SN subramayan
-
బాసులు లేని వర్క్ కల్చర్
వారంలో 90 గంటలు పని చేయాలంటు ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యయన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విధానాన్ని వ్యతిరేకించిన ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా డెన్మార్క్ వర్క్ కల్చర్ను అవలంబించడం ద్వారా భారత్ ప్రయోజనం పొందే అవకాశం ఉందని సూచించారు.‘డెన్మార్క్లో ఉద్యోగులు మైక్రో మేనేజ్మెంట్(కింది స్థాయి బాసులు) లేకుండా స్వతంత్రంగా పనిచేస్తారు. వీరు సంవత్సరానికి కనీసం ఐదు వారాల సెలవు, ఆరు నెలల పేరెంటల్ లీవ్ అనుభవించే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన పని గంటలు ఎంచుకోవచ్చు. దాంతో వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరూ ఉద్యోగాలను వీడకుండా స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడి ఉద్యోగులు అనుభవించే సౌకర్యాలు, స్వయంప్రతిపత్తి కారణంగా చాలా మంది పనిని కొనసాగిస్తారు. కంపెనీ యజమానులు మానసిక ఆరోగ్యానికి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్కు విలువ ఇస్తారు. వ్యక్తిగత ఆకాంక్ష కంటే సామూహిక శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తారు’ అని చెప్పారు.అసలేం జరిగిందంటే..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్తో వీడియో ఇంటెరాక్షన్లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.Why the people in Denmark are happiest about their work practices:- Employees are trusted to work independently without micromanagement- Minimum five weeks of vacation and six months of parental leave- Flexible hours allow time for family and personal life- Job loss is…— Harsh Goenka (@hvgoenka) January 16, 2025వినాశనానికి దారితీస్తుందంటూ ఇప్పటికే స్పందనసుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) గతంలో స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్ట్యాగ్ను జత చేశారు. -
‘మీ లాభాల కోసం మేం చావలేం’
ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటల పనిదినాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) తీవ్రంగా తప్పుబట్టింది. కార్మికుల శ్రేయస్సును పణంగా పెట్టి లాభాపేక్షతో అలుపెరగకుండా పని చేయించడం సరికాదని చెప్పింది. కంపెనీల లాభాల కోసం చావడానికి సిద్ధంగా లేమని కేఐటీయూ ప్రకటించింది. భారతీయ శ్రామిక శక్తిని అమానవీయంగా దోపిడీ చేయడం ద్వారా సుబ్రహ్మణ్యన్ సారథ్యం వహిస్తున్న కంపెనీ లాభాలు పొందుతుందని యూనియన్ ఆరోపించింది.కేఐటీయూ కార్యదర్శి సూరజ్ నిడియాంగా మాట్లాడుతూ..‘యూనియన్ ఈ అంశాన్ని ఒంటరి ప్రకటనగా పరిగణించడం లేదు. గతంలో నారాయణమూర్తి వారానికి 70 గంటల పని విధానం కావాలని సూచించినప్పుడు కర్ణాటకలో అమలు చేసే ప్రయత్నం జరిగింది. కేఐటీయూ జోక్యం, ఉద్యోగుల ప్రతిఘటన కారణంగానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎల్ అండ్ టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి లాభాల కోసం మా ప్రాణాలను పణంగా పెట్టలేం’ అని చెప్పారు.ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఇవే..‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూస్తారు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆయన కామెంట్లపై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థల్లో పనిగంటలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్సీఎల్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ వంటి వ్యక్తులు పని గంటల పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టే అంశాన్ని నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: మెటా క్షమాపణలు చెప్పాలి.. పార్లమెంటరీ కమిటీ సమన్లు..?అసలు ఉద్దేశంపై వివరణసోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్ అండ్ టీ ఇటీవల దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘ఇది భారతదేశపు దశాబ్దమని ఛైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు. అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని ప్రకటన జారీ చేసింది. -
'90 గంటల పని'పై ఎల్&టీ హెచ్ఆర్ టీం స్పందన
ఉద్యోగులు వారంలో 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా విధులకు హాజరుకావాలంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో దీని మీద మామూలు చర్చ జరగడం లేదు. అయితే.. తమ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై ఎల్ అండ్ టీం హెచ్ఆర్ టీం స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై వివరణతో హెచ్ఆర్ హెడ్ సోనికా మురళీధరన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఉంచారు.90 పని గంటల విషయంలో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్(SN Subrahmanyan) వ్యాఖ్యలు జనాల్లోకి చాలా పొరపాటు వెళ్లాయంటూ లారెన్స్ & టూబ్రో(L & T) హెచ్ఆర్ హెడ్ సోనికా అంటున్నారు. ‘మా ఎండీ వ్యాఖ్యలు పొరపాటుగా జనంలోకి వెళ్లాయి. ఆయన చాలా సాధారణంగానే ఆ మాటలు అన్నారు. కానీ, అవి అనవసర విమర్శలు దారితీయడం నిజంగా బాధాకరం. వారానికి 90 గంటలు పని తప్పనిసరనిగానీ.. దానిని అమలు చేయాలనిగానీ ఆయనేం అనలేదు. .. ఆయన ప్రతీ ఉద్యోగిని తన కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు. అలాగే తన టీం బాగోగుల గురించి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడున్న కార్పొరేట్ ప్రపంచంలో ఇది అంత్యంత అరుదైన విషయం’’ అని ఆమె అన్నారు. అలాగే.. ఆయన నాయకత్వాన్ని ఆమె ఆకాశానికెత్తారు. కాబట్టి.. ఆయన మాటల్ని అర్థం చేసుకుని, విమర్శలకు పుల్స్టాప్ పెట్టాలని ఆమె కోరారు.అంతటితో ఆగలేదు..ఉద్యోగులు వారానికి 90 గంటలు(90 Hours Work) పనిచేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అయితే ఆయన పనిగంటల వరకు మాట్లాడినా ఈ వివాదం అంతగా ముదిరేది కాదేమో. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ, ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాలి’’ అని అన్నారు. దీంతో రచ్చ మొదలైంది.ఉన్నతహోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చూసి ఆశ్చర్యానికి గురయ్యానంటూ బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె అసహనం వ్యక్తం చేశారు. వారానికి 90 గంటలు పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సైతం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. అలాగైతే సండే పేరును ‘సన్ డ్యూటీ’గా మార్చాలని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బానిసలాగా కష్టపడటాన్ని కాకుండా తెలివిగా పనిచేయడాన్ని తాను నమ్ముతానని తెలిపారు. పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరమన్నారు. మరోవైపు.. పలువురు ప్రముఖులు సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం కొసమెరుపు.చర్చ సరైన దిశగా వెళ్లడం లేదు. పని పరిమాణంపైనే కదా ఇదంతా. నా దృష్టిలో అయితే 40 గంటలా.. 70 గంటలా లేదంటే 90 గంటలా అని కాదు. ఎంత నాణ్యమైన పనిని అందించామా అన్నదే ముఖ్యం. 10 గంటల్లో కూడా ప్రపంచాన్ని మార్చవచ్చు. అందుకే పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంతసేపు పని చేశామన్నది ముఖ్యం కాదు:::మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా -
‘మెట్రో’ కొత్త టార్గెట్.. డిసెంబర్ 2018
♦ అప్పటికి మూడు కారిడార్లలో 72 కి.మీ రూట్లో ప్రాజెక్టును పూర్తిచేస్తాం ♦ జూన్లో ‘మియాపూర్-ఎస్ఆర్నగర్’, ‘నాగోల్-మెట్టుగూడ’ ప్రారంభం లేదు ♦ మెట్రో తొలి దశ ప్రారంభోత్సవ తేదీని ప్రభుత్వమే ప్రకటిస్తుంది ♦ ఎల్అండ్టీ మెట్రో రైల్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ స్పష్టీకరణ ♦ ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీగా గాడ్గిల్ స్థానంలో శివానంద నింబార్గీ నియామకం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును 2018 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని ఎల్అండ్టీ మెట్రో రైల్ ప్రాజెక్టు చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ వెల్లడించారు. నాగోలు-రహేజా ఐటీ పార్క్, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్నుమా.. ఈ మూడు రూట్లలో మొత్తం 72 కి.మీ. మేర ప్రాజెక్టును అప్పటికి పూర్తిచేయాలని తాజాగా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. గతంలో 2017 జూలై నాటికి పనులు పూర్తిచేస్తామని అనుకున్నా.. పనులు చేపట్టేందుకు అవసరమైన ఆస్తుల సేకరణ, రైట్ ఆఫ్ వే లభించకపోవడం, అలైన్మెంట్లో మార్పులు వంటిసమస్యలతో నిర్మాణం ఆలస్యమైందన్నారు. తాజాగా గడువు పొడిగింపు, ఆలస్యం కారణంగా పెరుగుతోన్న అంచనా వ్యయం చెల్లింపు, నిర్మాణ ఒప్పందంలో మార్పులు చేర్పుల వంటి అంశాలపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్పారు. బుధవారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎల్అండ్టీ మెట్రో రైల్ మేనేజింగ్ డెరైక్టర్గా వీబీ గాడ్గిల్ స్థానంలో శివానంద నింబార్గీ నియామకాన్ని సుబ్రమణ్యన్ లాంఛనంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారిద్దరితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న.. నాగోలు-మెట్టుగూడ(8 కి.మీ.), మియాపూర్-ఎస్ఆర్నగర్(11 కి.మీ.) రూట్లలో మెట్రో రైలు ప్రారంభోత్సవం ఉండదని స్పష్టం చేశారు. ఈ రూట్లలో సాంకేతికంగా పనులు పూర్తయినప్పటికీ ప్రయాణికులకు అవసరమైన భద్రతాపరమైన ఏర్పాట్ల పూర్తి, వసతుల కల్పన, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ, టికెట్ వెండింగ్ యంత్రాల ఏర్పాటు, ఇతర నిర్వహణ పనులను పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. మెట్రో తొలి దశ ప్రారంభోత్సవ తేదీని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుందన్నారు. పాతనగరంలో మెట్రో అలైన్మెంట్ ఖరారుపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, సర్కారు నిర్ణయం మేరకే పనులు చేపడతామన్నారు. ప్రస్తుతం ఎంజీబీఎస్-ఫలక్నుమా రూట్లో 5.3 కి.మీ మార్గం మినహా ఇతర రూట్లలో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పంజాగుట్ట, హైటెక్సిటీ, మూసారాంబాగ్ ప్రాంతాల్లో మెట్రో మాల్స్ నిర్మాణాలు ఊపందుకున్నాయన్నారు. కాగా, మెట్రో ప్రాజెక్టును గడువులోపల(2017 జూలై) పూర్తిచేయని కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్ల మేర పెరగనుందని ఎల్అండ్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరిగిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ సంస్థకు చెల్లించాలని ఎల్అండ్టీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసినట్లు తెలిసింది. కీలక సమయంలో వెళుతున్నా.. బాధగా ఉంది: గాడ్గిల్ ‘‘మెట్రో నిర్మాణ ఒప్పందం కుదిరినప్పుడు 2010 సెప్టెంబర్లో ఎండీగా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం ప్రాజెక్టు కీలక దశలో ఉంది. ఈ సమయంలో పదవీ విరమణ చేస్తుండడం బాధగా ఉంది. ఈ నెలాఖరు వరకు పదవిలో కొనసాగుతాను. మెట్రో నిర్మాణంలో ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు, వాటిని అధిగమించిన తీరుపై ఓ పుస్తకం రాస్తా. ఇది భవిష్యత్ మెట్రో ప్రాజెక్టులకు గైడ్గా ఉపకరిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఫొటోగ్రఫీ, ట్రెక్కింగ్ వంటి హాబీలతో సేదదీరుతాను.’’ ప్రాజెక్టు పూర్తిచేయడమే లక్ష్యం: శివానంద నింబార్గీ ‘‘జూన్లో ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తాను. ఇది నాకు గొప్ప అవకాశం. గడువులోగా పనులు పూర్తిచేయడమే నా లక్ష్యం. ప్రాజెక్టును ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత గాడ్గిల్దే. హైదరాబాదీలకు అంతర్జాతీయ ప్రమాణాలున్న మెట్రో సేవలు త్వరలోనే అందుతాయని భావిస్తున్నాను.’’ మెట్రో పనుల పురోగతి ఇదీ.. మొత్తం 72 కి.మీ మార్గంలో పనులకుగానూ 49 కి.మీ మార్గంలో పిల్లర్ల ఏర్పాటు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. స్టేషన్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మొత్తం 57 మెట్రో రైళ్లకుగానూ 40 మెట్రో రైళ్లు ఉప్పల్, మియాపూర్ డిపోకు చేరుకున్నాయి. అలైన్మెంట్పై సందిగ్ధత కారణంగా ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గంలో పనులు నిలిచాయి. పలు స్టేషన్లకు చేరుకునే మార్గాలను రీడిజైన్ చేస్తున్నారు.