Tamim Ahmed Chowdhury
-
'లొంగిపోనన్నాడు.. అందుకే చంపాం'
ఢాకా: బంగ్లాదేశ్లోని ఢాకా కేఫ్ మారణ హోమానికి కారణమైన కీలక సూత్రదారి లొంగిపోయేందుకు నిరాకరించడమే కాకుండా దాడులకు దిగడం వల్లే ప్రతిదాడులు చేసి హతమార్చామని ఢాకా బలగాలు తెలిపాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్పై గత నెలలో ఉగ్రవాదులు దాడి చేసి ఒక భారతీయురాలు, 16మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. దీని సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)గా బంగ్లా భద్రతా బలగాలు గుర్తించాయి. ఇతడు బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. దీంతో అప్పటి నుంచి బలగాలు అతడికోసం గాలిస్తున్నాయి. ఢాకా శివార్లలోని నారాయణ్గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం అందడంతో ఆపరేషన్ చేపట్టారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను కార్నర్ చేసినప్పటికీ వారు లొగిపోకుండా కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారు గంటపాటు జరిగిన కాల్పుల్లో ఎట్టకేలకు తమీమ్ చనిపోయాడు. -
ఢాకా దాడి సూత్రధారి హతం
మరో ఇద్దరు ఉగ్రవాదులనుమట్టుబెట్టిన బంగ్లా పోలీసులు ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్పై గత నెలలో జరిగిన ఉగ్ర దాడి సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)ని బంగ్లా భద్రతా బలగాలు శనివారం హతమార్చాయి. అతడితో పాటు ఇద్దరు అనుచరులు చనిపోయారు. జూలై 1న ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీపై ఉగ్ర దాడిలో ఒక భారతీయురాలు, 16 మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారి బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తమీమ్. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. భద్రతా బలగాల అదుపులో ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన ఓ ఉగ్రవాది ఢాకా శివార్లలోని నారాయణ్గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం ఇవ్వడంతో ఆపరేషన్ చేపట్టినట్టు కౌంటర్ టైజమ్ యూనిట్ చీఫ్ మోనీరుల్ ఇస్లాం చెప్పారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో లోపలి నుంచి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురూ చనిపోయారు. ఈ ఆపరేషన్ సుమారు గంట పాటు సాగిందని వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి కొన్ని గ్రెనేడ్లు, ఓ పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, తమీమ్కు సంబంధించిన సమాచారం అందించిన వారికి బంగ్లా పోలీసులు 20లక్షల బంగ్లా టాకాల రివార్డును ప్రకటించారు. -
గొంతులు కోయించిన మాస్టర్మైండ్ చచ్చాడు
ఢాకా: ఢాకా కేఫ్లో ఊచకోత వెనుక సూత్రదారి హతమయ్యాడు. బంగ్లాదేశ్ రాజధానిలో శనివారం ఉదయం బలగాలు జరిపిన సోదాల్లో తారసపడిన మొనిరుల్ ఇస్లామ్ చీఫ్ తమిమ్ అహ్మద్ చౌదురి కాల్పులు జరపగా ప్రతిగా బలగాలు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ అధికారులు స్పష్టం చేశారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఉగ్రవాద నిరోధక దళం, ట్రాన్స్నేషనల్ క్రైమ్ యూనిట్ ఉమ్మడిగా నారాయణ్ గంజ్ సదార్ ప్రాంతంలో కార్డన్ సెర్చ నిర్వహించారు. ఈ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు, మోనిరుల్ ఇస్లాం చీఫ్ తలదాచుకున్నారని సమాచారం తెలియడంతో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో గుంపుగా ఉన్న ఉగ్రవాదులు బలగాలకు తారసపడి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు జరిపిన ప్రతిదాడుల్లో మోనిరుల్ ఇస్లామ్ చీఫ్ తమిమ్ మరికొందరు హతమయ్యారు. ఢాకాలోని ఆర్టిసన్ బేకరీపై ఈ ఏడాది (2016) జూలై 1న కొంతమంది ఉగ్రవాదులు దాడులు చేసి 22మందిని అత్యంత దారుణంగా గొంతుకోసి చంపిన విషయం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించిన మాస్టర్ మైండ్ కెనడా సంతతికి చెందిన బంగ్లాదేశీయుడు తమిమ్ అని పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తుండగా చిక్కి చివరకు హతమయ్యాడు.