Tirupati by-election
-
దొడ్డిదారిలో ‘డిప్యూటీ
తిరుపతి కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే.. టీడీపీ గెలిచింది కేవలం ఒకే ఒక్కటి. 48 డివిజన్లలో వైఎస్సార్సీపీ నెగ్గగా ఒక్క డివిజన్ ఫలితం కోర్టు పరిధిలో ఉంది. ఈ లెక్కన ఎలా చూసినా.. ఎప్పుడు ఎన్నిక నిర్వహించినా.. అది మేయర్ అయినా.. డిప్యూటీ మేయర్ అయినా కచ్చితంగా వైఎస్సార్సీపీకే దక్కి తీరాలి. కానీ కూటమి గూండాల విధ్వంసకాండ.. కార్పొరేటర్ల కిడ్నాప్లు.. పచ్చ ముఠాల కుతంత్రాల నడుమ మంగళవారం జరిగిన ఎన్నికలో ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్న టీడీపీ డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది!! సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. ఏమాత్రం సంఖ్యాబలం లేని చోట్ల.. వైఎస్సార్సీపీ గుర్తుతో ఎన్నికల్లో నెగ్గిన వారిని బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి పీఠాలపై టీడీపీ కొలువుదీరింది! దాడులు, దౌర్జన్యాలు చేసినా.. అధికార దుర్వినియోగానికి పాల్పడినా... పోలీసుల నుంచి ఆర్డీవోల దాకా మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ మోహరించినా తమ ఎత్తుగడలు పారని చోట్ల ఎన్నికలను వాయిదా వేయించింది. తిరుపతి కార్పొరేషన్లో ఏమాత్రం మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు అధికార దుర్వినియోగంతో డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకున్నారు. కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్న టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు తెగబడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుని ప్రజాస్వామ్యానికి పాతరేసింది. ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే కిడ్నాప్నకు గురైన కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. కూటమి గూండాల దుర్మార్గాలకు భయపడి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయక తప్పలేదని మీడియా ముందు మొర పెట్టుకోవడం గమనార్హం. వైఎస్సార్సీపీ 13 సీట్లు గెలిచిన నందిగామలోనూ చైర్ పర్సన్ పదవిని కేవలం ఆరు సీట్లలో నెగ్గిన టీడీపీ సంఖ్యా బలం లేకున్నా అధికారం అండతో దక్కించుకుంది.రెండో రోజూ అదే అరాచకం..సోమవారం నిర్వహించాల్సిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కూటమి గూండాల బెదిరింపులు, దాడులు, కిడ్నాప్లు, కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి డిప్యూటీ మేయర్ పదవిపై కన్నేసిన నేపథ్యంలో టీడీపీ గూండాలు మొదటి రోజు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో ఉప ఎన్నిక సమావేశ మందిరానికి వెళ్తున్న బస్సుపై రాడ్లతో దాడి చేసి నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. దీంతో కోరం లేక ఉప ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. నడి రోడ్డులో ఖాకీల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పచ్చముఠాలు రెండో రోజు మరింత బరి తెగించాయి. ఉప ఎన్నిక వాయిదా పడిన వెంటనే అదే రోజు రాత్రి కిడ్నాప్నకు గురైన అనీష్ రాయల్ భార్య మమతను సైతం కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి.. అనీష్ రాయల్ నివాసానికి చేరుకుని ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కూటమి గూండాలు అక్కడికి కూడా చేరుకుని ఆమె ఉన్న నివాసం తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నించడంతో తొలుత 100కి ఫోన్ చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవటంతో తిరిగి అభినయ్రెడ్డికి సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన అభినయ్రెడ్డి, ఎంపీ గురుమూర్తిపై కూటమి గూండాలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో కౌశిక్, వాసుయాదవ్, అభినయ్ డ్రైవర్ గాయాలపాలు కాగా, ఓ కారు ధ్వంసమైంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఓటింగ్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ సభ్యులు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్..డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఓటు హక్కు వినియోగించుకోకుండా పథకం వేసిన కూటమి గూండాలు సోమవారం అర్ధరాత్రి దాటాక ఆయన్ను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. ఉప ఎన్నికలో పాల్గొనకుండా నిర్బంధించారు. ఆయనతో బలవంతంగా ఓ వీడియోను చిత్రీకరించి టీడీపీ మీడియా కో–ఆర్డినేటర్ శ్రీధర్వర్మ సెల్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉప ఎన్నిక ముగిసిన తరువాత సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ సుబ్రమణ్యంను విడిచిపెట్టడంతో ఆయన నేరుగా భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకుని జరిగిన విషయాన్ని వివరించారు. క్షమించండి.. విలపించిన కార్పొరేటర్లుకిడ్నాప్నకు గురైన నలుగురు కార్పొరేటర్లు అనీష్ రాయల్, అనిల్, అమర్నాథ్రెడ్డి, మోహన్కృష్ణ యాదవ్ ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే నేరుగా భూమన నివాసానికి చేరుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి, అభినయ్రెడ్డి కాళ్లమీద పడి క్షమించమంటూ అనీష్ రాయల్ కన్నీరు మున్నీరయ్యారు. తమను కిడ్నాప్ చేసిన వ్యక్తులు చిత్రహింసలకు గురి చేశారని, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి వారికి అనుకూలంగా వీడియో చిత్రీకరించారని తెలిపారు. భూమన, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీషను కలసిన కిడ్నాప్ అయినా కార్పొరేటర్లు వారికి భయపడి ఓటు వేయాల్సి వచ్చిందని, తప్పు జరిగిపోయిందని వేడుకున్నారు. వైఎస్సార్సీపీ తమకు రాజకీయ జీవితాన్ని, గుర్తింపునిచ్చిందని, తాము ఎప్పటికీ జగనన్న వెంటే నడుస్తామని పేర్కొన్నారు. కూటమికి అనుకూలంగా ఓటు వేసేందుకు తాను నిరాకరించినట్లు అమర్నాథ్రెడ్డి వెల్లడించారు. ఉప ఎన్నికలో ఆయన ఎవరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు. వారిని ఓదార్చలేక భూమన కంట తడి పెట్టారు. పాలకొండలో పారని పచ్చ పాచిక!పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలో కూటమి నాయకుల పాచికలు పారలేదు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఐక్యతతో వారి యత్నాలు బెడిసికొట్టాయి. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఎమ్మెల్యే జయకృష్ణతో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన మరో కౌన్సిలర్తో కలిపి నలుగురు మాత్రమే ఎన్నిక కోసం హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల కోసం నిరీక్షించినా ఎవరూ హాజరు కాకపోవడంతో కోరం లేక ఎన్నికను నిలిపివేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. పిడుగురాళ్లలో ఒక్కరు లేకున్నా...పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. రెండు రోజులుగా ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడం, కోరం లేని కారణంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరగలేదని రిటర్నింగ్ అధికారి మురళీ కృష్ణ తెలిపారు. కూటమికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కేసుల పేరుతో తమ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు.విప్ను తిరస్కరించిన ఎన్నికల అధికారితిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ సీపీ జారీ చేసిన విప్ని ఎన్నికల అధికారి శుభం బన్సల్ తిరస్కరించారు. మంగళవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణారెడ్డి విప్ లిస్ట్ను ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్కి అందచేసేందుకు యత్నించగా సమయం మించిపోయినందున తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. తాను ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశ మందిరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. విప్ లిస్ట్ని ఎన్నికల అధికారి తిరస్కరించటంతో విప్ జారీ చేయకుండానే తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికను నిర్వహించారు.మూడు చోట్ల ఎన్నికలు వాయిదాసాక్షి, అమరావతి: మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు మంగళవారం కూడా వాయిదా పడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికతో పాటు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు ‘కోరం’ లేని కారణంగా వాయిదా పడగా.. కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ ఎన్నికను ఉద్రిక్త పరిస్థితులు కారణంగా వాయిదా వేసినట్లు స్థానిక జిల్లాల అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమాచారమిచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడు నగర, ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం 12 డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం కేవలం ఐదు చోట్ల ఏడు పదవులకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన ఐదు చోట్ల ఐదు పదవులకు ఎన్నిక మంగళవారానికి వాయిదా, పడగా కేవలం రెండు చోట్ల మాత్రమే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. నందిగామలో పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి మునిసిపల్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు.పోలీసులపై దాడికి శాప్ చైర్మన్ యత్నంతిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం మంగళవారం ఉదయం భూమన కరుణాకరరెడ్డి నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో బయలు దేరిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల వాహనాన్ని అడ్డుకునేందుకు శాప్ చైర్మన్ రవినాయుడు యత్నించగా, పోలీసులు నిరోధించారు. రవినాయుడు తిడుతూ దాడికి యత్నించడంతో ఇద్దరు పోలీసులు కిందపడ్డారు.నరకయాతనకు గురిచేశారు.. ఒక్కసారిగా మా వాహనంపై 300 మంది రౌడీలు దాడి చేశారు. నాతోపాటు మరో ముగ్గురు కార్పొరేటర్లను చితకబాది గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా హింసించారు. మా కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తామని బెదిరించడంతో ఆ పార్టీకి వంత పాడాల్సి వచ్చింది. ఇది క్షమించరాని నేరంగా భావిస్తున్నా. భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో నా ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తా. – డాక్టర్ అనీష్ రాయల్, 45వ డివిజన్ కార్పొరేటర్, తిరుపతి భౌతిక దాడులను తట్టుకోలేక.. కూటమి నేతలు మమ్మల్ని కిడ్నాప్ చేసి శారీరకంగా హింసించి రహస్య ప్రాంతంలో బంధించారు. కూటమికి సపోర్ట్ చేయకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. భౌతిక దాడులకు తట్టుకోలేక వారు చెప్పినట్టే వినాల్సి వచ్చింది. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన భూమన కుటుంబం మాకు దైవంతో సమానం. – బోకం అనీల్ కుమార్, 50వ డివిజన్ కార్పొరేటర్, తిరుపతి రాజకీయ జీవితం వైఎస్సార్సీపీతోనే.. ఎలాగైనా డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవాలని మమ్మల్ని కిడ్నాప్ చేశారు. ప్రాణం పోయినా సరే వైఎస్సార్సీపీతోనే ఉంటా. కూటమి నేతలు భయభ్రాంతులకు గురిచేయడంతో వారికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. – మోహన్కృష్ణ యాదవ్, 16వ డివిజన్ కార్పొరేటర్, తిరుపతితటస్థంగా ఉన్నా.. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి రుణపడి ఉంటా. నన్ను కిడ్నాప్ చేసి ఎన్ని చిత్రహింసలు పెట్టినా టీడీపీకి ఓటు వేసేది లేదని తటస్థంగా ఉన్నా. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తారనే భూమన కరుణాకర్ రెడ్డి అన్న దగ్గరకు వచ్చి నా ఆవేదన చెప్పుకొన్నా. – పుల్లూరు అమరనా«థ్ రెడ్డి, 5వ డివిజన్ కార్పొరేటర్, తిరుపతి -
తిరుపతి ఉప ఎన్నిక: దిక్కుతోచని స్థితిలో టీడీపీ..
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలతో జిల్లాలో టీడీపీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ఆ పార్టీ గడిచిన రెండేళ్లుగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించకపోగా, ఆ పార్టీని ఓడించిన ప్రజలను దూషిస్తూ, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ రాజకీయాలు చేసింది. వీటిని పట్టించుకోని ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోకడలకు మరోసారి షాక్ ఇచ్చారు. తాజాగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండి ఉంటే.. ఆ పార్టీ పరిస్థితి “మిడతం బొట్లు’ మాదిరిగా ఉండేది. పోటీలోకి దిగడమే కాక ఎన్నికల ప్రచారంలోనూ ఓటర్లను, ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడంతో మరోసారి కొట్టిన ఓటు దెబ్బ చెంప పెట్టు అయింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ జిల్లాలో జనాదరణ కోల్పోయింది. నానాటికి పార్టీ క్షీణదశకు చేరుకుంటుంది. సార్వత్రిక ఎన్నికలతో మొదలైన ఆ పార్టీ పతనం.. తాజాగా జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలతో సమాధి దశకు చేరుకుంది. రెండేళ్ల క్రితం అధికారంలో ఉన్న ఆ పార్టీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 36 శాతం ఓట్ షేర్ను దక్కించుకుంటే.. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 32 శాతం ఓట్ షేర్కు పతనమైంది. సాధారణంగా రెండేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. కానీ ఇందుకు భిన్నంగా అధికార పారీ్టకి ప్రజాదరణ, ఓట్ షేర్ పెరగడం విశేషం. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలకే దిమ్మ తిరిగేలా ఫలితాలు వెలువడ్డాయి. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీకి దీటుగా ఓట్లు సాధించలేని పరిస్థితి. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వారం రోజులకు పైగా జిల్లాలో మకాం వేసి ప్రతి నియోజకవర్గంలో రోడ్షోలు, డోర్టు డోర్ క్యాంపెయిన్లు, సమీక్షలతో నానా హడావుడి చేసినా ఓటర్లే కాదు టీడీపీ క్యాడర్ కూడా పట్టించుకోలేదు. పర్యవసానంగా నాలుగు నియోజకవర్గాల్లో పాస్ మార్కులు కూడా రాని పరిస్థితి. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ 32 శాతానికి మించి ఓట్లు దక్కించుకోలేని స్థితిలోకి ప్రధాన ప్రతిపక్షం పడిపోయింది. ఓటు బ్యాంక్ పతనం దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి జిల్లాలో గట్టి ఓటు బ్యాంక్ ఉండేది. గతంలో అనేక దఫాలుగా ఆ పారీ్టకి అధికారాన్ని కట్టబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా, ప్రజలను, పార్టీ కేడర్ను గాలికి వదిలేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, తన పరిపాలన విధానంతో ప్రతి వర్గాన్ని తీవ్రంగా నష్టపరిచింది. ఈ పరిణామాలే ఆ పార్టీ శాపంగా పరిణమించారు. గెలుపోటములు ఎన్నికల్లో సర్వసాధారణమే అయినా.. టీడీపీ అధినేత నుంచి క్షేత్ర స్థాయిలో సెకండ్ లీడర్ల స్థాయి వరకు హుందాతనం రాజకీయాలు వదిలేశారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించపోగా, ఓడించారని ప్రజలను దుర్భాషలు, ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చే విధంగా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు, కుతంత్రాలు, సీఎంపై వ్యక్తి గత దూషణలకే ప్రాధాన్యత ఇచ్చింది.ఇవే ఆ పార్టీ పతనానికి సమాధి రాళ్లు అయ్యాయి. రెండేళ్ల తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్, తిరుపతి ఉప ఎన్నికల్లోనూ తన పంథాను మార్చుకోకపోవడంతో ప్రజలు దిమ్మదిరిగే షాక్ను ఇచ్చారు. ఇన్నాళ్లు ఆ పార్టీ కోసం కష్టపడిన నేతలతో పాటు ఆదరించిన అభిమానులు దూరమయ్యారు. సార్వత్రిక ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో ఓటు బ్యాంకు కోల్పోతూ వచ్చింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ 2019 ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికల నాటికి 69,537 ఓట్లను కోల్పోయింది. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ 32 శాతానికి మించి ఓటింగ్ షేర్ దక్కని పరిస్థి«తి. ఓ వైపు కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ లేమి ఏర్పడింది. మరి కొన్నిచోట్ల నాయకుల హడావుడి తప్ప క్షేత్ర స్థాయిలో ప్రజల ఆదరణ లేకపోవడం టీడీపీ నేతలకు గట్టి షాక్ని మిగిల్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సూళ్లూరుపేట, సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో టీడీపీకి 2,74,110 ఓట్లు దక్కాయి. సరిగ్గా రెండేళ్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇవే నియోజకవర్గాల్లో 2,04,573 ఓట్లు దక్కాయి. అంటే 69,537 ఓట్లు తగ్గడంపై నేతలు తలలు పట్టుకుంటున్నారు. బీజేపీకి 30 వేలు లోపే జిల్లాలో జాతీయ పార్టీ బీజేపీ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఆకాశమే హద్దుగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో పాటు మతతత్వ రాజకీయాలతో లబ్ధి పొందడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు బలంగా తిప్పి కొట్టారు. పర్యవసానంగా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కనీసం 9 వేల ఓట్లు కూడా రాని పరిస్థితి. ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రా, తెలంగాణ బీజేపీ కీలక నేతలంతా తిరిగి మండలాల వారీగా విస్తృత ప్రచారం చేసినా కమలం వైపు ఓటర్లు కన్నెత్తి కూడా చూడలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కలిపినా 29,800 ఓట్లు దక్కాయి. సర్వేపల్లిలో 7,025 ఓట్లు, గూడూరులో 6,613, సూళ్లూరుపేటలో 8,890, వెంకటగిరిలో 7,280 ఓట్లు లభించాయి. జిల్లాలో బీజేపీకి నాయకులు లెక్కకు మించి ఉండడం విశేషం. నేల విడిచి స్వాము చేసినా.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలోకి ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ నేల విడిచి స్వాము చేసినా ప్రజలు ఆదరించలేదు. ప్రతి నియోజకవర్గంలో రోడ్షో, కొన్ని చోట్ల డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడంతో పాటు ప్రతి నియోజక వర్గంలోనూ సమీక్షలు నిర్వహించి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఎన్నికల ప్రారంభం నుంచే జిల్లాలో హడావుడి చేసిన టీడీపీ ముఖ్య నేతలంతా ఎన్నికలకు ముఖం చాటేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గాన్ని స్థానిక ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా మాట్లాడారు. ప్రతి చోటా ఇదే ఫార్మూలా పాటించినప్పటికీ ప్రజల నుంచే కాకుండా టీడీపీ క్యాడర్ నుంచి కూడా స్పందన రాని పరిస్థితి. జిల్లాలో టీడీపీ కీలక నేతలుగా చెలామణి అవుతున్న బీద రవిచంద్ర ఎన్నికలకు పూర్తిగా ముఖం చాటేయగా, జిల్లా అంతా టీడీపీకి తానే అంటూ హడావుడి చేసిన సోమిరెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో మిగిలిన నియోజకవర్గాల కంటే భారీగా ఓట్లకు గండి పడడం విశేషం. 2019లో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి వచ్చిన ఓట్లలో 31,957, గూడూరులో 12,619, సూళ్లూరుపేటలో 3,122, వెంకటగిరిలో 21,839 ఓట్లు కంటే తగ్గాయి. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం పేరుతో భారీగా హడావుడి చేసినా కనీసం క్యాడర్ కూడా పట్టించుకోని పరిస్థితి. ఇక గూడూరులో మాజీ ఎమ్మెల్యే సునిల్కుమార్ అంతగా పట్టించుకోకపోవడంతో అభ్యర్థి పనబాక లక్ష్మి సొంత ప్రాంతం కావడంతో వారే పూర్తిస్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టారు. అయినా కానీ అక్కడ కూడా వర్కవుట్ కాలేదు. ఇక వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ నాలుగు రోజులు హడావుడి చేసి ముఖం చాటేశారు. సూళ్లూరుపేటలోని నేతలది ఇదే పరిస్థితి. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: చెక్కు చెదరని వైఎస్సార్సీపీ ఓట్ షేర్ తిరుపతిలో వైఎస్సార్సీపీ ఘన విజయం -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్ సీపీదే హవా
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. తన సిట్టింగ్ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైఎస్సార్ సీపీ 65.85%, తెలుగుదేశం పార్టీ 23.10%, బీజేపీ 7.34% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు తుది ఫలితాలకు 2 నుంచి 3 శాతం వరకు తేడా ఉండొచ్చని వెల్లడించింది. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం వైఎస్సార్ సీపీ 59.25%, టీడీపీ 31.25%, బీజేపీ 7.5% ఓట్లు సాధిస్తాయని స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించనున్నారని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, మే 2వ తేదీ ఆదివారం తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. చదవండి: మనసా వాచా కర్మణా ‘స్వచ్ఛ సంకల్పం’ చేయాలి ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
చంద్రబాబు సభ: ఆ రాయి ఎలా వచ్చింది?
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సభలో రాళ్ల దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చంద్రబాబు సభ మొత్తం సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు సీసీ ఫుటేజీల పరిశీలించగా, చంద్రబాబు సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనపడలేదు. గాయాలైన వ్యక్తుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. సదరు వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. చంద్రబాబు చూపిన రాయి అసలు ఆ ప్రాంతంలోనే లేనట్టు నిర్ధారణ అయ్యింది. చంద్రబాబు సభలో రాయి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కాగా, తిరుపతి ఉప ఎన్నిక వేళ చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపిన సంగతి విదితమే. రాజకీయ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆయన ఈ ఎన్నికలో డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళనలో తనపై రాయి విసిరారంటూ సోమవారం రాత్రి అప్పటికప్పుడు ఒక కట్టుకథ అల్లారు. అది నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతోందంటూ పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే.. రాయి ఎవరికి తగిలిందో.. ఎవరికేం అయిందో చెప్పలేక తుదకు అభాసుపాలయ్యారు. చదవండి: ఎన్నికల వేళ ఎన్నెన్ని వేషాలో! నవరత్నాల క్యాలెండర్ విడుదల -
తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం సృష్టించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్గా తేలడంతో టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. చంద్రబాబుతో కలిసి అనిత, సంధ్యారాణి తిరుమల దర్శనానికి వెళ్లిన ఆ మరుసటి రోజునే అనిత, సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో కరోనా భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు. చదవండి: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వీరంగం.. కానిస్టేబుల్పై కత్తితో దాడి చంద్రబాబు, నారా లోకేశ్పై డీజీపీకి ఫిర్యాదు -
‘టీడీపీ త్వరలో తెరమరుగయ్యే పార్టీ’
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి విజయం ఖాయమని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయతకు జనం జేజేలు కొడుతున్నారన్నారు. శంఖారావం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజల ఆదరణతో వైఎస్సార్సీపీకి అద్వితీయమైన బలం వచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి సీఎం జగన్ జననేతగా ఎదిగారు. ఏడాదిన్నరకాలంగా సీఎం జగన్ నవరత్నాలతో నవశకాన్ని తెచ్చారు. టీడీపీ త్వరలోనే తెరమరుగయ్యే పార్టీల్లో ఒకటి. నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. లోకేష్కు ఇంకా రాజకీయ పరిణతి రాలేదు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి బీజేపీ దిగజారిపోయింది’’ అని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. చదవండి: ‘కూన’ గణం.. క్రూర గుణం బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్చల్ -
‘ఢిల్లీ వరకు ఆ రీసౌండ్ వినిపించాలి’
సాక్షి, చిత్తూరు: జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గండికోట నుంచి గాలేరుకు నగరి జలాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. పైప్లైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా గురుమూర్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలన్నారు. సామాన్యులను పార్లమెంట్కు పంపించిన ఘనత సీఎం జగన్దన్నారు. మాధవి, నందిగం సురేష్లాగానే గురుమూర్తి కూడా పార్లమెంట్కు వెళ్తారని కన్నబాబు ధీమావ్యక్తం చేశారు. చదవండి: కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే: అంబటి -
ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అకాల మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది. తిరుపతి, కర్నాటకలోని బెల్గాం లోక్సభ స్థానాలు, తెలంగాణ లోని నాగార్జునసాగర్ సహా వివిధ రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆ షెడ్యూల్లో తెలిపింది. ఈ ఎన్నికలకు మార్చి 23న నోటిఫికేషన్ జారీకానుంది. పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, వీవీప్యాట్లను వినియోగించనుంది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు ఏ జిల్లాలో ఉంటాయో ఆ జిల్లాలో ఎన్నికల నియమావళి తక్షణం అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ ఎన్నికలు జరిగే నియోజకవర్గం రాష్ట్ర రాజధాని పరిధిలోగాని, మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోగానీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగానీ ఉంటే ఎన్నికల నియమావళి కేవలం ఆ నియోజకవర్గ పరిధికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. 2021 జనవరి ఒకటో తేదీ నాటికి ఖరారైన ఓటర్ల జాబితాతో ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 30–03–2021 నామినేషన్ల స్క్రూటినీ: 31–03–2021 నామినేషన్ల ఉపసంహరణకు గడువు: 03–04–2021 పోలింగ్ తేదీ: 17–04–2021 కౌంటింగ్ తేదీ: 02–05–2021 -
2,94,781 మంది ఓటర్లు
తిరుపతి ఉపఎన్నికలో ఓటు వినియోగానికి అవకాశం తుది జాబితా విడుదల చేసిన ఆర్వో తిరుపతి తుడా: తిరుపతి ఓటర్ల తుది జాబితా ను ఆర్వో వీ.వీరబ్రహ్మయ్య మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో విడుదల చేశారు. 2015 జనవరి 27 నాటికి 2,94,781 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది జాబితాను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. పురుషులు-1,50,043, మహిళలు-1,44,699, ఇతరులు- 39 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఈ నెల 13న జరగనున్న తిరుపతి ఉపఎన్నికలో వీరంతా ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లను అధికారులు క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత జాబితాను విడుదల చేసినట్టు చెప్పారు. ఏర్పాట్లకు ఆదేశం పోలింగ్ దగ్గరకు సమీపిస్తుండటంతో ఆర్వో ఏర్పాట్లపై దృష్టి సారించారు. తిరుపతి అసెంబ్లీలో 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో అవసరమయ్యే ఏర్పాట్లును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లో తాగునీరు, లైటింగ్, బారికేడ్లు స్టేషన్ నంబర్లు కనిపించేలా అతికించడం వంటి వాటిపై దృష్టి సారించాలని పీవో, ఏపీవోలకు ఆదేశాలు జారీ చేశారు.