Paadayatra
-
పాదయాత్రలంటే హడలిపోతున్న నేతలు.. టీ.కాంగ్రెస్లో ఏం జరుగుతోంది!
కాంగ్రెస్ నేతలు పాదయాత్రలంటే హడలిపోతున్నారెందుకు? ఒక వైపు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలు షురూ చేశారు. వీరిద్దరి యాత్రలతో జిల్లాల నాయకులు ఇబ్బంది పడుతున్నారు. మా నియోజకవర్గంలో పాదయాత్ర వద్దంటే ఏమవుతుందో అన్న భయం. అగ్ర నేతల ఆధిపత్య పోరుతో నలిగిపోతున్న జిల్లా నాయకులు. అసలు టీ.కాంగ్రెస్లో ఏంజరుగుతోంది? చేయి తుప్పు వదులుతోందట.! హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ యాత్రలు చేస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. అయితే ఎవరి నియోజకవర్గంలో వారు పాదయాత్ర చేస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అంటూ బయల్దేరడంతో నియోజకవర్గ స్థాయి నేతల గుండెలు అదిరిపోతున్నాయట. పాదయాత్ర అంటేనే ఖర్చుతో కూడుకున్నది. జనసమీకరణ, భోజనాలు, ఇతర ఏర్పాట్లు అన్ని కలిపి ఒక్క రోజుకు కనీసం 25 నుంచి 30 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఒక నియోజకవర్గంలో ఒక్కరోజు పాదయాత్ర అయితే ఇబ్బంది లేదు కానీ నేతలు పోటీ పడి యాత్ర చేయడం ద్వారా తమకు ఖర్చు తడిసి మోపడవుతోందని తెగ హైరానా పడిపోతున్నారట నియోజకవర్గాల్లో టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు. పాదయాత్రకు టికెట్కు లింకు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున తమ నియోజకవర్గంలో పాదయాత్ర వద్దంటే టిక్కెట్ ఎక్కడ ఎగిరిపోతుందో అనే భయం ఒకవైపు... యాత్ర లేకపోతే కేడర్లో ఉత్సాహం తగ్గిపోతుందనే ఆందోళన మరోవైపు స్థానిక నేతల్ని ఆలోచనలో పడేస్తోంది. ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అటు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా భట్టి విక్రమార్క తన పాదయాత్ర షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు 150 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పుడు సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఒకటి, రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు రాష్ట్ర నాయకులు పాదయాత్ర పెట్టుకోవడం నియోజకవర్గ నేతలకు ఆర్థిక భారంగా మారిందట. అలా జిల్లాలు చుట్టేస్తున్నారు.! హుజురాబాద్, హుస్నాబాద్, స్టేషన్ ఘన్ పూర్, వర్దన్న పేట, ఇల్లందు, కొత్తగూడెం ఇలా పలు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర పూర్తయింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ప్రారంబించిన భట్టి పాదయాత్ర కూడా ఈ నియోజకవర్గాల గుండా వెళ్ళనుంది. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ పరధిలోనే పాదయాత్ర షెడ్యూల్ ను రేవంత్ రెడ్డి ఇంకా ప్రకటించలేదు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పూర్తయ్యాక రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తారని చెబుతున్నారు. అయినను పోయి రావలెను భట్టి పాదయాత్ర చేసిన రూట్ లో రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ పాదయాత్ర చేసిన రూట్ లో సీఏల్పీ నేత పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం ఏంటనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇద్దరు నేతలు కూర్చుని కర్ణాటక కాంగ్రెస్ నేతల మాదిరిగా.. ఒకరు పాదయాత్ర చేసిన నియోజకవర్గంలో మరోకరు చేయకుండా రూట్ మ్యాప్ తయారు చేసుకుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుంది...నియోజకవర్గ నేతలకు ఆర్థిక భారం తగ్గతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాని క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా..గాంధీభవన్ నేతలు ఏకపక్షంగా పాదయాత్ర రూట్ మ్యాప్ లను ప్రకటించడంతో నియోజకవర్గ ఇంచార్జ్ లు, ఆశావాహులు నలిగిపోతున్నారు. -
నేడు పవన్, వామపక్ష నేతల పాదయాత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా శుక్రవారం విజయవాడలోని బెంజి సర్కిల్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై జాతీయ రహదారి మీదుగా రామవరప్పాడు వరకు కొనసాగుతుందని పేర్కొంది. -
‘ప్రజాసంకల్పం’ విజయాన్ని కోరుతూ పాదయాత్ర
-
‘పెలికాన్ ’ కంపెనీని మళ్లీ తెరవాలి
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల పాదయాత్ర రాజేంద్రనగర్: పెలికాన్ రబ్బర్ కంపెనీని మళ్లీ తెరిచి కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం గగన్ పహాడ్, కాటేదాన్ చౌరస్తా పారిశ్రామిక వాడలలో రాజేంద్రనగర్ జోన్ సీఐటీయూ అధ్యక్షుడు వి.జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పెలికాన్ రబ్బర్ కంపెనీని అక్రమంగా లాకౌట్ చేశారన్నారు. దీంతో 20 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. దాదాపు 300 మంది కార్మికులు కంపెనీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఎల్ఐసీ, రెండేళ్ల బోనస్ ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. కార్మికులు ఉత్పత్తి చేసిన కోట్లాది రూపాయల విలువైన ట్యూబ్లను గోదాంల్లో దాచి పెట్టారని చెప్పారు. కంపెనీ యజమాని ఆనంద్ అగర్వాల్ కొత్తగా సాబురి ఇన్ క్స్ పేరుతో మరో కంపెనీని సృష్టించి కంటెయినర్లలో మాల్ను తరలిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కార్మికులకు మూడు నెలల జీతాలు ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులతో కలిసి ఆనంద్ అగర్వాల్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అక్రమ లాకౌట్ను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో జె.రవీందర్, పి.నర్సింహులు, సిద్ధయ్య, మల్లేష్, కృష్ణ, మహేందర్, జహంగీర్, కేతమ్మ, రజని, ఆనంద్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాదయాత్రపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సాక్షి, హైదరాబాద్: తాము చేపడుతున్న పాదయాత్రను అడ్డుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సీపీఎం తెలిపింది. ఈనెల 17 నుంచి చేపట్టనున్న మహాజన పాదయాత్రను ఎద్దేవా చేస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్లు లేవని పేర్కొంది. సీపీఎం చేస్తున్నది ప్రభుత్వ, టీఆర్ఎస్ వ్యతిరేక యాత్ర కాదని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.