sarika suspicious death
-
వరంగల్ సెంట్రల్ జైలుకు సనా
వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న అనిల్ రెండో భార్య సనను పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 27వరకూ రిమాండ్ విధించింది. దీంతో సనాను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా సనా రిమాండ్ రిపోర్టులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. సనాను అనిల్ 2010లో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని చూసేందుకు రాజయ్య, ఆయన భార్య మాధవి వచ్చేవారని తెలుస్తోంది. అనిల్, అత్త మాధవి ప్రవర్తన వల్ల సారిక ఆత్మహత్య చేసుకుందని సమాచారం. అలాగే రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులపై రాహుల్ గాంధీకి సారిక రాసిన లేఖను ...సనా దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అవినీతి ఆరోపణలపై రాజయ్య ఏసీబీకి ఇచ్చిన సంజాయిషీ డైరీని కూడా ఆమె నుంచి పోలీసులు తీసుకున్నారు. ఇక రాజయ్యకు ఎంపీ టికెట్ రావడంతో సారికను ఇంట్లో నుంచి పంపించేయాలని సనా ఒత్తిడి తెచ్చినట్లు సనా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. -
సారిక కేసులో ఏ4గా సన
వరంగల్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలు, అనిల్ రెండో భార్యగా చెబుతున్న సనను ఏ4 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం ఆమెకు వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో హాజరుపరచనున్నారు. మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సిరిసిల్ల అనిల్ రెండో భార్య సనను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సారిక మృతి కేసులో కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలో గత శనివారం రాత్రి సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసుల అదుపులో సన!
సాక్షి, హన్మకొండ/ఖమ్మం: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సిరిసిల్ల అనిల్ రెండో భార్య సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారిక మృతి కేసులో కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలో శనివారం రాత్రి సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా సోమవారం సన అరెస్టును పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో సంఘటన జరిగిన రోజు నుంచి సిరిసిల్ల అనిల్ రెండో భార్య సన పరారీలో ఉంది. సన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్లోని ఉప్పల్లో ఆమె ఉందనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అమె అక్కడి నుంచి పరారయ్యారని భావించి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. చివరికి ఈ నెల 7న ఖమ్మం నగరంలోని ఖిల్లాబజార్ ప్రాంతంలో సనను, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, సనను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంపులో ఓ క్వార్టరు లో సన నుంచి వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. కాగా, సనను అరెస్టు చేసిన విషయాన్ని ఖమ్మం జిల్లాలోని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఖమ్మం రూరల్ మండలంలో తన బంధువుల ఇంట సనా ఆశ్రయం పొందుతున్నట్టు తెలుసుకున్న హన్మకొండ సుబేదారి పోలీసులు ఆమెను, ఆమెతో పాటు ఉన్న సోదరుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సారిక కేసులో అనిల్ రెండో భార్య సన అరెస్ట్
-
ఆత్మహత్య చేసుకోవాలని సారికను ఒత్తిడి చేశారు!
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో సారిక, ఆమె పిల్లలు ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేసిన వరంగల్ పోలీసులు.. రిమాండు రిపోర్టును సిద్ధం చేశారు. ఇందుకోసం మొత్తం 24 మందిని ప్రశ్నించారు. రాజయ్య కుమారుడు అనిల్, కోడలు సారికల వైవాహిక జీవితం గురించి కూడా రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. అనిల్ రెండో భార్య సన మాత్రం తప్పించుకుని తిరుగుతోందని తెలిపారు. కాగా, ఈ కేసులో ఎ1 అనిల్, ఎ2 సిరిసిల్ల రాజయ్య, ఎ3 మాధవీలత, ఎ4 సన అని పేర్కొన్నారు. రిమాండు రిపోర్టులో మరిన్ని విభ్రాంతికర వాస్తవాలను పోలీసులు బయటపెట్టారు. అవి ఇలా ఉన్నాయి... అనిల్ రెండో వివాహంతోనే సారికపై వేధింపులు మొదలయ్యాయి అనిల్కు తల్లిదండ్రుల మద్దతు ఉంది సారికను మామ రాజయ్య, అత్త మాధవీలత వేధించారు ఆమె పలుమార్లు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది కేసుల కారణంగా సారికపై వేధింపులు మరింతగా పెరిగాయి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని నిరంతరం వేధించారు ఆత్మహత్య చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారు ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు ఈ వేధింపులకు సాక్షులు సారిక, పిల్లలను అత్తింటివారు ఒంటరి చేశారు ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే వేధింపులు పెరుగుతాయని సారిక భయపడింది పలుకుబడి ఉపయోగించి వేధిస్తారని ఆందోళన చెందింది విసిగిపోయి పిల్లలతో ఆత్మహత్యకు ఒడిగట్టింది తెల్లవారుజామున 4-4.30 మధ్య ఆత్మహత్యకు పాల్పడింది పొగలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు గుర్తించి 100, 108లకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటి బెడ్రూంలో రెండు గ్యాస్ సిలిండర్లున్నాయి ఒకటి ఖాళీ, మరోటి నిండుది. మంటలు, పొగ కారణగానే సారిక, పిల్లలు మరణించారు బెయిల్ దరఖాస్తు కాగా, శనివారం వరంగల్ కోర్టులో రాజయ్య, ఆయన భార్య మాధవి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సంఘటన జరిగిన ఇంట్లో తాము ఉండటం లేదని, ఎన్నికల నేపథ్యంలోనే తాము ఒక రోజు ముందుగా అక్కడికి వచ్చామని అందులో పేర్కొన్నారు. అందువల్లే ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని, తమకు బెయిల్ ఇవ్వాలని అందులో కోరారు. వారి పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దానిపై విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.