breaking news
Raja Saab Movie
-
ప్రభాస్ 'రాజాసాబ్' హీరోయిన్కి అవార్డ్
'రాజాసాబ్' బ్యూటీ, హీరోయిన్ మాళవిక మోహనన్ మరో అవార్డ్ దక్కించుకుంది. ముంబైలో జరిగిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్లో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కించుకుంది. ఓటీటీ, వెబ్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన బిగ్గెస్ట్ అవార్డ్స్గా ఈ సంస్థకు పేరుంది. ఈ ఈవెంట్లో రెడ్ కార్పెట్పై నడిచిన మాళవిక.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటోల్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్)మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్లో మాళవిక స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంది. డిసెంబరులో రిలీజయ్యే ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్కు మరింత దగ్గర అవుతుందేమో చూడాలి.కేరళకు చెందిన మాళవిక.. 2013లో తొలుత మలయాళ సినిమాలతోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కన్నడ, హిందీలోనూ పలు చిత్రాలు చేసింది. రజినీకాంత్ 'పేట' మూవీ ఈమెకు కాస్త గుర్తింపు తీసుకొచ్చింది. దళపతి విజయ్ 'మాస్టర్'తో మరో హిట్ అందుకుంది. గతేడాది 'యుద్రా' అనే హిందీ సినిమా చేసింది. ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో ప్రస్తుతం ఆశలన్నీ 'రాజాసాబ్'పైనే పెట్టుకుంది. ఇది కాకుండా సర్దార్ 2, హృదయపూర్వం అనే చిత్రాల్లో నటిస్తోంది.(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
'రాజాసాబ్' మారుతి.. ఏకంగా ఆరు కథలు!
'రాజాసాబ్' టీజర్కి అన్నివైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొన్నాళ్ల ముందు వరకు డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఎందుకు సినిమా చేస్తున్నాడా అని తిట్టుకున్న ఫ్యాన్స్.. ఇప్పుడు టీజర్ చూసి మెచ్చుకుంటున్నారు. పర్లేదు మూవీ డీసెంట్గానే ఉండొచ్చు, హిట్ కొట్టబోతున్నాం అని మురిసిపోతున్నారు. అయితే డైరెక్టర్ మారుతి గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది.స్వతహాగా ఆర్టిస్ట్ అయిన మారుతి.. 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' సినిమాలతో దర్శకుడిగా మారాడు. ఈ రెండింటిలోనే బూతు డైలాగ్స్ ఉండేసరికి ఇతడిపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దీని నుంచి బయటపడేందుకు నానితో 'భలే భలే మగాడివోయ్' సినిమా తీశాడు. తనపై ఉన్న బూతు ముద్రని చెరిపేసుకున్నాడు. తర్వాత నుంచి కామెడీ ఎంటర్టైనర్స్ తీస్తున్నాడు. గతంలో 'ప్రేమకథా చిత్రమ్'తో హారర్ కామెడీ ట్రెండ్ సెట్ చేసిన మారుతి.. ఇప్పుడు 'రాజాసాబ్'తో హారర్ ఫాంటసీ స్టోరీతో రాబోతున్నాడు.(ఇదీ చదవండి: 'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ)సరే అసలు విషయానికొస్తే.. మారుతిలో దర్శకుడితో పాటు మంచి రైటర్ కూడా ఉన్నాడు. గతంలో తన కథలతో పలువురు దర్శకుల్ని పరిచయం కూడా చేశాడు. ఇప్పుడు 'రాజాసాబ్' తర్వాత కూడా అలానే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ తర్వాత మరో కొత్త మూవీ చేయడానికి చాలా టైమ్ పట్టొచ్చు. కానీ అంతలో తన దగ్గరున్న ఆరు స్టోరీల్ని టాలీవుడ్లోనూ పలువురు యంగ్ డైరెక్టర్స్కి ఇవ్వాలని ఫిక్సయ్యాడట. త్వరలో ఇవి కార్యరూపం దాల్చనున్నాయి.ఇక 'రాజాసాబ్' సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన మారుతి.. చూచాయిగా ఉండకపోవచ్చని అన్నాడు. డిసెంబరులో రాబోయే సినిమా హిట్ అయిన దానిబట్టి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పుకొచ్చాడు. మారుతి కామెంట్స్ బట్టి చూస్తే సెకండ్ పార్ట్ ఉండదు. డిసెంబరు 5న 'రాజాసాబ్' థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికీ ఇంకాస్త వర్క్ బ్యాలెన్స్ ఉంది. రిలీజ్కి ఇంకా చాలా సమయముంది కాబట్టి అంతలో పూర్తి చేసి చెప్పిన టైంకి రావొచ్చు. లేదంటే మాత్రం మళ్లీ డేట్ మారడం పక్కా.(ఇదీ చదవండి: సమంత.. ఆ జ్ఞాపకం ఇంకా అలానే) -
'రాజాసాబ్'లో మారిపోయిన తాత.. ప్రభాస్ కాదా?
ప్రభాస్ 'రాజాసాబ్' టీజర్ వచ్చింది. ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. అదే టైంలో వాళ్లకు చిన్న సందేహం కూడా వచ్చింది. అదే తాత గెటప్. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్.. ముసలి గెటప్లో కనిపించాడు. ఇప్పుడు టీజర్లో మాత్రం స్టోరీ అంతా వేరేలా ఉంది. దీంతో ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు.టీజర్ బట్టి చూస్తే.. ఓ పెద్ద మహల్. దానికి యజమాని అయిన ఓ వ్యక్తి.. తరతరాలుగా ఆ మహల్తోపాటు ఆస్తిని అనుభవించాలని అనుకుంటాడు. దీంతో చనిపోయిన తర్వాత దెయ్యంగా మారి అక్కడే ఉండిపోతాడు. ఓ సందర్భంలో హీరోహీరోయిన్లు అక్కడికి వస్తారు. తర్వాత జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)టీజర్ మొత్తంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ని తాతగా చూపించారు. కానీ గతంలో ప్రభాస్ని ముసలి గెటప్లో చూపించారు. దీంతో ఫ్యాన్స్ పలు థియరీలు అనుకుంటున్నారు. ఆత్మ రూపంలో ఉండే తాత.. క్లైమాక్స్లో ప్రభాస్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ప్రభాస్.. తాతలా మారిపోయి విలన్స్ని చితక్కొట్టేస్తాడు అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమేంటి? అనేది సినిమా వస్తే తప్పితే క్లారిటీ రాదు.ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించగా.. మారుతి దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఇంకొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసుకుని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి సినిమాని తీసుకురాబోతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి) -
ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి
లవ్, యాక్షన్, ఫాంటసీ, మైథాలజీ.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు డార్లింగ్ ప్రభాస్ (Prabhas). అయితే హారర్ జానర్ను మాత్రం టచ్ చేయలేదు. ప్రేమకథా చిత్రం మూవీ చూసిన ప్రభాస్కు అలాంటి హారర్ మూవీ ఒకటి చేయాలని కోరిక పుట్టింది. ఆ సమయంలో మారుతి కలవడం, కథ చెప్పడం, అది నచ్చడంతో ది రాజా సాబ్ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే మారుతి డైరెక్ట్ చేసిన చివరి చిత్రం పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచింది. అభయమిచ్చిన ప్రభాస్అలాంటి సమయంలో పాన్ ఇండియా హీరోతో సాహసం చేయడం దేనికని దర్శకుడు వెనకడుగు వేశాడు. తర్వాతెప్పుడైనా చూద్దామని వాయిదా వేయాలనుకున్నాడు. కానీ, ప్రభాస్ ఒప్పుకోలేదు. కథ నచ్చిందని.. ముందుకు వెళ్దామని అభయం ఇవ్వడంతో మారుతి (Director Maruthi) రెట్టింపు జోష్తో రాజా సాబ్ (The Raja Saab Movie) తెరకెక్కించాడు. పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.ఇద్దరు హీరోయిన్లు కావాలిసోమవారం (జూన్ 16న) రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మారుతి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ.. సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా? అని అడిగాడు. సలార్లో ఉన్న కథానాయిక ఎప్పుడో ఒకసారి వస్తుంది. కల్కి 2898 ఏడీలో కూడా ఒకమ్మాయి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది. ఆదిపురుష్లోనేమో సీతాదేవి ఎక్కడో ఉంటుంది. ఇద్దరేం ఖర్మ.. ముగ్గురిని తీసుకొచ్చిన డైరెక్టర్నా దగ్గర, నా ఇంట్లో ఎవరూ లేరు డార్లింగ్.. ఇద్దరు హీరోయిన్లను పెడతావా? అన్నాడు. అప్పుడు ఆయన్ను ఎగాదిగా చూసి మీ రేంజ్కు ఇద్దరేంటి? ముగ్గుర్ని పెడతానన్నాను. అలా ముగ్గురు హీరోయిన్లను తీసుకెళ్లి హారర్ కొంపలో పెట్టాను. ఇది రొమాంటిక్ హారర్ ఫాంటసీగా తెరకెక్కించాను అని మారుతి చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు పాపం.. ప్రభాస్ రొమాంటిక్ లవ్స్టోరీలను చాలా మిస్సవుతున్నట్లున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.చదవండి: సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్కు కౌంటర్? -
ఈరోజు మా నాన్న ఉండుంటే.. ఆ థియేటర్తో 'మారుతి' అనుబంధం
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). సోమవారం టీజర్ విడుదల కానుంది. ఈ క్రమంలో పలు థియేటర్స్ వద్ద ప్రభాస్, మారుతి కటౌట్స్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. వాటిని చూసిన దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. గతంలో తన తండ్రి అరటిపళ్లు అమ్మినచోట ఇప్పడు తన కటౌన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ మారుతి తెలిపారు. ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేసిన మారుతి.. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా పని చేశాడు. మచిలీపట్నం, వైజాగ్లో మారుతి పెరిగారు. ఆ ప్రాంతాలతో ఆయనకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.'మచిలీపట్నం - సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్)తో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ మా నాన్నగారికి ఒకప్పుడు చిన్న అరటిపళ్లు దుకాణం ఉండేది. ఎప్పటికైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఈ థియేటర్లో విడుదలైన అందరి హీరోల సినిమాల బ్యానర్స్ నేను ఎంతో ఆశతో కట్టేవాడిని. ఒక్కసారైనా నా పేరు ఇక్కడ చూడాలని కలలు కనేవాడిని. ఇప్పుడు ఇదే థియేటర్ వద్ద నిలబడి చూస్తుంటే.. నా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో అన్ని గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎవరికైనా ఇంతకు మించి ఇంకేం కావాలి. కానీ, ఈరోజు మా నాన్న ఉండుంటే చాలా గర్వపడేవారు. ఆయన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉంది. ఏదైనా ఉన్న సమయంలోనే మన బాధ్యతలను పూర్తి చేయాలి. మన డార్లింగ్ను వెండితెరపై నేను ఎలా చూపించాలని ఆశ పడ్డానో మీ అందరికీ చూపించనున్నాను. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది.' అని ఆయన అన్నారు.MACHILIPATNAM - Siri complex (krishna Kishore in past)This is the place where my father once had a small banana stall…Where I used to write for banners of all heroes films released in this theater dreaming with hope :) I was one of those who wished “okkasaraina mana peru… pic.twitter.com/Wnu3cCUoOz— Director Maruthi (@DirectorMaruthi) June 16, 2025 -
'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. షేర్ చేస్తే కఠిన చర్యలు
ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా టీజర్.. ఈ నెల 16న రిలీజ్ చేస్తామని కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. దీంతో అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో అనుకోనిది జరిగింది. ఎవరో టీజర్ని లీక్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మూవీ టీమ్ అలెర్ట్ అయిపోయింది. హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 'రాజాసాబ్ కంటెంట్ ఎవరి సోషల్ మీడియాలోనైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలానే అకౌంట్ సస్పెండ్ చేస్తాం. అందరూ మాకు సహకరిస్తారని అనుకుంటున్నాం' అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు కొన్నిరోజుల క్రితమే అనౌన్స్ చేశారు.హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించారు. సంజయ్ దత్ విలన్గా చేశాడు. తమన్ సంగీతమందించాడు. ఇప్పటికే చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో రాబోయే టీజర్తో మూవీ కంటెంట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున)Strict action will be taken and handles will be suspended immediately if any leaked content from #TheRajaSaab is found….We request everyone to cooperate and stand with us in protecting the experience….Let’s celebrate responsibly. Be aware. ⚠️— The RajaSaab (@rajasaabmovie) June 13, 2025 -
పుష్ప 2 డేట్ కు రాజాసాబ్.. బ్లాక్ బస్టర్ పక్కా..
-
'ది రాజాసాబ్' నుంచి బిగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). తాజాగా ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ వంటి అంశాలను ఒక పోస్టర్తో చిత్ర యూనిట్ తెలిపింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 16న ఉదయం 10:52గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ టీజర్కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. రీసెంట్గా విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రభాస్ టీజర్ డబ్బింగ్ వర్క్ కూడా పూర్తిచేశారట. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం.తాతా మనవళ్ళుగా ప్రభాస్‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్నగర్ భోగట్టా. వాస్తవంగా ఈ సినిమా విడుదల ఏప్రిల్ 10న రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉండటంతో వాయిదా పడింది. ఇంకా కొంత భాగం షూటింగ్ పనులు కూడా ఉన్నాయట. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్లోను నెలకొంది.ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. A day that promises a festival on the big screens just like we all dreamt of seeing our dearest darling #Prabhas ❤️❤️❤️A lot more exciting days ahead…#TheRajaSaab pic.twitter.com/PFdV1mcqDJ— Director Maruthi (@DirectorMaruthi) June 3, 2025 -
లేట్గా వచ్చినా లేటెస్ట్గా...
హీరోకి గాయం... షూటింగ్కి బ్రేక్ ఆర్టిస్ట్ డేట్స్ సర్దుబాటు కాలేదు... షూటింగ్ లేట్ సినిమాకి అనుకున్న థియేటర్లు అమరలేదు... రిలీజ్ పోస్ట్పోన్ ఒక సినిమా మేలు కోరి ఇంకో సినిమా వెనక్కి తగ్గితే... విడుదల వాయిదా... కారణం ఏదైనా కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి థియేటర్లకు రావు. వాయిదా పడుతుంటాయి. ఇలాంటప్పుడే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తా అని రజనీకాంత్ ‘బాషా’లో చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంటుంది. అలా లేట్ అయిన సినిమాలన్నీ లేటెస్ట్గా వస్తాయని ఊహించవచ్చు. ఇక... విడుదల వాయిదా పడిన చిత్రాల గురించి తెలుసుకుందాం. తనయుడి కోసం... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలుపోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ సపై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే షూటింగ్ని కూడా శరవేగంగా జరిపారు.చిరంజీవి ఎలాగైనా సంక్రాంతి బరిలో దిగుతారని అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినిమా అభిమానులు అనుకున్నారు. కట్ చేస్తే... తనయుడు రామ్చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదల వాయిదా వేశాం’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే మే 9న ఈ సినిమా విడుదలకానుందనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండటంతో ఆ తేదీకి రిలీజ్ కాలేదు. కాగా జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రం 2002 జూలై 24న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ పరంగానూ ఆ డేట్ కలిసొచ్చే అవకాశం ఉండటంతో చిత్రయూనిట్ జూలై 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. ఏదిఏమైనా కొత్త విడుదల తేదీపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండక తప్పదు. రాజా సాబ్ వచ్చేదెప్పుడు?రాజా సాబ్ రాక కోసం అటు ప్రభాస్ అభిమానులు ఇటు సగటు సినిమా ప్రేమికులు వేచి చూస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు.అది కూడా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడినప్పటికీ కొత్త విడుదల ఎప్పుడు? అన్నది మాత్రం చిత్రబృందం ఇప్పటివరకూ ప్రకటించ లేదు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని టాక్.చారిత్రక యోధుడు వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి వారు ఇతర ముఖ్య పాత్రలుపోషించారు. చారి్రతక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్ సపై ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా, 2025లోనూ రెండు స్లారు రిలీజ్ వాయిదా పడింది.ఈ ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన యూనిట్.. ఆ తేదీకి వాయిదా వేసి, మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీకి కూడా విడుదల కాలేదు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నందున మే 9 నుంచి జూన్ 12కి విడుదలను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈసారి ఎలాగైనా ఈ తేదీకే రిలీజ్ చేసేందుకు ప్రమోషన్స్ని కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.మాస్ ఎంటర్టైనర్వెండితెరపై తనదైన శైలిలో మాస్ జాతరని ప్రేక్షకులకు చూపించనున్నారు రవితేజ. అయితే ఆ సమయం ఎప్పుడు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. (మనదే ఇదంతా అనేది ట్యాగ్లైన్). భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా ‘మాస్ జాతర’ అనే టైటిల్ను ఖరారు చేయడంతో పాటు 2025 మే 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే ఈ నెల 9న విడుదల కాలేదు.రిలీజ్ని వాయిదా వేసిన చిత్రబృందం కొత్త విడుదల తేదీని మాత్రం ప్రకటించ లేదు. దీంతో రవితేజ అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ఫుల్పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రవితేజ భుజానికి గాయం కావడంతో షూటింగ్కి బ్రేక్ పడింది. ఈ కారణంగా చిత్రీకరణ ఆలస్యం అయింది. అయితే మేజర్ టాకీ పార్ట్ పూర్తయిందని, కేవలం పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ శ్రీలీల కూడా ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్. అయితే జూలైలో ‘మాస్ జాతర’ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల జరిగిన ఓ ప్రెస్మీట్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చె΄్పారు. ఆయన విడుదల తేదీ ప్రకటించనప్పటికీ జూలై 18న రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. భక్తి పరవశంవిష్ణు మంచు హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర కీలక పాత్రలుపోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు మేకర్స్.అయితే వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం వల్ల రిలీజ్ని జూన్ 27కి వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త రిలీజ్ డేట్కి సంబంధించినపోస్టర్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విడుదల చేయించింది యూనిట్. మహాశివుడికి వీర భక్తుడైన కన్నప్ప కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ద్వారా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా, తనయుడు అవ్రామ్ భక్త వెండితెరపై ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగానే కాదు.. అమెరికాలోనూ విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మంచు విష్ణు అండ్ టీమ్. పీరియాడికల్ నేపథ్యంలో... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.ఈ సినిమాను తొలుత ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఆ తేదీకి విడుదల కాలేదు. ఆ తర్వాత మే 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ డేట్ కూడా జూలై 4కి వాయిదా పడింది. ‘‘కింగ్డమ్’ని ముందుగా అనుకున్నట్టు మే 30న రిలీజ్ చేయాలని ఎంతగానో ప్రయత్నించాం. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు (ఆపరేషన్ సిందూర్) జరిగాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్స్ స, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, వాయిదా నిర్ణయం తీసుకున్నాం. సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ ఏ టైటిల్ పెట్టాలి? అన్నది తొలి భాగం ఫలితం తర్వాత నిర్ణయిస్తాం’’ అని ఆయన తెలిపారు. అక్కా తమ్ముడి అనుబంధం నితిన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కథానాయికలుగా నటించారు. నటి లయ కీలక పాత్ర చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే ఆ తేదీకి వాయిదా పడిన ఈ సినిమాని జూలై 4న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రయూనిట్. అక్క– తమ్ముడు అనుబంధాలతో అల్లుకున్న కథతో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. ఇందులో క్రీడా నేపథ్య అంశాలు కూడా ఉంటాయని, ఆర్చరీ ఆటగాడిగా నితిన్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సలో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ వాయిదా పడి, చివరికి జూలై 4కి రాబోతోంది. అదే తేదీకి విడుదలకు సిద్ధమైన నితిన్ ‘తమ్ముడు’ మరోసారి వాయిదా పడుతుందా? లేక విడుదలవుతుందా? అనేది వేచి చూడాల్సిందే. పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు జరిగాయి.. మరికొన్ని జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
రాజా సాబ్ టీజర్ డేట్ ఫిక్స్!
-
ఏ క్షణమైనా 'రాజాసాబ్' టీజర్ రిలీజ్!
-
నోరు జారిన కుర్రాడు.. నిధి అగర్వాల్ మాత్రం
సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్. అందుకే పలువురు నెటిజన్లు.. హీరోహీరోయిన్లపై అప్పుడప్పుడు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని సదరు నటీనటులు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం కాస్త గట్టిగానే ఇచ్చేస్తుంటారు. హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఇప్పుడు ఓ కుర్రాడికి అలానే కౌంటర్ ఇచ్చింది.ఏం జరిగిందంటే?నిధి అగర్వాల్ గురించి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దీనికి స్పందించిన ఓ నెటిజన్ ఈమెని శ్రీలల(Sreeleela) పోలుస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. 2021లో వచ్చిన శ్రీలీల 20కి పైగా సినిమాలు చేసింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి ఏం చేసింది? ఎన్ని మూవీస్ చేసింది? అని అన్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)ఈ ట్వీట్ పై స్వయంగా స్పందించిన నిధి అగర్వాల్.. సదరు నెటిజన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. 'ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది. తమిళంలో మూడు మూవీస్ చేసింది. హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie)కి సంతకం చేసింది. మంచి స్క్రిప్ట్ లు అనుకున్న వాటికే సంతకం చేస్తున్నా. అందుకు టైమ్ తీసుకుంటున్నాను. కొన్నిసార్లు నా నిర్ణయం తప్పయి ఉండొచ్చు. కానీ మంచి సినిమాలు చేయాలనేది నా అభిప్రాయం. వరసగా సినిమాలు చేయాలనే తొందరేం లేదు. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. కాబట్టి బ్రదర్.. నా గురించి నువ్వేం బాధపడకు' అని చెప్పుకొచ్చింది.నిధి అగర్వాల్ బాగానే కౌంటర్ చేసింది. కానీ సదరు నెటిజన్ అన్నదాంట్లోనూ కాస్త నిజముంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తప్పితే నిధి అగర్వాల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీ లేదు. పవన్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్(The Raja Saab Movie) చేసింది గానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అటు శ్రీలీల కూడా సినిమాలైతే చేస్తోంది గానీ దాదాపు ఫ్లాప్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
RAJASAAB పరిస్థితి ఏంటి..?
-
కన్ ఫ్యూజన్ లో ది రాజా సాబ్ ...!
-
నిధి అగర్వాల్.. ఓ వింత కండీషన్
హీరోయిన్లు చాలామంది సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ఛాన్సుల్ని అందుకునే విషయంలో పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ నిధి అగర్వాల్ కి మాత్రం తొలి మూవీ చేసేటప్పుడు వింతైన కండీషన్ పెట్టారట. అది చూసి ఈమె షాకైందట.(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)''మున్నా మైకేల్' మూవీతో నా కెరీర్ మొదలైంది. ఇదో బాలీవుడ్ మూవీ. టైగర్ ష్రాఫ్ హీరో. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత నాతో ఓ కాంట్రాక్ట్ పై సంతకం చేయించారు. అందులో నో డేటింగ్ అనే కండీషన్ కూడా ఉంది. అంటే సినిమా పూర్తయ్యేవరకు హీరోతో నేను డేటింగ్ చేయకూడదనమాట.కాంట్రాక్ట్ మీద సంతకం పెడుతున్నప్పుడు ఇవన్నీ గమనించలే గానీ తర్వాత వీటి గురించి తెలిసి ఆశ్చర్యపోయాను' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం తెలుగులో హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు చేస్తున్న నిధి.. ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడింది. 'మంచి, చెడు చెప్పడానికి పద్ధతి ఉంది. హద్దులు దాటి అసభ్యంగా మాట్లాడటం మాత్రం సరికాదు. నేను అస్సలు ఇలాంటివి పట్టించుకోను' అని నిధి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
గేమ్ ఛేంజర్ దెబ్బకు ప్రభాస్ రాజసాబ్ కి టెన్షన్
-
ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్ని పక్కనపడేసిన తమన్
ప్రస్తుతం ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్(Thaman) ఒకడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా తేడా లేకుండా దాదాపు చాలా భాషల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతడు ప్రభాస్ 'రాజాసాబ్' (The Rajasaab Movie) కోసం కూడా పనిచేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ కోసం చేసిన సాంగ్స్ అన్నీ పక్కనపడేశానని, కొత్తగా మళ్లీ చేస్తున్నానని అన్నాడు. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి సింగర్ మంగ్లీ.. ఫొటోలు వైరల్)ఓ ఇంగ్లీష్ ఎంటర్ టైన్ మెంట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తమన్ చాలా విషయాలు మాట్లాడాడు. కానీ 'రాజాసాబ్' పాటల్ని డస్ట్ బిన్ లో వేశానని చెప్పడం చర్చనీయాంశమైంది. 'రాజాసాబ్'కి పాటలు కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టా. షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సర్.. చాలా కాలం తర్వాత కమర్షియల్ పాటలతో వస్తున్నారు''ఈ సినిమాలో ఇంట్రో, మెలోడీ, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ చేయబోతున్నారు. రాబోయే ఐదు నెలలో సాంగ్స్ షూటింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాట చేస్తున్నాం. నిజానికి 'రాజాసాబ్' కోసం చాలా పాటలు చేశారు. కానీ నాకెందుకో మార్చేద్దాం అనిపించింది. ఎప్పుడో ట్యూన్స్ చేసిచ్చా. వాళ్లు షూటింగ్ మొదలుపెట్టలేదు. దీంతో ఇవన్నీ డస్ట్ బిన్ లో పడేశా. కొత్తగా సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా. డైరెక్టర్ కి కూడా ఇదంతా చెప్పా. ఇవి ఇప్పుడు వర్కౌట్ కావు. నేను నా మ్యూజిక్ ని చీట్ చేయలేను. ఇలా ఉండటమే కరెక్ట్' అని తమన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
కష్టాల 'రాజాసాబ్'.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) చేస్తున్న వాటిలో కాస్త తక్కువ బజ్ ఉన్న సినిమా అంటే 'రాజాసాబ్'.(The Rajasaab Movie) ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు తొలుత డార్లింగ్ ఫ్యాన్స్ వద్దన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. అలానే ఈ ఏడాది రాబోయే పండగల కోసం కొత్త మూవీస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదంటే వచ్చే ఏడాది పడుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
రాజాసాబ్ సంక్రాంతి స్పెషల్ పోస్టర్.. లుక్ అదిరింది!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "రాజా సాబ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వాల్యూస్తో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తోంది. "రాజా సాబ్" సినిమా అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం "రాజా సాబ్" చిత్రీకరణ తుది దశలో ఉంది.దిల్ రూబా పండగ పోస్టర్యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "దిల్ రూబా" సినిమా నుంచి విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్గా "దిల్ రూబా" ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.చదవండి: టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత -
రాజా సాబ్ వాయిదా?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఈ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘రాజా సాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా, చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావడం లేదని, కొత్త విడుదల తేదీపై త్వరలోనే చిత్రయూనిట్ ఓ ప్రకటన చేయనుందని తెలిసింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సంక్రాంతి సందర్భంగా ‘రాజా సాబ్’ సినిమాకు చెందిన ఓ అప్డేట్ని ఇవ్వడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందట. బహుశా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రావొచ్చని సమాచారం. -
ప్రభాస్ కి భయపడని చిన్న హీరోలు
-
రాజాసాబ్ కు పోటీగా వెళ్తున్న టిల్లు..?
-
ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన ‘రాజా సాబ్’ బ్యూటీ (ఫోటోలు)