వారా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన ప్రస్తుతం సరిపోదా శనివారం అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ఎస్జే కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇటీవలే నాని 40వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఫిబ్రవరి 24న తన కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే తాజాగా జరుపుకున్న బర్త్ డే వేడుకల్లో నాని తనయుడు అర్జున్ తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చాడు. నాని నటించిన జెర్సీ చిత్రంలోని హోయనా హోయనా అనే ట్యూన్ను పియానోపై వాయించాడు. తండ్రి బర్త్ డే రోజు తన కుమారుడు స్పెషల్గా ట్రీట్ ఇవ్వడంతో నాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నాని భార్య అంజనా యలవర్తి తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంజనా తన ఇన్స్టాలో రాస్తూ..'ఈ వారాంతంలో నా సగం జీవితంలో తెలిసిన వ్యక్తి 40వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. సాధారణంగా ఆయన ఇలాంటి వేడుకలు, సర్ప్రైజ్ల నుంచి తప్పించుకుంటాడు. కానీ చిన్న చిన్న హావ భావాలను ఆస్వాదిస్తారు. ఒక చిన్న సర్ప్రైజ్ అతనిని మార్చగలదు. ఈ సారి జున్ను తన నాన్నా బర్త్ డే కోసం బిగ్ ప్లాన్ చేశాడు. ఆయనకు లైఫ్లో మరిచిపోలేని సర్ప్రైజ్ అందించాడు. అర్జున్ నుంచి ఈ రోజు అనుకోకుండా జెర్సీ నుంచి ఒక పాటను చూశాం. ఈ పాటతో నాని గర్వపడేలా చేశాడు అర్జున్. ఇది నిజంగా అద్భుతమైన క్షణంలా అనిపించింది. ఏదో ఒక సమయంలో పూర్తి వీడియో పోస్ట్ చేస్తాను' అంటూ షేర్ చేసింది. కాగా.. నాని పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు. నానిది స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామమే అయినా.. విశాఖపట్నానికి చెందిన అంజనా అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కెరీర్ మొదట్లో బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని.. అనుకోకుండా 'అష్టా చమ్మా' చిత్రంతో హీరోగా మారాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిందా చిత్రం. అలా 2008లో మొదలైన ఆయన ప్రయాణం. హీరోగా ఇప్పటికే 30కి పైగా చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. గతేడాది దసరా,హాయ్ నాన్న చిత్రాలతో హిట్లు కొట్టిన నాని.. త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో అలరించనున్నారు. View this post on Instagram A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) -
నేచురల్ స్టార్ నాని బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శనివారమే 'నాని' వేట!
‘‘కోపాలు రకరకాలుగా ఉంటాయి.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది.. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే ఎవరినైనా చూశారా.. నేను చూశాను’’ అంటూ నటుడు ఎస్జె సూర్య చెప్పే డైలాగ్స్తో విడుదలైంది ‘సరిపోదా శనివారం’ టీజర్. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్ట్ 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్ని విడుదల చేశారు. నాని చేస్తున్న సూర్య పాత్ర ఒకే ఒక్క రోజు (శనివారం) మాత్రమే కోపం చూపిస్తుందని టీజర్ ద్వారా స్పష్టం చేశారు. వారంలో జరిగే ఘటనలను పేపర్ పై రాసుకుని, తనని ఇబ్బందిపెట్టేవారిని శనివారం వేటాడతాడు సూర్య. ఇక నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు దానయ్య తెలిపారు. -
సస్పెన్స్ విడిపోయింది.. ఒకేసారి రెండు సినిమాలపై క్లారిటీ
ఇప్పుడున్న హీరోల్లో వేగంగా సినిమాలు చేసేది ఎవరా అని చూస్తే చాలామందికి గుర్తొచ్చే పేరు నాని. ఓ మూవీ సెట్స్పై మరొకటి అనౌన్స్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు మాత్రం డబుల్ ధమాకా ఇచ్చేశాడు. గత కొన్నాళ్ల నుంచి ఏవైతే రూమర్స్ వస్తున్నాయో వాటిపై అధికారికంగా అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమాలు? ఏంటి సంగతి? గతేడాది డిసెంబరులో 'హాయ్ నాన్న' అనే సెంటిమెంట్ మూవీతో హిట్ కొట్టిన హీరో నాని.. ప్రస్తుతం 'సరిపోదా శనివారం' చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 29న థియేటర్లలోకి ఇది రానుంది. దీని షూటింగ్ జోరుగా నడుస్తోంది. మరోవైపు నాని చేయబోయే కొత్త చిత్రాలపై కూడా ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) 'బలగం' దర్శకుడు వేణు.. తన రెండో మూవీతో నానితో చేయబోతున్నాడని చాలారోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలతో పాటు వేణు కూడా నానిని కలిసి విష్ చేయడంతో ఈ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తీసే ఈ సినిమా ప్రకటన త్వరలో వస్తుంది. మరోవైపు 'ఓజీ' తీస్తున్న సుజీత్.. నానితో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించేశారు. క్రూరమైన వ్యక్తి.. సౌమ్యుడిగా మారడంతో అతడి ప్రపంచం తలకిందులైపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాలని హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. సో ఇలా తన పుట్టినరోజున రెండు సినిమాల అప్డేట్స్ నాని నుంచి వచ్చేశాయ్. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
నాని 'సరిపోదా శనివారం' గ్లింప్స్ విడుదల.. టైటిల్ సీక్రెట్ ఇదే
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. 'అంటే సుందరానికీ' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రలో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నాడు. ఆగష్టు 29న ఈ చిత్రం విడుదల కానుంది. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి గ్లింప్స్ను విడుదల చేశారు మేకర్స్.. ఇందులో నాని యాంగ్రీమెన్లా కనిపిస్తున్నాడు. ఎస్ జే సూర్య వాయిస్తో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. వారం మొత్తంలో శనివారం మాత్రమే హీరో నానిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. దీనినే ఈ గ్లింప్స్లో చూపించారు. వారంలో అన్ని రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా ఈ మూవీ ఉండనుంది. యాక్షన్కు.. వినోదానికి ఇందులో పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. నాని క్యారెక్టర్ డిజైన్ చాలా ఫ్రెష్ గా ఉంది. గ్లింప్స్లో డైలాగ్స్ లేకపోయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. నాని సిగరెట్ తాగే విధానం పాత్రకు చైతన్యాన్ని తెస్తుంది. వెనుక సీటులో అజయ్ ఘోష్ కూర్చొని ఉండగా నాని రిక్షా తొక్కే సన్నివేశం మెచ్చుకోదగినది. గ్లింప్స్తో ఫ్యాన్స్ను నాని మెప్పించాడని చెప్పవచ్చు. -
నేడు ఈ టాప్ హీరో పుట్టినరోజు.. ఎవరో గుర్తుపట్టారా?
రేడియో జాకీగా తన కెరియర్ను మొదలు పెట్టిన నాని నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. అపజయాలు వచ్చినా మళ్లీ ఎలా నిలుదొక్కుకోవాలో తెలిసిన హీరో నాని మాత్రమే అని చెప్పవచ్చు. నాని పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు.. నేడు ఫిబ్రవరి 24న ఆయన పుట్టినరోజు జరుపుకోనున్నారు. నానికి అక్క కూడా ఉన్నారు. పై ఫోటోలో ఉండేది ఆమెనే..పేరు దీప్తి. నానిది స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామమే అయినా.. విశాఖపట్నానికి చెందిన అంజనా అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తొలినాళ్లలో బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని.. అనుకోకుండా 'అష్టా చమ్మా' చిత్రంతో హీరోగా మారాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిందా చిత్రం. అలా 2008లో మొదలైంన ఆయన నట ప్రయాణం. హీరోగా ఇప్పటికే 30కి పైగా చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. రీసెంట్గా దసరా,హాయ్ నాన్న చిత్రాలతో హిట్లు కొట్టిన నాని.. త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో రానున్నాడు. సినిమాల్లో 'నేచులర్ స్టార్'గా ఎదిగిన నాని కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. తన అక్క దీప్తి అంటూ ఆయనకు ఎంతో ప్రేమ అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే తన కుమారుడితో పాటు సతీమణి అంజనాకే ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పాడు. జీవితాంతం తెలుగు సినిమాలే చేస్తానని, బాలీవుడ్ వెళ్లే ఆలోచన లేదని ఓ సందర్భంలో నాని తెలిపాడు. తాను తెలుగు ప్రేక్షకులకు నచ్చినట్టుగా ఇతర చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలు చవిచూసినా నిలదొక్కుకుని నేడు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టే సినిమాలు తీసే స్థాయికి నాని చేరుకున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా శుభాకాంక్షలు తెలపండి. -
పుష్పరాజ్ వెనక్కి తగ్గితే..తగ్గేదేలే అంటున్న యంగ్ హీరోస్
-
వారిపై కన్నేసిన మృణాల్ ఠాకూర్.. ప్లాన్ అదుర్స్
ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన నటి మృణాల్ ఠాకూర్. చాలా మంది నటీమణులాగానే బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించిన మృణాల్ ఠాగూర్ ఆ తరువాత హిందీ చిత్రాల్లో నటించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ భామకు టాలీవుడ్ నుంచి లక్కీచాన్స్ వరించింది. అదే సీతారామం చిత్రం. ఆ చిత్రం సక్సెస్ మృణాల్ ఠాగూర్ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల నాని సరసన నటించిన 'హాయ్ నాన్న' చిత్రం హిట్ కూడా ఈమె ఖాతాలో పడింది. (ఇదీ చదవండి: సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్) మంచి జోష్ మీదు ఉన్న మృణాల్ ఠాకూర్కు విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో ఛాన్స్ దక్కింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉంటే మృణాల్ ఠాకూర్పై ఇప్పుడు కోలీవుడ్ కన్ను పడింది. అక్కడ ఈ అమ్మడి కోసం మూడు భారీ ఆఫర్లు ఎదురుచూస్తున్నాయనేది తాజా సమాచారం. అందులో భాగంగా ఏఆర్ మురుగదాస్ శివకార్తికేయన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ తన రాజ్కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శింబు కథానాయకుడిగా నిర్మించనున్న భారీ యాక్షన్ ఎంటర్ కథా చిత్రంలో మృణాల్ ఠాగూర్ను ఒక హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో మరో హీరోయిన్గా కీర్తీ సురేష్ నటించబోతున్నట్లు సమాచారం. కాగా మృణాల్ ఠాగూర్ మరో లక్కీచాన్స్ కూడా తలుపు తట్టినట్లు తెలుస్తోంది. నటుడు అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాగానే అజిత్ మరో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. మార్క్ ఆంటోని చిత్రంతో ఫేమ్ సంపాదించుకున్న ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడానికి ఆయన సిద్ధం అవుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించనున్న చిత్రంలో కూడా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇలా కోలీవుడ్లో మృణాల్ ఠాకూర్ కరెక్ట్ ప్లాన్తో అడుగులేస్తూ.. వరుసగా దండెత్తడానికి సిద్ధమవుతున్నారన్నమాట. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
'కల్కి'లో మరో ఇద్దరు తెలుగు హీరోలు..
పాన్ ఇండియా హీరో ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). దీని కోసం ప్రభాస్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. అందుకే దీనికి సంబంధించిన చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరలవుతోంది. గతేడాది వచ్చిన సలార్ చిత్రం విజయంతో మంచి జోష్లో ఉన్న ప్రభాస్ మార్కెట్ కల్కి సినిమాతో మరోస్థాయికి చేరుకోవడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ స్టార్స్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల హాసన్, దీపిక పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరందరితో పాటుగా క్యామియో రోల్స్లో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా కల్కి చిత్రంలో కనిపించనున్నారని గతంలో భారీగానే ప్రచారం జరిగింది. 'కింగ్ ఆఫ్ కోథా' సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ కల్కి గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ఆ సినిమా సెట్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయిని చెప్పిన ఆయన కల్కిలో భాగం అవుతున్నారా అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. కానీ ఆయన మాటలను బట్టి కల్కిలో దుల్కర్ నటిస్తున్నారనే ప్రచారం మాత్రం గట్టిగానే జరిగింది. కల్కి సినిమా ఎండింగ్లో వచ్చే కీలకమైన సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్, నాని కూడా కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. కల్కి చిత్రంలో కృపాచార్యగా నాని కనిపిస్తే పరశురాముడిగా ఎన్టీఆర్ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘కల్కి’లో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు. అలాంటిది నాని, తారక్ పేర్లు తెరపైకి రావడంతో సినిమా మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం భారీగా ప్రచారం జరుగుతుంది. మే 9న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్కీ ఈ తేదీతో ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. 'కల్కి 2898 ఎ.డి' చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. -
బలగం వేణు దర్శకత్వంలో నాని సినిమా....
-
చిరు భాయ్కి హృదయపూర్వక అభినందనలు: మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్కుమార్ ట్విటర్ ద్వారా మెగాస్టార్కు కంగ్రాట్స్ తెలియజేశారు. Congratulations to #Megastar @KChiruTweets on being honoured with the #PadmaVibhushan , a great honour bringing great pride to #TeluguCinema and to his people who love him. Hard work never fails🙏 pic.twitter.com/2l4SEPFIII — Radikaa Sarathkumar (@realradikaa) January 25, 2024 Hearty congratulations, Dear Chiru Bhai, for being conferred with the Padma Vibhushan.@KChiruTweets — Mammootty (@mammukka) January 25, 2024 Congratulations sir ❤️❤️ You are always an Inspiration 😊#PadmaVibhushanChiranjeevi #Megastar https://t.co/41qCnAkw2K — Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2024 Many congratulations to you, Sir @KChiruTweets Gaaru, on the honor bestowed upon you. You rightly deserve it. Your contribution to cinema, the world of art, your philanthropic lifestyle, your good work for the public and the blessings of your elders brings you this. As a friend,… https://t.co/DXKj4RgZw7 — KhushbuSundar (@khushsundar) January 26, 2024 Good morning Padma Vibhushan Chiranjeevi gaaru :) ♥️@KChiruTweets 🙏🏼 — Hi Nani (@NameisNani) January 26, 2024 Telugu vadi Garva Karanam Mega 🌟 Padma Vibhushan@KChiruTweets garu #MegastarChiranjeevi Garu — Teja Sajja (@tejasajja123) January 25, 2024 Congratulations Annaya @KChiruTweets on being recipient to the second highest civilian award #PadmaVibhushan Much Deserving Honour for your inspiring legacy & contribution. Thank you for holding cinema high at every instance. ❤️ pic.twitter.com/SvqDpnCBfI — Satya Dev (@ActorSatyaDev) January 25, 2024 My favorite picture I have of us sir @KChiruTweets ❤️ Thank you for always being kind and warm to me. Thank you for the amazing films. Thank you for the brilliant performances. Thank you for being our MEGASTAR. You are now a #PadmaVibhushan Sir. A proud moment for us, for TFI… pic.twitter.com/Wa7Q9x6V4P — Adivi Sesh (@AdiviSesh) January 26, 2024 Congratulations to our BOSS @KChiruTweets Garu on being felicitated with the honorary award #PadmaVibhushan ❤️ Thank you for making us all proud yet again and again. pic.twitter.com/pW5LEbVtuo — Vassishta (@DirVassishta) January 25, 2024 -
నానికు యాక్షన్ కట్ చెప్పేది ఎవరు..?
-
నానికు యాక్షన్ కట్ చెప్పేది ఎవరు..?
-
OTTలో దుమ్ము లేపుతున్న మూవీ.. ఏకంగా మూడు స్థానాల్లో ట్రెండింగ్!
నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమమ్ ఉంటది మరి! ఎమోషనల్ యాక్టింగ్తో ఏడిపించే టాలెంట్ నాని సొంతం. ఆయన ఎంచుకునే కథ, కాన్సెప్ట్ అన్నీ కొత్తగా ఉండాల్సిందే! ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. నాని హీరోగా నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. తండ్రీకూతుళ్ల ప్రేమ కథను అందంగా, హృద్యంగా ఆవిష్కరించాడు డైరెక్టర్ శౌర్యువ్. ఓటీటీలోనూ ట్రెండింగ్ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ముందుగా అగ్రిమెంట్ చేసుకున్నందుకో ఏమో కానీ.. థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారు. అలా హాయ్ నాన్న ఈ నెల 4 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ము దులిపేస్తోంది. ఆదివారం నాడు(జనవరి 7న) ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. టాప్ 10లో మూడు స్థానాలు హాయ్ నాన్నదే! హాయ్ నాన్న తెలుగు వర్షన్ మొదటి స్థానంలో, హిందీ వర్షన్ ఐదో స్థానంలో, తమిళ వర్షన్ 10వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అంటే టాప్ 10లో మూడు స్థానాల్లో హాయ్ నాన్నే ఉండటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. హాయ్ నాన్న నెట్ఫ్లిక్స్లో తనదైన మార్క్ చూపిస్తోంది అని రాసుకొచ్చింది. మరి మీరు ఇంతవరకు హాయ్ నాన్న చూడకపోయుంటే ఓసారి వీలు చూసుకుని లుక్కేయండి.. The heartwarming tale transcends languages and bringing love to every corner 😍🔥#HiNanna is making its mark on the @NetflixIndia Trending charts! 🤘 Enjoy this blockbuster with your family at home today! 🤩 Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN @shouryuv… pic.twitter.com/pJx4Lgfjiu — Vyra Entertainments (@VyraEnts) January 7, 2024 చదవండి: రెండో పెళ్లికి సిద్ధమైన సిద్ధార్థ్.. మొదటి భార్య ఎవరో తెలుసా? కోట్లు సంపాదించిన కమెడియన్..ఆ ఒక్క పొరపాటుతో జీవితమే అస్తవ్యస్తం.. చివరకు డిక్కీలో శవం! -
ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ.. ఎక్కడంటే?
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు హాయిగా ఉంటుందని, జనాలకు తప్పకుండా నచ్చుతుందన్నాడు. అతడి నమ్మకం నిజమైంది. సినీప్రియులు హాయ్ నాన్నకు జై కొట్టారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్కు కనెక్ట్ అయ్యారు. భారీ బడ్జెట్ సినిమాలైన యానిమల్, సలార్ పోటీని తట్టుకుని హాయ్ నాన్న ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది. అక్కడే ఈ సినిమా ఘన విజయం సాధించేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం నేటి (జనవరి 4) నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను చూడటం మిస్ అయినవారు, మరోసారి హాయ్ నాన్న చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో వీక్షించేయండి.. కథ విషయానికి వస్తే.. ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు. అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! చదవండి: ఆహా.. బయలుదేరిందయ్యా.. కీర్తి పోస్ట్ చూశారా? -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..
తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు ఎస్ఐపై కార్యకర్తల దాడి.. టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయపడిన ఎస్ఐ సతీష్ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్ను ఆసుపత్రికి తరలించారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు.. పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు. దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్ అంటారా.. ‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’. దాడి సంఘటనపై కేసు నమోదు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్ఐ సతీష్పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్ఐ సతీష్కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేస్తాం.. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్ఐ సతీష్పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
హాయ్ నాన్న బ్లాక్బస్టర్ హిట్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ లెక్కల కన్నా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడమే ముఖ్యమని ఫీలవుతుంటాడు. అయితే తను ఎంచుకునే వైవిధ్యమైన కంటెంట్కు కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లే వస్తుంటాయి. అది దసరా సినిమాతో నిరూపితమైంది. తాజాగా హాయ్ నాన్నతో మరో బ్లాక్బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడీ హీరో. డిసెంబర్ 7న రిలీజైన హాయ్ నాన్న నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ నెల 7న రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభించింది. ఫలితంగా మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే డిసెంబర్ 22న విడుదలైన సలార్ హాయ్ నాన్న మూవీకి గట్టి పోటీనిచ్చింది. ఇప్పటివరకు వచ్చిందెంతంటే? సోషల్ మీడియాలో అంత హడావుడి లేకపోయినా సైలెంట్గా బాగానే రాబట్టింది. తాజాగా ఈ సినిమా అధికారిక కలెక్షన్లను ప్రకటించింది చిత్రయూనిట్. హాయ్ నాన్న ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టిందని తెలిపింది. ఇక ఈ మూవీ థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. నెట్ఫ్లిక్స్లో జనవరి 4 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. మరి థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఆనందించండి. Ending the year on a BLOCKBUSTER NOTE 💥🧨 Thank you all for embracing good cinema and giving us a warm hug 🤗#HiNanna magic has made a 75Crore+ Worldwide Gross ❤️🔥 and this is our victory 🤗#BlockbusterNanna Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN @shouryuv… pic.twitter.com/Ywl7pFPAEz — Vyra Entertainments (@VyraEnts) December 31, 2023 చదవండి: తెలుగులో అదే చివరి సినిమా.. హీరోయిన్ నుంచి ప్రాధాన్యత లేని పాత్రల్లో.. -
Hi Nanna In OTT: ఓటీటీలోకి 'హాయ్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
డిసెంబరులో వచ్చిన హిట్ సినిమాలు అంటే చాలామంది 'సలార్', 'యానిమల్' పేర్లు చెప్తారు. అయితే ఇదే నెలలో నేచురల్ స్టార్ నాని కూడా ఓ క్లాస్ మూవీతో వచ్చాడు. హిట్ కొట్టేశాడు. ఇప్పటికీ థియేటర్లలో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) కొత్త దర్శకులతో ప్రయోగాలు చేస్తున్న నాని.. ఈ ఏడాది మార్చిలో 'దసరా' అనే మాస్ సినిమాతో వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఈ మధ్య 'హాయ్ నాన్న' అనే తండ్రి-కూతురు సెంటిమెంట్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తొలుత ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎక్కువరోజులు నిలబడటం కష్టమని అన్నారు. కానీ 20 రోజులు దాటిపోయినా సరే ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. ఇకపోతే థియేటర్లలో 'హాయ్ నాన్న' ఇంకా ఆడుతుండగానే ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. నెట్ఫ్లిక్స్ లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి తర్వాత అంటే జనవరి 19 లేదా 26వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మరీ ఆలస్యం అవుతుందనో ఏమో ఇప్పుడు డేట్ ముందుకు మార్చినట్లు అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) Love is in the air, and so is our excitement ❤️🌟 Join @NameisNani and #MrunalThakur in their journey of finding love in Hi Nanna. Hi Nanna, streaming from 4th January in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi on Netflix. 👨👩👧#HiNannaOnNetflix pic.twitter.com/zTy8cY7jnX — Netflix India (@NetflixIndia) December 30, 2023 -
హైదరాబాద్లో సరిపోదా...
‘అంటే సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ్రపారంభమైంది. ‘‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని పూర్తిగా యాక్షన్–΄్యాక్డ్ అవతార్లో కనిపిస్తారు. హై బడ్జెట్, భారీ కాన్వాస్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నవంబరులో ఒక షెడ్యూల్ పూర్తి చేశాం. రెండో షెడ్యూల్ని హైదరాబాద్లో ్రపారంభించాం. ఈ షెడ్యూల్లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్తో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్ని చిత్రీకరించనున్నాం. పాన్ ఇండియా చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రా నికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
ఓటీటీకి హాయ్ నాన్న.. ఆ తర్వాతే స్ట్రీమింగ్!
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో శౌర్యువ్ డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్కు లవ్ స్టోరీని జతచేసి తెరకెక్కించారు. తండ్రీ, కూతురి స్టోరీ కావడంతో ఆడియన్స్కు ఎమోషనల్గా కనెక్ట్ అయింది. అయితే థియేటర్లలో ఆడియన్స్ను మెప్పించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జవనరిలో ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజైన నలభై రోజుల తర్వాతే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. నలభై రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ నెట్ఫ్లిక్స్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం కనిపించడం లేదు. జనవరి 19న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. కాగా.. ఈ చిత్రంలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రానికి హీషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు. కథేంటంటే.. ముంబైకి చెందిన విరాజ్(నాని) ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. తనకు కూతురు మహి(బేబీ కియారా ఖన్నా)అంటే ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడతున్న మహికి అన్నీ తానై చూసుకుంటాడు. సింగిల్ పేరెంట్గా ఉన్నప్పటికీ కూతురుకి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి రోజు రాత్రి కూతురికి సరదాగా కథలు చెప్పడం విరాజ్కి అలావాటు. ఆ కథల్లోని హీరో పాత్రని నాన్నతో పోల్చుకోవడం మహికి అలవాటు. ఓ సారి అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానని ప్రామిస్ చేస్తాడు నాన్న విరాజ్. అమ్మ కథ కోసం నెలంతా కష్టపడి చదివి క్లాస్ ఫస్ట్ వస్తుంది. తర్వాత కథ చెప్పమని నాన్నని అడిగితే.. చిరాకు పడతాడు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. రోడ్డుపై ప్రమాదం నుంచి కాపాడిన యష్ణతో మహికి స్నేహం కుదురుతుంది. ఇద్దరూ ఓ కాఫీ షాప్లోకి వెళ్లి విరాజ్కి కాల్ చేస్తాడు. విరాజ్ కూడా అక్కడికి రాగానే అమ్మ కథ చెప్పమని అడుగుతారు. కూతురు మారం చేయడంతో అమ్మ కథను చెబుతాడు. ఈ కథలో అమ్మ వర్షని యష్ణగా ఊహించుకుంటుంది మహి. అసలు వర్ష ఎవరు? విరాజ్-వర్షల లవ్స్టోరీ ఏంటి? విరాజ్ సింగిల్ పేరెంట్గా ఎందుకు మారాల్సి వచ్చింది? వర్షకి యష్ణకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? డాక్టర్ అరవింద్ (అంగద్ బేడీ)తో ఎంగేజ్మెంట్ చేసుకున్న యష్ణ..విరాజ్తో ప్రేమలో ఎలా పడింది? ఆ ప్రేమ నిలబడిందా? అరుదైన వ్యాధిని మహి జయించిందా? లేదా? తదితర విషయాలు తెలియాలంటే ‘హాయ్ నాన్న’సినిమా చూడాల్సిందే. -
అంతకుమించిన స్థాయి లేదు
‘‘చిత్ర పరిశ్రమలో బాక్సాఫీసు లెక్కలు, స్థానాలు, స్థాయి అని మాట్లడుతుంటారు. నాకు సంబంధించి శుక్రవారం నా సినిమా విడుదలైతే.. ‘నాని సినిమాకి వెళ్దాం రా’ అని ప్రేక్షకులు అన్నారంటే అదే గొప్ప స్థాయి.. దానికి మించిన స్థాయి ప్రపంచంలో మరొకటి లేదని నమ్ముతాను. ఆ స్థాయి, స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని హీరో నాని అన్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాని మాట్లాడుతూ–‘‘మా సినిమాపై ప్రేక్షకులు ఎన్నో ప్రశంశలు కురిపిస్తున్నారు. నేను నమ్మంది నిజమైనందుకు ఆనందంగా ఉంది. ‘హాయ్ నాన్న’ కి ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అన్నారు. ‘‘నానిగారు ‘హాయ్ నాన్న’ కథని నా కోసం, తెలుగు సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నాను’’ అన్నారు శౌర్యువ్. ‘‘హాయ్ నాన్న’ చరిత్రలో నిలిచిపోయే చిత్రం’’ అన్నారు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల. కెమెరామేన్ షాను మాట్లాడారు. -
మహేష్ బాబుతో మల్టీస్టారర్.. నానితో త్రివిక్రమ్ సినిమా
-
శబ్దంతో థ్రిల్
దాదాపు పదిహేనేళ్లకు హీరో ఆది పినిశెట్టి–డైరెక్టర్ అరివళగన్–మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కాంబినేషన్ కుదిరింది. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఈరమ్’ (2009) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘వైశాలి’గా విడుదలైంది. ఇక తాజాగా వీరి కాంబోలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ‘శబ్దం’ తెరకెక్కుతోంది. ఇది కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. 7ఎ ఫిలింస్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని హీరో నాని విడదల చేశారు. ‘‘ఈ ‘శబ్దం’లో శబ్దానికి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్లతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్ను నిర్మించాం. ఈ సినిమా కోసం తమన్ ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సహనిర్మాత: భానుప్రియ శివ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఆర్. బాలకుమార్. -
రైతులకు అండగా కొడాలి నాని మరియు పేర్ని నాని
-
నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
'నాని' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీని గుర్తుపట్టగలరా..?
మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా అయిన ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్తో హీరో నాని ఒక సినిమా చేశారు. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఐదుగురు మహిళలు ఒక గ్రూప్గా ఉంటారు. కానీ వారందరూ కూడా సేమ్ గ్రూప్ ఏజ్ కాకుండా ఒక్కొక్కరిది ఒక్కో వయసు చిన్న పాప దగ్గర నుంచి బామ్మ వరకు ఉంటారు. వారిలో 'శ్రియ రెడ్డి కొంతం' అనే అమ్మాయి అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లోనే ఆ అమ్మాయి ఎవరా అని చాలా మంది ఆరా తీశారు. సినిమా విడుదల సమయంలో ఆమె ఎక్కడా కూడ ఆప్రమోషన్లో పాల్గొనలేదు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఆమెరికా వెళ్లిపోయింది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని సాధరణంగా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు ఇలా హాట్ ఫోటోలతో మళ్లీ వైరల్ అవుతుంది.,హైదరాబాద్లోని తార్నాకకు చెందిన శ్రియ కొంతం ఇంటర్మిడియట్ తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. ఆమెకు సినిమాలపై మక్కువ ఉండటంతో అప్పుడప్పుడు కొన్ని ఆడిషన్స్లలో పాల్గొనేది. తనకు 12 ఏళ్ల వయసులోనే విజయదేవర కొండతో థియేటర్ ఆర్టిస్ట్గా నటించానని చెప్పింది. తాను ఇంటర్ చదవుతున్నప్పుడు శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్ చేస్తుండగా.. అక్కడ ఒక కోఆర్డినేటర్ తనను చూసి దర్శకుడు విక్రమ్ కుమార్కు రిఫర్ చేస్తే అలా నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో ఛాన్స్ దక్కినట్లు చెప్పింది. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రియ కొంతం ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Shriya Kontham (@shriya.kontham)