Nayim case
-
కేస్ఖతం.. దుకనం బంద్
-
నయీమ్ కేసులో ఎవరినీ వదలం: నాయిని
సాక్షి, మెదక్: గ్యాంగ్స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్ప గించబోమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. సిట్ నివేదిక అందాక దోషులని తేలితే ఎంతటి వారైనా వదలబోమని హెచ్చరించారు. సోమవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో స్టాఫ్ క్వార్టర్స్కు ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. నయీమ్తో పోలీసులకు సంబంధాలు ఉన్నట్లు పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోబోమని తెలిపారు. సీడబ్ల్యూసీకి నయీమ్ బాధిత చిన్నారులు నల్లగొండ క్రైం: గ్యాంగ్స్టర్ నయీమ్ డెన్లో గుర్తించిన 8 మంది చిన్నారులను నల్లగొండ బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ)కి సోమవారం మహబూబ్నగర్ అధికారులు అప్పగించారు. వీరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె షామ కూడా ఉంది. చిన్నారుల పేర్లను కూడా మార్చి రికార్డుల్లో నమోదు చేయడంతో వారి రక్త సంబంధీకులు ఎవరనేది తేలాల్సి ఉంది. నాలుగేళ్ల బాలుడు జానీపాష అలియాస్ పాలేద్తోపాటు మరో ఇద్దరిది సూర్యాపేట జిల్లా నేరెడుచర్లగా, ఓ బాలికది హుజూర్నగర్ అని అధికారులు గుర్తించారు. -
లొసుగుల వల్లే ప్రధానికి లొంగుతున్నారు
చంద్రబాబు, కేసీఆర్పై సురవరం ఆరోపణ - రాజకీయ అభద్రతతో ఉన్నందునే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజం - రెండున్నరేళ్ల పాలనలో హామీల అమల్లో ఘోర వైఫల్యమని మండిపాటు - నేటి నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ భేటీ సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: లొసుగులు ఉన్నందు వల్లే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వా నికి లొంగిపోతున్నారని సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీల అమల్లో వైఫల్యాలతో పాటు వారి ఇతర బలహీనతలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందా లేదా వారే లొంగి పోతున్నారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. బాబు, కేసీఆర్ రాజకీయ అభద్రతాభావంతో ఉన్నారని, అందువల్లే ప్రతిపక్షాలు లేకుండా చేయాలని విపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కానీ వారి తో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారన్నారు. బుధవా రం నుంచి శుక్రవారం వరకు నగరంలో జరగ నున్న సీపీఐ జాతీయ, కౌన్సిల్ సమావేశాల సందర్భంగా సురవరం సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... రెండున్నరేళ్ల పాలనలో ఇద్దరిదీ ఘోర వైఫల్యం.. ‘చంద్రబాబు, కేసీఆర్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీల్లో ప్రధానమైనవి అమలు కాలేదు. రైతు రుణాల రద్దు సహా ఇతర హామీ ల అమల్లో చంద్రబాబు ఘోరంగా విఫలమవ్వ గా దళితులకు మూడెకరాల భూపంపిణీ, పేద లకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటింటికీ మంచి నీటి సరఫరా తదితర హామీల్లో ఒక్కశాతం కూడా కేసీఆర్ అమలు చేయలేదు. వైఫల్యా లను కప్పిపుచ్చుకునేందుకు పూజలు, పండు గలు, పబ్బాలు అంటూ ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి కొందరు వ్యక్తులు రాజుకు మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ ఆ కోవకు చెందినవారే. బీజేపీతో స్నేహం భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే నగదురహిత లావాదే వీలు, డిజిటలైజేషన్ అంటూ చంద్రబాబు, కేసీఆర్ హడావుడి చేస్తున్నారు. దీని సాధ్యాసా ధ్యాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తు న్నారు. చుట్టూ వందిమాగధులు చేరి పొగడ్త లతో ముంచెత్తుతుండడంతో బాబు, కేసీఆర్ లకు రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదు. నయీం కేసే కేసీఆర్ అవగాహనకు కొలబద్ధ.. నయీం కేసును సీబీఐకు ఇచ్చేందుకు నిరాకరిం చడం ద్వారా కేసీఆర్ అవగాహనను కొలబద్ధ గా అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ఎవరినీ వదలం అని చెప్పినా... తప్పు చేసిన వారు తమ పార్టీలో ఉంటే వారికి రక్షణ, లేని వారికి శిక్షణ అన్నట్లుగా విచారణకు నిరాకరిస్తున్నారు. పార్లమెంటు స్తంభన వారి వ్యూహరచనే... పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకుం డా కేంద్రం, బీజేపీ వ్యూహం పన్నాయి. బీజేపీ అగ్రనేత అద్వానీ అదే ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభలో మెజారిటీ ఉన్నా బీజేపీ కీలకాంశా లపై ఎందుకు చర్చించలేదు?’ అని అన్నారు. పెద్ద నోట్ల రద్దు అత్యంత తెలివితక్కువ నిర్ణయం... పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అత్యంత తెలివి తక్కువది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ కుండా ఈ నిర్ణయం తీసుకోవడం అర్థరహి తం. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు పక్కకుపోయి నగదు రహిత లావాదేవీలు, డిజిటలైజేషన్ అంటూ కొత్త పాట అందుకున్నారు. ఇది దేశ, కాల పరిస్థితులకు అనువైనది కాదు. ఈ నిర్ణయం వల్ల ఆశించిన మేర నల్లధనం బయటకు రాలేదు. దాచుకున్న డబ్బే బ్యాంకులకు వచ్చింది, దోచుకున్న డబ్బు మార్పిడి అయ్యిందనేది మా అంచనా. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. కొంతైనా కోలుకునేందుకు, నోట్ల కష్టాలు కొంచెమైనా తీరేందుకు కనీసం 5, 6 నెలలు పట్టొచ్చు. సురవరంతో గద్దర్ భేటీ సురవరంతో ప్రజా గాయకుడు గద్దర్ సమావేశమయ్యారు. మంగళవారం మగ్దూం భవన్కు వచ్చిన ఆయన సురవరం తో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు, ప్రజా సమస్య లపై ప్రభుత్వం స్పంది స్తున్న తీరు తదితర అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమా వేశంలో సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండటంతో సురవరంను అభినందిం చేందుకే వచ్చానని, తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని గద్దర్ తెలిపారు. -
మాజీ ఏఎస్పీ రవీందర్రెడ్డిని విచారించిన సిట్
నయీమ్ కేసు దర్యాప్తులో వేగం హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. మొన్నటికిమొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్యను విచారించిన సిట్ అధికారులు.. సోమవారం మాజీ అడిషనల్ ఎస్పీ రవీందర్రెడ్డిని విచారించారు. రవీందర్రెడ్డిని నార్సింగి పోలీస్స్టేషన్కు పిలిపించి... సిట్ ఏసీపీ సారుుకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 50 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఆయనతో పాటు నయీమ్ డ్రైవర్ శ్యామెల్ను కూడా విచారించారు. మూడున్నరేళ్ల పాటు భువనగిరిలో పనిచేసిన రవీందర్రెడ్డి... ఆ సమయంలో నయీమ్తో ఏర్పడిన పరిచయంతో పలు సెటిల్మెంట్లు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించారు. నయీమ్తో ఎప్పుడు ఎవరు ప్రయాణించింది... ఎక్కడెక్కడ కలిసేది వంటి వివరాలను శ్యామెల్ నుంచి రాబట్టినట్టు తెలిసింది. నయీమ్ను కలవలేదు: రవీందర్రెడ్డి సిట్ విచారణ అనంతరం రవీందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నయీమ్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను భువనగిరిలో పనిచేసిన మూడున్నరేళ్లలో నయీమ్ జైలులో ఉన్నాడని, ఎలాంటి కేసులూ డీల్ చేయలేదన్నారు. భువనగిరి తర్వాత చిత్తూరు, మెదక్లలో పనిచేసి పదవీ విరమణ పొందానని, ప్రస్తుతం నిజామాబాద్లో వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటున్నానని తెలిపారు. అరుుతే రిటైరరుున తరువాత తాను ఓసారి నయీమ్ను కలిశానన్న రవీందర్... అందుకు కారణం చెప్పలేదు. క్యూ కట్టిన బాధితులు: నయీమ్ బెదిరింపులకు భయపడి భూ డాక్యుమెంట్లు కోల్పోరుున బాధితులు నార్సింగ్ ఠాణా ఎదుట క్యూ కట్టారు. భువనగిరిలో లక్ష్మినరసింహస్వామి వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన దాదాపు నాలుగు వేల మందిని నయీమ్ అనుచరులు బెదిరించి ఆ భూములను అక్రమించి, డాక్యుమెంట్లు లాక్కున్నారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత నార్సింగ్ ఠాణా పరిధిలో అతడు నివాసముంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు ఆ భూముల డాక్యుమెంట్లు లభించారుు. -
కీలక దశకు నయీం కేసుల దర్యాప్తు
గ్యాంగ్స్టర్ నయీం, అతని అనుచరులపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కీలక ఘట్టానికి చేరుకుంది. సిట్ పర్యవేక్షునిగా బాధ్యతలు చేపట్టిన శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్... మంగళవారం ఐజీ నాగిరెడ్డితో పాటు విచారణాధికారులతో సమావేశమయ్యారు. నయీం కేసులను దర్యాప్తు చేసిన అధికారులందరి నుంచి వివరాలు సేకరించారు. కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనందున తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 72 కేసులు నమోదవగా 80 మందిని అరెస్టు చేశారు. వీటికి సంబంధించి వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులను ఏడీజీ అంజనీకుమార్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక కోర్టుల్లో ఎక్కడిక్కడ దాఖలు చేయాలని సూచించారు. నయీం కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టయిన 80 మంది కూడా అతని కుటీంబీకులు, సన్నిహితులు మాత్రమే ఉన్నారు. అయితే నయీం ద్వారా పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు లబ్ధిపొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అరెస్టు చేసిన నయీం అనుచరుల నుంచీ ఈ కోణానికి సంబంధించి కీలకాంశాలు, వారి మధ్య నడిచిన లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరి విషయంలో పక్కా ఆధారాలు లభ్యం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ... ఎన్కౌంటర్ తర్వాత నుంచి నయీం కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అధికార, విపక్షాలకు చెందిన రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వస్తున్నారు. ప్రముఖులతో సంబంధాలపై వార్తలు వెలువడుతుండగా... కొందరు నేతలపై ఓ జిల్లాలో కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో గ్యాంగ్స్టర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు ఆస్కారం లేకుండా నయీమ్ కేసుల్లో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నమోదైన వాటిలో కేవలం కబ్జా, బెదిరింపుల ఆరోపణలతో కూడిన వాటిని ఈలోపే కొలిక్కి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా కషిచేస్తున్నారు. అందుకు అనుగుణంగా ‘సిట్’లో పోలీసు సిబ్బందిని పెంచడమే కాకుండా దర్యాప్తు వేగాన్ని కూడా పెంచారు. గత ఆగష్టు 8న నయీంను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తర్వాత అతని ఆగడాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నయీం కేసులకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సిట్ సేకరించింది. అయితే నయీమ్ను ఉపయోగించుకొని కొందరు రాజకీయ నేతలు లాభపడ్డారనే విషయం వెలుగులోకి రావడంతో ఈ కేసు విషయంలో రాజకీయపార్టీల ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. నెల రోజులు పూర్తయినా కేసు దర్యాప్తులో పురోగతి లేదంటూ, దర్యాప్తు సంస్థపై నమ్మకం లేదంటూ కొందరు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులను పెంచిన ఉన్నతాధికారులు... కేసును కొలిక్కి తీసుకుచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారుల పైనా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. -
‘బీబీనగర్’ రిసార్ట్లో నయీమ్ కేసు విచారణ
బీబీనగర్: గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో నల్లగొండ జిల్లా భువనగిరి, పరిసర ప్రాంతాలకు చెందిన అనుచరులను, నిందితులను, అతడితో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇందుకోసం వారు బీబీనగర్ మండలంలోని ఓ రిసార్టును వేదిక చేసుకున్నట్లు సమాచారం. పాశం శ్రీనుతోపాటు, మరి కొంతమందిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని ఈ రిసార్టుకు తీసుకువచ్చి విచారిస్తునట్లు తెలిసింది. అలాగే, బీబీనగర్ మండలంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులకు నయీమ్తో ఎమైనా సంబంధాలున్నాయా? నయీమ్ అనుచరులు ఇక్కడ భూదందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడ్డారా? వారికి ఎవరైనా సహకరించారా? అని సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
నయీం కేసులో రాజకీయ కోణం
-
నయీమ్ అనుచరులను చర్లపల్లికి తరలింపు
పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ అనుచరులు శ్రీధర్ గౌడ్, బలరాంలను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టు ఇచ్చిన 5 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో సోమవారం వీరిని హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచిన వనస్థలిపురం పోలీసులు తదనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా.. నయీం కేసులో ప్రధాన నిందితుడు టెక్ మధుని పిటి వారెంట్ మీద నల్లగొండ జైలు నుంచి తరలించారు. సోమవారం మధును సైతం హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు. -
నయీమ్ను అంతమొందించడం మంచిదే
ఈ కేసులో ప్రభుత్వ పనితీరు బాగుందని జానారెడ్డి ప్రశంస సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగుందని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ నయీమ్ను అంతమొందించడంలో ప్రభుత్వ నిర్ణయం సరైందేనని మెచ్చుకున్నారు. నయీమ్ ఆగడాలను గత ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందనడం సరికాదన్నారు. కాగా, నయీమ్ తనను ఎప్పుడూ బెదిరించలేదని జానారెడ్డి చెప్పారు. ఈ కేసుపై సిట్ను ఏర్పాటు చేయవద్దనడం సరికాదన్నారు. సిట్ నివేదిక వచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు అవసరమా, వద్దా అనేది చెబుతామన్నారు. కాంగ్రెస్ ‘జలదృశ్యం’ ప్రజెంటేషన్ సమయంలో తాను కర్ణాటక వెళ్లానని జానారెడ్డి చెప్పారు.