
నేచురల్ స్టార్ నాని ఇటీవలే హిట్-3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో మోస్ట్ వయొలెంట్గా కనిపించి అభిమానులను మెప్పించారు. హిట్ సిరీస్లో వచ్చిన మూడో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నాని ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలో తనకు నచ్చిన చిత్రాల్లో మెయిజగన్(తెలుగులో సత్యం సుందరం) ఒకటని తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాల మధ్య వచ్చిన ఈ చిత్రం భావోద్వేగం, వ్యక్తిగత జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఇటీవల వ్యక్తిగతంగా తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిన చిత్రమిదేనని వెల్లడించారు. తన సినిమా హిట్-3 ప్రమోషన్ల సందర్భంగా ఈ సినిమా గురించి విన్నానని ఓ యూట్యూబ్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. వేల కోట్లతో నిర్మించిన చిత్రాలకు ప్రశంసలు రావొచ్చు..కానీ ఇలాంటి కథలు రావడం చాలా అరుదైన విషయమన్నారు.

కాగా.. తమిళంలో మెయిజగన్ అనే పేరుతో ప్రేమ్ కుమార్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫుల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు.