old notes validity
-
పాత నోట్లు.. మరో వారం?
కేంద్రప్రభుత్వం రద్దు చేసిన రూ. 500, 1000 నోట్ల చెల్లుబాటును మరో వారం లేదా పదిరోజుల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టోల్ ట్యాక్స్ రద్దును నెలాఖరు వరకు పొడిగించిన ప్రభుత్వం.. ఇతర అత్యవసర సేవలు, ప్రాథమిక అవసరాలకు పాత నోట్ల చెల్లుబాటును కూడా పొడిగించవచ్చని సమాచారం. వాస్తవానికి గురువారం అర్ధరాత్రితో పాత నోట్ల చెల్లుబాటు గడువు ముగిసిపోతుంది. అయితే, ఇప్పటికి ఇంకా పూర్తిగా కొత్త నగదు అందుబాటులోకి రాకపోవడం, బ్యాంకులు.. ఏటీఎంల వద్ద క్యూలైన్లు పెరిగిపోతూనే ఉండటంతో మరికొన్నాళ్లు పాత నోట్లను చెల్లుబాటయ్యేలా ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారని సమాచారం. ప్రస్తుత పరిస్థితులను అందులో సమీక్షించారని అంటున్నారు. ప్రధానంగా రైతులకు, వ్యవసాయ రంగానికి మరింత ఊరట కల్గించే చర్యలు ప్రకటించవచ్చని అంటున్నారు. పాతనోట్లు ఉన్నవాళ్లు వాటిని రైల్వే టికెట్ కౌంటర్లు, బస్ టికెట్ కౌంటర్లు, ప్రభుత్వ లేదా ప్రభుత్వరంగ కార్యాలయాలు, విమానాల టికెట్ కౌంటర్ల వద్ద ఉపయోగించే అవకాశం ఈ అర్ధరాత్రి వరకు ఉంది. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ల కొనుగోలు, మందుల కొనుగోలు తదితర అవసరాలకు సైతం పాత నోట్లను వినియోగించుకోవచ్చు. ఇప్పుడు దీన్నే మరో వారం లేదా పది రోజుల పాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
పాత పెద్ద నోట్ల కష్టాలకు మరో ఉపశమనం
-
నోట్ల కష్టాలకు మరో ఉపశమనం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుడి కష్టాలను తగ్గించేందుకు కేంద్రం మరిన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. ప్రజలకు పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల వినియోగాన్ని మరో 10 రోజుల పాటు పొడిగించింది. పాత పెద్ద నోట్లు ఈ నెల 24 వరకు చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, బస్సు టికెట్లు, ఎయిుర్ పోర్టుల్లోని కౌంటర్లలో విమాన టికెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీల్లో మందుల కొనుగోలు, ఎల్పీజీ సిలిండర్లు, రైల్వే కేటరింగ్ల్లో నవంబర్ 24 అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుబాటవుతాయి. ప్రభుత్వ ఆధీనంలోని సహకార కేంద్రాల్లోనూ ధ్రువీకరణ పత్రాలతో పాత నోట్లను వినియోగించవచ్చు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల పన్నులు చెల్లించవచ్చు. సోమవారం అర్ధరాత్రి వరకే అనుమతిచ్చినా బ్యాంకులు, ఏటీఎం వద్ద పెరుగుతున్న రద్దీ, ప్రజల్లో ఆందోళన నేపథ్యంలో ఈనెల 24 అర్ధరాత్రి దాకా అనుమతిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆ లోపు కొత్త కరెన్సీ చాలా వరకు అందుబాటులోకి రావొచ్చని భావిస్తోంది. నగదు మార్పిడి, విత్ డ్రా పరిమితిని కూడా స్వలంగా పెంచింది. -
రికార్డుస్థాయిలో పన్నులు
కరెంట్ బిల్లుల ద్వారా వచ్చింది రూ.72లక్షలు ఇంటి పన్నుల ద్వారా రూ.26.81 లక్షలు కరెంటు బిల్లుల చెల్లింపునకు మరో మూడు రోజులు అవకాశం సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని/ కోల్సిటీ : పెద్దనోట్లు రద్దు ఇంకా పల్లెల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తమవద్ద రూ.500, 1000పాతనోట్లను మార్పిడి చేసుకునేందుకు ఎంతగా ఆందోళన చెందుతున్నారో పన్నుల చెల్లింపే అద్దంపడుతోంది. పాతనోట్లుపన్నుల కట్టలు శుక్రవారం నుంచి చెల్లుబాటు కావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కొత్త నోట్లు అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పాతనోట్లతోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నులు, నల్లా, కరెంటు బిల్లులు శుక్రవారం ఒక్క రోజు చెల్లించవచ్చని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఒక్క రోజులోనే రికార్డుస్థాయిలో చెల్లింపులు వచ్చాయి. రూ.కోటి మేర ఒక్క రోజులోనే వసూలయ్యాయి. కరెంట్ బిల్లులు పెద్దపల్లి ఈఆర్వో పరిధిలో రూ.30 లక్షలు, గోదావరిఖని పరిధిలో రూ.32లక్షలు, మంథని పరిధిలో రూ.10లక్షలు ట్రాన్స్కో ఖజానాకు వచ్చి చేరాయి. దీంతో ట్రాన్స్కో మొండి బకాయిలను రాబట్టేందుకు ఇదే మంచి అవకాశమని, పాతనోట్లతో బిల్లుల చెల్లింపును మరో మూడురోజులకు పెంచింది. ఇక ఇంటి పన్నుల విషయానికి వస్తే పెద్దపల్లి నగర పంచాయతీ పరిధిలో రూ.10లక్షలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.11.50లక్షలు, జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల ద్వారా రూ.5.31లక్షలుఖజానాకు వచ్చి చేరాయి. ట్రాన్స్కోకు భారీగా బకాయిల చెల్లింపు గోదావరిఖని విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని జనగామ, రాంనగర్, ౖయెటింక్లయిన్కాలనీ, గౌతమినగర్, పీజీ సెంటర్, రామగుండం, ఆకెనపల్లి, బసంత్నగర్ సబ్స్టేçÙన్లలో కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు బిల్లులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం ఒక్కరోజే బకాయిలు రూ.26లక్షలు వసూలయ్యాయి. గురువారం ఈ నోట్లు అనుమతించకపోవడంతో కేవలం రూ.1.50లక్షలు వసూలయ్యాయి. శుక్రవారం ఏకంగా రూ.26 లక్షలు వసూలయ్యాయి. కార్పొరేషన్కు రూ.11 లక్షలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్ను వసూలుకు శుక్రవారం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వడంతో నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కమిషనర్ డి.జాన్శ్యాంసన్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు నగరంలో ప్రచారం చేపట్టారు. మూడు ఆటోరిక్షాలకు మైక్ల ద్వారా నగరంలో ప్రచారాన్ని నిర్వహించారు. 17 మంది బిల్ కలెక్టర్లతోపాటు మున్సిపల్ కార్యాలయంలో రెండు ప్రత్యేక కౌంటర్లను శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రజలు బిల్లులు చెల్లించేలా అందుబాటులో ఉంచారు. రాత్రి 7.30గంటల వరకు రూ.11.50 లక్షల వరకు రికార్డుస్థాయిలో పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. అయితే నగరంలోని 50డివిజన్లలో పన్నుల వసూళ్ల కోసం వెళ్లిన బిల్కలెక్టర్లు తిరిగి కార్యాలయానికి వస్తే పూర్తి కలెక్షన్ వివరాలు తెలిసే వీలుంటుందని ఆర్ఐ శంకర్రావు తెలిపారు. -
మరో మూడురోజులు పాతనోట్లకు ఓకే
-
మరో మూడురోజులు పాతనోట్లకు ఓకే
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుడి కష్టాలను తగ్గించేందుకు కేంద్రం మరిన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. ప్రజలకు పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల వినియోగాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించింది. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, బస్సు టికెట్లు, ఎయిుర్ పోర్టుల్లోని కౌంటర్లలో విమాన టికెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీల్లో మందుల కొనుగోలు, ఎల్పీజీ సిలిండర్లు, రైల్వే కేటరింగ్ల్లో సోమవారం అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుబాటవుతాయి. ప్రభుత్వ ఆధీనంలోని సహకార కేంద్రాల్లోనూ ధ్రువీకరణ పత్రాలతో పాత నోట్లను వినియోగించవచ్చు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల పన్నులు చెల్లించవచ్చు. శుక్రవారం అర్ధరాత్రి వరకే అనుమతిచ్చినా బ్యాంకులు, ఏటీఎం వద్ద పెరుగుతున్న రద్దీ, ప్రజల్లో ఆందోళన నేపథ్యంలో ఈనెల 14 అర్ధరాత్రి దాకా అనుమతిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆ లోపు కొత్త కరెన్సీ అందుబాటులోకి రావొచ్చని భావిస్తోంది. టోల్ రద్దు పొడిగింపు జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా టోల్ గేట్ల వద్ద పన్ను వసూళ్ల నిలుపుదలను కూడా కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజులు పొడగించింది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్ కట్టాల్సిన పని లేదంటూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఔటర్ రింగురోడ్డుపై కూడా ఈ నెల 14 వరకు టోల్ కట్టాల్సిన అవసరం లేదంటూ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటన విడుదల చేశారు.