potti sriramulu nellore district
-
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్రగాయాలు
-
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
-
నెల్లూరులో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ దొంగల ముఠా
-
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ బస్సు యాత్ర
-
ఆర్టీసీ డ్రైవర్పై దాడి.. ఆరుగురి అరెస్ట్
కావలి/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన కేసులో పోలీసులు శనివారం ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 24 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఆరుగురిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన నిందితులను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేందుకు ఏఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. కాగా దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ16జెడ్0702) డ్రైవర్ బి.రామ్సింగ్ కావలి ట్రంక్రోడ్డు వద్ద కారును పక్కకు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. స్థానికులతో పాటు అక్కడే ఉన్న కానిస్టేబుల్ సర్దిచెప్పడంతో అతడు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అనంతరం తన స్నేహితుడైన దేవరకొండ సుధీర్తో పాటు మరికొందరికి ఫోన్ చేశాడు. వారంతా కారు, ద్విచక్రవాహనాల్లో బస్సును వెంబడించి మద్దూరుపాడు వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్ రామ్సింగ్ను బస్సు నుంచి కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్న కావలి రూరల్ సీఐ ఎం.రాజేశ్ ప్రయాణికులు రోడ్డుపై ఉండటాన్ని గమనించి వివరాలు ఆరా తీశారు. గాయపడిన డ్రైవర్ రామ్సింగ్ను చికిత్స నిమిత్తం వెంటనే కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడితో మాట్లాడి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. దాడి ఘటనకు సంబంధించి దేవరకొండ సుధీర్, విల్సన్, శివారెడ్డి, మల్లి, కిరణ్ సహా మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీ హిమవతి నేతృత్వంలో కావలి డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. కావలిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన కాగా ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. కావలిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా డ్రైవర్ రామ్సింగ్పై దాడిని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి. దాడికి నిరసనగా ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నట్టు పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చంద్రయ్య, ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు, అప్పారావు ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రం సమర్పిసా్తమన్నారు. అంతకుముందు విజయవాడలో చికిత్స పొందుతున్న రామ్సింగ్ను ఈయూ నేతలు పరామర్శించారు. -
అంతా రివర్స..!కంగుతిన్న టీడీపీ నేతలు
-
రొట్టెల పండుగకు పెరిగిన భక్తుల తాకిడి
-
ఆనంకి దెబ్బ మీద దెబ్బ..
-
నెల్లూరు జిల్లాలో హౌస్ సర్జన్ విద్యార్థిని సూసైడ్
-
నెల్లూరులోని కేఎన్ఆర్ స్కూల్ లో అడ్మిషన్స్ ఫుల్
-
ప్రజల వద్దకే పాలన అందిస్తోన్న ఏకైక నాయకుడు సీఎం జగన్
-
నెల్లూరు కావలిలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం
-
నెల్లూరులో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ
-
నెల్లూరు జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
అద్దె ఇళ్లలో ఉంటున్న వారికీ అండగా సీఎం జగన్
-
ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు అద్భుతం
-
రాజధాని ఎక్స్ ప్రెస్ లో పొగలు..
-
నెల్లూరులో జగనన్నే మా భవిష్యత్..నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమం
-
దశాబ్దాల సమస్యను పరిష్కరించిన సీఎం జగన్
-
నెల్లూరులో టీడీపీ నేతల దౌర్జన్యం
-
నెల్లూరు జిల్లాలో పడవ మునిగి ఆరుగురు స్నేహితుల మృత్యువాత
-
నెల్లూరు : తోడేరు చెరువులో బోటు ప్రమాదం
-
నెల్లూరు నగరంలో దారుణ హత్య
-
నెల్లూరు జిల్లా కావలిలో దారుణం
-
తల్పగిరిలో వ్యక్తి దారుణ హత్య కలకలం
-
మత్స్య సంపద మురిపిస్తోంది.. ఎగుమతుల్లో నాలుగో స్థానం
నూట పది కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగిన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మత్స్య సంపదలో గణనీయ ఆదాయం సాధిస్తూ పురోగమిస్తోంది. జిల్లాలో సహజ సిద్ధంగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లలో వివిధ రకాలైన చేపలు పెరుగుతుంటాయి. వాటిని కొన్ని పేద కుటుంబాలు పట్టుకుని జీవనం సాగిస్తుంటాయి. ఇక సముద్ర తీరంలో ఉన్న 98 మత్స్యకార గ్రామాల ప్రజలు ప్రధానంగా పడవలు, బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్లి రోజుల తరబడి అక్కడే ఉండి చేపలు, రొయ్యలు వేటాడి తీసుకొస్తుంటారు. వాటిని వ్యాపారులకు విక్రయించి ఆదాయం పొందుతుంటారు. ఇవే కాక జిల్లాలో సుమారు 32 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. బ్రాకిష్ వాటర్లో సాగుచేసే చెరువుల నుంచి ఏడాదికి దాదాపు 90 వేల టన్నుల రొయ్యలు పట్టుబడుతున్నాయి. ఇవన్నీ జిల్లా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. – సాక్షి, నెల్లూరు డెస్క్ జిల్లాలో అధికారికంగా సుమారు 8 వేల ఎకరాల్లో చేపల చెరువులున్నాయి. అనధికారికంగా ఇది ఇంకా ఎక్కువే ఉంటాయని సమాచారం. వీటిలో ఏటా దాదాపు రెండు లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం టన్ను చేపల ధర రూ.1.50 లక్షలు ఉంది. ఈ లెక్క ప్రకారం వాటి విలువ రూ.3,000 కోట్లు. పట్టుబడిన చేపల్లో కొంత జిల్లాలో వినియోగం అవుతుండగా, ఎక్కువ సరుకు ఇతర రాష్ట్రాలకు, పొరుగు జిల్లాలకు ఎగుమతి అవుతోంది. ఇవి కాకుండా జిల్లాలో సహజసిద్ధంగా ఏర్పడిన సాగునీటి చెరువులు, కాలువలు, నదుల్లో కూడా మత్స్యసంపద దొరుకుతోంది. భారీగా రొయ్యల చెరువులు జిల్లాలో దాదాపు 24 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటిలో 80 శాతం బ్రాకిష్ వాటర్ (సెలెనిటీ తగినంతగా ఉన్నవి) చెరువులే. రొయ్యల ఉత్పత్తి జిల్లాలో ఏటా లక్ష టన్నులకు పైగానే ఉంటోంది. ఇందులో 90 వేల టన్నులు రాష్ట్రం నుంచి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం టన్ను రొయ్యల ధర రూ.2.50 లక్షల వరకు ఉంది. ఈ ప్రకారం లెక్కిస్తే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల విలువ రూ.2,500 కోట్లు. ఆదాయం భారీగా ఉండటంతో రైతులు కూడా ఎక్కువమంది రొయ్యలు సాగుకే మొగ్గుచూపుతున్నారు. ఎగుమతులు ఎక్కడెక్కడికి.. బ్రాకిష్ వాటర్లో పెంచే రొయ్యలతోపాటు సముద్ర చేపలు ఎక్కువ భాగం జిల్లా నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంత వరకు చెన్నై, ముంబై, కోల్కతా, కొచ్చి, గుజరాత్కు కూడా ఎగుమతి అవుతున్నాయంటే జిల్లాలో సముద్ర ఉత్పత్తులు ఎంత మేరకు లభిస్తున్నాయో అర్థమవుతుంది. శీతలీకరణ వాహనాల (ఇన్సులేటెడ్ వెహికల్స్) ద్వారా కూడా రోడ్డు మార్గాన పొరుగు రాష్ట్రాలకు చేపలు, రొయ్యలను పంపుతున్నారు. ఆక్వా ఉత్పత్తులలో జిల్లా గణనీయ ప్రగతి సాధిస్తోందని అధికారులు వివరించే లెక్కలు తెలియజేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు జిల్లాలో 9 తీర ప్రాంత మండలాల్లో 98 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో 1,98,000 మంది జనాభా ఉన్నారు. వీరంతా సముద్రంలో చేపలు, రొయ్యలు వేటాడి బతుకుతున్నారు. కుటుంబంలోని మగవారు సముద్రంలోకి వేటకు వెళతారు. ఒక్కోసారి చేపలు పట్టడానికి వారం రోజులు కూడా పట్టవచ్చు. అందుకే వేటకు వెళ్లే ముందు తగినంత ఆహారం కూడా తమతోపాటు తీసుకెళ్తారు. వేటాడి తెచ్చిన మత్స్యసంపదను వీరు వ్యాపారులకు విక్రయించి తమ కుటుంబాలను పోషించుకుంటారు. జిల్లా స్థానం ఇదీ ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. సముద్రంలో, ఆక్వా చెరువుల్లోనే కాకుండా నదులు, కాలువలు, సాగునీటి చెరువులు తదితర వాటితో కలిపి జిల్లాలో ఏటా 3.50 లక్షల టన్నుల మత్స్య సంపద దొరుకుతోంది. ఇంత కంటే ఎక్కువ సంపదతో ముందు వరుసలో ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. ప్రభుత్వ పరంగా ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ ఇస్తుండటం, రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరా చేస్తుండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వ సహకారం ఆక్వా సాగు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై విద్యుత్ను అందిస్తోంది. చేపలు, రొయ్యలకు ఫీడ్ కూడా నాణ్యమైనది అందించేలా శాఖా పరంగా చర్యలు తీసుకుంది. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఏటా సుమారు రూ.2,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందుకు జిల్లా రైతులూ తమవంతుగా తోడ్పాటు అందిస్తున్నారు. సాగును ఇంకా ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా రైతులకు తోడ్పాటు అందిస్తున్నాం. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ రూ.1.50కే యూనిట్ విద్యుత్ గతంలో ఆక్వా సాగుకు యూనిట్ ధర రూ.4.86 ఉండేది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.2కే విద్యుత్ను అందిస్తామని చెప్పడంతో అధికారంలో ఉన్న చంద్రబాబు రూ.2కు యూనిట్ కరెంట్ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆక్వా జోన్లోని రైతులకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందిస్తోంది. – ఫణీంద్రనాయుడు, ఆక్వారైతు, గంగపట్నం సబ్సిడీతో రైతులకు ఊరట రొయ్యల చెరువులకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ వల్ల లాభం పొందుతున్నాం. నేను పది రొయ్యల చెరువులు సాగు చేస్తున్నా. ఈ ఏడాది మొత్తం చూస్తే మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏడాదికి మూడుసార్లు సాగు జరుగుతుంది. గతేడాది మేలో వేసినప్పుడు రొయ్యల రేటు బాగుంది. 100 కౌంట్ రూ.280, 70 కౌంట్ రూ.340 వరకు పలికింది. సెప్టెంబర్లో రేటు భారీగా తగ్గి 100 కౌంట్ రూ.160 పలికింది. ఈ సమయంలో నష్టపోయాం. ప్రస్తుతం 100 కౌంట్ రూ.240 పలుకుతోంది. ప్రభుత్వం విద్యుత్పై యూనిట్కు రూ.1.50 పైసలు సబ్సిడీ ఇస్తుండటంతో నష్టపోయే పరిస్థితి లేదు. – ఆవుల సోమయ్య, పెదపట్టపుపాళెం, రొయ్యల సాగు రైతు -
ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
గడప గడపకు అందుతున్న సంక్షేమ పథకాలు
-
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
-
మాటిస్తున్నా...మా ప్రభుత్వం దాన్ని క్లియర్ చేస్తుంది
-
నెల్లూరులో వైఎస్ఆర్ సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
-
నెల్లూరు హరనాథపురం జంక్షన్ లో ఫ్లైఓవర్ నిర్మాణం
-
వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టును పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా
-
బాలికపై మేనమామ నాగరాజు అత్యాచారయత్నం
-
నెల్లూరులో రెండోరోజు వెంకటేశ్వర వైభవోత్సవాలు
-
నెల్లూరు జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు
-
నెల్లూరులో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
-
ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి భౌతికకాయం
-
ఉపాధి హామీ పనుల్లో నెల్లూరు జిల్లా అగ్రస్థానం
-
60 కేజీల గంజాయి సీజ్
-
నెల్లూరులో NIA అధికారుల సోదాలు
-
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
-
నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ కిడ్నాప్ కలకలం
కృష్ణాజిల్లా: విజయవాడ పెనమలూరు పీఎస్ పరిధిలో బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ వినోద్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కలకలం రేపింది. తన భర్తను నిన్నరాత్రి (ఆదివారం) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ప్రశాంతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వినోద్ అనే వ్యక్తి నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా సిల్వర్ కలర్ కారులో వినోద్ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో తన భర్తను కిడ్నాప్ చేశారని వినోద్ భార్య.. ప్రశాంతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఆటో ఎక్కిన పాపానికి సామూహికంగా ఆమెపై.. -
42 రోజుల పాటు కార్యకర్తలను కలుసుకుంటా
-
మహిళతో డాక్టర్ వివాహేతర సంబంధం
-
ప్రియుడి మృతి.. తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య
సాక్షి,నెల్లూరు: వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు . పెళ్లి చేసుకోవాలని పెద్దలను కూడా ఒప్పించారు. ఉపాధి నిమిత్తం వెళ్లిన ప్రియుడు మృతి చెందడంతో ఆ బాధను తాళ లేక ప్రియురాలు కూడా ఆత్మ హత్య చేసుకున్న సంఘటన ఉండ్రాళ్ల మండలంలోని యల్లాయపాళెం మజరా గ్రామనత్తంలో శనివారం చోటుచేసుకుం ది. స్థానికుల కథనం మేరకు .. గ్రామంలోని దళితవాడకు చెందిన ఉండ్రాళ్ల శ్రీకాం త్ ( 21 ) , అదే ప్రాంతానికి చెందిన కోరికల సౌమ్య ( 19 ) రెండేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువురి కుటుం బ సభ్యులు కూడా అంగీకరించారు. అయితే శ్రీకాంత్ ముగ్గురు కుమారుల్లో రెండో వాడు కావడంతో పెద్ద కుమారుడికి వివాహం చేశాక వీరికి పెళ్లి చేద్దామని పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇంతలో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ ఎలక్ట్రికల్ డెకరేటర్స్ వద్ద పనిచేస్తాడు. అందులో భాగంగా ఆత్మకూరు వద్ద డెకరేషన్స్ పని నిమిత్తం శుక్రవారం వెళ్లి విద్యుత్ షాకకు గురై మృతి చెందాడు. దీంతో మనస్తాపానికి గురైన సౌమ్య శనివారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న గుళికల మందు తీసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు నార్తురాజుపాళెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు . దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇద్దరి మృతదేహాలను గ్రామంలో ఒకేచోట ఖననం చేయడం అందరినీ కలచి వేసింది. వీరి మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు . -
సెల్ఫోన్ చార్జర్ తీస్తుండగా.. దారుణం
సాక్షి,నెల్లూరు: సెల్ఫోన్ చార్జర్ను ప్లగ్ పాయింట్ నుంచి తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సైదాదుపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సురేష్(33) తన నివాసంలో సెలఫోన్కు చార్జ్ పెట్టి తీస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు విచారణలో తెలిందని పోలీసులు వెల్లడించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అందించారు. మృతుడు ఇటీవల కువైట్ నుంచివచ్చాడని, మృతునికి భార్య ,ఒక బిడ్డ ఉన్నారని పోలీసులు తెలిపారు. -
మంగళపర్తి లో శ్రీనివాస్ హత్య కేసులో వీడిన మిస్టరీ
-
పోలీసుల అదుపులో కౌన్సిలర్ హత్య కేసు నిందితుడు
-
యువతిని కాపాడిన దిశయాప్
-
వీడిన కవల పిల్లల హత్య కేసు మిస్టరీ
-
ఇంకా లభించని బాలుడు సంజు ఆచూకీ
-
దొరకని సంజూ ఆచూకీ
-
నెల్లూరు జీజీహెచ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
-
ఆనందయ్య మందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-
అధికారంలోకి రాగానే మహిళలకు వైఎస్ జగన్ సున్నా వడ్డీ రుణాలిచ్చారు
-
కోదిరోజుల నుంచి మందు పంపిణి జరగడం లేదు
-
ఆనందయ్య మందుతో కరోనా నయం అవుతుందనే భావన ప్రజల్లో ఉంది
-
‘కంటిలో డ్రాప్స్.. ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ’
-
ఆనందయ్య మందు: ఆరోపణలొద్దు
-
ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం
-
మ్యాగజైన్ స్టోరీ 21 may 2021
-
కరోనా మందుకు వారం పాటు బ్రేక్
-
కృష్ణపట్నం: ఆయుర్వేదం మందు నిలిపివేత
-
నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ కొరతకు చర్యలు తీసుకుంటున్న అధికారులు
-
నెల్లూరులో పకడ్బందీగా కర్ఫ్యూ అమలు
-
నెల్లూరు జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
వామ్మో.. చెన్నై చికెన్
సాక్షి, నెల్లూరు : నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన మాంసాన్ని నెల్లూరు చికెన్స్టాల్ యజమానులు చెన్నైలో తక్కువ నగదు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దానిని నెల్లూరులోని హోటల్స్, ధాబాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పద్మావతి సెంటర్లో ఓ చికెన్ స్టాల్ను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం సదరు స్టాల్పై కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. ఫ్రీజర్లలో భారీగా కుళ్లిపోయిన, నిల్వ ఉన్న మాంసాన్ని గుర్తించారు. సుమారు 350 కేజీలకు పైగా కుళ్లిపోయిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. స్టాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న యజమాని, సిబ్బంది అక్కడినుంచి పరారయ్యారు. అనంతరం మాంసాన్ని డంపింగ్యార్డులో పూడ్చిపెట్టాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. స్టాల్లో ఏర్పాటు చేసిన ఫ్రీజర్లను సీజ్ చేశారు. తక్కువ మొత్తంతో.. నగరంలోని కొందరు చికెన్ స్టాల్స్ యజమానులు తక్కువ మొత్తం వెచ్చించి అధికమొత్తంలో నగదు సంపాదించాలని అత్యాశ పడ్డారు. ఈక్రమంలో చెన్నైలోని పలు చికెన్ స్టాల్స్లో మిగిలిపోయిన మాంసాన్ని తక్కువ రేట్కు కొనుగోలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా కొందరు స్టాల్స్ యజమానులు అక్కడి నుంచి చికెన్ను ఇక్కడికి తరలిస్తున్నారు. రెండురోజుల క్రితం పోలీస్ గ్రౌండ్స్ సమీపంలోని ఓ ఇంట్లో చెన్నై నుంచి దిగుమతి చేసుకున్న మాంసాన్ని కార్పొరేషన్ అధికారులు భారీ స్థాయిలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నగరంలోని పలు చికెన్ స్టాల్స్ యజమానులు ఇదే దారిలో చెన్నైలో నిల్వ చికెన్ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించి దాడులకు దిగారు. దిగుమతి చేసుకున్న మాంసాన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. మందుబాబులు తాగిన మైకంలో చెడిపోయిన మాంసాన్ని గుర్తించరని ఇలా చేస్తున్నారు. దాడులు కొనసాగుతూనే ఉంటాయి నిల్వ ఉంచిన మాంసం విక్రయాలపై, అపరిశుభ్రంగా ఉండే హోటళ్లు, చికెన్ స్టాల్స్పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, ఎంహెచ్ఓ వెంకటరమణ పేర్కొన్నారు. స్టాల్స్లో ఫ్రీజర్లుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు కార్పొరేషన్లో వెటర్నరీ వైద్యుడిని నియమించినట్లు తెలిపారు. జంతు వదశాలలో కార్పొరేషన్ ఆమోదించి ముద్రవేసిన మాంసాన్నే ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. అనుమానాస్పద దుకాణాలపై ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో వెటర్నరీ వైద్యుడు మదన్మోహన్, శానిటరీ సూపర్వైజర్ ప్రతా ప్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
అమరావతే రాజధానిగా కొనసాగుతుంది
సాక్షి, నెల్లూరు: అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతంలో వరద నీళ్లు వచ్చాయని, అప్పటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని మాత్రమే మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారని ఆయన పేర్కొన్నారు. దీంతో టీడీపీ రాజధానిని మార్చేస్తున్నారంటూ గందరగోళం సృష్టిస్తున్నారన్న మంత్రి మండిపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని చెప్పిందని ... అయినా చంద్రబాబు అక్కడే రాజధానిగా నిర్ణయించారన్నారు. గురువారం మంత్రి ఆత్మకూరు నియోజకవర్గంలో వాసిలి, నెల్లూరు పాలెం, ఎన్నవాడ గ్రామాల్లో పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన .... ఆత్మకూరు నియోజక వర్గంలోని ప్రజల సమస్యలపై ఏర్పాటు చేసిన ఎంజీఆర్ హెల్ప్లైన్కు ఇప్పటివరకూ 150కిపైగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందులో 45 సమస్యలను పరిష్కరించామని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని మిషన్ భగీరథ తరహాలోనే రాష్ట్రంలో కూడా తాగునీటి కోసం కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో సోమశిల జలాశయం నుంచి జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సోమశిల జలాశయానికి నీటి కరువు భవిష్యత్తులో ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం
-
చట్టసభల్లో ‘సింహ’గళం
సాక్షి , నెల్లూరు : రాష్ట్ర అసెంబ్లీలో సింహపురి గళం బలంగా వినిపించింది. పార్లమెంట్లో జిల్లా నుంచి ఎన్నికైన ఆదాల ప్రభాకర్రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం అసెంబ్లీలో జలవనరుల శాఖ మంత్రి అనిల్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహం ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు మాట్లాడిన మాటలకు మంత్రి అనిల్కుమార్ యాదవ్ జవాబు ఇస్తూ టీడీపీ ఐదేళ్ల పాలనపై, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్పై ఘాటుగా విమర్శించారు. నీరు లేకుండా చెట్టు లేకుండా రూ.18 వేల కోట్లు చంద్రబాబు, ఆయన సహచర మంత్రులు దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జిల్లా సాగునీటి ప్రాజెక్ట్లను విస్మరించారంటూ ధ్వజమెత్తారు. 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిలను ఏనాడు 36 టీఎంసీల నీటిని నిల్వ చేసిన పాపాన పోలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే సోమశిల ముంపు గ్రామాలైన వైఎస్సార్ జిల్లాలోని బాధితులకు పరిహారం ఇచ్చి 78 టీఎంసీల నీటిని నిల్వ చేయించిన అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. వైఎస్సార్ శ్రీకారం చుట్టిన సంగం, పెన్నా బ్యారేజీలను 2014లో సీఎం అయిన చంద్రబాబు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చినా.. ఐదేళ్లలో అడుగు ముందుకు వేయలేదంటూ దుయ్యబట్టారు. కుటుంబ హత్యలను రాజకీయ హత్యలుగా ప్రచారమా? ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్లలో జిల్లాకు చేసిందీ ఏమీ లేదని విమర్శించారు. వరుసగా ఓడిపోయిన చంద్రమోహన్రెడ్డిని అడ్డదారిలో మంత్రిని చేసి నిత్యం తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించాలని ఆయనకు పని కల్పించారన్నారు. టీడీపీ కార్యకర్తల్ని చంపేస్తున్నారని చంద్రబాబు గోల చేస్తున్నారని,, సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో చేవూరు శ్రీనివాసులు అనే టీడీపీ కార్యకర్త హత్య జరిగింది. అయితే ఆయన హత్యకు కారణం వివాహేతర సంబంధం అని అన్ని పత్రికల్లో ప్రచురితమైన పేపర్లను సభలో చూపించి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు మాట్లాడే ముందు కనీసం సరిగ్గా చూసుకోకపోవటం ఏంటని ప్రశ్నించారు. బాబును ఏయిర్ పోర్టులో భద్రతా దళాలు తనిఖీలను నేరంగా చూపించేలా మాట్లాడటం సరికాదని ఘాటుగా విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఆఖరికి ఆయన కుమారుడుకి రెండు ఉద్యోగాలు.. మూడు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. జాబుల కోసం చంద్రబాబు మాటలు విని ఉమ్మడి కుటుంబాలు సైతం విడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం దేశ రాజధానిలో ఢిల్లీలోని పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమ జరిగింది. నెల్లూరు నుంచి వైఎస్సార్సీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన ఆదాల ప్రభాకర్రెడ్డి, తిరుపతి పార్లమెంట్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాద్ మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదాల ప్రభాకర్రెడ్డి తెలుగులో ప్రమాణం చేయగా, బల్లి దర్గాప్రసాద్ ఇంగ్లిష్లో ప్రమాణ స్వీకరాం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు కొందరు ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం ఎంపీలకు మాట్లాడే అవకాశం రానుంది. -
జగన్ హామీతో సాగర సమరానికి సై!
సాక్షి, వాకాడు(నెల్లూరు) : మత్స్య సంపద పునరుత్పత్తి నేపథ్యంలో 61 రోజుల వేట నిషేధం తర్వాత బతుకు వేటకు సాగరంపై సమరానికి మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. శనివారం తెల్లవారు జాము నుంచి వేటకు బయలుదేరాల్సి ఉండడంతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు ఇంజన్ పడవలు, వలలను సిద్ధం చేసుకుని శుక్రవారం ట్రయల్ వేట సాగించారు. గత కొన్నేళ్లుగా సముద్రంలో ప్రకృతి విపత్తులతో అంతంత మాత్రంగా వేట సాగుతోంది. ఏటా వేట నిషేధ కాలంలో గత ప్రభుత్వం నుంచి సాయం కూడా అందని పరిస్థితిలో మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మత్స్యకారులకు వరాలు ప్రకటించడంతో ఉత్సాహంగా ఉన్నారు. చేపల వేటే జీవనాధారంగా సాగుతున్న మత్స్యకారులు సాగరంపై సమరానికి సిద్ధమయ్యారు. మత్స్య సంపద పునరుత్పత్తి కాలంగా ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటను నిషేధించింది. 61 రోజుల వేట విరామం తర్వాత శనివారం తెల్లవారు జాము నుంచి వేట పునః ప్రారంభవుతోంది. జిల్లా సముద్ర తీరంలో మత్స్యకారులు తమ వేట సామగ్రిని సంసిద్ధం చేసుకున్నారు. గంగమ్మ తల్లికి పూజలు చేసి వేటకు బయలుదేరుతారు. వేటే జీవనాధారమైన మత్స్యకారులు రెండు నెలలుగా వేట లేక ఆకలితో అలమటించారు. గత ప్రభుత్వ హయాంలో రెండేళ్లుగా వేట విరామం పరిహారం సక్రమంగా అందించకపోవడంతో ప్రతి ఏడాది 50 నుంచి 60 శాతం మంది మత్స్యకారులు మాత్రమే నిరాశతో వేటకు వెళ్లేవారు. కానీ ఈ సారి కొత్త ప్రభుత్వం మత్స్యకారుల కన్నీళ్లు తుడిచే విధంగా వరాలు కురిపించడంతో పూర్తిస్థాయిలో ఉత్సాహంగా వేటకు బయలుదేరారు. జిల్లాలో 169 కిలో మీటర్ల సముద్ర తీరం వెంబడి 12 మండలా పరిధిలో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 3 లక్షలకు పైగా మత్స్యకార జనాభా ఉంది. అందులో లక్ష మందికి పైగా మెరుగైన జీవనోపాధి కోసం చెన్నై, నాగూరునాగపట్నం, రామేశ్వరం, కడలూరు, తూతుకుడి తదితర ప్రాంతాలకు వలసలు పోయారు. మిగిలిన 2 లక్షల మంది మత్స్యకారులు జిల్లా తీరంలోనే జీవనం సాగిస్తున్నారు. కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో కేవలం వేటపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులు 59 వేల మంది ఉన్నారు. జిల్లాలోని మత్స్యశాఖ అధికారిక రికార్డుల ప్రకారం 18 సోనా బోట్లు, 3,200 ఫైబర్ బోట్లు, 1,500 కొయ్య తెప్పలు ఉన్నాయి. కానీ వాస్తవంగా మెకనైజ్డ్ పడవలు 7,000 ఉన్నాయి. కొయ్య తెప్పలు 3,000 ఉన్నాయి. వీటిలో ఒకరు నుంచి ఐదు మంది వరకు చేపలు వేట చేయడానికి సముద్రంలోకి వెళ్తారు. నిషేధ సాయానికి కొర్రీలు ∙విరామంలో ఆదుకోని బాబు ప్రభుత్వం చంద్రబాబు సీఎం అయిన తర్వాత మత్స్యకారులకు రూ.4,000 నగదు పరిహారంగా ఇస్తామన్నారు. దీంతో మొదటి ఏడాది బియ్యం పంపిణీ చేయడాన్ని పూర్తిగా రద్దు చేసి, 2015–16 లో కేవలం రూ.2,000 మాత్రమే పరిహారంగా ఇచ్చారు. జిల్లాలో 59 వేల మంది మత్స్యకారులు చేపలు వేట చేయడం ద్వారా కుటుంబాలను పోషించుకొంటుంటేæ కేవలం 10,916 మందికే పరిహారం ఇవ్వాలని లెక్కలు తేల్చారు. అయితే వారిలో 7 వేల మందికే పరిహారం అందింది. 2016–17లో 13,114 మందికి రూ.4,000 చొప్పున ఇవ్వాలని తేల్చగా, వారిలో 8 వేల మందికే ఇచ్చారు. 2017–18లో 11,500 మందికి రూ.4,000 చొప్పున పరిహారం అందజేసేందుకు నివేదికలు తయారు చేయగా>, వారిలో 7,500 మందికే అందాయి. 2018–19 లో 13 వేల మందికి పరిహారం అందజేయాలని నివేదికలు సిద్ధం చేశారు. కానీ ఇచ్చినది 8,250 మందికి మాత్రమే. ఇలా జిల్లాలో చేపలు వేట చేసి బతుకుతున్న మత్స్యకారులకు వేట నిషేధ కాలానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం జిల్లాలోని మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. రెక్కాడితే కాని డొక్కాడని మత్స్యకారులు, కుటుంబాలను పోషించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పలు పాలవుతున్నారు. వైఎస్ జగన్ హామీతో ఆనందోత్సాహాలు ఎన్నికలకు ముందు, ఎన్నికల మేనిఫెస్టోలో మత్స్యకారులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో వరాలు ప్రకటించారు. సీఎంగా అన్ని వర్గాలకు హామీలు నెరవేరుస్తుండడంతో మత్స్యకారులు తమ భవిష్యత్పై భరోసా ఉందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయం రూ.10 వేలకు పెంచుతామని, సబ్సిడీపై డీజల్ అందజేస్తామని, బీమా పరిహారాన్ని రెండింతలకు పెంచడం, బోట్లు రిజిస్ట్రేషన్ తదితర సంక్షేమాలతో జగన్ మత్స్యకారులను ఆదుకోబోతున్నారు. -
ఆగని బీద బ్రదర్స్ దందా..
సాక్షి, కావలి(కర్నూలు) : అధికారం అండతో బీద సోదరులు ప్రారంభించిన గ్రావెల్ దందాను ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. సొంత అవసరాలకు సామాన్యులు ట్రక్కు గ్రావెల్ తరలిస్తుంటే నానా హంగామా చేసే అధికార యంత్రాంగం బీద సోదరులు నిబంధనలకు విరుద్ధంగా లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలిస్తున్నా సంబంధిత మైనింగ్ శాఖాధికారులు మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం మారినా కొనసాగుతున్న బీద సోదరుల గ్రావెల్ దందాపై దృష్టి సారించకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నిత్యం వందల టిప్పర్లతో వెయ్యి ట్రిప్పుల గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఏడాదిన్నరగా 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు. ఒప్పందాల ప్రకారం ఇంకా 15 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ రవాణా చేయాల్సి ఉంది. బీద బద్రర్స్ గ్రావెల్ దందాతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో చిల్లి పడింది. గ్రావెల్ దందా ఒక ఎత్తైతే.. గ్రావెల్ తవ్వకాలు సాగించిన ప్రదేశంలో పెద్ద ఎత్తున ఇసుక తరలించి డంప్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఇందు కోసం గ్రావెల్ గోతుల్లో బోర్లు కూడా వేసుకుని, అన్ని వసతులు సిద్ధం చేసుకున్నారు. మొన్నటి వరకు టీడీపీలో కీలక నేతలుగా చెలామణి అయిన సోదరులు సొంత మండలాన్ని కేంద్రంగా చేసుకుని గ్రావెల్ దందాకు తెర తీశారు. అధికారం అండతో నిబంధనలకు విరుద్ధంగా బీద సోదరులు తమ బినామీల పేర్లతో గ్రావెల్ తవ్వకాల కోసం కొద్ది మొత్తంలో భూములను రెవెన్యూ అధికారులను ప్రలోభ పెట్టి లీజుకు తీసుకున్నారు. అయితే సుమారు 170 ఎకరాలను ఆక్రమించారు. మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం ఆరడుగుల మేర గ్రావెల్ తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే వంద ఎకరాలకు పైబడి 10 నుంచి 17 అడుగుల మేర లోతులో తవ్వేశారు. సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు. గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు వందల రూ.కోట్ల సీనరైజ్ ఎగ్గొట్టి యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. అల్లూరు మండలం నార్త్ ఆములూరులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఏడాదిన్నర నుంచి టీడీపీ నాయకులు బీద మస్తాన్రావు, బీద రవిచంద్ర, బీద గిరిధర్ సౌజన్యంతో కొనసాగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామంలోని సర్వే నంబర్ 349/5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, సర్వే నంబర్ 351/3, 4, సర్వే నంబర్ 350/1, 2, 3, 4, 5, 6, 7, 348/14, 329/1 తదితర సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నాణ్యమైన గ్రావెల్ ఇక్కడే జిల్లాలోని బిట్రగుంట–గూడూరుల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులను శ్రీనివాస ఇడిఫైస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్) చేస్తోంది. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో గ్రావెల్తో నేలను చదును చేయడం అత్యంత కీలకమైన పని. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే రైలు పట్టాలు బిగిస్తారు. అయితే నేలను చదును చేయడానికి అవసరమైన గ్రావెల్ నాణ్యమైనది, జిగురు ఎక్కువ శాతం ఉండేది అవసరం. ఈ లక్షణాలు కలిగిన గ్రావెల్ అల్లూరు మండలం నార్త్ ఆములూరులోని ప్రభుత్వ భూముల్లో ఉంది. ఏడాదిన్నర క్రితం ఈ పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన నిర్మాణ సంస్థ అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న బీద సోదరులను ఆశ్రయించింది. కోట్లాది రూపాయలు చేతులు మారడంతో గ్రావెల్ తవ్వకాలకు పచ్చ జెండా ఊపారు. దీంతో బిట్రగుంట నుంచి గూడూరు వరకు ఇక్కడ నుంచి గ్రావెల్ను మూడో లైన్కు నిర్మాణానికి తరలిస్తున్నారు. 50 వేల క్యూబిక్ మీటర్ల వరకే అనుమతి అయితే బీద సోదరులు వివిధ అవసరాల కోసం తమ బినామీల పేర్లతో 110 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. గ్రావెల్ తవ్వకాల కోసం ఇక్కడ పది.. పదిహేను ఎకరాల విస్తీర్ణంలో 50 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ వంద ఎకరాల్లో ఎంత అవసరమో అంత గ్రావెల్ యథేచ్ఛగా తవ్వకాలు చేసుకుని తరలించుకోవచ్చని నిర్మాణ సంస్థకు అప్పగించారు. వాస్తవానికి 25 లక్షలు క్యూబిక్ మీటర్ల గ్రావెల్ నిర్మాణ సంస్థకు అవసరం కాగా, ఇప్పటి వరకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను అక్రమంగా తరలించారు. 100 టిప్పర్లు, ఐదు పొక్లెయిన్లు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం తవ్వకాలు చేస్తూనే ఉంది. రోజుకు వెయ్యి ట్రిప్పులు గ్రావెల్ను తరలిస్తున్నారు. అనుమతించిన ప్రభుత్వ భూములే కాకుండా అనుమతి లేని భూముల్లో కూడా యథేచ్ఛగా తవ్వకాలు చేసేస్తున్నారు. 10 నుంచి 17 అడుగుల లోతులు వరకు తవ్వకాలు చేసి తరలిస్తున్న గ్రావెల్ వల్ల ఏర్పడిన గోతుల్లో టిప్పర్లు మరమ్మతులు చేసే గ్యారేజ్లు, సిబ్బంది విడిది గదులను ఏర్పాటు చేసుకొన్నారు. బోరు పాయింట్ను నిర్మించి నీటిని వినియోగించుకొంటున్నారు. సమీపంలో ఉన్న పైడేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తీసుకొచ్చి గ్రావెల్ తరలించగా ఏర్పడిన భారీ గోతులనే ఇసుక డిపోలుగా మలుచుకొని నిల్వ చేస్తున్నారు. బీద సోదరులు అండదండలతో ప్రారంభమైన ఈ అక్రమ గ్రావెల్ తరలింపు దందా రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ గ్రావెల్ తరలింపు నిర్విరామంగా జరుగుతున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధికారిక అంచనాల ప్రకారం రూ.300 కోట్లు విలువ చేసే గ్రావెల్ను అక్రమంగా తరలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తవ్వేసిన గ్రావెల్కు సంబంధించి ఇంజినీరింగ్ సంస్థకు జరిమానాలు విధించడంతో పాటు తవ్వకాలను ఆపేయడమా? సీనరైజ్ వసూలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. -
సమరనాదం
సమరోత్సాహం వెల్లివిరిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. జై జగన్.. జైజై జగన్ నినాదంతో సభా ప్రాంగణం మారుమోగింది. జిల్లా నలుమూలల నుంచి వెల్లువలా జనసమూహం తరలివచ్చింది. 39 డిగ్రీల తీవ్ర ఎండను సైతం భరిస్తూ తమ అభిమాన నేత రాక కోసం, ఆయన ప్రసంగం కోసం ఎదురుచూశారు. ఒక్కసారిగా వైఎస్ జగన్ను చూసి రెట్టించిన సంతోషంతో సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయంతో సమరశంఖారావం సభా ప్రాంగణం దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జరిగిన సభలో పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించడంతోపాటు సభావేదిక ముందు ఏర్పాటుచేసిన ర్యాంపుపై తిరుగుతూ బూత్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. సింహపురి గడ్డపై సాగిన సమర శంఖారావం పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల ప్రాంగంణంలో జరిగిన సభలో పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించి శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంతోపాటు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేసేలా జోష్ నింపారు. జగన్ మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరులోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు తరలివచ్చారు. ఈ క్రమంలో పలుచోట్ల పార్టీ శ్రేణులు జగన్కు ఘనస్వాగతం పలికారు. తొలుత సూళ్లూరుపేట ఎమ్మెల్యే, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నాయుడుపేట, గూడురు, వెంకటాచలం టోల్గేట్ మీదుగా జగన్ నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దుగ్గరాజపట్నం కట్టి తీరుతాం వైఎస్ జగన్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సభలో మాట్లాడారు. ప్రధానంగా సూళ్లూరుపేటకు చెందిన బూత్ కమిటీ సభ్యుడు వెంకటేష్ దుగ్గరాజపట్నం పోర్టు విషయంలో టీడీపీ ఇచ్చిన హమీని విస్మరించిందని చెప్పగా దానికి స్పందించిన జగన్ అందరి ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే దుగ్గరాజపట్నం పోర్టు కట్టి తీరుతామని ప్రకటించారు. జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, సెజ్లు ఉన్నాయిని, కానీ వాటిలో తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల వారు పనిచేస్తున్నారని స్థానికంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావడం లేదని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక యువతకు స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. ఓటు చూసుకోండి ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తూ లక్షల సంఖ్యలో ఓట్లు తొలగిస్తోందని, ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీని అభిమానించి ప్రేమించే ప్రతిఒక్కరూ తమ ఓటును సరిచూసుకోవాలిని జగన్ సూచించారు. అలాగే బూత్ కమిటీ సభ్యులు మీకు కేటాయించిన 35 ఇళ్లకు వెళ్లి వారి ఓటర్ల జాబితాను ఒకసారి పరిశీలించాలని, వాటితో పాటు మీ ఓట్లు కూడా ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు. ర్యాంపుపై అటూ ఇటూ నడుస్తూ.. జగన్ ప్రసంగం ఆధ్యంతం ఆకట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల తొలగింపు, సర్కారు కుయుక్తులు మొదలుకుని సభ్యులడిగిన ప్రశ్నలకు బదులివ్వడం వరకూ సుదీర్ఘంగా ప్రసంగం కొనసాగింది. సభా వేదిక నుంచి పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. అనంతరం బూత్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వేదిక ముందు భాగంలో ఉన్న ర్యాంపుపై అటూ ఇటూ నడుస్తూ బదులిచ్చారు. దీంతో సభకు హాజరైన వారిలో ఉత్సాహం రెట్టించింది. మరోవైపు మంగళవారం జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అశేష జనవాహిని ముండుటెండను లెక్కచేయకుండా జగన్ కోసం తరలివచ్చారు. అలాగే రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగం మొత్తం జై జగన్ అంటూ నినాదాలు చేశారు. హాజరైన నేతలు సభలో నెల్లూరు, తిరుపతి మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్ రావు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పార్టీ నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, కిలివేటి సంజీవయ్య. ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్ కుమార్యాదవ్. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, సమన్వయకర్తలు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మేరళిధర్, బాపట్ల, తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు నేదురుమల్లి రామకుమార్రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకులు ఎల్లసిరి గోపాలరెడ్డితోపాటు అన్ని నియోజకవర్గాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యం రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేద్దాం. జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను గెలిపించుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇద్దాం. మన లక్ష్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంమే. – నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, తిరుపతి, నెల్లూరు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జి ఓట్లు తొలగింపుపై విచారణ జరిపించాలి ఓట్ల తొలగింపుపై టీడీపీ నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారు. ఎవరు పేర్ల మీద ఓటర్లు తొలగించారో ప్రత్యేక విభాగంతో దర్యాప్తు చేయిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ఓట్ల తొలగిస్తూనే ప్రతిపక్ష పార్టీపై నిందలు వేస్తున్నారు. – పంజల సుకుమార్రెడ్డి, తిరుపతి పార్లమెంట్ జిల్లా బూత్కమిటీ కన్వీనర్ టీడీపీకి బుద్ధి చెబుదాం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెబుదాం. చంద్రబాబు చేస్తున్న మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియచేసి, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే నవరత్నాలను ప్రతి ఒక్కరికీ వివరిద్దాం. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరం కష్టపడి పార్టీని గెలిపించుకుందాం. – భగవాన్రెడ్డి, తిరుపతి పార్లమెంట్ జిల్లా బూత్కమిటీ అబ్జర్వర్ -
భారీగా ఎర్రచందనం స్వాధీనం: స్మగ్లర్లు పరారీ
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అనంతసాగరం మండలం పిలకలమర్రి వద్ద దాదాపు 50కి పైగా ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు.అందుకు సంబంధించి మూడు వాహనాలను పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు, అటవీశాఖ అధికారులను చూసి ఎర్రచందనం స్మగ్లర్లు వాహనాలు వదిలి పరారైయ్యారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పట్టుబడిన ఎర్రచందన దుంగలను, వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.