old notes validity till december 15
-
నోట్ల మార్పిడికి రాం రాం!
-
నోట్ల మార్పిడికి రాం రాం!
⇒ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్కే రూ. 1,000 నోటు పరిమితం ⇒ 15వ తేదీ వరకు అనుమతించిన చెల్లింపులన్నీ పాత రూ. 500 నోట్లతోనే.. ⇒ కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం ⇒ జాబితాలో తాజాగా మొబైల్ రీచార్జ్, స్కూలు ఫీజులు, కో-ఆపరేటివ్ స్టోర్లు ⇒ పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిలకు మాత్రమే అవకాశం ⇒ డిసెంబర్ 2 వరకూ టోల్ ట్యాక్స్ రద్దు న్యూఢిల్లీ పెద్ద నోట్ల రద్దుతో కొనసాగుతున్న ప్రజల కష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 15 వరకూ అనుమతించిన చోట్ల పాత 500 నోటును వాడుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో బ్యాంకుల్లో రూ. 500, వెయ్యి నోట్ల మార్పిడిని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ‘పౌర సేవల బిల్లులు(కేవలం నీటి, విద్యుత్ బిల్లుల చెల్లింపు) చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకూ పాత రూ. 500 నోటు వినియోగించవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి నవంబర్ 25 నుంచి అందుబాటులో ఉండదు’ అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇంత కుముందు ఈ గడువు డిసెంబర్ 30 వరకూ ఉంది. నవంబర్ 8న నోట్ల రద్దుపై మోదీ ప్రకటన అనంతరం పౌర సేవల బిల్లులు, ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం, రైల్వే, బస్సు, విమాన టికెట్లకు , పెట్రోల్ బంకులతో పాటు పలుచోట్ల 500, వెరుు్య నోట్లను అనుమతించారు. ఈ గడువును నవంబర్ 24 వరకూ పొడిగిస్తూ వచ్చారు. గడువు ముగియడంతో గురువారం రాత్రి తాజా నిర్ణయం తీసుకున్నారు. అరుుతే ఇక నుంచి కేవలం రూ. 500 నోట్లు మాత్రమే స్వీకరిస్తారని, వెరుు్య నోట్లను ఎక్కడా తీసుకోరని, బ్యాంకులతోపాటు పోస్టాఫీసుల్లోని సేవింగ్స్ ఖాతాల్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవాలని ఆర్థిక శాఖ పేర్కొంది. ఎక్కడెక్కడ పాత 500 నోటు చెల్లుతుందంటే.. పౌర సేవల బిల్లులు.. కేవలం విద్యుత్, నీటి బిల్లుల కోసమే.. బకాయిలు చెల్లించాలి.. ఆస్తి పన్ను చెల్లింపులకు వర్తించదు టోల్ ప్లాజాలు (డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు లేదు) డిసెంబర్ 3 నుంచి 15 వరకు చెల్లించవచ్చు పెట్రోల్ బంకులు.. శ్మశాన వాటికలు.. కోర్టు ఫీజులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పాల కేంద్రాలు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ఖర్చులకు డాక్టర్ చీటీతో అన్ని మందుల షాపుల్లో మందుల కొనుగోలుకు రైల్వే టికెట్ కౌంటర్లు, బస్సు టికెట్ కౌంటర్లు (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సహకారంతో నడిచే బస్సులు), ఎరుుర్పోర్టు కౌంటర్లు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీ, స్థానిక సంస్థల స్కూళ్లలో ఒక్కో విద్యార్థి రూ.2 వేల వరకూ ఫీజులు చెల్లించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ విక్రయ కేంద్రాల నుంచి విత్తనాల కొనుగోలుకు మొబైల్ రీచార్జ్ కోసం.. ఒక రీచార్జ్కు ఒక్క నోటే తీసుకుంటారు. కన్సూమర్ కోఆపరేటివ్ స్టోర్ల నుంచి రూ. 5 వేల వరకూ కొనుగోళ్లకు విదేశీయులు వారానికి రూ. 5 వేల వరకూ విదేశీ కరెన్సీ మార్చుకోవచ్చు. వివరాలు పాస్పోర్టులో తప్పకుండా నమోదు చేయాలి. రైల్వే క్యాటరింగ్ సేవలకు, సబర్బన్, మెట్రో రైలు టికెట్ల కొనుగోలుకు చారిత్రక స్థలాల్లో టికెట్ల కొనుగోలుకు -
బ్యాంకులలో పాతనోట్ల మార్పిడి బంద్
-
బ్యాంకులలో పాతనోట్ల మార్పిడి బంద్
పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రం పలు నిర్ణయాలు వెలువరించింది. బ్యాంకులలో నోట్ల మార్పిడిని గతంలో ప్రకటించినట్లుగానే బుధవారంతో ఆపేసింది. ఇప్పటికే ఈ తరహా మార్పిడి కోసం బ్యాంకులలో క్యూలైన్లు తగ్గుతున్నాయని, అందువల్ల ఇప్పటివరకు అసలు బ్యాంకు ఖాతాలు లేనివారు ఖాతాలు తెరుచుకోడానికి, అలాగే తమవద్ద ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడానికి వీలుగా బ్యాంకులలో రద్దీ తగ్గించాలన్న ఉద్దేశంతో పాతనోట్ల మార్పిడిని 24వ తేదీ తో ఆపేస్తున్నామని ప్రకటించింది. ఇక పాత 500, 1000 రూపాయల నోట్ల చెల్లుబాటును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ నోట్ల చెల్లుబాటు విషయంలో ఇప్పటివరకు ఉన్న నిబంధనలలో కొన్నింటిని మార్చి, మరికొన్నింటిని చేర్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... 500, 1000 రూపాయల నోట్ల వాడకానికి సూచనలు ఇవీ... కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, మునిసిపల్, స్థానిక సంస్థల యాజమాన్యాలలో నడుస్తున్న అన్ని పాఠశాలలలో స్కూలు ఫీజులను రూ. 2వేల వరకు రూ. 500 నోట్లతో చెల్లించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలలో కూడా ఫీజులు చెల్లించవచ్చు. రూ. 500 వరకు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జికి చెల్లించుకోవచ్చు. ఒకసారి రూ. 5వేల విలువైన వస్తువులను వినియోగదారుల సహకార స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. మంచినీళ్లు, విద్యుత్ బిల్లుల పాత బకాయిలు, ప్రస్తుత బిల్లులను చెల్లించవచ్చు. ఇది కేవలం వ్యక్తుల గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ కోరిక మేరకు టోల్ ప్లాజాల వద్ద డిసెంబర్ 2వ తేదీ వరకు టోల్ మినహాయింపు, 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 500 నోట్లతో చెల్లింపునకు ఆమోదం విదేశీయులు వారానికి రూ. 5000 వరకు విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు అనుమతి. దీనికి సంబంధించిన ఎంట్రీలను వాళ్ల పాస్పోర్టులలో నమోదుచేస్తారు. Central Government decides that there will be no over the counter exchange of old Rs. 500 and Rs. 1000 notes after midnight of 24.11.2016. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 Certain other exemptions relating to cancellation of legal tender character of old Rs. 500 and Rs.1000 notes extended up to 15.12.2016. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 Those extended till 15.12.2016 include Payment of current & arrear dues to utilities which will be limited to only water and electricity. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 Foreign citizens will be permitted to exchange foreign currency upto Rs.5,000 per week.Entry to this effect will be made in their passports. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 Toll payment at toll plazas can be made via old Rs.500 notes from 3.12.2016 to 15.12.2016 as toll free arrangement continues upto 2nd Dec. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 For details of decisions taken today relating to cancellation of legal tender character of old Rs.500 &Rs.1000 notes:https://t.co/iJ5RWadKkZ — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016