resumption
-
మళ్లీ మానస సరోవర యాత్ర
న్యూఢిల్లీ: భారత్–చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరిన్ని కీలక అడుగులు పడ్డాయి. ఈ వేసవి నుంచి కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ వెళ్లిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి సన్ వెయ్డాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు జరిగాయి. ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ నదుల విషయమై పరస్పరం మరింతగా సహకరించుకునేందుకు, జల వనరులకు సంబంధిత డేటాను పూర్తిస్థాయిలో ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయి. భారత్–చైనా నిపుణుల స్థాయి బృందం దీనిపై వీలైనంత త్వరగా చర్చలు జరపనుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ శాఖ మంత్రి లియూ జియాంచవోలతోనూ మిస్రీ సమావేశ మయ్యారు. పలు కీలకాంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘‘ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఉన్నతస్థాయిలో చర్చలు జరపాలని గత అక్టోబర్లో కజాన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీలో నిర్ణయించడం తెలిసిందే. తాజా చర్చలు అందులో భాగమే’’ అని వివరించింది. ‘‘ఇరుదేశాల దౌత్య బంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా విశ్వాస కల్పనకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. ఆర్థిక, వర్తక రంగాల్లో ఇరుదేశాల్లో నెలకొన్న పరస్పర ఆందోళనలు, సందేహాలు కూడా సన్–మిస్రీ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. దీర్ఘకాలిక ప్రాతిపదికన విధాన పారదర్శకత, విశ్వసనీయతే గీటురాళ్లుగా ముందుకు సాగాలని అంగీకారం కుదిరింది’’ అని వెల్లడించింది. మానస సరోవర యాత్ర, చైనాకు నేరుగా విమాన సర్వీసులు 2020లో రద్దయ్యాయి. -
అక్కడ విమాన సర్వీసులు వాయిదా?
చెన్నై: తమిళనాడులో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. విదేశాల నుంచి విమానాల్లో, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చిన వారిని పరీక్షించగా 66 కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ విషయం వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ కేసుల్లో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం తమిళనాడులో ఇప్పటివరకు 14,753 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 98 మరణాలు సంభవించాయి. కోవిడ్-19 బారిన పడిన వారిలో 7,128 మంది కోలుకున్నారు. (కరోనా: కర్ణాటక కీలక నిర్ణయం) -
త్వరలో.. నేషనల్ హెరాల్డ్ పునఃప్రారంభం
న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’, ‘నవజీవన్’ పత్రికలు మళ్లీ పాఠకుల ముందుకు రానున్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఈ పత్రికలను మళ్లీ ప్రచురించనున్నట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్సీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. సీనియర్ జర్నలిస్టు నీలభ్ మిశ్రాను ఎడిటర్ ఇన్ చీఫ్గా నియమించారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో పత్రికలను ప్రచురించనున్నారు. ఆర్థిక కారణాల వల్ల ఈ పత్రికల ప్రచురణను గతంలో నిలిపివేశారు. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ను 1937లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. తాజాగా నీలభ్మిశ్రా సారథ్యంలో ఈ పత్రికలు, డిజిటల్ ఎడిషన్సతో సహా ప్రజల ముందుకు రానున్నాయి. మిశ్రా తన సంపాదక బృందాన్ని నియమించుకుని త్వరలోనే పని ప్రారంభిస్తారని, ఆ తర్వాత ఉర్దూ పత్రిక ఖ్వామీ ఆవాజ్ కూడా వెలువడుతుందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.