Rain fury
-
ఉత్తరాదిలో వరద బీభత్సం. మండీలో కూలిన స్టీల్ బ్రిడ్జ్
ఢిల్లీ: ఉత్తరాదిలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలతో వరద పోటెత్తుతోంది. గత రెండు రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలకు 12 మంది మృత్యువాత పడ్డారు. మరికొన్ని రోజులు ఇదే రకంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన ఐఎండీ స్పష్టం చేయడంతో ఉత్తరాది ప్రజలు అల్లాడిపోతున్నారు. దక్షిణ ఢిల్లీలోని మండీలో స్టీల్ బ్రిడ్జ్ కూలిపోవడం వరద తీవ్రతకు అద్దం పడుతోంది. రేపు ఢిల్లీలో స్కూళ్లకు సెలవు ప్రకలించారు. 41 ఏళ్ల తర్వాత రికార్డు స్తాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. గత 24 గంటల్లో 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 1982 జూలైలో ఢిల్లీని అతాలకుతలం చేసిన వర్షాలు తర్వాత ఆ తీవ్రతను దాటి వర్షాలు పడటం నగర వాసుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇక హిమాచల్ప్రదేశ్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్లోని పలుప్రాంతాలు నీట మునిగాయి. తద్వారా పలు ప్రాంతాల్లో రహదారుల్ని మూసివేశారు. ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి ప్రభుత్వాలు. Capital of the world’s fifth largest economy. Video from GK1. Flooding, long power cuts, garbage on roads, massive traffic jams… Delhi is a shit show! #DelhiRains pic.twitter.com/yQosD51XO2 — Shweta Sengar (@ShwetaSengar) July 8, 2023 చదవండి: జైలులో నన్ను చంపాలని ప్లాన్ చేశారు.. సుఖేష్ సంచలన లేఖ -
హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల శనివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్పల్లి, మైత్రీవనం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లిలో గరిష్టంగా 4.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలానే కొన్ని చోట్ల విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. కాగా గత కొద్ది రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. (చదవండి : ఈనెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ) -
భారీ వర్షం: ప్రాథమిక నష్టం అంచనా.. 770 కోట్ల పైనే
ఒంగోలు, న్యూస్లైన్ : భారీ వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. ప్రాథమికంగా నష్టం అంచనా రూ.770 కోట్లకుపైమాటేనని అధికారులు తేల్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా జనం మాత్రం ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. వేలాది నివాస గృహాలు, పదుల సంఖ్యలో కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. ముంపు గ్రామాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నించడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్, రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి, పురపాలకశాఖ మంత్రి మానుగుంట మహీధర్రెడ్డిలు శనివారం జిల్లాకు వస్తుండటంతో అధికారులు తాత్కాలికంగా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. కూలీలు సురక్షితం గురువారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఎట్టకేలకు శుక్రవారం క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. యర్రగొండపాలెంలో పశువులమేత కోసం వెళ్లి దాదాపు 70 మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. తీగలేరు, దొంగలవాగు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. వాగులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సును బయటకు తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండపి సమీపంలోని ముసి వాగు అవతల చిక్కుకున్న 300 మంది రాజమండ్రికి చెందిన కూలీలు, మరో 100 మంది కొండపికి చెందిన కూలీలను అధికారులు మరబోట్ల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చే పనిలో ఉన్నారు. దీని కోసం పాకల సముద్ర తీరం నుంచి బోట్లు తెప్పించారు. జరుగుమల్లి మండలం సాదువారిపాలెం శుక్రవారం రాత్రికి కూడా జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. చీరాలలో 5 వేల చేనేత గృహాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గంలో 150 ఇళ్లు కూలిపోయాయి, 14 గేదెలు, 15 గొర్రెలు చనిపోయాయి. చీరాల ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్కు గండిపడటంతో సమీపంలోని సవరపాలెం బ్రిడ్జికి ముప్పు పొంచి ఉంది. కొత్తపట్నం మార్గంలో ఉప్పువాగు పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. కందుకూరు ప్రాంతంలో కాలనీల్లో చేరిన నీటిని బయటకు పంపలేదు. ఒంగోలులో కూడా ఇంకా పెద్ద ఎత్తున నీరు నిలిచే ఉంది. పర్చూరు ప్రాంతంలో కాలనీల్లో చిక్కుకున్న నీటిని బయటకు పంపే పరిస్థితి లేకుండా పోయింది. దేవరపాలెం క్రాస్రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గిద్దలూరులో 14 వేల ఎకరాలు నీటమునిగాయి. కాకర్ల డ్యామ్ వద్ద భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. దీంతో 14 గ్రామాలకు రాకపోకలు లేకుండా పోయాయి. ఆర్టీసీ అధికారులు శుక్రవారం దాదాపు 30 సర్వీసులను తిప్పలేదు. ప్రధానంగా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వరదనీరు విపరీతంగా వస్తుండటంతో 9 గేట్లు తెరిచారు. ప్రాథమిక నష్టం అంచనా వివరాలు.. జిల్లాకు మంత్రులు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ప్రాథమిక అంచనాలను తయారు చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు రూ. 770 కోట్లకుగాపైగా జిల్లాలో నష్టం వాటిల్లిందని అధికారులు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆర్అండ్బీకి చెందిన 30.106 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, దానికోసం రూ. 97.15 కోట్లు అవసరమవుతాయని నివేదించనున్నారు. పంచాయతీ రాజ్శాఖ పరిధిలో మరమ్మతులకు రూ. 229.21 కోట్లు అవసరమవుతాయని తేల్చారు. -
కోస్తాలో కొనసాగుతున్న వర్షాలు