people security
-
మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం
సాక్షి, అమరావతి: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టు పార్టీపై మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా భద్రతా చట్టం 1992 కింద ఆగస్టు 17, 2019 నుంచి ఏడాది పాటు మావోయిస్టు పార్టీపై నిషేధం పొడిగించారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలైన రైతు కూలీ సంఘం, ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్, విప్లవకార్మిక సమాఖ్య, సింగరేణి కార్మిక సమాఖ్య , ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ర్యాడికల్ యూత్ లీగ్, రివల్యూషనరీ డెమాక్రాటిక్ ఫ్రంట్ తదితర సంస్థలపై నిషేధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 1991 నుంచి ఈ సంస్థలపై ప్రతీ ఏటా నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. -
కేసీఆర్కు జడ్ప్లస్ అయితే సీమాంధ్రులకు ఎంత?
-
కేసీఆర్కు జడ్ప్లస్ అయితే సీమాంధ్రులకు ఎంత?
హైదరాబాద్ నగరంలో ఉండే సీమాంధ్రుల భద్రతపై స్ఫష్టత వచ్చే వరకు విభజన ప్రక్రియ చేపట్టకూడదని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు యూపీఏ సర్కార్ను డిమాండ్ చేశారు. శనివారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోనే ప్రముఖ నేత అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్కు జెడ్ప్లస్ భద్రత కావాలంటే... హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్రులకు ఎంత రక్షణ కావాల్సి ఉంటుందని అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 31, సెప్టెంబర్ 1వ తేదీలలో కూకట్పల్లిలో దీక్ష చేపట్టనున్నట్లు శ్రీనివాసరాజు వివరించారు.