PLEANARY
-
YSR Congress Party: వైఎస్సార్సీపీ ప్లీనరీ తేదీలు, వేదిక ఖరారు
సాక్షి, తాడేపల్లి: జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీని నిర్వహిస్తామని తెలిపింది. ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. చదవండి: (‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే?) -
ఆర్టికల్ 371 జోలికి వెళ్లం
గువాహటి: ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అక్రమంగా ఒక్క వలసదారున్ని కూడా దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్ఈసీ) 68వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 371ని కూడా కేంద్రం రద్దు చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని తెలిపారు. ‘దీనిపై నేను ఇదివరకే పార్లమెంటులో స్పష్టతనిచ్చాను. నేడు 8మంది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో మరోసారి చెబుతున్నా. కేంద్రం ఆర్టికల్ 371 జోలికి వెళ్లదు’ అని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందునే దాన్ని రద్దుచేశామని, అయితే ఆర్టికల్ 371 మాత్రం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుందని, ఈరెండింటి మధ్య చాలా తేడా ఉందని షా వివరించారు. ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతూ..అక్రమ చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరముందని షా అభిప్రాయపడ్డారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ‘ఫెడరల్ ఫ్రంట్’!
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో మార్పు కోసం రూపుదిద్దుకోనున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనకు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభను వేదికగా చేసుకోవాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇదే వేదికపై ఫెడరల్ ఫ్రంట్పై పూర్తిస్థాయి రాజకీయ ప్రకటన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై సన్నిహితులతో చర్చించినట్టు సమాచారం. కార్యాచరణపై కసరత్తు.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలను కూడగడతానని ప్రకటించిన కేసీఆర్.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించి, ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలపై మథనం చేస్తున్నారు. దీనికోసం రాజకీయ, రాజకీయేతర మేధావులతో చర్చిస్తున్న ఆయన.. టీఆర్ఎస్ ఆవిర్భావ సభను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఉద్యమం నాటి తరహాలో.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభలను నిర్వహించారు. వాటికి ఇతర రాష్ట్రాల్లోని పార్టీల అధినేతలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఆర్ఎల్డీ అధినేత అజిత్సింగ్ తదితరులు టీఆర్ఎస్ సభల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. అలా ఇతర పార్టీలు రాజకీయ వేదికలపై సంఘీభావం తెలపడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులోనూ అదే తరహాలో వ్యవహరించాలని.. కలసి వచ్చే రాజకీయ పార్టీల నేతలను, కూటమి పట్ల సానుకూలంగా ఉన్న నేతలను ఆహ్వానించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్పై దృష్టి పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగసభను ఫెడరల్ ఫ్రంట్కు పునాదిగా మలచాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది. 10 లక్షల మందితో.. ఫెడరల్ ఫ్రంట్కు పునాది వేసే బహిరంగసభను తెలంగాణలో ఏర్పాటు చేయడం వల్ల దేశవ్యాప్తంగా మన రాష్ట్రంపై దృష్టి పడేలా చేయడం, టీఆర్ఎస్ కేడర్లో స్థైరం నింపడమనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లేదా నల్లగొండలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను, ప్రతినిధులను ఆహ్వానించనుండటంతో ఆ స్థాయిలోనే బహిరంగ సభ ఉండాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. కేసీఆర్ ఒకసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వస్తారని.. అనంతరం బహిరంగసభకు ఆహ్వానించే పార్టీల నాయకులు, ప్రతినిధుల జాబితా సిద్ధం కానుందని పేర్కొంటున్నారు. -
ఏఐసీసీ కమిటీలో పొన్నంకు చోటు
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన రాజ కీయ సబ్కమిటీలో చోటు కల్పించారు. ఎ.కె.ఆంటోని అధ్యక్షతన నియమించిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల కమిటీలో అన్ని రాష్ట్రాల నుంచి 25మంది సభ్యులుండగా, అందులో పొన్నంకు అవకాశం కల్పిం చారు. మాజీ ప్రధాని మన్మోహన్ అధ్యక్ష తన నియమించిన డ్రాఫ్ట్ కమిటీలోనూ పొన్నంకు అవకాశం వచ్చింది. కాగా కీలక కమిటీల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
పాతతరానికే రాహుల్ ఓటు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మార్చిలో ఢిల్లీలో జరపనున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్ల కమిటీలో పాతతరం నేతలకే అధ్యక్షుడు రాహుల్ కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ప్లీనరీ ఏర్పాట్లకోసం నియమించిన పలు కమిటీలను ఏఐసీసీ బుధవారం ప్రకటించింది. ఇందులో పలువురు పాతతరం నేతలకు ముఖ్యమైన బాధ్యతలు అప్పజెప్పారు. ప్లీనరీ నిర్వాహక కమిటీ బాధ్యతలను పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరాకు అప్పగించగా.. కన్వీనర్గా ఆస్కార్ ఫెర్నాండెజ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జ్లను నియమించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో డ్రాఫ్ట్ కమిటీకి వేశారు. ఈ కమిటీలోనూ సగానికిపైగా మంది వృద్ధ నేతలే. రాజకీయ తీర్మానాలను సిద్ధం చేసే కమిటీ బాధ్యతలను ఏకే ఆంటోనీకి అప్పగించారు. ఆర్థిక వ్యవహారాల కమిటీకి పి. చిదంబరం చైర్మన్ కాగా.. కన్వీనర్ జైరాం రమేశ్. పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీకి ఏ కమిటీలోనూ స్థానం కల్పించలేదు. స్టీరింగ్ కమిటీ పార్లమెంటు హౌజ్లో మార్చి 16వ తేదీన సమావేశమై తీర్మానాల తుదిజాబితాను సిద్ధం చేయనుంది. ప్లీనరీ మార్చి 17, 18 తేదీల్లో జరగనుంది. -
రాష్ట్రంలో అరాచక పాలన
ఆకివీడు : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఇలాగే కొనసాగితే ప్రజలు చెప్పులు, రాళ్లతో కొడతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉండి నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశం శనివార ఆకివీడు రైస్ మిల్లర్స్ హాలులో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ న్యాయం చేయమని వచ్చిన బాధితులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని టీడీపీ పాలకులపై ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచక పాలనను అరికట్టేందుకు సమయం దగ్గరపడిందని అన్నారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పాలనలో అరాచకం ఉందన్నారు. నియోజకవర్గంలో 170 ఎకరాల భూమిని పేదలకు పంచడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రూ.30 కోట్ల మంచినీటి పథకాన్ని నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి వెతలున్నప్పటికీ టీడీపీ నాయకులు కాలువల్లో దిగి పోజులిస్తున్నారని నాని ఆరోపించారు. ప్రజలు గమనిసూ్తనే ఉన్నారన్నారు. ఏడాదిన్నరలో రాజన్న రాజ్యం రాబోతుందని, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. కాగా బూత్ స్థాయి సమస్యల్ని వెలికితీసి వాటి పరిస్కారానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్లీనరీల విజయవంతంతో టీడీపీ కళ్లు తెరిపించామని చెప్పారు. జిల్లాస్థాయి ప్లీనరీకి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇంకా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే విజయం అని అన్నారు. ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పాతపాటి సర్రాజు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడగకుండానే ప్రజల తలుపు తట్టి ప్రభుత్వ పథకాలు అందజేశానని గుర్తు చేశారు. కానీ నియోజకవర్గంలో పదేళ్లుగా అభివృద్ధి కుంటుబడి పాతికేళ్లు వెనక్కిపోయిందన్నారు. ప్రజలు ఇదంతా గమనిసూ్తనే ఉన్నారని అన్నారు. సరియైన సమయంలో టీడీపీకి బుద్ధిచెబుతారని ఆకాంక్షించారు. అనంతరం బూత్, మండల కమిటీల ఎన్నికను ఆమోదించారు. పలు తీర్మానాలను ఆమోదించారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయి బాల పద్మ, నియోజకవర్గ నాయకుడు మేడిది జాన్సన్, కనకరాజు సూరి, చినమిల్లి వెంకట్రాయుడు, కాశిరెడ్డి, బూరుగుపల్లి సుబ్బారావు, శ్రీనుబాబు, మాజీ ఎమ్మెల్యే ఇందుకూరి రామకృష్ణంరాజు, పి.ఉమాదేవి, గుండా సుందర రామనాయుడు, గుల్లిపల్లి అచ్చారావు, ఇర్రింకి వీరరాఘవులు, కేశిరెడ్డి మురళీ, జగ్గురోతు విజయ్కుమార్, షేక్ హుస్సేన్, నంద్యాల సీతారామయ్య, జామి శ్రీనివాస్, పుప్పాల పండు, శిరపు శ్రీనివాస్, తోట శివాజీ, గ్లాడ్సన్, మోరా జ్యోతి పాల్గొన్నారు. -
దోపిడీ పాలనను సాగనంపుదాం
కొవ్వూరు : టీడీపీ మంత్రులు, నాయకులు ఇసుక, మట్టి, మద్యం మాఫియాలుగా మారి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. స్థానిక పరిమి రామారాయుడు రత్తమ్మ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశా రు. సంస్థాగతంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బ లోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సా గిస్తున్న రాక్షసపాలనకు చరమగీతం పాడాలని సూచించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అవి నీతికి పాల్పడుతూ ప్రజాధనం దోచుకుతింటున్నారన్నారు. అక్రమ సంపాదనను రాబోయే ఎన్నికల్లో ఖర్చుచేయాలంటూ చంద్రబాబు అవి నీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకు అందించారని, చంద్రబాబు పాలనలో ఇసుక మాఫియా ముఠాలుగా మారారని ధ్వజమెత్తారు. అసమర్థ మంత్రి పాలనలో నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు పరిమి హరి చరణ్, బండి పట్టాభి రామారావు, ముదునూరి నాగరాజు, గురుజు బాలమురళీకృష్ణ, చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు, లకంసాని శ్రీనివాసరావు, చీర్ల బ్రహ్మానందం తదితరులు వివిధ తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, నియోజకవర్గ కన్వీనర్లు పుప్పాల వాసుబాబు, ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాసరావు, దయాల నవీన్బాబు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, నాయకులు పోతుల రామతిరుపతిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, చాగల్లు, తాళ్లపూడి మండల అధ్యక్షులు కొఠారు అశోక్బాబు, కుంటముక్కల కేశవ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రానున్న రెండేళ్లలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తానేటి వనిత పార్టీ శ్రేణులకు పి లుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేంతవరకూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వాస్పత్రిలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. ఇసుక అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. ఇసుక మాఫియా హత్యలకు తెగబడుతోందని, టీడీపీ నాయకులు సొంత పార్టీ నాయకులను హత్య చేయిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో తాగునీరు దొరక్కపోయినా మద్యం ఎరులై పారుతోందని విమర్శించారు. కోట్లు ఎలా వచ్చాయి దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ.25 లక్షలు అప్పు చేసిన మంత్రి ఇప్పుడు కోట్లు ఎలా సంపాందించారో చెప్పాలని ప్రశ్నించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి.. అబద్దపు హామీలతో అన్ని వర్గాలకు మోసగించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళుళం జిల్లా పార్టీ పరిశీలకుడు కొయ్యే మోషేన్రాజు విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సాఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య విమర్శించారు. అన్నదాతల ఆత్మహత్యలు పట్టవా.. రుణమాఫీ అమలు కాకపోవడం, పం టలకు గిట్టుబాటు ధరల లభించక అ న్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటు న్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు మేకా శేషుబాబు విమర్శించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల సం ఖ్య తక్కువ సంఖ్యలో ఉందన్న నెపంతో ప్రభుత్వం హాస్టళ్లను మూసివేస్తోం దని ఆరోపించారు. ఇది మాఫియా పాలన ఎన్టీఆర్ పాలన ఒక పద్ధతిగా ఉండేదని, చంద్రబాబు హయాం మాఫియా పాలనలా తయారైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు ఆరోపించారు. టీడీపీ కు టుంబ పాలనలా తయారైందని విమర్శించారు. పార్టీలో యువత భాగస్వామ్యం పెరగాలని సూచించారు. తెలు గుదేశం మహానాడు చంద్రబాబు భజ న కోసం ఏర్పాటు చేసుకున్న జాతర అని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ విమర్శించారు. తీర్మానాలిలా.. పింఛన్లు, ఇళ్ల ఎంపికలో లబ్ధిదారులకు ప్రాధాన్యం, జన్మభూమి కమిటీల రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, టీడీపీ నాయకుల దోపిడీని అరికట్టడం, మద్యం, ఇసుక, మట్టి మాఫియాల ఆగడాలను అడ్డుకోవడం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడాన్ని వ్యతిరేకించడం, ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల సక్రమ అమలు, తాగు, సాగునీటి సమస్యలు తీర్చడం, వ్యవసాయ ఉత్పత్పులకు కనీస మద్ధతు ధర కల్పించడం వంటి తీర్మానాలు ఆమెదించారు. దళిత, గిరిజన సంక్షేమానికి పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు, కొవ్వూరు గోష్పాదక్షేత్రం అభివృద్ధికి నిధుల కేటా యింపు, కొవ్వూరు–భద్రాచలం రైల్వేలై¯ŒS నిర్మాణానికి చర్యలు, చాగల్లు జైపూర్ షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్లీనరీలో తీర్మానించారు. -
దోపిడీ పాలనను సాగనంపుదాం
కొవ్వూరు : టీడీపీ మంత్రులు, నాయకులు ఇసుక, మట్టి, మద్యం మాఫియాలుగా మారి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. స్థానిక పరిమి రామారాయుడు రత్తమ్మ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశా రు. సంస్థాగతంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బ లోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సా గిస్తున్న రాక్షసపాలనకు చరమగీతం పాడాలని సూచించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అవి నీతికి పాల్పడుతూ ప్రజాధనం దోచుకుతింటున్నారన్నారు. అక్రమ సంపాదనను రాబోయే ఎన్నికల్లో ఖర్చుచేయాలంటూ చంద్రబాబు అవి నీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకు అందించారని, చంద్రబాబు పాలనలో ఇసుక మాఫియా ముఠాలుగా మారారని ధ్వజమెత్తారు. అసమర్థ మంత్రి పాలనలో నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు పరిమి హరి చరణ్, బండి పట్టాభి రామారావు, ముదునూరి నాగరాజు, గురుజు బాలమురళీకృష్ణ, చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు, లకంసాని శ్రీనివాసరావు, చీర్ల బ్రహ్మానందం తదితరులు వివిధ తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, నియోజకవర్గ కన్వీనర్లు పుప్పాల వాసుబాబు, ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాసరావు, దయాల నవీ¯ŒSబాబు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, నాయకులు పోతుల రామతిరుపతిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, చాగల్లు, తాళ్లపూడి మండల అధ్యక్షులు కొఠారు అశోక్బాబు, కుంటముక్కల కేశవ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రానున్న రెండేళ్లలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తానేటి వనిత పార్టీ శ్రేణులకు పి లుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేంతవరకూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వాస్పత్రిలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. ఇసుక అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. ఇసుక మాఫియా హత్యలకు తెగబడుతోందని, టీడీపీ నాయకులు సొంత పార్టీ నాయకులను హత్య చేయిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో తాగునీరు దొరక్కపోయినా మద్యం ఎరులై పారుతోందని విమర్శించారు. కోట్లు ఎలా వచ్చాయి దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ.25 లక్షలు అప్పు చేసిన మంత్రి ఇప్పుడు కోట్లు ఎలా సంపాందించారో చెప్పాలని ప్రశ్నించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి.. అబద్దపు హామీలతో అన్ని వర్గాలకు మోసగించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళుళం జిల్లా పార్టీ పరిశీలకుడు కొయ్యే మోషేన్రాజు విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సాఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య విమర్శించారు. అన్నదాతల ఆత్మహత్యలు పట్టవా.. రుణమాఫీ అమలు కాకపోవడం, పం టలకు గిట్టుబాటు ధరల లభించక అ న్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటు న్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు మేకా శేషుబాబు విమర్శించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల సం ఖ్య తక్కువ సంఖ్యలో ఉందన్న నెపంతో ప్రభుత్వం హాస్టళ్లను మూసివేస్తోం దని ఆరోపించారు. ఇది మాఫియా పాలన ఎన్టీఆర్ పాలన ఒక పద్ధతిగా ఉండేదని, చంద్రబాబు హయాం మాఫియా పాలనలా తయారైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు ఆరోపించారు. టీడీపీ కు టుంబ పాలనలా తయారైందని విమర్శించారు. పార్టీలో యువత భాగస్వామ్యం పెరగాలని సూచించారు. తెలు గుదేశం మహానాడు చంద్రబాబు భజ న కోసం ఏర్పాటు చేసుకున్న జాతర అని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ విమర్శించారు. తీర్మానాలిలా.. పింఛన్లు, ఇళ్ల ఎంపికలో లబ్ధిదారులకు ప్రాధాన్యం, జన్మభూమి కమిటీల రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, టీడీపీ నాయకుల దోపిడీని అరికట్టడం, మద్యం, ఇసుక, మట్టి మాఫియాల ఆగడాలను అడ్డుకోవడం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడాన్ని వ్యతిరేకించడం, ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల సక్రమ అమలు, తాగు, సాగునీటి సమస్యలు తీర్చడం, వ్యవసాయ ఉత్పత్పులకు కనీస మద్ధతు ధర కల్పించడం వంటి తీర్మానాలు ఆమెదించారు. దళిత, గిరిజన సంక్షేమానికి పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు, కొవ్వూరు గోష్పాదక్షేత్రం అభివృద్ధికి నిధుల కేటా యింపు, కొవ్వూరు–భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణానికి చర్యలు, చాగల్లు జైపూర్ షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్లీనరీలో తీర్మానించారు. -
శోధన - వేదన
-
జులై 8న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ