Sambhasivarao
-
పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు
-
కళాకారుల ఖాతాల్లోకే పారితోషికం
– జానపద కళాకారుల సంఘం నాయకులతో టీటీడీ ఈవో తిరుపతి అర్బన్: టీటీడీ పరిధిలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న(రిజిస్టర్డ్) గ్రామీణ భజన మండళ్ల కళాకారులకు ఇకపై వారివారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకే గౌరవ పారితోషికం జమ చేస్తామని ఈవో డాక్టర్ సాంబశివరావు వెల్లడించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులుగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు శుక్రవారం ముగిశాయి. అంతకుముందు ఈవో డాక్టర్ సాంబశివరావు భజన మండళ్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈవో దృష్టికి 7 ప్రధాన డిమాండ్లను కళాకారుల సంఘం అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి తీసుకెళ్లారు. స్పందించిన ఈవో మాట్లాడుతూ ప్రతి భజన బృందానికి ఏడాదికి ఒకసారి తిరుమలలో ప్రదర్శనకు అవకాశం కల్పించేలా ఆన్లైన్ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ ప్రాంతాల్లో భజన మండళ్లు ప్రదర్శన కోసం వెళ్లినప్పుడు రాను–పోను సెమీ లగ్జరీలో పూర్తి ప్రయాణ ఛార్జీలు చెల్లిస్తామన్నారు. వాయిద్య పరికరాలను ఆయా ఊర్లలోని ఆలయాలకు ఇవ్వడం ద్వారా ఏ భజన మండలి అయినా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఏడాది పొడవునా అన్ని భజన మండళ్లకు అన్ని కార్యక్రమాల్లో సమాన అవకాశాలు కల్పించేలా రోస్టర్ చార్ట్ రూపొందించుకోవాలని ధర్మ ప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రతి సంవత్సరం ఉగాది నుంచి ఉగాదికి వార్షిక ప్రణాళిక రూపొందించాలన్న భజన మండళ్ల డిమాండ్లకు ఈవో అంగీకరించారు. అంతేగాక ప్రతి ప్రదర్శన సమాచారాన్ని భజన మండళ్ల సభ్యులకు మొబైల్ మెసేజ్ల ద్వారా తెలియజేస్తామని హామీ ఇచ్చారు. టీటీడీకి చెందిన ఎస్వీబీసీలోనూ కళారూపాల ప్రదర్శనకు కొంత సమయం కేటాయించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుపతి జేఈవో పోల భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ముక్తేశ్వరరావు, ఎఫ్ఏ అండ్ సీఏవో బాలాజీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్య సేవలకు మరింత ప్రాధాన్యం
–దాతల ప్రోత్సాహానికి సన్నాహాలు –డోనార్ మేనేజ్మెంట్ ఆన్లైన్ ప్రారంభంలో టీటీడీ ఈవో తిరుపతి అర్బన్: తిరుమల– తిరుపతి దేవస్థానాల ద్వారా విద్య, వైద్య రంగాల సేవలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతల సౌకర్యార్థం డోనార్ మేనేజ్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ విధానాన్ని సోమవారం ఈవో ప్రారంభించారు. ఈసందర్భంగా తిరుపతిలోని ఏడీ బిల్డింగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీటీడీ ట్రస్టులకు ఎక్కువ మంది దాతలు విరాళాలు అందిస్తున్న నేపధ్యంలో విద్య, వైద్యరంగాలతో పాటు భక్తులకోసం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తద్వారా దాతల సంఖ్య పెరిగేందుకు అవకాశముంటుందన్నారు. ఈ కొత్త ఆన్లైన్ విధానం ద్వారా టీటీడీ లోని 9 ట్రస్టులు, ఒక పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు 48 గంటల్లోపు డిజిటల్ పాస్పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే దాతలుగా వున్న వారు తమ డోనార్ గుర్తింపు సంఖ్య, పాస్పుస్తకం సంఖ్యను ఆన్లైన్లో పొందుపరచి డిజిటల్ పాసుపుస్తకాన్ని పొందవచ్చునన్నారు. దాతల విభాగం ద్వారా కల్పించే దర్శనం, బస తదితర ప్రయోజనాలను ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని వివరించారు. ప్రస్తుతానికి టీటీడీలో 40వేలమంది దాతలు వున్నారని వారందరికీ ఈ కొత్త విధానం ద్వారా ఎన్నో ఆధునిక సేవలను అందించేందుకు వీలుకలుగుతుందన్నారు. ఇదే తరుణంలో కొత్త విధానం అమలవుతున్న తొలినాళ్లలో ఏవైనా లోటుపాట్లు ఎదురైతే వాటిని తక్షణం సరిదిద్ది ఆన్లైన్ వి«ధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. – వెబ్సైట్లో వివరాలు : దాతలు ఇచ్చే విరాళాల సొమ్ముతో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆయా ట్రస్టులకు చెందిన అ«ధికారులు పూర్తి వివరాలను టీటీడీ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. ట్రస్టుల సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు విజువల్స్ తీయించి ఎస్వీబీసీలో ప్రసారం చేస్తూ వెబ్సైట్లో వుంచడం ద్వారా మరింత మంది భక్తులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ–హుండీ ద్వారా భక్తులు సమర్పించే కానుకలు నేరుగా శ్రీవారి హుండీ అకౌంట్కు జమ అవుతాయని పూర్తిస్థాయిలో తెలియబరచాలన్నారు. ఈ–డొనేషన్ విధానాన్ని కూడా డోనార్ మేనేజ్మెంట్ అప్లికేషన్కు అనుసంధానం చేయాలని టీటీడీ ఈవో ఐటీ విభాగం అ«ధికారులకు సూచించారు. ఇప్పటి వరకు పాస్పుస్తకాలు అందని దాతల వివరాలు సేకరించి మూడు రోజుల్లోపు డిజిటల్ పాస్పుస్తకాలను దాతలే స్వయంగా వచ్చి పొందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోల భాస్కర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏవో బాలాజీ, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, దాతల విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, టీసీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
చిన్న ఆస్పత్రుల అభివృద్ధితో పేదలకు మేలు
=చిన్న ఆస్పత్రుల అభివృద్ధితో పేదలకు మేలు =ఆప్నా రాష్ట్ర సదస్సులో డీఎంహెచ్ఓ సాంబశివరావు ఎంజీఎం, న్యూస్లైన్ : అత్యాధునిక వైద్యం ధనవంతులకే అందుతోంది.. చిన్న ఆస్పత్రులను అభివృద్ధి చేసుకోవడం ద్వారా పేద ప్రజ లకు మెరుగైన వైద్యం అందించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివా రం హన్మకొండ పద్మాక్షి కాలనీలోని జయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో నిర్వహించిన 21వ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (ఆప్నా) రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలంగాణ ఉద్యమంలో, రాష్ర్టం కోసం అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు సామాజిక దృక్పథంతో సేవలందించినపుడే వైద్య వృత్తిపై ప్రజల్లో గౌరం పెరుగుతుందని చెప్పారు. ఇక్కడికి వచ్చే మారుమూల ప్రాంతాల్లోని గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఓపీ విభాగంలో 10 శాతం మేర ఉచితంగా సేవలందించాలని సూచిం చారు. ప్రభుత్వ పరంగా నర్సింగ్ హోమ్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. చారిత్మ్రాకమైన వరంగల్ నగరం లో మొట్టమొదటి సారిగా ఆప్నా రాష్ర్ట స్థాయి సదస్సు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అంతకుముం దు ఆప్నా సావనీర్ ఆవిష్కరించారు. అనంతరం భవిష్యత్లో చిన్న ఆస్పత్రుల సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన కార్యచరణతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్పై చర్చించి పలు నిర్ణయా లు తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో సవరణలు అవసరం : నర్సింగరెడ్డి, ఆప్నా రాష్ర్ట అధ్యక్షుడు ఆరోగ్యశ్రీ పథకం కార్పొరేట్ ఆస్పత్రులకు వరంగా మారిం దని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా చిన్న చిన్న ఆస్పత్రులకు ఒరిగిందేమీ లేదన్నారు. నిబంధనలు కార్పొరేట్ ఆస్పత్రులకు వర్తించే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే సవరించాలని కోరారు. 20 నుంచి 50 పడకల ఆస్పత్రికి కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేసినప్పుడే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రులను పట్టణాలకే పరిమితం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు చికిత్స పొందేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏడు సంవత్సరాల నుంచి అమల వుతున్న ఈ పథకంలోని విధానాల ద్వారా చిన్న ఆస్పత్రులు పెద్ద ఎత్తున మూత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి : రవీందర్రెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు మారుమూల ప్రాంతాల ప్రజలతోపాటు పేదలకు అందుబాటులో ఉంటున్న చిన్న చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్కు ఆరో గ్య శ్రీ పథకాన్ని వర్తింపచేసినపుడే ప్రజలకు లబ్ధిచేకూరుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చయ్యే వైద్యానికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించడానికి ప్రభుత్వం రూ.లక్ష చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నా రు. నర్సింగ్ హోమ్ల అనుమతి విషయంలో ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతోందని, వాటిని తొలగించి సహకరించాలని కోరారు. వైద్యులు సేవాభావంతో మెలగాలి : ప్రొఫెసర్ సీతారామరాజు, జయ హాస్పిటల్ అడ్వయిజర్ ప్రభుత్వ వైద్యులతోపాటు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ వైద్యు లు పేద ప్రజలకు సేవా భావంతో మెరుగైనా వైద్యం అందించాలని సూచించారు. వైద్య వృత్తి అన్ని వృత్తుల్లోకెల్ల గొప్ప ది.. దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. వైద్య వృత్తిని కొంత మంది వ్యాపారంగా మారస్తున్నారని అలాం టి విధానాన్ని మానుకుంటే వారిని ప్రజలు దేవుళ్లుగా భావి స్తారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తరువాత అసోసియేషన్ ప్రత్యేక కమిటీని ఎన్నుకుని చిన్న ఆస్పత్రుల తో మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైనా వైద్యం అం దించాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ సభ్యు డు ఎం.రమేశ్రెడ్డి, ఆప్నా జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, వైద్యులు కాంతారెడ్డి, కృష్ణారావు, శ్రీనివాసమూర్తి, కె.అశోక్రెడ్డి, కె.రమేశ్రెడ్డి, ఇ.రవీందర్రెడ్డి, ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంధ్యరాణి, కొత్తగట్టు శ్రీనివాస్, విజయ్చందర్రెడ్డి, కంకణాల మల్లేశం, బందెల మోహన్రావు, కాళీప్రసాద్, మోహన్దాస్, కె.ప్రమీల, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.