rtc bus hulchul
-
మహబూబ్నగర్ బస్టాండ్లో మరో దారుణం
మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో మరో దారుణం వెలుగుచూసింది. బస్సు కోసం నిరీక్షిస్తున్న వ్యక్తి పైకి బస్సు దూసుకెళ్లి.. అతను మృతిచెందిన ఘటన మరవకముందే.. శనివారం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రోజు మహబూబ్నగర్ బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తున్న ఓ ప్రయాణికుడిపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
బస్టాండ్లో ఆర్టీసీ బస్సు బీభత్సం
మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఆర్టీసీబస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ఫాం వద్ద ఆగాల్సిన బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.