PNB fraud probe
-
పీఎన్బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో (PNB) మరో మోసం వెలుగు చూసింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.271 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు బ్యాంకు వివరించింది. ఇప్పటికే ఈ మొత్తానికి ప్రొవిజనింగ్ చేసినట్లు పేర్కొంది.భువనేశ్వర్లోని పీఎన్బీ స్టేషన్ స్క్వేర్ బ్రాంచ్ ఈ రుణాన్ని జారీ చేసింది. పీఎన్బీ ఫ్రాడ్ జరిగినా డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.4,508 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.2,223 కోట్లతో పోలిస్తే అధికంగా నమోదైంది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.29,962 కోట్ల నుంచి రూ.34,752 కోట్లకు, వడ్డీ ఆదాయం రూ.27,288 కోట్ల నుంచి రూ.31,340 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా పీఎన్బీ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 6.24 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కొన్నేళ్లుగా హైప్రొఫైల్ కేసులతో ఇబ్బంది పడుతోంది. అందులో కొన్ని కింద తెలియజేశాం.నీరవ్ మోదీ స్కామ్ (2018): భారతదేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసాల్లో ఒకటిగా నిలిచింది. దీని విలువ సుమారు రూ.12,700 కోట్లు. నగల వ్యాపారి నీరవ్ మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై అనధికార లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ)లను ఉపయోగించి మోసపూరిత రుణాలు పొందారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగుల కారణంగా ఈ కుంభకోణం ఏళ్ల తరబడి బయటపడలేదు.నీరవ్ మోదీ కుంభకోణంలో గీతాంజలి జెమ్స్ యజమాని మెహుల్ చోక్సీ కూడా ఇరుక్కున్నాడు. 2018 ప్రారంభంలో దేశం విడిచి పారిపోయిన అతను అప్పటి నుంచి అధికారులు, విచారణ వ్యవస్థల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.ఇదీ చదవండి: రేట్ల కోత కాదు.. ఏం చేయాలో సూచించిన మిశ్రాపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ మోసం (2020): సరైన నిబంధనలు పాటించకుండా షెల్ కంపెనీలకు రుణాలు ఇచ్చిన కేసులో పీఎన్బీఐ హౌసింగ్ ఫైనాన్స్ ప్రమేయం ఉందని తేలింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. -
చిక్కుల్లో మెహుల్ చోక్సీ భార్య?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కు రూ 13,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ భార్య ప్రీతి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మూడో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇందులో మెహుల్ చొక్సీతో పాటు అతని భార్య ప్రతీని మరికొందరి పేర్లు చేర్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన రుణాల ఎగవేత కేసులో మెహుల్ చోక్సీకి సహాకరించారనే అభియోగాలను ఆమెపై ఈడీ మోపింది. పీఎన్బీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే 2018, 2020లలో రెండు ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. కాగా మూడో ఛార్జ్షీట్ ఇప్పుడు వేసింది. ఇందులో మెహుల్ చోక్సీ దంపతులతో పాటు గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, గిలి ఇండియా లిమిటెడ్, నక్షత్ర బ్రాండ్ లిమిటెడ్ కంపెనీల పేర్లతో పాటు పీఎన్బీ బ్రాండీ హౌజ్ శాఖ మేనేజర్ గోకుల్నాథ్షెట్టిల పేర్లు చేర్చింది. చదవండి: మోహుల్ చోక్సీ బాధితుల జాబితాలో చేరిన మరో కంపెనీ! -
డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాతో పీఎన్బీకి షాక్
గృహ రుణాల సంస్థ డీహెచ్ఎఫ్ఎల్కు ఇచ్చిన రుణాల విషయంలో మోసం(ఫ్రాడ్) జరిగినట్లు తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పేర్కొంది. రూ. 3688 కోట్లమేర రుణాలను డీహెచ్ఎఫ్ఎల్ మోసపూరితంగా తీసుకున్నట్లు పీఎన్బీ తాజాగా రిజర్వ్ బ్యాంక్కు నివేదించింది. ఈ రుణాలకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ను మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మోసపూరిత ఖాతాలపై నాలుగు త్రైమాసికాలలో 100 శాతం ప్రొవిజనింగ్ను చేపట్టవలసి ఉంటుంది. దీంతో ఇప్పటికే డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాపై రూ. 1246 కోట్ల ప్రొవిజనింగ్ను చేపట్టినట్లు పీఎన్బీ వెల్లడించింది. షేరు డౌన్ డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా మోసపూరితమని వెల్లడించిన నేపథ్యంలో పీఎన్బీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీఎన్బీ షేరు 5.5 శాతం పతనమై రూ. 35 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఇప్పటికే పీఎస్యూ దిగ్గజం ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్తోపాటు.. ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ సైతం డీహెచ్ఎఫ్ఎల్ మోసపూరిత ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. రూ. 85,000 కోట్లకుపైగా రుణ భారాన్ని కలిగి.. దివాళా కోర్టులకు చేరిన తొలి ఫైనాన్షియల్ సేవల కంపెనీగా డీహెచ్ఎఫ్ఎల్ నిలిచినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
పీఎన్బీ స్కాం: గోకుల్నాథ్ సంచలన విషయాలు
సాక్షి,ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా పేరొందిన పీఎన్బీ స్కాంలో కీలక వివరాలను ఈడీ సాధించింది. విచారణలో పీఎన్బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి సంచలన విషయాలను వెల్లడించాడు. బ్యాంకు జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకే తానే ఎల్వోయూల (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీచేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయంలో వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ, గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకుడు మెహుల్ చోక్సీ తనను బ్లాక్ మెయిల్ చేశారని ఈడీ విచారణలో అంగీకరించాడు. అయితే ఇందుకు తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం పొందలేదని వివరించాడు. 2010లో నీరవ్మోదీకి మోడీకి మొట్టమొదటి ఎల్వోయూను జారీ చేసినట్టుగా గోకుల్నాథ్ శెట్టి ఈడీ ముందు ఒప్పుకున్నాడు. దీంతో మొదటి దుర్వినియోగంపై ఇద్దరు వ్యాపారవేత్తలు బెదిరింపులకు పాల్పడడంతో 2017 వరకు జారీ చేస్తూ వచ్చానని తెలిపాడు. ఇలా మొత్తం 13,700 కోట్ల రూపాయల విలువైన ఎల్వోయూలను జారీ చేశానని తెలిపాడు. అయితే 2010 ఆగస్టు నుంచి 2017వరకు పీఎన్బీ బ్రాడీహౌస్ బ్రాంచ్కు జీఎంగా ఉన్న రాజీవ్ జిందాల్ ఆదేశాల మేరకు వీటిని విడుదల చేసినట్టు చెప్పాడు. ఎలాంటి సెక్యూరిటీలు, హామీలు లేకుండానే వీటిని జారీ చేయాలని తనను జీఎం ఆదేశించినట్టు పేర్కొన్నాడు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తే ఉద్యోగం ఊడిపోతుందంటూ చోక్సీ, మోదీ బెదిరించారని ఈడీ అధికారులకు చెప్పాడు. బ్యాంకింగ్ నియమాల ఉల్లంఘనపై పూర్తి బాధ్యతను తనపై వేసుకున్న శెట్టి... తన కింది ఉద్యోగులు ఎవరికీ ఈ మోసం గురించి తెలియదని పేర్కొన్నాడు. దీంతో విచారణలో శెట్టి తెలిపిన వివరాలపై ఈడీ మరితంగా ఆరా తీస్తోంది. కాగా ఇప్పటికే రాజీవ్ జిందాల్ను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పీఎన్బీ స్కాంలో పీఎంఏల్ఏ చట్టం కింద మార్చి 3న, అదుపులోకి తీసుకున్న గోకుల్ నాథ్ శెట్టి జ్యుడీషియల్ కస్టడీ ఈ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కస్టడీ గడువును కోరే అవకాశం ఉంది. -
నీరవ్ వ్యాపారంపై అంబానీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు చెక్కేసిన డైమండ్ వ్యాపారి నీరవ్మోదీపై విపుల్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడుగా ఉన్న నీరవ్ వ్యాపార విస్తరణ క్రమం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో మరింత విస్తరించేలా భారీ ప్లాన్లను రూపొందించుకున్నారని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బంధువు, టవర్ క్యాపిటల్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపుల్ అంబానీ వెల్లడించారు. 1999లో వ్యాపారాన్ని ప్రారంభించిన నీరవ్ మోదీ అయిదేళ్లు తిరక్కుండానే తన రత్నాలు, వజ్రాల వ్యాపార సంస్థ ‘ఫైర్స్టార్ గ్రూప్’ ను విదేశాల్లోనూ విస్తరించాడని తెలిపారు. అప్పటికే 6 అంతర్జాతీయ నగరాలకు తన వ్యాపారాన్నివిస్తరింపజేసిన నీరవ్ 2015లో మరింత దూకుడు పెంచాడన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డైమండ్ వ్యాపార సామ్రాజ్యాన్ని 2020 నాటికి 12 దేశాల్లో భారీగా విస్తరించాలని భావించారట. ఈ సందర్భంగా 30కి పైగా ఔట్లెట్లను నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తానని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో నీరవ్ వెల్లడించిన విషయాన్ని విపుల్ గుర్తు చేశారు. అంతటి విస్తరణా కార్యక్రమాల్ని చూసిన ఎవరికైనా ఔరా.! అనిపిస్తుందని ఆయన తెలిపారు. ప్రఖ్యాత నటి, మోడల్ నవోమీ వాట్స్ నుంచి జూనియర్ ట్రంప్ వరకు నీరవ్ బిజినెస్ మోడల్ను చూసి అలా ఆశ్చర్యపోయిన వారేనని అన్నారు. నీరవ్ మోదీ, అతని మామ మోహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్కాంలో ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
దర్జా దొంగలు
-
పీఎన్బీ స్కాంలో మరో కీలక అరెస్ట్