row
-
ఇందిరాగాంధీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీలో ఇందిరాగాంధీపై మంత్రి అవినాష్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బడ్జెట్ సెషన్ సందర్భంగా శుక్రవారం అవినాష్ మాట్లాడుతూ మేం మహిళల కోసం ‘లక్పతి’ దీదీ స్కీమ్ అమలు చేస్తుంటే గతంలో మీరు మీ హాయంలో మీ ‘దాదీ’ పేరుతో స్కీములు అమలు చేశారని ఇందిరాగాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇందిరాగాంధీపై మంత్రి కావాలని చేసిన ఈ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.అయితే స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని ఇందుకు ఒప్పుకోలేదు.దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ జరగకుండా అడ్డుకున్నారు.సభ నడవకుండా అడ్డుకుంటుండంతో ఆరుగురు కాంగగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.పార్లమెంట్లో వ్యవహరించినట్లుగానే బీజేపీ రాజస్థాన్ అసెంబ్లీలోనూ వ్యవహరిస్తోందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. -
‘అందరినీ పంపించాక ఎవరిని విచారిస్తారు?’
కృష్ణా, సాక్షి: రహస్య కెమెరా ఉదంతంతో వార్తల్లోకెక్కిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించగా.. ఇవాళ మరోసారి ఆందోళన చేపడతారేమోననే అనుమానంతో కాలేజ్ యాజమాన్యం భయపడింది. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు.. హాస్టల్ నుంచి విద్యార్థులను పంపించేస్తోంది.ఈ క్రమంలో విద్యార్థులు ఎదురుతిరగారు. అందరినీ బయటకు పపించాక ఎవరిని విచారణ చేపడతారని యాజమాన్యాన్ని నిలదీశారు. తాము హాస్టల్లోనే ఉంటామని భీష్మించుకుని కూర్చుకున్నారు. మరోవైపు.. విషయం తెలిసి విద్యార్థి సంఘాలు కాలేజీ బయట ఆందోళనకు దిగాయి. విద్యార్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అడ్డుకుని నిరసన చేపట్టాయి. వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారని నిలదీశారు.ఇదీ చదవండి: రాక్షస రాజ్యంలో 'గుడ్ల' గూబలు! -
సీఎం స్టాలిన్ కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు. 'కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే.' అని యువజన, క్రీడా అభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. 'సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజెపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు చాలాకాలంగా మిత్ర పక్షంగా ఉంటోంది డీఎంకే. ముంబయి మీటింగ్లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా..? ' అని ప్రశ్నించారు. Udhayanidhi Stalin’s hate speech with Hindi subtitles. Rahul Gandhi speaks of ‘मोहब्बत की दुकान’ but Congress ally DMK’s scion talks about eradicating Sanatana Dharma. Congress’s silence is support for this genocidal call… I.N.D.I Alliance, true to its name, if given an… https://t.co/hfTVBBxHQ5 pic.twitter.com/ymMY04f983 — Amit Malviya (@amitmalviya) September 2, 2023 ఉదయనిధి స్టాలిన్ తన మాటలను సమర్ధించుకున్నారు. మారణహోమానికి పిలుపునివ్వలేదని అన్నారు. బలహాన వర్గాల పక్షాన తాను మాట్లాడినట్లు చెప్పారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన మాట్లాడినట్లు పేర్కొన్నారు. I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality. I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb — Udhay (@Udhaystalin) September 2, 2023 'ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాషాయ బెదిరింపులకు మేము భయపడము. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతాము.' అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW — Udhay (@Udhaystalin) September 2, 2023 ఇదీ చదవండి: ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ -
'మా సార్కు అమ్మాయిలు తక్కువా..?' రాహుల్ ఫ్లయింగ్ కిస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే..
ఢిల్లీ: పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బిహార్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ ఈ అంశంపై మాట్లాడటం రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే రాహుల్కు అమ్మాయిల కొరత ఏం లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ మాట్లాడటంపై బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో సభ నుంచి వాకౌట్ చేస్తున్న క్రమంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ సమయంలో పార్లమెంట్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. అయితే.. రాహుల్ చర్యను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. తమను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. మహిళా ఎంపీలను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తూ స్పీకర్కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ చర్య మహిళలపై కాంగ్రెస్ ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై బిహార్కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు నీతు సింగ్ తాజాగా స్పందించారు. If Rahul Gandhi wants to give flying kiss he has many women available He won’t give it to a 50 year old budhiya Congress MLA from Bihar : Neetu Singh Anti women Congress can even defend Rahul’s misdemeanours inside the House pic.twitter.com/oXRz67ZqlX — Shehzad Jai Hind (@Shehzad_Ind) August 10, 2023 నీతు సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే.. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలకు ఇస్తాడు.. కానీ ఆ 50 ఏళ్ల మహిళకు ఎందుకు ఇస్తాడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి మాట్లాడారు. రాహుల్పై ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి అన్ని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. యాంటీ మహిళా కాంగ్రెస్ రాహల్ చర్యను సమర్థిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: బ్రిటీష్ కాలం చట్టాలకు ప్రక్షాళన.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు -
కొట్టుకుని కేసులు పెట్టుకున్న సీఐలు
పీఎం పాలెం (భీమిలి): ఏదైనా గొడవ జరిగితే సామాన్యులు వెళ్లి పోలీసులను ఆశ్రయిస్తారు. అటువంటిది.. ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు గొడవ పడటమేగాక కొట్టుకున్నారు. ఇద్దరూ గాయపడ్డారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. జీవీఎంసీ ఆరో వార్డులోని పీఎంపాలెం ఆఖరు బస్టాప్ సమీపంలోగల షిప్యార్డు కాలనీలోని శ్రీనిలయం అపార్టుమెంట్లో ఏసీబీలో సీఐగా పనిచేస్తున్న ప్రేమ్కుమార్, వీఆర్లో ఉన్న సీఐ రాజులనాయుడు కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరిద్దరు సెల్లార్లోని కారు పార్కింగ్ విషయంలో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సీఐలతో పాటు వారి కుటుంబసభ్యుల మధ్య మరోమారు వివాదం తలెత్తింది. కొట్లాటకు దారితీసింది. సీఐలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. సీఐ ప్రేమ్కుమార్ 100కు డయల్ చేసి సమాచారం అందించడంతో పీఎం పాలెం పోలీసులు అక్కడకు వెళ్లి ఘర్షణపై వివరాలు సేకరించారు. మంగళవారం సీఐలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (క్లిక్: ఔను.. ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
జ్ఞానవాపి వివాదం: ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్-మందిర్ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మసీదులో శివలింగం గురించి వెతకడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆయన. గురువారం సాయంత్రం నాగ్పూర్(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోహన్ భగవత్ ప్రసంగిస్తూ.. వివాదాన్ని ఎందుకు పెంచాలి? సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి ముగింపు పలకవచ్చు కదా! ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాం. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా. కానీ, ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?.. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం ఎంత వరకు సమంజసం? అని హిందూ సంఘాలను ప్రశ్నించారాయన. జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదు. ఇప్పుడున్న హిందువులో, ముస్లింలో దానిని సృష్టించింది కాదు. ఆ సమయానికి అది అలా జరిగిపోయింది. బయటి దేశాల నుంచి వచ్చిన కొందరు.. దేవస్థానాలను నాశనం చేశారు. అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ముస్లింలలో కొందరి పూర్వీకులు కూడా హిందువులే!.సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. అందుకు ఒక మార్గం కనిపెట్టాలి. కుదరనప్పుడు కోర్టులకు చేరాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా అంగీకరించి తీరాలి. ఆరెస్సెస్.. ఏ మత ప్రార్థనా విధానాలకో వ్యతిరేకం కాదు. అందరినీ అంగీకరిస్తుంది. అందరినీ పవిత్రంగానే భావిస్తుంది. మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలి అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి-శృంగేరీ కాంప్లెక్స్లో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఆధారంగానే ప్రత్యేక కోర్టు కమిటీతో వీడియో సర్వే చేయించింది వారణాసి న్యాయస్థానం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్నూ వారణాసి కోర్టుకే బదిలీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ లోపు వీడియో సర్వే రిపోర్టు వారణాసి జిల్లా న్యాయస్థానాకి చేరింది. కోర్టు ‘జ్ఞానవాపి’ పిటిషన్పై వాదనలు జులై 4న విననుంది. జ్ఞానవాపి వ్యవహారం కోర్టులో ఉండగానే.. తాజ్మహల్లో మూసిన గదుల్లో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయంటూ అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఆపై ఢిల్లీ కోర్టులో కుతుమ్ మినార్ కాంప్లెక్స్లో హిందూ, జైన్ల పూజలకు అనుమతించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై జూన్ 9న కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఆర్కియాలజీ విభాగం మాత్రం.. ప్రపంచ వారసత్వ సంపద అయిన కుతుబ్ మినార్ వద్ద ఏ మతం ప్రార్థనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఓ మసీదు పునర్నిర్మాణ పనుల్లో హిందూ ఆలయ ఆనవాలు కనిపించాయంటూ.. ఆ పనుల్ని నిలిపివేయించాయి హిందూ సంఘాలు. చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యలు -
మసీదుల్లో మందిరాలను పునరుద్ధరించి తీరతాం!: ఎమ్మెల్యే ఈశ్వరప్ప
బెంగళూరు: మసీదుల్లో మందిరాల ఉనికిపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతున్న వేళ.. బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. 36,000 ఆలయాలను ధ్వంసం చేసి.. మసీదులు కట్టారని, వాటన్నింటిని పునరుద్ధరించి తీరతామని శపథం చేస్తున్నాడాయన. కర్ణాటక డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప పై కామెంట్లు చేశాడు. మందిర్-మసీద్ వ్యవహారంపై మీడియా సాక్షిగా శుక్రవారం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆలయాలను ధ్వంసం చేసి.. వాటిపై మసీదులు కట్టారు. వేరే ఎక్కడైనా మసీదులు కట్టి.. నమాజ్లు చేసుకోండి. అంతేగానీ, ఆలయాల మీద మసీదులను అనుమతించేదే లేదు. ముప్పై ఆరువేల ఆలయాలను హిందువులు తిరిగి అదీ లీగల్గా చేజిక్కించుకోవడం ఖాయం అని పేర్కొన్నారు ఆయన. జ్ఞానవాపి మసీదు వ్యవహారం కోర్టులో ఉన్న వేళ.. కర్ణాటకలోనూ అదే తరహా వ్యవహారం వెలుగుచూసింది. మంగళూరు దగ్గర ఓ పాత మసీదులో రిన్నోవేషన్ పనులు జరుగుతుండగా.. హిందు ఆలయం తరహా నమునాలు వెలుగు చూశాయి. దీంతో.. వీహెచ్పీ నేతలు పనులు ఆపించాలంటూ జిల్లా అధికారులను కోరారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈశ్వరప్ప గుడులను పునరుద్ధరించి తీరతామని వ్యాఖ్యానించడం విశేషం. ముస్లింలందరూ చెడ్డవాళ్లు కారని, అలాగని ఆలయాలపై మసీదులు నిర్మించి నమాజ్లు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఒక మసీదు ఉందంటే.. అది కచ్చితంగా శివుడి ఆలయమే అయ్యి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈశ్వరప్ప కామెంట్లపై కాంగ్రెస్ మండిపడుతోంది. న్యాయస్థానాల్లో వ్యవహారం ఉండగా.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పిస్తోంది. K S Eshwarappa: ಮಸೀದಿ ಇದ್ದಲ್ಲಿ ವಿಶ್ವನಾಥ ದೇವಾಲಯ ಆಗಿಯೇ ಆಗುತ್ತೆ ಎಂದ ಈಶ್ವರಪ್ಪ ||Bjp|| ||Karnataka Tak||@BJP4Karnataka #karnatakanews #UpdateNews #Eshwarappa #latestnews #GyanvapiMosque Watch:https://t.co/4IxRcaVlTY pic.twitter.com/gltJOr0alm — Karnataka Tak (@karnataka_tak) May 27, 2022 K S Eshwarappa: ‘ಎಲ್ಲಾ ಮುಸ್ಲೀಮರು ಕೆಟ್ಟವರು ಅನ್ನುವುದಿಲ್ಲ’ ||Bjp|| ||Karnataka Tak||@BJP4Karnataka #Muslim #Eshwarappa #KarnatakaTak #latestnews Watch:https://t.co/Wm05PslukR pic.twitter.com/LjkX7B3yQ5 — Karnataka Tak (@karnataka_tak) May 27, 2022 -
హిజాబ్ వివాదం విషపూరిత కుట్ర: శివకుమార్
మంగళూరు: కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై జరుగుతున్న వివాదం యువత మనసులను విషపూరితం చేసే కుట్రలో భాగమని కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. మంగళూరులోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వస్త్రధారణపై జరుగుతున్న వివాదాలు మన దేశాన్ని అవమానం పాల్జేచేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం, పెట్రో ధరల పెంపు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా హిజాబ్ ధరించడం వంటి సున్నితమైన విషయాలను స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు వాడుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులు, ప్రజల్లో అశాంతి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాషాయ పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే పంథాను అనుసరిస్తోందని గుర్తు చేశారు. రాజ్యాంగంపై అందరికీ విశ్వాసం ఉందని, హిజాబ్ వివాదం త్వరలోనే సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక కోస్తా ప్రాంతం తనదైన చరిత్ర, సంస్కృతి, మానవ వనరులను కలిగి ఉందని.. ఎడ్యుకేషన్ హబ్గా పేరుగాంచిందని శివకుమార్ తెలిపారు. హిజాబ్ వివాదానికి ఆజ్యం పోసి యువత మనసుల్లో విషం నింపే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ) -
మన వాట్సాప్ చాట్ సురక్షితమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు మాదక ద్రవ్యాల కేసుగా మారడం, ఇందులో వాట్సాప్ చాట్ కీలకంగా మారిన నేపథ్యంలో సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ వాట్సాప్ స్పందించింది. ఆపరేటింగ్ సిస్టమ్ తయారీదారులు అందించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని, దీంతో యూజర్ల భదత్రకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది. వాట్సాప్ మెసేజ్ లు పూర్తిగా సురక్షితమని, ధర్డ్ పార్టీలు వాటిని యాక్సెస్ చేయలేవంటూ యూజర్లకు భరోసా ఇస్తోంది. ఈ మేరకు వాట్సాప్ ఒక ప్రకటన విడుదల చేసింది. (డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) వాట్సాప్ సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ అందిస్తున్నామని తద్వారా మీరు, మీరు కమ్యూనికేట్ చేస్తున్నవ్యక్తి మాత్రమే ఆయా సందేశాలను చదవగలరు. తప్ప, మధ్యలో ఎవరూ దీన్ని యాక్సెస్ చేయలేరని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ను మాత్రమే వాట్సాప్లో ఉపయోగిస్తారు కనుక మిగతా సమాచారం లీక్ అయ్యే అవకాశం లేదని వాట్సాప్ ప్రతినిది ఒకరు తెలిపారు. అలాగే ఫోన్ డాటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా బలమైన పాస్వర్డ్లు లేదా బయోమెట్రిక్ ఐడీలు వంటి అన్ని భద్రతా ఫీచర్లను సద్వినియోగం చేసుకోవాలని యూజర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తోపాటు, టాలెంట్ ఏజెంట్ జయ సాహా సెల్ఫోన్ నుంచి సేకరించిన 2017 నాటి వాట్సాప్ చాట్ వ్యవహాం హాట్ టాపిక్ గా మారింది. ఈ చాట్ల ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్ హీరోయిన్స్ సారా ఆలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి నటులకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఈ ప్రకటన జారీ చేసింది. -
ఓట్ల కోసమే రాహుల్ హిందుత్వ అవతారం
సాక్షి, అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లోని ప్రధాన దేవాలయాలను హిందూ ఓట్లకోసమే రాహుల్ సందర్శిస్తున్నారని ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆలయాలను రాహుల్ గాంధీ సందర్శించడం వెనుక ఓట్లు.. సీట్లే ప్రధాన కారణమని ఆమె అన్నారు. ‘భగవంతుడి అద్భుతాలు చూడాలనుకునేవారికి.. ఇదే పెద్ద నిదర్శనం’ రాహుల్ గాంధీ సోమనాథ్ ఆలయాన్ని దర్శించడంపై ఇరానీ వ్యంగ్యంగా స్పందించారు. అంతేకాక రాహుల్ గాంధీ జంధ్యెం ధరించిన ఫొటోపైనా ఆమె వ్యంగ్య బాణాలు సంధించారు. హిందువుగా జీవించేవాడు.. ఆవును గౌరవిస్తాడు.. ఆవుని పూజిస్తాడు..అంతేకానీ గోహత్యలను సమర్థించరంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిచి ఇరానీ వ్యాఖ్యానించారు. -
వివాదంలో ఓలా, ఫౌండర్స్పై కేసు
బెంగళూరు: ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ఓలా వివాదలో ఇరుక్కుంది. కాపీరైట్ చట్టం ఉల్లంఘించిన ఆరోపణలతో బెంగళూరు పోలీసులు ఓలా ఫౌండర్స్పై కేసున మోదు చేశారు. ఓలా ప్లే ప్లాట్ఫారమ్ ద్వారా చలనచిత్ర పాటలను చోరీ చేసి స్ట్రీమింగ్ చేసినందుకు బెంగళూరుకు చెందిన రికార్డింగ్ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఓలా ప్లే ప్లాట్ఫాం ద్వారా పైరేటెడ్ సినిమా పాటలను వాడుతున్నారని మ్యూజిక్ సంస్థ లహరి రికార్డింగ్ కంపెనీ లిమిటెడ్. ఓలా మాతృ సంస్థ ఎఎన్ఐ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్పై ఫిర్యాదు చేసింది. తాము ఆడియో హక్కులను కొనుగోలు చేసిన కన్నడ , తెలుగు సినిమాల నుండి పాటలను డౌన్లోడ్ చేసుకుంటున్నారనీ ఆరోపించింది. కర్ణాటక, ఢిల్లీ, కోల్కతా తమిళనాడులో వీటిని అక్రమంగా వినియోగిస్తున్నారని మ్యూజిక్ కంపెనీ ఆరోపించింది. దీంతో పోలీసులు ఓలా కార్యాలయంపై దాడి చేసి, పాటలను డౌన్లోడ్ చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎఎన్ఐ టెక్నాలజీస్ లిమిటెడ్, ఓలా ఫౌండర్స్ భవిష్ అగర్వాల్ , అంకిత్ భతీపై కేసు నమోదు చేశారు. -
అప్పీలుకు బామ్మగారి 'అల్లికల' పాట్లు!
మరణ శిక్షనుంచి బయట పడేందుకు ఓ బామ్మగారు పడరాని పాట్లు పడుతోంది. జైల్లో శిక్ష అనుభవిస్తూ తన నైపుణ్యంతో శిక్షను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. హాబీగా ఉన్న అల్లికలను అమ్మకానికి పెట్టి, తోటి ఖైదీలకు నేర్పుతూ శిక్ష నుంచి బయటపడేందుకు ఆ బ్రిటిష్ బామ్మ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ఫేస్ బుక్, ట్విట్లర్ వంటి సామాజిక మాధ్యమాలను కూడ వినియోగించుకుంటోంది. ఇండోనేషియాలోని బాలీకి కొకైన్ అక్రమ రవాణాకు పాల్పడిందన్న కేసులో 2013 లో చెల్తెన్ హామ్ కి చెందిన 59 ఏళ్ళ లిండ్సీ శాండిఫోర్డ్ కు మరణ శిక్ష విధించారు. అయితే ఆ బామ్మ చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తోందని, అది తగ్గించేందుకు అంతా సహకరించాలంటూ ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలోనూ ఆమె పరిస్థితిని వివరిస్తూ ప్రచారం జోరందుకుంది. లిండ్సీ శిక్షను తగ్గించుకోవాలంటే అప్పీల్ చేసుకునేందుకు వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంది. అందుకు తనకు చేతనైన స్వెట్టర్లు, షాల్స్, బొమ్మలు మొదలైన వివిధ రకాల ఊలు అల్లికలను అమ్మకానికి పెట్టింది. జైల్లోని మరో ఇరవైమంది మహిళలకు అల్లికలు కుట్లు నేర్పుతూ.. షాల్స్, స్వెట్టర్లు, ఉలెన్ టెడ్డీబేర్లు వంటి వాటిని ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా ఆస్ట్రేలియాలోని చర్చి గ్రూపులకు అమ్మకాలు నిర్వహిస్తోంది. వచ్చిన డబ్బుతో అప్పీల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటిదాకా జరిపిన అమ్మకాలతో ఏడువేల యూరోలు సంపాదించింది. తాను శిక్ష నుంచి బయట పడాలంటే న్యాయవాదులకు మరో 15 వేల యూరోలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఆ ఫీజు చెల్లించలేకపోతే ఆమెకు ఈ సంవత్సరంలో మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇండోనేషియా ప్రస్తుతం ఆమె మరణదండన పై తాత్కాలిక విరామాన్ని ఇచ్చింది. బామ్మగారి పరిస్థిపై ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బ్రిటిష్ యాంటిక్ డీలర్ జూలియన్ పాండర్ ఆమెతో బలవంతంగా ఈ నేరం చేయించాడని బ్రిటన్ ఇప్పటికే చెప్పిందని.. కెరోబోకన్ జైల్లో ఉన్న శాండిఫోర్డ్ చెప్తోంది. అల్లికలు అంటే తనకు పిచ్చి అని, ఖాళీ సమయాల్లో అల్లికలతోనే కాలం గడిపే తనను... తన నైపుణ్యమే శిక్షనుంచి రక్షిస్తుందని శాండిఫోర్డ్ నమ్ముతోంది. అయితే తన అవసరం కోసం కాక జైల్లోని ఇతర మహిళలు సైతం అల్లికలు నేర్చుకోవడం వల్ల.. నైపుణ్యం పెరగడమే కాక, సంపాదించిన డబ్బుతో జైలునుంచి బయట పడగల్గుతారని ఆమె చెబుతోంది. -
సల్మాన్ ట్వీట్లపై మండిపడ్డ తండ్రి