Prateek Reddy
-
కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ది హత్యా?
- అతన్ని చంపించింది నేనే.. - డబ్బులివ్వకుంటే నీ కొడుకునూ చంపిస్తా - వ్యాపారి నాగేందర్ను బెదిరించిన నయీమ్ - 2011లో ఔటర్పై ‘ప్రమాదం’లో మరణించిన ప్రతీక్ సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డి చనిపోయింది రోడ్డు ప్రమాదంలో కాదా? గ్యాంగ్స్టర్ నయీమే అతన్ని హత్య చేయించాడా? అది హత్యేనని, తానే చేయించానని నయీమే తనతో స్వయంగా చెప్పాడని వ్యాపారి గంపా నాగేందర్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం రేపుతోంది. తన కొడుకునూ అలాగే చంపుతానంటూ నయీమ్ బెదిరించాడని అందులో నాగేందర్ పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది...? కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డి 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు. అతనితోపాటు స్నేహితులైన సుజీత్కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ప్రమాదమేనని, పటాన్చెరు వైపు వస్తుండగా గొర్రెలను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పిందని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. సర్వీసు రోడ్డు పక్కనున్న మట్టి, రాళ్ల కుప్పను ఢీకొని కారు ఎగిరిపడిందని తేల్చారు. ప్రతీక్ మృతదేహం రోడ్డుకు 20 అడుగుల దూరంలో పడింది. ఇది రోడ్డు ప్రమాదంగానే పోలీసు రికార్డుల్లో ఉండిపోయింది. అయితే ప్రతీక్ను తానే చంపించానని నయీమే స్వయంగా చెప్పాడని నాగేందర్ తాజాగా ఆగస్టు 17న భువనగిరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘గత మార్చి 18న నయీమ్ అనుచరులు నన్ను నయీమ్ వద్దకు తీసుకువెళ్ళారు. రూ.5 కోట్లివ్వాల్సిందిగా నయీమ్ నన్ను డిమాండ్ చేశాడు. లేదంటే నా కుటుంబీకుల్ని హతమారుస్తానన్నాడు. రోడ్డు ప్రమాదంగా కన్పించేలా నా కుమారుల్ని చంపుతానన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకునూ అలాగే చంపానన్నాడు. అది హత్య అని ఎవరూ గుర్తించలేదని చెప్పుకొచ్చాడు’’ అని వివరించారు. పోలీసులు మాత్రం కేవలం నయీమ్ బెదిరింపుల కోసం చెప్పిన మాటల ఆధారంగా దీనిపై ఓ నిర్ణయానికి రాలేమంటున్నారు. అయితే ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలంటూ నయీమ్ తనను బెదిరించాడని వెంకట్రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. -
ప్రత్యేక చర్చ : తప్పిదాలే ప్రాణాలు తీస్తున్నాయా?
-
తప్పిదాలే ప్రాణాలు తీస్తున్నాయా?
-
విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు
*వరుస ప్రమాదాల్లో బలవుతున్న ప్రముఖులు *ప్రాణాలు తీస్తున్న అతి వేగం *గమ్యస్థానానికి చేరాలన్న తొందరలో దూకుడు ప్రయాణం *సీటు బెల్ట్ వాడరు *ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన *డ్రైవర్ల పట్ల పర్యవేక్షణా లోపం *చిన్న అశ్రద్ధకు భారీ మూల్యం *రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది బలి త్వరగా వెళ్లాలనే ఆరాటం... ఆ ఆత్రుతే ప్రాణాల మీదకు తెస్తోంది... ఆ తొందర్లోనే చిన్న చిన్న జాగ్రత్తలను గాలికి ఒదిలేయడం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎందరో ప్రముఖులు, మరెంతో మంది భవిష్యతారలు ఇలాగే మృత్యువాతపడ్డారు. అతి వేగం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంటుంది. కాని భయపడేవారేవరూ. కేర్లెస్గా ఉండటమే తమకు ఇష్టమని ఆధునిక యూత్ ర్యాష్ డ్రైవింగ్తో మరీ చెప్తోంది. వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పొగొట్టుకుంటే... ఎవరికి నష్టం. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందు కన్నుమూస్తే ఆ తల్లిదండ్రులు పడే వేదనను ఎవరు తీర్చుతారు? *శోభానాగిరెడ్డి వైఎస్ఆర్ సీపీ నేత *ఎర్రన్నాయుడు టీడీపీ నేత *లాల్జాన్ బాషా టీడీపీ నేత *కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి (s/o కోమటిరెడ్డి వెంకట్రెడ్డి) *కోటా వెంకట ప్రసాద్ (s/o కోటా శ్రీనివాసరావు) *పి.పవన్ కుమార్ (s/o బాబూమోహన్) *మహ్మద్ అయాజుద్దీన్ (s/o మహ్మద్ అజారుద్దీన్) ఇపుడు.... *నందమూరి జానకిరామ్.. (s/o నందమూరి హరికృష్ణ) వీరంతా రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన రాజకీయ, సినీప్రముఖులు. *వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృత్యువాత పడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన ఆ దుర్ఘటన ఇప్పటికీ కళ్లముందు కదులుతూనే ఉంటుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కారులో ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. *ఇక రోడ్డు ప్రమాదాలు తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం మిగిల్చాయి. సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, లాల్ జాన్బాషాలు రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం పెట్రోల్ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో ఆయన కన్నుమూశారు. ఇక టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్జాన్ బాషా వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను ఢీ కొట్టింది. ఘటనా స్థలిలోనే బాషా కన్నుమూశారు. *అలాగే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డిని రోడ్డు ప్రమాదమే పొట్టనపెట్టుకుంది. 2011లో మెదక్ జిల్లా కొల్లూరు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ప్రతీక్తో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఘటనాస్థలంలోనే చనిపోయారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారు నడపడం ఆ ప్రమాదానికి కారణం. *ఇక ఫాదర్స్ డే నాడే.. సినీ నటుడు కోట శ్రీనివాసరావుకు పుత్రశోకం కలిగింది. ఫంక్షన్కు అటెండయ్యేందుకు స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తున్న కోట వెంకట ప్రసాద్.. నార్సింగి సమీపంలో అప్పా వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. బాబూమోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003లో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పాయాడు. అలాగే వర్ధమాన నటుడు యశోసాగర్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. *హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై మితి మీరిన వేగంతో బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో వాదనలు వినిపించాయి. *ఇపుడు నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ను బలిగొంది రోడ్డుప్రమాదమే. జానకిరామ్ ప్రయాణిస్తున్న సఫారీ.. నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారు వద్ద రాంగ్రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. చెప్పుకుంటూ పోతే ఎంతో మంది జీవితాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. చిన్న అజాగ్రత్తలు ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏంటని ఆరా తీస్తే...అతివేగం ఒకరిదైతే.. నిర్లక్ష్యం ఇంకొకరిది. ప్రొఫెషనల్ డ్రైవర్లు కాకపోవటం.... డ్రైవర్లను పెట్టుకోకపోవటం...ఇలా ఎన్నో ప్రమాదానికి కారణాలవుతున్నాయి. ఇక అన్నిజాగ్రత్తలు తీసుకున్నా...రోడ్డుపై వెళ్లేటపుడు ఎదురుగా వస్తున్న వాహనదారుల తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.