sivarathri
-
బాల్య వివాహాలపై నిఘా
చిత్తూరు కలెక్టరేట్: శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో బాల్య వివా హాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉం చాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాళహస్తి ఆలయ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా 13, 14వ తేదీల్లో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారని, బాల్య వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఆ రెండు రోజులు ఆలయ పరి«ధిలో నిఘాను మరింత పెంచాలని సూచించారు. ఇందుకోసం పోలీసులతోపాటు, అంగన్వాడీ కార్యకర్తులు, వెలుగు సిబ్బందిని వినియోగించుకోవా లని పేర్కొన్నారు. బాల్య వివాహాలను ముందుగానే గుర్తించి సంబందీకులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించాలని, రాత్రుల్లో విద్యుత్ దీపకాంతులతో ఆలయం శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. తాగునీరు, ఆహారం, స్నానపు ఘట్టాలు, మరుగుదొడ్లు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య కేంద్రాలను ఏర్పాటుచేసి, భక్తులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి పట్టణం పరిధిలోని రోడ్లను శుభ్రంగా ఉంచి, రాత్రింబవళ్లు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులకు సూచించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అక్కడక్కడా సూచిక బోర్డులు, ప్రధాన కూడళ్లలో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు బస్సులు నడపండి ముక్కంటీశుని బ్రహ్మోత్సవాలకు జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని, అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు బస్సు సర్వీసులను కూడా నడపాలన్నారు. ఎక్కువగా వచ్చే ప్రైవేటు వాహనాల పార్కింగ్కు చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు. స్వామివారి దర్శన క్యూలలో భక్తులకు అసౌకర్యం కలుగకుం డా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో శ్రీకాళహస్తి ఆలయ ఈఓ భ్రమరాంబ, పోలీసు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
శివరాత్రికి అనుమానమే
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం క్షేత్రంలో జరిగే ప్రత్యేక పర్వదినాల్లో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తరాదని అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. పనులు నత్తతో పోటీ పడుతుండటంతో ఇంకా మట్టి చదును చేసే పనులు కూడా పూర్తికాలేదు. శివరాత్రి నాటికి పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఈ ఏడాది కూడా వాహనదారులకు కష్టాలు తప్పేలా లేవు. సుమారు రూ.66కోట్ల వ్యయంతో ఆరు కి.మీ. రోడ్డును మూడు నెలల క్రితం ప్రారంభించిన పనులు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశాలున్నాయి. మరో వారం రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుంటే కొన్నిచోట్ల మట్టి చదును పనులు కూడా పూర్తికాలేదు. కొన్నిచోట్ల గృహాలు అడ్డంరావడంతో దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్లు ఏమి చేయలేని పరిస్థితి. మరికొన్నిచోట్ల 100 మీటర్ల వెడల్పు వేయలేక 80 మీటర్లకే చేయాల్సి వస్తోంది. రింగ్రోడ్డులోకి ప్రవేశించే ముందు కల్వర్టు పనులు జరుగుతూనే ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి మల్లమ్మ కన్నీరు, గోశాల, తెలుగు విశ్వవిద్యాలయం, వర్క్షాపు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా దేవస్థానం టోల్గేట్ వరకు నిర్మించాలి. ఇప్పటివరకు దేవస్థానం గ్యాస్ గోదాము నుంచి తెలుగు విశ్వవిద్యాలయం వరకు మట్టితో చదును చేసి కంకరవేసే పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు అడ్డంకిగా మారాయి. అలాగే 14 కల్వర్టులకు గానూ 6 మాత్రమే చివరిదశకు చేరుకున్నాయి. శివరాత్రి నాటికి పనులు కొలిక్కి రాకపోతే వాహనాల మళ్లింపు ప్రక్రియ పోలీసులకు సవాలుగా మారే అవకాశముంది. అయితే మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాల అనంతరం బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలని అధికారవర్గాలు భావిస్తున్నాయని సమాచారం. -
శ్రీశైలంలో 17 నుంచి శివరాత్రి వేడుకలు
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 17 నుంచి 26 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో నారాయణ భరత్ గుప్తా ఆదివారం విలేకరులకు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 17 నుంచి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించేందుకు 22 నుంచి స్పర్శదర్శనాన్ని నిలుపుదల చేస్తున్నామని చెప్పారు. టీటీడీ 18న , రాష్ట్ర ప్రభుత్వం 21న.. పట్టువస్త్రాలను సమర్పిస్తాయని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం 24న వస్తుందని, అ రోజు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రాత్రి 10.30కు పాగాలంకరణ, అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.