samba sector
-
సరిహద్దుల్లో సొరంగం
జమ్మూ: భారత్లో చొరబాట్లకు జిత్తుల మారి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంది. జమ్మూలోని సాంబా సెక్టార్లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ వైపు వెళుతున్న ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) కనుగొన్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3–4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. భారత్లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాక్ దీనిని నిర్మించిందని అధికారులు వెల్లడిం చారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. పాకిస్తాన్లో తయారైనట్టుగా గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని కప్పి ఉంచినట్టుగా బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. దీంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా సాంబా సెక్టార్లో అణువణువు గాలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురవడంతో ఈ సొరంగ మార్గం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి వదులుగా మారింది. ఎందుకిలా మట్టి ఉందన్న అనుమానంతో అక్కడ అంతా పరిశీలించి చూడగా పాకిస్తాన్లో తయారీ అయినట్టుగా చిహ్నాలు ఉన్న ఇసుక బస్తాల్ని బలగాలు గుర్తించాయి. వాటిని తొలగించి చూడగా 170 మీటర్ల పొడవైన సొరంగం కనిపించింది. సాంబా సెక్టార్లో వేల్బ్యాక్ శిబిరానికి దగ్గరగా ఈ సొరంగం ఉంది. కరాచి, శంకర్గఢ్ అని పేర్లు ముద్రించి ఉన్న 8–10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ బస్తాలపై ఉన్న తేదీలను బట్టి అవి ఇటీవల తయారైనట్టుగా తెలుస్తోంది. ఈ సొరంగం పాకిస్తాన్ వైపు సరిహద్దు శిబిరం గుల్జార్ వరకు కొనసాగిం దని అధికారులు చెప్పారు. ఈ సొరంగం ద్వారా పాక్ ఉగ్రవాదులు చాలా సులభంగా చొరబాట్లు చేయవచ్చునని వివరించారు. పాక్కు తెలిసే చేసింది ఈ సొరంగం నిర్మాణం గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా తెలుసునని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. ఆ సొరంగాన్ని ఇటీవల తవ్వారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. సాంబా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి సొరంగాన్ని తవ్వారన్న సమా చారం తమకు అందగానే సరిహద్దు బలగాలు రంగం లోకి దిగాయన్నారు. శుక్రవారం సాయం త్రానికి దీన్ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం జమ్వాల్ సాంబ సెక్టార్లోనే ఉంటూ పాక్ ఇంకా ఎక్కడెక్కడ సొరంగాలు ఏర్పాటు చేసిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
సొరంగం నుంచి ఉగ్రవాదులు
సాంబా సెక్టార్లో గుర్తించిన సైన్యం న్యూఢిల్లీ: కశ్మీర్లోని సాంబా సెక్టార్లో మంగళవారం బలగాల చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు సొరంగం ద్వారా చొరబడినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) చీఫ్ కేకే శర్మ చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద పొలాల్లో 80 మీటర్ల సొరంగ మార్గం ద్వారా అక్రమంగా ప్రవేశించినట్లు చెప్పారు. ‘చమ్లియాల్ ఔట్పోస్టు వద్ద ఆపరేషన్ పూర్తరుున తర్వాత కంచెను పరిశీలించాం. ఉగ్రవాదులు కంచెను తొలగించిన ఆనవాళ్లేవీ కనపడలేదు. అరుుతే బుధవారం ఉదయం అక్కడ 2బై2 చిన్న సొరంగమార్గాన్ని గుర్తించాం. పంట పొలాల్లో దీన్ని తవ్వారు.’ అని చెప్పారు. ఈ సొరంగం.. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 75-80 మీటర్ల దూరంలో, కంచె నుంచి 35-40 మీటర్లు ఉంది. దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ హస్తం ఉందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల వద్ద జైషే మొహమ్మద్కు చెందిన ‘అఫ్జల్ గురు దళం (ఏజీఎస్)’ అని ఉర్దూలో రాసి ఉన్న నోట్ లభ్యమైంది. రైళ్ల పేల్చివేతకు కుట్ర సాంబా సెక్టార్లో చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు దేశంలో భారీ విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారు. రైళ్లను, రైలు పట్టాలను పేల్చేయడం లాంటి వరుస దాడులకు పన్నాగం పన్నినట్లు బీఎస్ఎఫ్ అదనపు డెరైక్టర్ జనరల్ అరుణ్ చెప్పారు. 5 చైన్ ఐఈడీ (అత్యాధునిక పేలుడు పదార్థాలు), ద్రవరూపంలోని పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించాలనుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఐదు సీసాల ట్రైనైట్రోగ్లిసరిన్ అనే ద్రవ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితోపాటు 3 ఏకే 47 తుపాకులు, 20 మేగజీన్లు, 517 బుల్లెట్లు, 8ఎంఎం పిస్టల్, 20 గ్రెనేడ్లు, జీపీఎస్ సెట్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ చీఫ్ సమీక్ష నగ్రోటాలో దాడి జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సందర్శించారు. దాడి వివరాలను కమాండర్లు సుహాగ్కు వివరించారు. భద్రతా పరిస్థితులను ఆయన సమీక్షించారు. -
పాక్ గూఢచారి పట్టుబడ్డాడు
పాకిస్తాన్కు గూఢచారిగా వ్యవహరిస్తున్న వారు ఒక్కరినొక్కరుగా పట్టుబడుతున్నారు. ఆగస్టు నెల మొదట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ గూఢచారి రాజస్తాన్లో పట్టుబడగా.. నిన్న జమ్మూకశ్మీర్లో సాంబ సెక్టార్లో మరోవ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర్నుంచి రెండు పాకిస్తానీ సిమ్ కార్డులు, భద్రతా దళాలు మోహరించి ఉన్న చిత్రపట్టాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతని జమ్మూ జిల్లాకు చెందిన అర్నియా ప్రాంత నివాసి బోద్రాజ్గా గుర్తించారు. అతిపెద్ద గూఢచర్య నెట్వర్క్లో ఇతను కూడా ఓ భాగమేమో అనే అనుమానంతో భద్రతా దళాలు విచారణ చేస్తున్నాయి. ఆగస్టులో రాజస్తాన్లో అదుపులోకి తీసుకున్న పాక్ గూఢచారి నుంచి కూడా బోర్డర్ ప్రాంత చిత్ర పటాలు, పలు ఫోటోగ్రాఫ్లను పోలీసులు స్వాధీన పరుచుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం పాక్ గూఢచారిని అరెస్టు చేసిన రోజునే కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో భారత్ పోస్టులపై పాకిస్తానీ రేంజర్లు దాడులు జరిపారు. ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ ఏడుగురు పాకిస్తానీ రేంజర్లను హతమార్చింది. అయితే ఈ దాడిలో ఎవరూ చనిపోలేని పాకిస్తాన్ పేర్కొంటోంది. నిన్న జరిగిన ఈ సంఘటనతో బీఎస్ఎఫ్ పోస్టులపై పాకిస్తాన్ ఎక్కువగా గురిపెట్టినట్టు తెలుస్తోంది. గత నెల కశ్మీర్లోని ఉడీ ఆర్మీ బేస్పై దాడులు జరిపి 19మంది మన జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. వెంటనే పాకిస్తాన్కు షాక్గా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్దేశిత దాడులు నిర్వహించింది. 30 నుంచి 50 మంది ఉగ్రవాదులను ఈ దాడిలో చనిపోయినట్టు భారత ఆర్మీ పేర్కొంది. కానీ ఆ దాడులపై పాకిస్తాన్ మళ్లీ దుష్ఫచారమే చేయడం ప్రారంభించింది. అవి అసలు సర్జికల్ స్ట్రైక్సే కావని, తరుచూ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే కాల్పులేనని పేర్కొంది. -
30 చోట్ల పాకిస్థాన్ కాల్పులు
-
30 చోట్ల పాకిస్థాన్ కాల్పులు
జమ్మూకశ్మీర్: పాకిస్థాన్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. ఒప్పందాలను మరోసారి ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ సెక్టార్ లోని పలు ప్రాంతాలపై ఆదివారం రాత్రంతా కాల్పులకు తెగబడింది. నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం 30 సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ సైన్యం కాల్పులకు దిగినట్లు సైనికాధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. -
ముగిసిన ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత
జమ్ము : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన తీవ్రవాదుల జరిపిన దాడిలో ముగ్గురు ఉగ్రవాదులతో సహా తొమ్మిది మంది మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జమ్మూలోని పోలీస్ స్టేషన్ మీద, తర్వాత ఆర్మీ క్యాంపు మీద గురువారం తీవ్రవాదులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అకస్మికంగా ఉగ్రవాదులు దాడి చేయడంతో పోలీసులు అప్రమత్తమై, వారిపై ఎదురుదాడికి దిగారు. ఉగ్రవాదుల మృతదేహాలను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. మృతదేహాల ఆధారంగా ఏమైనా ఆధారాలు లభిస్తాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. చివరకు ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టడంతో వారి మధ్య జరిగిన సుదీర్ఘ పోరు ముగిసింది. ఒకే బృందంగా బయల్దేరిన ఉగ్రవాదులు ముందుగా పోలీసు స్టేషన్ మీద, తర్వాత ఆర్మీ క్యాంపు మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఆర్మీ అధికారి కూడా మరణించాడు. ఇటీవల పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 29 వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య న్యూయార్క్లో సమావేశం జరగనున్న నేపథ్యంలో కూడా.. ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. జమ్ము లోని సాంబ సెక్టార్లో రెండు గంటల వ్యవధిలో రెండు చోట్ల ఒకే ఉగ్రవాదుల బృందం దాడులు చేసింది. ఆర్మీ యూనిఫాంలో ఆటోరిక్షాలో వచ్చిన తీవ్రవాదులు మొదట పాక్ సరిహద్దుకు కిలోమీటర్ దూరంలో ఉన్న హీరాలాల్ పోలీస్ స్టేషన్పై బాంబులు విసిరి, అనంతరం ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ట్రక్ డ్రైవర్ను హతమార్చి ట్రక్కులో అక్కడినుంచి పారిపోయారు. -
కాశ్మీర్లో ఉగ్రదాడి: ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన తీవ్రవాదుల దాడిలో ఓ ఆర్మీ అధికారి సహా మొత్తం 12 మంది మరణించారు. ఒకే బృందంగా బయల్దేరిన ఉగ్రవాదులు ముందుగా పోలీసు స్టేషన్ మీద, తర్వాత ఆర్మీ క్యాంపు మీద కాల్పులు జరిపారు. దీంతో నలుగురు పోలీసులు, ఓ ఆర్మీ అధికారి సహా మొత్తం 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 29 వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య న్యూయార్క్లో సమావేశం జరగనున్న నేపథ్యంలో కూడా.. ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడటం గమనార్హం. జమ్ము లోని సాంబ సెక్టార్లో రెండు గంటల వ్యవధిలో రెండు చోట్ల ఒకే ఉగ్రవాదుల బృందం దాడులు చేసింది. ఆర్మీ యూనిఫాంలో ఆటోరిక్షాలో వచ్చిన తీవ్రవాదులు మొదట పాక్ సరిహద్దుకు కిలోమీటర్ దూరంలో ఉన్న హీరాలాల్ పోలీస్ స్టేషన్పై బాంబులు విసిరి, అనంతరం ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఆ తర్వాత ట్రక్ డ్రైవర్ను హతమార్చి ట్రక్కులో అక్కడినుంచి పారిపోయారు. తర్వాత అదే తీవ్రవాదుల బృందం పఠాన్కోట్- జమ్ము జాతీయ రహదారిపై ఉన్న ఆర్మీ క్యాంప్ వద్దకు చేరుకుని అక్కడ కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఒక ఆర్మీ అధికారి, మరో ఏడుగురు జవాన్లు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరినట్లయింది. ఇరుపక్షాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫలితంగా జాతీయరహదారిని మూసేశారు. -
కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు.. ఏడుగురు జవాన్ల మృతి
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లో తీవ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఒకే తీవ్రవాదుల బృందం సాంబ సెక్టార్లో రెండు గంటల వ్యవధిలో రెండు చోట్ల దాడులు చేసింది.. ఆర్మీ యూనిఫాంలో వచ్చిన తీవ్రవాదులు మొదట పాక్ సరిహద్దుకు కిలో మీటర్ దూరంలో ఉన్న హీరాలాల్ పోలీస్ స్టేషన్పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఆ తర్వాత ట్రక్ డ్రైవర్ను హతమార్చి ట్రక్లో అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత అదే తీవ్రవాదుల బృందం ఆర్మీ క్యాంప్పై కాల్పులు జరిపింది. ఇటీవలే భారత్లోకి చొరబడ్డ తీవ్రవాదులే ఈ ఘాతుకాని ఒడిగట్టారని నిఘా వర్గాలంటున్నాయి. భారత్ పాక్ దైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికాలో భేటీ అవుతున్న నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొల్పే ఉద్దేశ్యంతోనే తీవ్రవాదులు తెగబడినట్లు తెలుస్తోంది.