shanmukha
-
ఓటీటీలో అసురుడిని ఎదురించిన ధీరుడి కథ సడెన్ ఎంట్రీ
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం 'షణ్ముఖ' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించింది. డివోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సాప్బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. అయతే, రవి బస్రూర్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే కాన్సెప్ట్తో 'షణ్ముఖ' చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆహా తెలుగు ఓటీటీ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని ఆ సంస్థ ఒక పోస్టర్ను విడుదల చేసింది. . ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్( Avika Gor) గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చింది.షణ్ముఖ కథేంటంటే..చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్) ఓ డ్రగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు. ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్స్టిగేషన్ ప్రాజెక్ట్లో కార్తీ, సారా సక్సెస్ అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.A cop, a scholar, and an ancient mystery!Dive into the forgotten tales, hidden treasures, and secrets buried deep in the forest.#Shanmukha Premieres from April 11 only on #aha #AadiSaikumar #Avikagor #Shanmukha pic.twitter.com/YvnuUBU6P3— ahavideoin (@ahavideoIN) April 10, 2025 -
ఆది సాయికుమార్ లేటేస్ట్ థ్రిల్లర్ మూవీ.. ఎలా ఉందంటే?
టైటిల్: షణ్ముఖనటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ తదితరులుదర్శకత్వం: షణ్ముగం సప్పని నిర్మాతలు: తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాణ సంస్థ: సాప్బ్రో ప్రొడక్షన్స్సంగీతం: రవి బస్రూర్విడుదల తేదీ: మార్చి 21, 2025టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. మరోసారి డిఫరెంట్ స్టోరీతో అభిమానుల ముందుకొచ్చారు. గతంలో ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా చేసిన ఆది సాయికుమార్.. టాప్ గేర్ తర్వాత గేర్ మార్చాడు. వరసగా క్రైమ్, యాక్షన్ జోనర్తో అభిమానులను మెప్పిస్తున్నారు. సీఎస్ఐ సనాతన్ క్రైమ్ థ్రిల్లర్ తర్వాత ఆది హీరోగా నటించిన మరో యాక్షన్ అండ్ డివోషనల్ థ్రిల్లర్ 'షణ్ముఖ'. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్ గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.షణ్ముఖ కథేంటంటే..చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్) ఓ డ్రగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు. ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్స్టిగేషన్ ప్రాజెక్ట్లో కార్తీ, సారా సక్సెస్ అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.ఎలా ఉందంటే.. మనదేశంలో మూఢ నమ్మకాలు, క్షుద్రపూజలను నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తమ స్వార్థం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే పాయింట్ను కథగా ప్రేక్షకుల ముందుకొచ్చారు డైరెక్టర్ షణ్ముగం. గతంలోనూ ఇలాంటి జోనర్లో ఎన్నో సినిమాలు వచ్చినా ఈ స్టోరీని కాస్తా భిన్నంగా చూపించారు. కథను అడవుల్లో మొదలుపెట్టిన షణ్ముగం.. చివరికీ అడవుల్లోనే ముగించాడు. ఫస్ట్ హాఫ్ అంతా రోటీన్గా అనిపిస్తుంది. అద్భుతమైన ఫైట్ సీన్తో ఆది సాయి కుమార్ను ప్రేక్షకులను పరిచయం చేస్తాడు. ఆ తర్వాత జరిగే సీన్స్ ప్రేక్షకులకు ఊహకందేలా ఉంటాయి. ఆది సాయికుమార్, అవికా గోర్ లవ్ స్టోరీ కూడా అంతగా ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు. మొదటి భాగం అంతా ఇన్స్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్కు అంతగా కనెక్ట్ కాలేదు. అక్కడక్కడ కృష్ణుడు(సుబ్రమణ్యం)తో వచ్చే కామెడీ సీన్స్ కాస్తా నవ్వించినా అంతగా మెప్పించలేదు. కార్తీ, సారాల ఇన్స్టిగేషన్ ప్రాజెక్ట్ ట్విస్ట్లతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.సెకండాఫ్కు వచ్చేసరికి కథ మొత్తం సారా, కార్తీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్ ట్విస్ట్లతో ఆడియన్స్లో కాస్తా కన్ఫ్జూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. కొన్ని చోట్ల సీరియస్గా కథ సాగుతున్న సమయంలో కామెడీని తీసుకొచ్చి ప్రేక్షకుల్లో కనెక్షన్ మిస్సయ్యేలా చేశాడు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మంచిదే.. కానీ తెరపై ఆవిష్కరించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. లాజిక్ పరంగా ఆలోచిస్తే కొన్ని చోట్ల సన్నివేశాల్లోనూ అది పూర్తిగా మిస్సయినట్లు కనిపించింది. కొన్ని సీన్స్ ఆడియన్స్ ఊహకందేలా ఉండడంతో కథనంలో క్యూరియాసిటీ మిస్సయింది. కథను మరింత ఆసక్తిగా మలచడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. క్లైమాక్స్ సీన్లో వచ్చే ట్విస్ట్లతో ప్రేక్షకులను కాసేపు కట్టిపడేశాడు. కానీ కొన్ని లాజిక్ లెస్ సీన్స్తో కథలో సీరియస్నెస్ అలాగే కొనసాగించలేకపోయాడు. ఓవరాల్గా దర్శకుడు తాను చెప్పాలనుకున్నా సందేశం మంచిదే అయినప్పటికీ.. కథనం, స్క్రీన్ప్లేపై మరింత ఫోకస్ చేసుంటే ఇంకా బాగుండేది. ఎవరలా చేశారంటే..ఆది సాయికుమార్ ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. పోలీస్గా తన అగ్రెసివ్నెస్ చూపించాడు. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ తెరపై కొత్తగా కనిపించింది. అయినప్పటికీ తన నటనతో మెప్పించింది. ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని కృష్ణుడు, అరియానా గ్లోరీ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్ఆర్ విష్ణు సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎంఏ మాలిక్ ఎడిటింగ్లో తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.-మధుసూధన్, సాక్షి వెబ్ డెస్క్ -
‘షణ్ముఖ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం షణ్ముఖ. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించనుంది. డివోషనల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాకు షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. సాప్బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ చేశారు.'సూరులైనా.. అసురులైనా.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇది ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే డైలాగ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇందులో ఆది సాయి కూమార్ పోలీసు అధికారి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ ఘనత ఆయనకే దక్కుతుంది: ఆది సాయికుమార్
‘‘నా సినిమా విడుదలై సంవత్సరం దాటిపోయింది. ఈ నెల 21న ‘షణ్ముఖ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ సినిమా ఘనత అంతా దర్శక, నిర్మాత షణ్ముగం సాప్పనికే దక్కుతుంది. మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుంది. మా చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఆది సాయికుమార్(Adi Sai kumar) చెప్పారు.షణ్ముగం సాప్పని దర్శకత్వంలో ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేశ్ యాదవ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలకు ముందే అన్ని భాషల శాటిలైట్ హక్కులు, డిజిటల్, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.‘‘డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపోందిన ఈ మూవీ చేయడం హ్యాపీ’’ అని అవికా గోర్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాని ఏపీ, తెలంగాణలో నా మిత్రుడు శశిధర్ రెడ్డి విడుదల చేస్తున్నారు’’ అన్నారు షణ్ముగం సాప్పని. -
ఆది సాయికుమార్ ‘షణ్ముఖ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
దీపావళికి షణ్ముఖ
ఆది సాయికుమార్ హీరోగా అవికా గోర్ హీరోయిన్గా నటించిన డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. పాన్ ఇండియా మూవీగా షణ్ముగం సాప్పని దర్శకత్వలో సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేశారు. షణ్ముగం సాప్పని మట్లాడుతూ – ‘‘ఆది సాయికుమార్ కెరీర్లో ఓ మైల్స్టోన్ మూవీలా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్తో రూపొందించిన చిత్రం ఇది. గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా సాగే ఈ చిత్రం విజువల్ వండర్లా ఉంటుంది. రవి బస్రూర్ ‘షణ్ముఖ’కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దీపావళి సీజన్లో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ పాన్ ఇండియా మూవీని పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
పవర్ఫుల్ పోలీస్
ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించారు. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.ఈ సందర్భంగా షణ్ముగం సాప్పని మాట్లాడుతూ– ‘‘డివోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రం ‘షణ్ముఖ’. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్తో రూపొందించాం. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్గా ఆది నటించారు. ఈ మూవీ తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ను అందించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
ఓ రచయిత ప్రయాణం
‘‘రైటర్ పద్మభూషణ్’ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయవాడలోని ఓ మధ్య తరగతి యువకుడి కథ ఇది’’ అని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ అన్నారు. సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో కథని అమ్మలానే చూస్తాను. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కంటెంట్ రాయాల్సింది రచయితనే. అలాంటి ఒక రచయిత ప్రయాణం ఈ చిత్రంలో ఉంటుంది. ఇందులో హీరో ΄ాత్ర పేరు పద్మభూషణ్. తను రైటర్ కావాలనుకుంటాడు. మరి అయ్యాడా? లేదా అనేదే కథ. దర్శకులు జంధ్యాల, ఈవీవీ, శ్రీను వైట్లగార్ల సినిమాలంటే ఇష్టం. నా బలం కూడా కామెడీనే. మా సినిమాలో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు. -
సినీ గీతాల కన్నా సనాతన ధర్మమే ఆకట్టుకుంది
ఆర్ష సాహిత్యంపై దాడులు పెరుగుతున్నాయి మన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చాగంటికి కులపరమైన ఉద్దేశాలు అంటగట్టొద్దు ‘సాక్షి’తో సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘సినీ పరిశ్రమలో పాటలు రాస్తున్న సమయంలోనే వైదిక వాజ్ఞ్మయంపై కొన్ని చానళ్లలో ప్రసంగించే అవకాశం వచ్చింది. దీంతో ప్రవచనాలతో బిజీ అయిపోయాను. సినిమాలకు పాటలు రాయడం కన్నా... సనాతన ధర్మప్రచారమే నన్ను ఆకట్టుకుంది. నా మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నా’నని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. కొంతమూరులో ఆయన నిర్మించిన శ్రీవల్లభ గణపతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరానికి వచ్చిన ఆయన సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. ఆయన మాటల్లోనే... బాలు ఆ నిర్మాతకు చివాట్లు పెట్టారు నేను రాసిన సినీగీతంలో ఒక పదం అర్థం కావడంలేదు కనుక, ఆ పదాన్ని మార్చమని ఓ నిర్మాత నన్ను అడిగారు. దాన్ని మార్చి మరో పదం రాశాను. పాడటానికి వచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ పదాన్ని ఎందుకు మార్చవలసివచ్చిందని నన్ను అడిగారు. నిర్మాత కోరిక మేరకు మార్చానని చెప్పాను. బాలు ఆ నిర్మాతకు చివాట్లు పెట్టి, పాత పదాన్నే ఉంచారు. బాపు, రమణలు ఎంతో ప్రోత్సహించారు భాగవతం సీరియల్కు పాటలు రాయడానికి బాపు, రమణలు నన్ను ఆహ్వానించారు. వారితో సంభాషణల్లో ఎక్కువగా భారత, భాగవత, రామాయణాల నుంచి కోట్ చేస్తుండేవాడిని. నా చేత వాళ్లు మళ్లీ మళ్లీ మాట్లాడించుకునేవారు. మంచిని తీసుకుందాం మన ప్రాచీన కావ్యాలు, ఆర్ష సాహిత్యంపై దాడులు ఎక్కువవుతున్నాయి. నేటి కాలానికి అన్వయించని విషయాలుంటే వాటిని పరిహరించి, మంచిని తీసుకుందాం. మన ధర్మాన్ని దెబ్బతీయడానికి కొందరు కుహనా మేధావులను పురిగొల్పుతున్నారు. ఈ కుహనా మేధావులు ఆర్షసాహిత్యాన్ని చూస్తున్న కోణంలో గతంలో ఎవరూ చూడలేదు. హృదయం నిర్మలంగా లేకుంటే అద్భుతాలు కూడా అసహ్యంగానే కనిపిస్తాయి. ఇవి ఉపాసనకు సంబంధించిన అంశాలు గణపతి కల్యాణం, హనుమంతుని కల్యాణం ఇత్యాదులు కథాపరమైన అంశాలు కావు. ఉపాసనకు సంబంధించిన అంశాలు. హనుమ జ్ఞానమూర్తి. జ్ఞానం ఉన్నచోట వర్చస్సు ఉంటుంది. కనుక హనుమంతునికి, సువర్చలకు వివాహం జరిపిస్తున్నాం. గణపతి బుద్ధిప్రదాత కనుకనే సిద్ధిబుద్ధిలతో గణపతి కల్యాణం జరిపిస్తున్నాం. చాగంటిని కులాల ఉచ్చులోకి లాగొద్దు సరస్వతీపుత్రుడు చాగంటి కోటేశ్వరరావు మీద కువిమర్శలు సనాతనధర్మంపై జరుగుతున్న దాడులుగానే భావించాలి. చాగంటికి కులపరమైన ఉద్దేశాలు అంటగట్టడం మంచి పద్ధతి కాదు. -
'ఆదిత్య' ఆడియో ఆవిష్కరణ
-
ఆదిత్య మూవీ స్టిల్స్
-
ఓవరాల్ చాంప్స్ మనీషా, షణ్ముఖ
అండర్-16 చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: అండర్-16 సెలక్షన్ కమ్ చెస్ టోర్నమెంట్లో ఓవరాల్ బాలికల టీమ్ టైటిల్ను ఎం.మనీషా చౌదరి కైవసం చేసుకుంది. అండర్-16 బాలుర ఓవరాల్ టైటిల్ను పి.షణ్ముఖ తేజ చేజిక్కించుకున్నాడు. వన్ గోల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని వెంకటరమణ కాలనీ కమ్యూనిటీ హాల్లో మంగళవారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్స్ ఫలితాలు: బాలికల విభాగం: అండర్-13: 1.సముద్రాల దేవిక, 2.పి.శ్రావణి, అండర్-10: 1.జె.ఎ.ఎస్.శర్వాణి. అండర్-8: 1.యజ్ఞ ప్రియ, 2.ప్రణీత ప్రియ. బాలుర విభాగం: అండర్-15 : 1.ఎస్.బిపిన్ రాజ్, 2.పి.గౌతమ్, 3.ఎం.తరుణ్, 4.ఎ.అఖిల్, 5.సాయి రేవంత్, 6.ఎల్.సాయి చరణ్, 7.సి.హెచ్.రాంమోహన్ రెడ్డి,8. ఎస్.ప్రవీణ్ కుమార్. అండర్-13: 1.ఎ.సాయి సిద్ధార్థ, 2.కుల్ప్రీత్ సింగ్, 3.బి.సాయి చాణిక్య రెడ్డి, 4.ప్రీతమ్ రెడ్డి, 5.వి.ప్రదీప్ రెడ్డి, 6. జశ్వంత్, 7.బి.ప్రశాంత్ కుమార్, 8.బి.హర్షిత్. అండర్-10: 1.ఎం.కౌశిక్, 2.జి.సంజన, అండర్-8: 1.టి.కె.సిద్ధార్థ 2. హిమేష్, అండర్-6: జె.ఎస్ఎస్. శ్రీకర్.