Ruins
-
క్షణ క్షణం.. భయం భయం!
అంబర్పేట: అంబర్పేట తహశీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. పాత భవనంలో తహశీల్దార్ కార్యకలాపాలు నిర్వహించడానికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రెండు దశాబ్ధాల క్రితం నిర్మించిన భవనంలో ఇప్పటికీ తహశీల్దార్ కార్యాలయం కొనసాగుతుండటంతో అటు సిబ్బంది, ఇటు పౌరులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా తహశీల్దార్ కార్యాలయం మాత్రం మారడం లేదు. శిథిల భవనంలో సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నిత్యం వందలాది పౌరులకు, వివిధ సేవలు అందించే కార్యాలయం సౌకర్యవంతంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం కార్యాలయం ప్రారంభం కాగానే వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురవుతున్నారు. కార్యాలయ ఆవరణలో రేకుల షెడ్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, శిథిల భవనంలో తహశీల్దార్తో పాటు డిప్యూటీ తహశీల్దార్ విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సైతం ఇదేం కార్యాలయం అన్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా తహశీల్దార్ కార్యాలయాన్ని పునర్నిర్మించాలని పలువురు కోరుతున్నారు. అమలుకు నోచుకోని హామీలు తహశీల్దార్ కార్యాలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో హామీలు, ప్రకటనలు ఇచ్చారే తప్ప ఇప్పటివరకు అవి ఆచరణకు నోచుకోలేదు. నియోజక వర్గంతో పాటు మలక్పేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు ఈ మండల పరిధిలోకి వస్తాయి. నిత్యం ఆ దాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రభు త్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్, ఆసరా పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాలు ఈ కార్యాలయం నుంచే సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అమలు చేసే కీలకమైన తహశీల్దార్ కార్యాలయం అధ్వానంగా ఉండటంపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యాలయానికి వచ్చి పోతుంటారే తప్ప పునర్ నిర్మించేందుకు చొరవ తీసుకోకపోవడం గమనార్హం. అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలందిస్తున్నాం తహశీల్దార్ కార్యాలయం పునర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని ఎమ్మెల్యే సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే నిధులు విడుదల కాగానే మొదటి ప్రాధాన్యతలో భాగంగా కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఈవిషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం విధులు నిర్వహించేందుకు అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. – వేణుగోపాల్, అంబర్పేట తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోప్రమాదకరంగా ఎండిన చెట్టు -
గోల్కొండ ఖిల్లా.. ఇలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం తొలిరూపు గోల్కొండ.. భాగ్యనగరం అనగానే ముందుగా గుర్చొచ్చే చారిత్రక నిర్మాణం. కాకతీయులు పునాది వేయగా, కుతుబ్షాహీలు ఆక్రమించుకుని మరింత అభివృద్ధి చేశారు. ఆ తర్వాత అసఫ్జాహీలు ఏలారు. ఇన్ని రాజవంశాల చేతులు మారినా.. పదిలంగా నిలిచిన ఆ మహా కోటకు ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. చాలా ఏళ్లు కావడంతో స్వతహాగా ఏర్పడుతున్న పగుళ్లు క్రమంగా పెరిగి మూలాలనే పెకిలిస్తున్నాయి. వాటికి వేగంగా మరమ్మతులు జరగక క్రమంగా కోటకు బీటలు వేస్తున్నాయి. ఇంతటి ప్రమాదపు అంచుల్లో ఉన్న కోటకు ఇటీవలి భారీ వర్షాలు పెద్ద కుదుపునే ఇచ్చాయి. రికార్డు స్థాయి వర్షంతో ఒక్కసారిగా గోడలన్నీ కదిలిపోయి నిట్టనిలువునా కూలిపోయేందుకు సిద్ధమయ్యాయి. ఆ వర్షాల సమయంలోనే ఓ బురుజు, మరో మహా కోట ప్రాకారం, నవాబులు జలకాలాడిన కటోరా హౌస్ ప్రహరీ నేలమట్టమైంది. మరికొన్ని గోడలు కూడా కూలే ప్రమాదం ఉంది. వాన కాదు కదా బలంగా గాలివీచినా రాళ్లు జారిపడేలా మారింది ఈ మహా కట్టడం. కేంద్రం వెంటనే స్పందించకుంటే కోటలోని చాలాప్రాంతాలు మట్టిదిబ్బగా మారటం ఖాయం. రూ.6 నుంచి రూ.8 కోట్లు కావాలి ఇటీవలి వర్షాలకు కూలిన ప్రాంతాలను పునరుద్ధరించాలంటే రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అవసరం అవుతాయని సమాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు అంచనాలు రూపొందించి మరమ్మతు కోసం అనుమతి కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. దానికి సమ్మతిస్తూ సరిపడా నిధులు కేటాయిస్తేనే వీలైనంత తొందరలో పునరుద్ధరణ పూర్తవుతుంది. వచ్చే వానాకాలం లోపు ప్రధాన పనులు చేపట్టడంతో పాటు, బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతు చేయకపోతే ఏడాదిలో మరిన్ని గోడలు కూలడం ఖాయం. నిధులేవి.. ఇంతపెద్ద గోల్కొండ నిర్వహణకు కేంద్ర పురాతత్వ సర్వేక్షణ విభాగం కేటాయిస్తున్న నిధులు సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే. శతాబ్దాల నాటి నిర్మాణం కావటంతో అడుగడుగునా మరమ్మతు చేస్తే తప్ప నిర్మాణం పదిలంగా ఉండని పరిస్థితిలో ఈ నిధులు ఏ మూలకూ చాలట్లేదు. మరోవైపు ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా ఢిల్లీకి అనుమతి కోసం పంపి, అక్కడి నుంచి అనుమతి వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతోంది. ఇక మరమ్మతు పనుల్లో నైపుణ్యం ఉన్న పనివారు దొరక్కపోవటం జాప్యానికి మరో కారణం. నిత్యం నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు మరమ్మతులు వేగంగా చేపడితేనే ఈ కట్టడం పదిలంగా ఉంటుంది. చారిత్రక కట్టడాలను దత్తత ఇచ్చేందుకు గతేడాది కేంద్రం శ్రీకారం చుట్టింది. గోల్కొండ బాధ్యత జీఎమ్మార్కు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎవరైనా దాతలు ముందుకొస్తే దత్తత ఇచ్చేందుకు ఏఎస్ఐ సిద్ధంగా ఉన్నా ఎవరూ స్పందిచట్లేదు. (చదవండి: టూరిస్టుల గోల్కొండ) జారిపోయిన బండరాళ్లు.. గోల్కొండ కోట పైభాగంలో జగదాంబ దేవాలయం వైపు వెళ్లే దారిలో 50 అడుగుల ఎత్తయిన కోట గోడ నిలువునా జారిపోయింది. గతంలో ఇక్కడ కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి మరమ్మతు చేయటంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత కూడా పైభాగంలోనే పనులు చేపట్టారు. బలహీనంగా ఉన్న కింది భాగానికి పూర్తిస్థాయి మరమ్మతు జరగలేదు. దీంతో భారీ వర్షాలకు కిందిభాగం మరింత బలహీనపడి కూలింది. దీంతో పైనుంచి రాళ్లు జారి పడిపోయాయి. ఫలితంగా గోడ వెనుక ఉండే మట్టి పూర్తిగా జారిపోయింది. మజ్నూ బురుజు.. దాదాపు కనుమరుగు మజ్నూ బురుజు. నయాఖిల్లాలో ఉంది. ప్రస్తుతం దీని చుట్టూ గోల్ఫ్ కోర్సు అభివృద్ధి అయి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సరిగ్గా 20 రోజుల ముందు దీనికి పైభాగంలో భారీ పగులు ఏర్పడింది. బురుజు పైభాగంలో 18 అడుగుల పొడవైన ఫిరంగి ఉంది. ఇది ఔరంగజేబు సైన్యం ఏర్పాటు చేసింది. దాని వెనుకవైపు పిట్టగోడ తరహాలో ఓ గోడ అప్పట్లోనే కట్టారు. ఆ గోడ నుంచి పగులు మొదలైంది. భారీ వర్షాల సమయంలో ఆ పగులు నుంచి నీరు లోపలికి చేరటంతో మట్టి జారి పైనుంచి దిగువ వరకు సగం బురుజు కూలిపోయింది. సగం బురుజు కూలగా, మిగతా సగం కూడా బలహీనపడింది. దానిపై టన్నుల బరువుండే ఫిరంగి ఉంది. ప్రస్తుతం అది కొంత భాగం గాలిలో వేళ్లాడుతోంది. క్రేన్తో దాన్ని పదిలంగా తీసి పనులు చేపట్టాలి. (చదవండి: గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?) ఇలా అయితే కష్టమే.. జగదాంబ దేవాలయానికి మరోవైపు వెళ్లే మార్గం. ఆ పక్కన కూలిన గోడ లాగానే ఇక్కడ కూడా ప్రధాన కట్టడానికి పైనుంచి దిగువ వరకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దీనికి అత్యవసరంగా శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు అవసరం. లేకుంటే, సాధారణ వర్షాలకు కూడా అది కూలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల కురిసిన స్థాయి భారీ వర్షం భవిష్యత్తులో కురిస్తే ఈ గోడ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణంలో లోపం? కుతుబ్షాహీ నవాబుల కుటుంబం జలకాలాడేందుకు 460 ఏళ్ల కింద రూపుదిద్దుకున్న భారీ జలాశయాన్ని కటోరా హౌస్ అంటారు. దీన్ని ఆనుకునే రోడ్డు ఉంది. దానివైపు దాదాపు 5 అడుగుల ఎత్తుతో 60 మీటర్ల పొడవైన గోడ ఉంది. గతంలో రోడ్డు నిర్మించినప్పుడు, ఆ తర్వాత మరమ్మతులు చేసినప్పుడు వరద నీటి ప్రవాహ మార్గం చెదిరిపోయింది. వర్షాల వరద ప్రవాహం గతి తప్పి, గోడను ఆనుకుని ఉన్న మట్టి జారింది. ఇటీవలి వర్షాలకు ఆ గోడ దాదాపు 40 మీటర్ల మేర కటోరా హౌస్లోకి పడిపోయింది. ఇక్కడ నిర్వహణలో శాస్త్రీయత లోపించటం వల్లే ఈ గోడ కూలిందని స్పష్టమవుతోంది. -
కూలేదాకా చూస్తారేమో..!?
దోమకొండ: మండల కేంద్రంలోని పలుగుగడ్డ ప్రాంతంలో గల వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీనిని తొలగించి దాని స్థానంలో కొత్త వాటర్ ట్యాంకును నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు. లక్ష లీటర్ల సామర్ధ్యం గల ఈ వాటర్ ట్యాంక్ను దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీని ద్వారా గ్రామంలోని మార్కండేయ కాలనీ, ఇందిరాకాలనీ, మటన్ మార్కెట్, ఊరడమ్మ వీధి, బురుజు, హనుమాన్ కాలనీతో పాటు పాత బీబీపేట రోడ్డు వరకు కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. రెండు సంవత్సరాలుగా ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పెచ్చులు ఊడిపోయాయి. పగుళ్లు ఏర్పడ్డాయి. రెండేళ్ల క్రితం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు ట్యాంక్ లోపల శుభ్రం చేస్తుండగా మెట్లు విరిగిపోయాయి. దీంతో సదరు కార్మికుడు సెల్ఫోన్ ద్వారా విషయం తెలియజేయగా పంచాయతీ సిబ్బంది ట్యాంక్పైకి ఎక్కి అతడిని తాళ్లతో పైకి తీశారు. వాటర్ ట్యాంక్ చుట్టూ పెద్ద సంఖ్యలో నివాసాలు ఉన్నాయి. దీంతో కాలనీవాసులు ఎప్పుడు కూలుతుందోనని భయపడుతున్నారు. ఈ విషయంలో కాలనీవాసులు పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులకు విషయం వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చి దానిని పూర్తిగా తొలగించాలని పేర్కొన్నారు. తొలగించే ముందే దాని స్థానంలో మరో ట్యాంకును నిర్మించాలని వారు ప్రతిపాదించారు. అదే సమయంలో మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ 60 వేల లీటర్ల సామర్థం రెండు వాటర్ ట్యాంకులకు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భూమిపూజ చేశారు. దీంతో కాలనీవాసులంతా సంతోషపడ్డారు. అయితే సదరు కాంట్రాక్టర్ పనులు మాత్రం నత్తనడకన చేస్తున్నారు. వీటితో పాటు గ్రామంలో మొదలుపెట్టిన వాటర్ ట్యాంకులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ వీటి నిర్మాణ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వీటిని ముందుగా పూర్తి చేయడం ద్వారా పాత ట్యాంకును తొలగించాలని వారు కోరుతున్నారు. వర్షాకాలం కావడంతో పాత వాటర్ ట్యాంకు ఏ క్షణమైన కూలవచ్చని, దాంతో కాలనీవాసులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకుల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. -
శిథిలావస్థలో కాకతీయుల కాలం నాటి ఆలయం
-
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
ఫిలింనగర్లోని ఎఫ్ఎన్సీసీలో గత ఆదివారం నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ఇంకా పూర్తి కాలేదు. శిథిలాల తొలగింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇనుపచువ్వలు కట్ చేయడం, పిల్లర్లు పగలగొట్టడం చాలా సమస్యాత్మకంగా ఉండటంతో ఆరు రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా కూలిన పోర్టికో శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగించే క్రమంలో ఎఫ్ఎన్సీసీ ప్రధాన భవనానికి ముప్పు ఏర్పడింది. ఇప్పటికే అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన గేటు వద్ద కిటికీలు విరిగిపోయాయి. గోడలు ధ్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుండటంతో ఎఫ్ఎన్సీసీ యాజమాన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
‘ట్రూత్’ చెబుతున్నది ఇదే..
నిజనిర్ధారణ సమాచారం కలచివేసే విధంగా ఉండడం వల్ల ప్రధాన మీడియా, పార్లమెంట్ చాలావరకు మౌనముద్ర దాల్చాయని కూడా ‘ట్రూత్’ పేర్కొన్నది. తన నివేదిక ముగింపులో ఇంకా ఇలా చెప్పింది: ‘ఉత్తర దక్షిణ టవర్లు, 47 అంతస్తులు ఉన్న 7వ టవరు జెట్ విమానాల తాకిడి వల్ల, వాటితో వ్యాపించిన మంటలతో గానీ ధ్వంసం కాలేదు. పేలుడు పదార్థాలతో, నియంత్రిత విధ్వంసంతో టవర్స్ నాశనమైనాయి.’ ‘చరిత్రపుటలకు ఎక్కకుండా వాస్తవాలను పూర్తిగా తొలగించివేశారు.’ - నోమ్ చామ్స్కీ (అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడికి స్పందనగా రాసిన గ్రంథం ‘9/11, 2002’ నుంచి) ‘మానవులలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. తమకు అనుకూలంగా లేకుంటే చాలు, ఎంతటి సత్యాన్నైనా పొక్కకుండా కప్పెడతారు.’ -హాన్స్ కోనింగ్ (కొలంబస్ గ్రంథకర్త. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సేనలతో పోరాడి, తరువాత అమెరికాలో స్థిరపడిన హాలెండ్ జాతీయుడు) సెప్టెంబర్ 11... పదమూడేళ్ల క్రితం (2001) సరిగ్గా ఇదే రోజున చరిత్ర మరువలేని దుర్ఘటన జరిగింది. మరో మూడురోజులలో దీనిని ప్రపంచం మరోసారి గుర్తు చేసుకోబోతున్నది. పాలకులూ, పాలనా వ్యవస్థలూ ప్రపం చంలో ఖండఖండాలలో వారి ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ఉగ్రవాదం తలెత్తడానికి ఎలా దోహదపడుతూ ఉంటారో, ఉగ్రవాద చర్యలకు ఎలా ఊతం ఇస్తుంటారో ఆలస్యంగా బయటపడుతున్న నిజాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ట్విన్ టవర్స్ దుశ్చర్యకు సంబంధించి రెండు పరస్పర విరుద్ధ నివేదికలు వెలువడ్డాయి. అమెరికా పాలకులు (జార్జిబుష్ జూనియర్) అధికారికంగా విడుదల చేసిన కమిషన్ విచారణ నివేదిక. పదిహేను వందల మంది సుప్రసిద్ధ అమెరికన్ భవన నిర్మాణ నిపు ణులు (ఆర్కిటెక్ట్స్), ఇంజనీర్లు విడుదల చేసిన విశిష్ట నివేదిక. అదే ‘ఇన్వెస్టిగేటర్ న్యూస్’. వీరు ‘నిజ నిర్ధారణ ఉద్యమం’ పేరుతో 2010 ప్రాంతంలో ఈ నివేదికను వెలువరించారు. అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చెందిన ట్విన్ టవర్స్ భవన సముదాయం మీద, అక్కడి ఫ్లారిడా కేంద్రంగా ఏకకాలంలో బయలుదేరిన నాలుగు పౌర విమానాలు దాడి చేశాయి. 110 అంతస్తుల ఆ భవన సముదాయం కుప్పకూలింది. ఆ టవర్స్లో నిత్యం పని చేసే 50,000 మంది ఉద్యోగులలో అధికారిక లెక్కల ప్రకారం 3,000 మంది చనిపోయారు. ఇక అమెరికా యుద్ధ తంత్ర కేంద్ర కార్యాలయం పెంటగాన్ మీద జరిగిన విమానదాడిలో 125 మంది చనిపోయారు. వీరితో పాటు మొత్తం ఆ నాలుగు విమానాలలోను ప్రయాణిస్తున్న 256 మంది కూడా చనిపోయారని కూడా ప్రకటించారు. ఈ మృతుల సంఖ్య పెరల్ హార్బర్ మీద జపాన్ చేసిన దాడి (డిసెంబర్ 1941) కారణంగా మరణించినవారి సంఖ్య కంటే ఎక్కువేనని అధికారిక కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. కొని తెచ్చుకున్న కొరివి ఈ విషయంతో పాటే, ‘2001, సెప్టెంబర్ 11తో అమెరికా ఇక మారిపోయిన దేశం’గా అవతరించవలసి వచ్చిందని ప్రకటించింది. ఇంకా, ‘ఇస్లామిస్ట్ ఉగ్రవాదుల బెడద 1990 వరకు లేద’నీ, ఆ తరువాతే ప్రారంభమై, పదేళ్ల వ్యవధిలోనే ఉగ్రవాదం నుంచి ప్రమాదం తీవ్రమైందని కూడా బుష్ ప్రభుత్వ విచారణ కమిషన్ ప్రకటించింది. అంటే, 1990 దాకా లేని ఉగ్రవాద బెడద, తరువాత తలెత్తడానికి ఉన్న పూర్వరంగం అంతా అరబ్ ప్రపంచానికి సంబంధించినదేనని అమెరికా భాష్యం. అక్కడ అప్పటికి ఏకైక సెక్యులర్ శక్తిగా ఉన్న పాలకుడు సద్దాం హుస్సేన్. ప్రజలను మూకుమ్మడిగా హత మార్చే విషపూరిత అణ్వాయుధాలను సద్దాం ప్రభుత్వం రూపొందిస్తున్నదన్న ఆరోపణతోనే ఇరాక్ మీద దాడులకు అమెరికా పథకం రచించింది. ఈ ఆరో పణలను ఐక్యరాజ్య సమితి మొదట ఆమోదించలేదు. కానీ అమెరికా ఒత్తిడి తోనే విచారణ కోసం ‘బ్రిక్స్ కమిషన్’ను నియమించింది. ఇరాక్లో తనిఖీలు జరిపిన ఈ కమిషన్ అక్కడ మారణాస్త్రాలను తయారు చేస్తున్నారని చెప్ప డానికి అవసరమైన ఆధారాలు లేవని తేల్చింది. ఇరాక్ పెట్రోలియం వనరులే లక్ష్యంగా ఉన్న అమెరికా బ్రిక్స్ కమిషన్ తీర్పును ఖాతరు చేయకుండా ఆ దేశం మీద దాడులకు దిగింది. అమెరికా సహా బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మ నీలు కలసిన దుష్టకూటమి జరిపిన దాడి కారణంగా ఇరాక్ సర్వనాశనమైంది. 15 లక్షల మంది హతమయ్యారు. ఇందులో బాలల సంఖ్య 4-5 లక్షలని అంచనా. చివరికి రుజువులు లేని ఆరోపణలతో సద్దాంనూ ఉరితీసింది. వీటన్నిటి ఫలితంగానే ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగింది. ఈ పరిణామమే అరబ్ ప్రపంచంలోని పెక్కు ప్రభుత్వాలు, వ్యవస్థలు (నిరంకుశ, ప్రజాతంత్ర పాలకులన్న తేడా లేకుండా) కూలిపోవడానికి దోహదపడింది. తిరుగు బాట్లకు కూడా ప్రోత్సాహమిచ్చింది. పరస్పర విరుద్ధ నివేదికలు ఇంతకీ సొంత గూటిని కూల్చుకునే పాలకులు చరిత్రలో ఉంటారా అని ప్రశ్నించుకుంటే, ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రం లేకపోలేదు. ముస్సో లినీ, హిట్లర్ ఏం చేశారు? రాజకీయ ప్రాపకం కోసం జర్మనీ పార్లమెంటు రీచ్స్టాగ్ భవంతికి నాజీ మూకల చేత నిప్పు పెట్టించి, ఆ పాపాన్ని హిట్లర్ కమ్యూనిస్టులపైకి నెట్టాడు. అసలు టవర్స్ మీద దాడికి ముందుగానే బుష్ (జూ) మారుమూల ప్రాంతంలో ఎందుకు తలదాచుకోవడానికి వెళ్లినట్టు? సోవియెట్ను బూచిగా చూపి అఫ్ఘానిస్తాన్లో తొలి ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని కూల్చడానికీ, మధ్యాసియా సోషలిస్ట్ రిపబ్లిక్లోకి చొరబడడానికి ఆ చిన్న దేశాన్ని ముఖద్వారంగా మార్చడానికీ తాలిబాన్లను సాకి ఆయుధాలు ఇచ్చింది అమెరికాయే. తాలిబాన్ల నుంచి పుట్టిందే అల్కాయిదా ఉగ్రవాదం. అమెరికా అండతోనే ఉన్మాదశక్తులుగా ఎదిగినవాళ్లే ఇస్లామిక్ ఉగ్రవాదులు. వీరిపై బిన్లాడెన్ ముద్రవేస్తే గానీ రాజ్య విస్తరణ, సైనిక పారిశ్రామిక విస్త రణ అనే జమిలి పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోవడం అమెరికాకు సాధ్యంకాదు. తన ఉనికి కోసం మెజారిటీ ఉగ్రవాదానికీ, మైనారిటీ ఉగ్రవా దానికీ మధ్య వ్యత్యాసాన్ని చెరిపివేసేదే పెట్టుబడిదారీ వ్యవస్థ అని విస్మరిం చరాదు. బహు శా ఈ పరిణామక్రమాన్ని శ్రద్ధగా అవగాహన చేసుకోవడం వల్లనే, శాస్త్ర సాంకే తిక రంగాలతో దానిని సంధానించబట్టే 9/11 ఘటనకు దారితీసిన కారణాల మీద నిజనిర్ధారణ విచారణ ఉద్యమం (ట్రూత్ మూవ్ మెంట్) అధ్యయనం చేసింది. వాస్తవాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. మరో కోణంతో జరిగిన ఈ డాక్యుమెంట్ రచనకు, నిజ నిర్ధారణ ఉద్య మానికి రథసారథి రిచర్డ్ గేజ్. భవన నిర్మాణ, వాస్తు నిపుణుడైన గేజ్ 1,500 మంది నిపుణులతో ట్రూత్ ఉద్యమాన్ని ఆరంభించారు. ఈ విశిష్ట సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 14,000 శాఖలు ఉన్నాయి. ‘మేము దాడి కుట్రకు సంబం ధించిన సిద్ధాంతాల జోలికి పోదలుచుకోలేద’ని కూడా ఆ సంస్థ స్పష్టంగా చెప్పింది. 9/11 ఘటన మీద వచ్చిన అధికారిక నివేదికల గురించి కొన్ని సమాధానాలు కావాలని వారు కోరుతున్నారు. కానీ గత దశాబ్దంగా అమెరికా పాలకులు ఆ ఊసే ఎత్తడం లేదు. ‘ట్రూత్’ను గమనించాలి ‘ఈ దుర్ఘటనలో పలువురు ప్రత్యక్ష సాక్షుల నుంచీ, ముఖ్యుల నుంచీ నేరుగా సాక్ష్యాలు సేకరించాం. ఫొటోలు, వీడియో ఫోరెన్సిక్, శాస్త్రవేత్తల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నాం. కీలకమైన ఈ అంశాలను అధికార నివేదిక విస్మ రించింది. వ్యక్తుల, ఏజెన్సీల సాక్ష్యాలను వక్రీకరించడం లేదా ధ్వంసం చేయ డం జరిగింది’ అని అనధికార నిజనిర్ధారణ సంస్థ చెబుతోంది. ట్రూత్ సంస్థ వెబ్సైట్లో ఈ డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. ప్రజలను మరింత చైతన్యవంతం చేసేందుకు ఇందుకు సంబంధించిన సమాచారంతో డీవీడీలు, పత్రాలు, బ్రోచర్లను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. 2006 మార్చిలో ఈ సంస్థ (ఏఈ 9 11 ట్రూత్) ఆవిర్భవించింది. ఈ సంస్థ విచారణలో కొన్ని వాస్తవాలు వెలుగుచూసిన మాట నిజం. అవి: *స్వయం చోదిత క్షిపణుల మాదిరిగా పౌర విమానాలు దాడి చేయ డంతోనే ఆ టవర్స్ కూలలేదనీ, రిమోట్ కంట్రోల్ లాగా నియంత్రిత విధ్వంస కాండ (కంట్రోల్డ్ డిమోలిషన్)తోనే కూలాయి. *బోయింగ్ 717 వంటి భారీ విమానం డీకొట్టినా తట్టుకు నిలబడగల సామర్థ్యంతో 1-2 టవర్లను పకడ్బందీగా నిర్మించారని భారీ నిర్మాణాల నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. కానీ అసలు ఫోరెన్సిక్ నిపుణుల సాక్ష్యాలే అధికారిక నివేదికలో లేవు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. *ఇంతటి భారీ స్థాయిలో మానవ ప్రేరితంగా జరిగిన దుర్ఘటన మీద నిష్పాక్షికంగా, సమగ్రంగా విచారణ జరిపించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిజాయితీపరులైన న్యాయశాస్త్ర నిపుణులతో, న్యాయమూర్తులతో, ఇంజనీర్లతో, సామాజిక కార్యకర్తలతో ఆ విచారణ జరిపించాలి. ఈ విధ్వంసం వెనుక ఉన్న వాస్తవాలను వివరిస్తూ ట్రూత్ సంస్థ అమె రికాలోని 30 నగరాలకు చెందిన, 23 దేశాలకు చెందిన దాదాపు ఏడేసి వందల మందికి 200 చిత్రాలను ప్రదర్శించింది. వీటితో 85 శాతం వీక్షకులు ఆమోదించారు. తన ఫిర్యాదును ప్రతి పార్లమెంట్ సభ్యునికీ కూడా ‘ట్రూత్’ అందించింది. నిజనిర్ధారణ సమాచారం కలచివేసే విధంగా ఉండడం వల్ల ప్రధాన మీడియా, పార్లమెంట్ చాలావరకు మౌనముద్ర దాల్చాయని కూడా ట్రూత్ పేర్కొన్నది. తన నివేదిక ముగింపులో ఇంకా ఇలా చెప్పింది: ‘ఉత్తర దక్షిణ టవర్లు, 47 అంతస్తులు ఉన్న 7వ టవరు జెట్ విమానాల తాకిడి వల్ల, వాటితో వ్యాపించిన మంటలతో గానీ ధ్వంసం కాలేదు. పేలుడు పదా ర్థాలతో, నియంత్రిత విధ్వంసంతోనే టవర్స్ నాశనమైనాయి.’ కాబట్టి ఈ విధ్వంసానికి సవాలక్ష కారణాలు వెతకాలి. ట్రూత్ నివేదిక చెబుతున్నది ఇదే. మళ్లీ అధికారంలోకి రావడం కోసం మూడు లక్షల నల్లవాళ్ల ఓట్లను మాయం చేసిన వాడికి అమెరికా నుంచి ఉగ్రవాదాన్ని సృష్టించడం కష్టమా? (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
48కి పెరిగిన చెన్నై మృతులు
సాక్షి, చెన్నై: చెన్నైలో ఈ నెల 28వ తేదీన 11 అంతస్తుల అపార్టుమెంట్ కూలిపోయిన ప్రమాదంలో బుధవారం రాత్రి 8 గంటల సమయానికి మృతుల సంఖ్య 48కు చేరింది. 27 మందిని శిథిలాల నుంచి రక్షించారు. ప్రమాద కారణాలపై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రమాదం జరిగి ఐదు రోజులు కావడంతో శిథిలాల కింద ఉన్న మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధం ఆ ప్రాంతమంతా అలుముకుంది. -
రాజమండ్రిలో కుప్పకూలిన భవనం
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రి నూనెకొట్టు వీధిలో బుధవారం రాత్రి 11.20 గంటల సమయంలో రెండతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులతోపాటు ఒక వాచ్మన్ చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆకుల ఆంజనేయులు(60), అతడి భార్య వెంకటరత్నంలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వారి కుమారుడు హనుమాన్, అతని భార్య విజయలక్ష్మి, మనుమడు భార్గవ్(4), జశ్వంత్(2), పక్కనే నిర్మిస్తున్న ఇంటికి వాచ్మన్గా పనిచేస్తున్న మరో వ్యక్తి శిథిలాల్లో చిక్కుకున్నారు. ఈ భవనం అయిదేళ్ల క్రితం నిర్మించారు. దీని పక్కన ఖాళీస్థలంలో కొత్తగా ఇల్లు నిర్మించేందుకు గొయ్యి తవ్వడంతో భవనం ఆవైపు కూలిపోయింది. ఈ ఘటనతో చుట్టుపక్కల నివసించే వారు భయాందోళనలతో పరుగులు తీశారు. సహాయక చర్యలను ఎస్పీ రవికుమార్మూర్తి పర్యవేక్షించారు.