participating
-
Paris Olympics 2024: భారత బ్యాడ్మింటన్ బృందం ఇదే (ఫొటోలు)
-
‘ఆ పరిస్థితి ఎక్కడా రాకూడదని కోరుకుంటున్నా’
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం ఢిల్లీలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన ‘దేశంలో పర్యావరణ పరిరక్షణ-అడవుల రక్షణ మొక్కల పెంపకం’ పై సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 1.175 కోట్ల మొక్కలను నాటామని వెల్లడించారు. అటవీ శాఖలో పోస్టుల భర్తీ.. 24 శాతానికి తగ్గిపోయిన అడవులను 33 శాతానికి పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అటవీ శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చాక భూగర్భ జలాలు, అడవులు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు దేశంలో ఎక్కడా రాకూడదని కోరుకుంటున్నానన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి జూట్, పేపర్ బాగ్స్ ను వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. -
కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరం
నిర్మల్టౌన్ : జ్ఞాన సరస్వతీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్మల్రూరల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో చేపట్టిన ఎన్ఎస్ఎస్ శిబిరం ఆదివారం నాటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురికినీరును శుభ్రం చేశారు. ఇందులో సర్పంచ్ చింతకింది నర్సయ్య, ఎంపీటీసీ దాసరి పంతులు, వీడీసీ మెంబర్ భీమన్న, కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి, అధ్యక్షుడు తుల భోజన్న, అధ్యాపకులు, విద్యార్థులున్నారు. -
మహిళలకు జల్లికట్టు
సేలం: నామక్కల్ జిల్లా, తిరుచెంగోడు ఇలంజర్ మండ్రం ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా మహిళలు, పిల్లలకు కోడి పందెం(మహిళల జల్లికట్టు) పోటీని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తిరుచెం గోడులోని నందవనం వీధిలో ఈ పోటీ నిర్వహించారు. ఇందులో ఒక వృత్తంలో ఒక కోడి పుంజు కాలిని ..మహిళ కాలిని తాడుతో కట్టి ఉంచుతారు. మహిళ కళ్లకు గంతలు కడతారు. ఆ మహిళ నిమిషంలోపు ఆ కోడి పుంజును పట్టుకోవాలి. ఈ పోటీల్లో విజేతలకు ఆసక్తికరమైన బహుమతులు అందజేశారు.ఈపోటీని మహిళల జల్లికట్టుగా పిలుస్తుండడం విశేషం. రెక్లా రేసు.. నామక్కల్ జిల్లా, తిరుచెంగోడులోని సీహెచ్పీ కాలనీ, కొల్లపట్టి, కరట్టుపాళయం సానార్ పాళయం కమిటీల ఆధ్వర్యంలో పొంగల్ సందర్భంగా రెక్లా(గుర్రాల)పోటీలు నిర్వహించారు. పోటీల్లో సేలం, ఈ రోడ్, కోవై, తిరుచ్చి జిల్లాలకు చెందిన 42 గుర్రాలు పోటీ పడ్డాయి. ఇందులో ఏడు కి.మీ దూరం పందెం, 44 ఇంచుల ఎత్తు గుర్రాలు, పెద్ద గుర్రాలు, చిన్న గుర్రాలు వంటి నాలుగు విభాగాల పోటీల్లో యువకులు పాల్గొన్నారు. లండన్కు చెందిన యోగా శిక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. -
జర్మనీ మొదటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్!
చెన్నైః ఒడిషాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూర్ లను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని గతంలో జర్మనీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ముందుగా తమ ప్రాజెక్టును కోయంబత్తూరు నుంచి ప్రారంభించేందుకు జర్మనీ సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం అయ్యారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ముందుగా కోయంబత్తూర్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని జర్మనీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే తమిళనాడు ముఖ్యంత్రి జయలలితను స్టేట్ సెక్రెటేరియల్ లో కలిసినట్లు తమిళనాడు ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సహాయం అందించేందుకు సంసిద్ధంగా ఉన్న జర్మనీ.. ముందుగా కోయంబత్తూర్ నుంచి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు జర్మన్ అంబాసిడర్ నే.. తెలిపారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తల ప్రాతినిథ్యంతో కూడిన ఓ బృదం జూలై 20న కోయంబత్తూర్ సందర్శించి, కోయంబత్తూర్ నగర మేయర్, ఇతర అధికారులతో మిగిలిన చర్చలు జరపనున్నట్లు తెలిపింది. ప్రాజెక్టులకు తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నజర్మన్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమిళనాడులో బ్యాంకింగ్ గ్రూప్ కెఎఫ్ డబ్ల్యూ సహా.. మరిన్ని జర్మన్ కంపెనీలు పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. -
ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు