Pochampally cloth
-
చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!
ఇకత్ చీరతో వేడుకలో వెలిగిపోతాం. నారాయణపేట మెటీరియల్తో డిజైనర్ బ్లవుజ్ కుట్టించుకుంటాం. మన సంప్రదాయ వస్త్రధారణ మనల్ని ఫ్యాషన్ పెరేడ్లో తళుక్కుమని తారల్లా మెరిపిస్తోంది. ఇవి ఇంత అందంగా ఎలా తయారవుతాయి. ఒక డిజైన్ని విజువలైజ్ చేసి వస్త్రం మీద ఆవిష్కరించే చేనేతకారులు ఏం చదువుతారు... ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేశారు మిసెస్ ఇండియా (Mrs India) విజేత సుష్మ. ఈ వస్త్రాలను నేసే చేతులను, ఆ వేళ్ల మధ్య జాలువారుతున్న కళాత్మకతను దగ్గరగా చూడాలనిపించింది. పోచంపల్లి బాట పట్టారామె. కళాత్మకత అంతా చేనేతకారుల చేతల్లోనే తప్ప వారి జీవితాల్లో కనిపించలేదు. నూటికి రెండు–మూడు కుటుంబాలు ఆర్థికంగా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఈ కళను తమ తరంతో స్వస్తి పలకాలనుకుంటున్న వాళ్లే. మరి... ఇంత అందమైన కళ తర్వాతి తరాలకు కొనసాగకపోతే? ఒక ప్రశ్నార్థకం. దానికి సమాధానంగా ఆమె తనను తాను చేనేతలకు ప్రమోటర్గా మార్చుకున్నారు. చేనేతకారుల జీవితాలకు దర్పణంగా నిలిచే డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తాను పాల్గొనే ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ కాంటెస్ట్లలో మన చేనేతలను ప్రదర్శిస్తున్నారు. ఆ చేనేతలతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్వతహాగా ఎంటర్ప్రెన్యూర్ అయిన సుష్మా ముప్పిడి (Sushma Muppidi) మన హస్తకళలు, చేనేతలను ప్రపంచవేదిక మీదకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేశారు.వైఫల్యమూ అర్థవంతమే! చీరాలకు చెందిన సుష్మ ముప్పిడి బీటెక్, ఎంబీఏ చేశారు. కొంతకాలం గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం, పెళ్లి తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతోపాటు మరో ప్రైవేట్ కాలేజ్లో పార్ట్టైమ్ జాబ్ చేశారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం... ఈ జర్నీలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉద్యోగం కోసం తన హండ్రెడ్పర్సెంట్ ఇస్తోంది. పిల్లల కోసం గడిపే సమయం తగ్గిపోతోంది. వెనక్కి చూస్తే తనకు మిగిలిందేమిటి? సివిల్ సర్వీసెస్ ప్రయత్నం సఫలం కాలేదు. ఉనికి లేని సాధారణ ఉద్యోగంతో తనకు వచ్చే సంతృప్తి ఏమిటి? సమాజానికి పని చేయడంలో సంతృప్తి ఉంటుంది, తనకో గుర్తింపునిచ్చే పనిలో సంతోషం ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత యూత్లో సోషల్ అవేర్నెస్ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొనవడం విజేతగా నిలవడం జరిగింది. సోషల్ ఇనిషియేటివ్, వెల్ స్పోకెన్, బెస్ట్ కల్చరల్ డ్రెస్, మిసెస్ ఫ్యాషనిష్టా వంటి గుర్తింపులతోపాటు ‘యూఎమ్బీ ఎలైట్ మిసెస్ ఇండియా 2024’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మార్చి ఒకటిన ఇటలీలోని మిలన్ నగరంలో, ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగే ఫ్యాషన్ షోలలో భారత చేనేతలు అసోం సిల్క్, మల్బరీ సిల్క్లను ప్రదర్శించనున్నారు. జూన్లో యూఎస్, ఫ్లోరిడాలో జరిగే మిసెస్ యూనివర్సల్ వేదిక మీద మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు సుష్మ. ఇవన్నీ ఆత్మసంతృప్తినిచ్చే పనులు. ఇక తనకు రాబడి కోసం ఎంటర్ప్రెన్యూర్గా మారారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆఫీస్ నుంచి యూఎస్, దుబాయ్, సింగపూర్లలో డైమండ్ బిజినెస్ (Diamond Business) నిర్వహిస్తున్నారు. ‘‘జీవితంలో గెలవాలి, నా కోసం కొన్ని సంతోషాలను పూస గుచ్చుకోవాలి. నన్ను నేను ప్రశంసించుకోవడానికి సమాజానికి నా వంతు సర్వీస్ ఇవ్వాలి’’ అన్నారు సుష్మ. ‘‘వయసు దేనికీ అడ్డంకి కాదు. అంతా మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఒక ముందడుగు వేయండి. సక్సెస్ అవుతామా, విఫలమవుతామా అనే సందేహాలు వద్దు. ఏ ప్రయత్నమూ చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలమైనా కూడా అది అర్థవంతమయిన వైఫల్యమే. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు’’ అని మహిళలకు సందేశమిచ్చారు. ఇది నా చేయూత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్లలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను. మన చేనేత కుటుంబాలు కళకు దూరం కాకుండా ఉండాలన్నా, ఇతరులు ఈ కళాత్మక వృత్తిని చేపట్టాలన్నా ఇది ఉపాధికి సోపానంగా ఉండాలి. అందుకోసం చేనేతలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తాను. సమావేశాలకు ఉపయోగించే ఫైల్ ఫోల్డర్స్, ఇంట్లో ఉపయోగించే సోఫా కవర్స్, వేడుకల్లో ధరించే బ్లేజర్స్ వంటి ప్రయోగాలు చేసి మన చేనేతలను ప్రపంచవేదికలకు తీసుకెళ్లాలనేదే నా ప్రయత్నం. నేను ఎంటర్ప్రెన్యూర్గా ఎల్లలు దాటి విదేశాలకు విస్తరించాను. చదవండి: అన్నదాత మెచ్చిన రైతుబిడ్డకాబట్టి నాకున్న ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుని మన చేనేతలను ప్రమోట్ చేయగలుగుతున్నాను. కలంకారీ కళ కోసం అయితే ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించి కలంకారీ కళాకారులకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. పారిస్, యూఎస్ కార్యక్రమాల తర్వాత ఆ పని. సివిల్స్ సాధించినా కూడా ప్రత్యేకంగా ఒక అంశం మీద సమగ్రంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాత్మక సమాజానికి ఇస్తున్న సర్వీస్ నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేదిక మీద మన భారతీయ చేనేతకు ప్రాతినిధ్యం వహించాలి. మన నేతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనేది నా లక్ష్యం. – సుష్మ ముప్పిడి, మిసెస్ ఇండియా– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
మగ్గం నేసి.. భళా అనేసి!
భూదాన్పోచంపల్లి: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్వేల్ గవర్నర్ మార్గరేట్ బీజ్లీ ఏసీబీక్యూ చేనేత మగ్గంపై పోచంపల్లి ఇక్కత్ వస్త్రం నేసి అబ్బురపర్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న పవర్హౌస్మ్యూజియంలో ‘చరఖా అండ్ కర్గా’ పేరిట నిర్వహించిన చేనేత ఇక్కత్ కళా ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్ హ్యాండ్లూమ్ మెరిట్ సర్టిఫికెట్ విన్నర్ తడక రమేశ్ ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సోమవారం భారతదేశ రాయబారి మనీష్ గుప్తా ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆమె బీజ్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కత్ కళ ఎంతో నైపుణ్యంతో కూడుకొన్నదని కొనియాడారు. సిడ్నీలో మొదటిసారిగా ఇక్కత్ వస్త్ర తయారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం తడక రమేశ్, మాస్టర్వీవర్ పాలాది యాదగిరిని భారత రాయబారి శాలువా కప్పి సన్మానించారు. (క్లిక్: సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్ నేత ప్రదర్శన) -
సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్ నేత ప్రదర్శన
భూదాన్పోచంపల్లి: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఆస్ట్రేలియాలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిడ్నీలోని పవర్హౌస్ మ్యూజియంలో ‘చరఖా అండ్ కర్గా’ పేరిట చేనేత హస్తకళల ప్రదర్శన జరుగుతోంది. ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్ హ్యాండ్లూమ్ మెరిట్ సర్టిఫికెట్ విన్నర్ తడక రమేశ్కు అవకాశం వచ్చింది. తడక రమేశ్ మగ్గంపై ఇక్కత్ వస్త్రాల తయారీ, చిటీకి కట్టడం, రంగులద్దకం, ఆసుపోయడం వంటి నేత ప్రక్రియలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. ఇండియా నుంచి పోచంపల్లి ఇక్కత్తో పాటు బనారస్ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనకు అవకాశ వచ్చిందని రమేష్ తెలిపారు. భారత రాయబారి మనీష్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సిడ్నీలో జాతీయ జెండావిష్కరణ ఉంటుందని, స్థానికంగా ఉన్న భారతీయులందరూ పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకల్లో తాను, మాస్టర్వీవర్ పాలాది యాదగిరి భాగస్వామికావడం గర్వంగా ఉందన్నారు. (క్లిక్: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్గా సంజన) -
పోచంపట్నం
పల్లె అంటే పెద్దరికం, నిండుదనం, సంప్రదాయం. పట్నం అంటే అల్లరికం, ఆకర్షకం, ఆధునికం. పోచంపల్లి వస్త్రాలతో ఇంత వరకు పల్లెల్నే నేస్తున్నాం. ఇప్పుడు వాటితో పట్నాలనూ డిజైన్ చేస్తున్నారు! పోచంపల్లి... ఇలా పోచంపట్నం అయితే... ఎంత వెరైటీగా ఉంటుందో చూడండి. పోచంపల్లి క్లాత్ అనగానే బామ్మలు కట్టుకునే చీరలు, అమ్మాయిలు వేసుకునే సల్వార్ కమీజ్లు, కొన్ని రకాల దుప్పట్లు వాటిలోని డిజైన్లు మన కళ్లకు కనిపిస్తాయి. అంతవరకే ఆ మెటీరియల్ గురించి ఆలోచిస్తాం. అందువల్లే పోచంపల్లి క్లాత్ ఫ్యాషనబుల్ ఫ్యాబ్రిక్ కాదు అనే ముద్ర పడిపోయింది. ముందెన్నడో వందల ఏళ్ల క్రితం పోచంపల్లి డిజైన్స్ చీరలతో మొదలయ్యాయి. తర్వాత సల్వార్ కమీజులు వచ్చాయి. ఆ తర్వాత మరో ఎంపిక లేకపోవడంతో ఇందులో అంతగా అభివృద్ధి జరగలేదు. అందువల్ల వినియోగదారులు కూడా ఈ ఫ్యాబ్రిక్కి చాలా పరిమితంగా ఉంటున్నారు. దీంతో చేనేతకారుడి జీవనాధారానికి ఆదరణ అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. ఇక్కడ మొదలు హైదరాబాద్కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో పోచంపల్లి గ్రామం ఉంది. మనం కట్టుకునే బట్టలు ఎంత కష్టపడి నేస్తే ఇంత అందంగా తయారయ్యాయో తెలుసుకునే అవకాశం అలాంటి చేనేత గ్రామాలను సందర్శిస్తేనే తెలుస్తుంది. అంతేకాదు భూదాన్ ఉద్యమంతో ముడిపడి ఉన్న గ్రామం కూడా కావడంతో ‘భూదాన్ పోచంపల్లి’గా మారిపోయింది. అక్కడికే వెళ్లి నేరుగా కొనుగోలు చేస్తే దళారీలకు చెల్లించేది తగ్గి, నేతన్నకి గిట్టుబాటుధర లభిస్తుంది. వేసవికి ప్రత్యేకం ఎండకాలం నూలు వస్త్రాలలోని సౌకర్యాన్ని దేహం కోరుకుంటుంది. అందుకే కాటన్ వస్త్రాలకు ఈ కాలం డిమాండ్ ఎక్కువ. పోచంపల్లి డిజైన్ పరంగానూ, సీజనల్ సౌకర్యంగానూ రెండు విధాల ఆకర్షించే అందమైన ఫ్యాబ్రిక్. పోచంపల్లి మెటీరియల్లో లేత నుంచి ముదురు రంగుల వరకు లభిస్తున్నాయి. వేసవికి.. ఆకుపచ్చ, నీలం, నిమ్మపండు రంగు, క్రీమ్ .. ఇలా అన్నింటిలోనూ లేత రంగులను ఎంచుకుంటే మరీ బాగుంటుంది. యువతరం మెచ్చేలా.. చేనేత అనగానే పెద్దవారు ధరించేదిగానే గుర్తిస్తాం. కానీ యువతరం మెచ్చేలా సూట్స్, ప్యాంట్స్, అనార్కలీ, లెహంగా.. ఇలా పోచంపల్లి ఫ్యాబ్రిక్స్తోనూ రకరకాల డిజైన్స్ సృష్టించవచ్చు. అలాంటి డ్రెస్సులు చేయమని డిజైనర్స్ని కోరవచ్చు. కార్పొరేట్ కళ... కార్పొరేట్లోనూ మహిళల డ్రెస్సింగ్లో పోచంపల్లిని ప్రవేశపెట్టవచ్చు. కాలర్ ఉన్న ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ ధరించి పోచంపల్లి చీర కట్టుకుంటే ఎంతో హుందాగా కనిపిస్తారు. అంతర్జాతీయ వేదికపై పోచంపల్లి ప్యారిస్ ఫ్యాషన్ షోలో నేను మన పోచంపల్లి ఇకత్ డిజైన్స్ ప్రదర్శించినప్పుడు వచ్చిన రెస్పాన్స్ మాటల్లో చెప్పలేనిది. ‘భారతదేశం నుంచి పోచంపల్లి డిజైన్స్’ అన్న అనౌన్స్ మెంట్ వేదిక మీద వినపడగానే అందరి లోనూ ఏదో ఉత్సాహం గమనించాను. పోచంపల్లి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాదు. డిజైన్సే ప్రధానంగా కనిపిస్తాయి. ఈ ఫ్యాబ్రిక్తో సూట్స్, జంప్ సూట్స్, ప్యాంట్స్, అనార్కలీ, లాంగ్ రెడ్కార్పెట్ గౌన్ కూడా డిజైన్ చేశాను. చేనేతకారులు తమ పిల్లలను ఈ రంగం లోకి రానివ్వడం లేదు. దాంతో రాబోయేతరం ఆ కళను నేర్చు కోవడం లేదు. ప్రభుత్వం ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, చేనేతకారుల నుంచి వస్త్రాన్ని తీసుకొని, డిజైనర్లకు అందుబాటులో ఉంచితే వందల ఏళ్ల చేనేత మున్ముందు కాలాల్లోనూ బతికే అవకాశాలు న్నాయి. ప్రస్తుతం ఒక డిజైనర్ తనకు కావల్సిన రంగులో డిజైన్ ఫ్యాబ్రిక్ కావాలంటే చేనేతకారుడిని వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఫ్యాషన్ రంగంలో సమయ పాలన అనేది చాలా ముఖ్యం. ఒక సీజన్కి తగ్గ దుస్తులను తయారుచేయడానికి, ఆ సీజన్కే ప్రత్యేకం అనిపించే మెటీరియల్ తప్పక అందుబాటులో ఉండాలి. అలా లేదంటే కొత్త డిజైన్స్ పుట్టుకురావు. చేనేతకారుల శ్రమకు తగ్గ ఫలమూ దక్కదు. - శిల్పారెడ్డి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్ రంగుల మాయాజాలం పూర్తి నూలు, లేదా పట్టు కలయికలతో పోచంపల్లి డిజైన్ మెటీరియల్, చీరలు లభిస్తున్నాయి. మొట్టమొదట పేటెంట్ హక్కులు పొందిన ప్రత్యేకత కూడా దీనికి ఉంది. ఆ నేతలో ఎన్ని డిజైన్లు పొందుపరుస్తారో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రంగుల దారాల్లో నెమళ్లు నర్తిస్తాయి. చిలుకలు పలకరిస్తాయి. ఏనుగులు గంభీరంగా నిలబడతాయి. పూవులు విరబూస్తాయి. ఆకులు అందంగా రూపుకడతాయి.. ఇలా రకరకాల ఆకృతులు మన ముందు ఆవిష్కృతమవుతాయి. భారీ జరీలు నిండిన చీరలకు విరుద్ధంగా ఈ డిజైన్లలో రంగుల మాయాజాలానికే ప్రాధాన్యత ఉంటుంది. బట్టలు వేసిన తర్వాత రంగులద్దడం చాలా సులువు. కానీ పోచంపల్లి నేత ప్రత్యేకత నేయడానికి తీసి పెట్టుకున్న దారానికి రంగులద్ది, తర్వాత నేయడం. కాంబినేషన్లో సరైన శ్రద్ధ లేకపోతే ఆకృతి సరిగా రానే రాదు. చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రకియ ఇది.