pays tributes
-
గిరిజనుల కులదైవం ఫోటోతో పాటు వైఎస్ఆర్ గారి ఫోటో..
-
చలపతి రావుకు నివాళులు అర్పించిన విక్టరీ వెంకటేష్
-
చలపతి రావుకు నివాళులు అర్పించిన మెగాస్టార్ చిరంజీవి
-
కైకాల మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, మంత్రులు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. కైకాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సార్వ భౌమ’ అనిపించుకున్న మేటి నటుడు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా నవరసనటనా సార్వ భౌమ అనిపించుకున్న మేటి నటుడు కైకాల సత్యనారాయణ మరణం విచారకరమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘‘కైకాల ఆరు దశాబ్దాల సినీ జీవితంలో 777 చిత్రాలలో నటించారు. కేవలం నటుడు గానే కాకుండా చిత్రం నిర్మాణం కూడా చేపట్టి పలు సినిమాలు నిర్మించి మంచి ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ రంగంలో అడుగు పెట్టిన ఆయన మచిలీపట్నం లోక్ సభ నుంచి ఎన్నికై పార్లమెంటు సభ్యుడి గాను తన సేవలను ప్రజలకు అందించారు. సత్యనారాయణ మరణం సినీ రంగానికి తీరని లోటు’’ అని మంత్రి కారుమూరి అన్నారు. ఇండస్ట్రీకి తీరని లోటు: మంత్రి వేణు కైకాల మృతి పట్ల మంత్రి వేణుగోపాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 700 చిత్రాలకు పైగా నటించిన కైకాల మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంతో బాధాకరం: మంత్రి రోజా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ గారు 750 కిపైగా సినిమాల్లో నటించి `నవరసనటనా సార్వభౌముడు` అనిపించారని మంత్రి రోజా ట్విట్ చేశారు. మరణం ఎంతో బాధాకరమని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కైకాల కుటుంసభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్ నివాళులర్పించారు. చదవండి: 4న విశాఖకు రాష్ట్రపతి రాక -
డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉండే రియల్ హీరో కృష్ణ గారు : బండి సంజయ్
-
కృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేఏ పాల్
-
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రభాస్
-
సూపర్ స్టార్ కృష్ణను తలుచుకొని ఎమోషనల్ అయిన సినీ ప్రముఖులు
-
మహేష్ బాబును పరామర్శించిన విజయ్ దేవరకొండ
-
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన jr ఎన్టీఆర్, నాగ చైతన్య
-
కృష్ణ పార్థివదేహాం వద్ద మోహన్ బాబు ఎమోషనల్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి
-
పింగళి చిత్రపటానికి నివాళలు అర్పించిన గవర్నర్ బిశ్వభూషణ్
-
యుద్ధ వీరులకు నివాళులర్పించిన రాంచరణ్ (ఫొటోలు)
-
అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు నేతలు పాల్గొన్నారు. చదవండి: నా తమ్ముళ్లు, చెల్లెళ్లు గొప్పగా చదవాలి: సీఎం జగన్ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీ రాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కులం, ప్రాంతం, మతం అనే భేదాలు లేకుండా గౌరవించే వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రజల మేలు కోసం చివరివరకు పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. డీజీపీ కార్యాలయంలో.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. -
లతకు పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: అమర గాయని లతా మంగేష్కర్ స్మృత్యర్థం పార్లమెంటు ఉభయసభలు సోమవారం గంటపాటు వాయిదా పడ్డాయి. లత మరణం సంగీతానికి, కళా రంగానికి తీరని లోటని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అన్నారు. ‘‘పాటల ఆత్మతో తాదాత్మ్యం చెందడం లతకే సొంతమైన విద్య. అందుకే ఆమె పాటలన్నీ మాస్టర్పీస్లుగా నిలిచిపోయాయి’’ అంటూ కొనియాడారు. లత స్వరం దశాబ్దాల పాటు దేశాన్ని మంత్రముగ్ధం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘దేశ ఐక్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని లత బలోపేతం చేశారు. ఆమె 36 భాషల్లో పాడిన తీరే దేశ ఐక్యతకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ’’ అని కొనియాడారు. మెలోడీ క్వీన్ మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇండోర్లో లత అకాడమీ లత జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్లో ఆమె జన్మస్థలం ఇండోర్లో సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ మొక్క నాటారు. ఇండోర్లో లత విగ్రహం, ఆమె పాటలతో మ్యూజియం, ఆమె పేరిట కాలేజీ, మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏటా లత జయంతి నాడు ఆమె పేరుతో అవార్డు ఇస్తామని చెప్పారు. లత అస్థికలను అల్లుడు ఆదినాథ్ సేకరించారు. వాటిని ఎక్కడ కలుపుతారనే దానిపై స్పష్టత లేదు. -
ఎన్టీఆర్కు మరణం ఉండదు: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్కు మరణం ఉండదని లక్ష్మీపార్వతి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లోని సమాధి వద్ద లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా అందరి మనసుల్లో ఉన్నారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని లక్ష్మీపార్వతి అన్నారు. చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్.. -
Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్యకి ప్రముఖుల నివాళి
-
ఏపీలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు ఫోటోలు
-
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ : మహానేత వైఎస్సార్కు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
మహానేత వైఎస్సార్కు సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, పులివెందుల: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఇవీ చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చిరునవ్వుల వేగుచుక్క (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యూపీ మాజీ సీఎం కల్యాణ్సింగ్కు ప్రధాని మోదీ నివాళి
-
మహానేత వైఎస్సార్కు వైఎస్ భారతి నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజంపేట మండలంలో రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. -
వైఎస్సార్కు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, షర్మిల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను, తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నారాయణకు సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. దిగువపల్లిలో నారాయణ మృతదేహానికి వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నారాయణ మృతి చెందడంతో వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం జగన్ వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. పలువురి నివాళి: అనార్యోగంతో మృతి చెందిన సీఎం జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి దంపెట్ల నారాయణ మృతదేహానికి మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథ్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళర్పించారు. (సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు అనారోగ్యంతో మృతి) -
గాంధీ, వాజ్పేయిలకు మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ గురువారం ఉదయం రాజ్ఘాట్లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. రాజ్ఘాట్ నుంచి నేరుగా అటల్ మెమోరియల్కు చేరుకున్న మోదీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయికి నివాళులు అర్పించారు. మహాత్మ గాంధీ, వాజ్పేయిలకు నివాళులు అర్పించిన అనంతరం దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల స్మృతి చిహ్నంగా ఇండియా గేట్ వద్ద నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్కు వెళ్లి అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని వెంట బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా తదితరులున్నారు. కాగా గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ, విదేశీ నేతలు సహా దాదాపు 8000 మంది అతిధులు హాజరు కానున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,పార్టీల నేతలు, పరిశ్రమ వర్గాలు, దౌత్యవేత్తలు, రాయబారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు అతిధుల జాబితాలో ఉన్నారు. -
కరుణానిధికి ప్రధాని మోదీ నివాళి
-
పోలీసు అమర వీరుల దినోత్సవంలో హోం మంత్రి
-
'తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవు'
హైదరాబాద్: తెలంగాణ సిద్దాంతకర్త, ప్రొ కె.జయశంకర్ ఆశయాలకనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కే తారక రామారావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 4వ వర్ధంతి వేడుకలను ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..వరంగల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు జయశంకర్ పేరుపెడతామన్నారు. జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు పెట్టామన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో..తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవన్నారు. చట్ట ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఇడుపులపాయలో తండ్రికి షర్మిల నివాళులు