vijayendra
-
బీజేపీలో ముసలం.. పార్టీ ఎమ్మెల్యేకు హైకమాండ్ షోకాజ్నోటీసులు
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా.. మరొకటి సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ గ్రూప్గా తయారైంది. పార్టీలో అంతర్గత విబేధాల నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.తాజాగా బసనగౌడ, విజయేంద్ర వివాదంపై బీజేపీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. ఈ మేరకు బసనగౌడ యత్నాల్కు షోకాజ్ నోటీసులు అందించింది. పార్టీ సిద్దాంత వ్యతిరేక వ్యాఖ్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లేకుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందని తెలిపింది.‘రాష్ట్ర స్థాయి పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా యత్నాల్ ప్రవర్తిస్తున్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించడం, బహిరంగ ప్రకటనలు చేయడం ఆందోళన కలిగించే విషయం. యత్నాల్ వైఖరి రాజకీయ, ప్రజా ప్రాముఖ్యత ఉన్న అన్ని విషయాలపై పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉంది. పార్టీ నాయకులపై మీరు చేసిన తప్పుడు, ఆరోపణలు పార్టీ క్రమశిక్షణను తీవ్రంగా ఉల్లంఘించడమే. మీ చర్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. లేనిపక్షంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది’ అని షోకాజ్ నోటీసులో పేర్కొంది. కాగా విజయేంద్రపై బసనగైడ తరుచూ విమర్శలు చేస్తున్నారు. విజయేంద్ర ఆయన వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని,పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆయనే కారణమయ్యారని ఆరోపించారు. ఈ క్రమంలోనే హైకమాండ్ చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక, తాజాగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, విజయేంద్రనే కారణమని పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరూ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణా నోటీసులపై స్పందించిన యత్నాల్.. పార్టీ నోటీసులకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు. కర్ణాటకలో పార్టీ ప్రస్తుత స్థితిని కూడా తెలియజేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వంతో విజయేంద్ర భేటీ అయిన నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడ్డాయి. రాజకీయ లబ్ధి కోసం యత్నాల్ తనపై, తన తండ్రి బీఎస్ యడియూరప్పపై నిత్యం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విజయేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. -
షికారిపుర నుంచి విజయేంద్ర పోటీ
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్యపై పోటీ పడడానికి బీజేపీ నేత బి.ఎస్. యడియూరప్ప కుమారుడు వెనకడుగు వేశారు. వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న సిద్దరామయ్యపై తన కుమారుడు విజయేంద్ర పోటీపడే అవకాశాలున్నాయని నిన్నటికి నిన్న చెప్పిన యడియూరప్ప ఒక రోజు గడిచిందో లేదో మాట మార్చారు. తన కుమారుడు వరుణ నుంచి పోటీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. శివమొగ్గ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన షికారిపురి నుంచి విజయేంద్ర పోటీ చేస్తారని శుక్రవారం విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని హైకమాండ్కు కూడా చెప్పానని వెల్లడించారు. అయితే వరుణ నుంచి విజయేంద్ర పోటీ చేయాలన్న ఒత్తిడి ఉందని అంగీకరించారు. -
సిద్దరామయ్యపై యడ్డీ కుమారుడు పోటీ?
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు సిద్దరామయ్య మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్న వరుణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బి.ఎస్. యడియూరప్ప కుమారుడు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు బి.వై. విజయేంద్ర వరుణ నియోజకవర్గం నుంచి పోటీ పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యడియూరప్ప చెప్పడంతో రాజకీయంగా ఈ స్థానంపై ఆసక్తి పెరిగింది. మైసూరు జిల్లాలో ముఖ్య నియోజకవర్గాల్లో ఒకటైన వరుణకి ప్రస్తుతం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వరుణ నుంచి సిద్ధరామయ్య పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. సిద్దరామయ్యపై మీ కుమారుడు విజయేంద్ర పోటీ పడతారా అని గురువారం యడియూరప్పని విలేకరులు ప్రశ్నించగా ‘‘దీనిపై చర్చలైతే సాగుతున్నాయి. వరుణలో నెగ్గడం సిద్దరామయ్యకు అంత సులభం కాదు. మేము మంచి అభ్యర్థినే నిలబెట్టి గట్టి పోటీ ఇస్తాం. చూద్దాం ఏమవుతుందో’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సిద్దరామయ్య స్పందిస్తూ తనపై ఎవరు పోటీకి దిగినా పట్టించుకోనని అన్నారు. యడియూరప్ప పోటీకి దిగినా స్వా గతిస్తామని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ పేర్కొనడం విశేషం. -
నిఖిల్ సింహా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో తారల సందడి (ఫొటోలు)
-
సీఎం కుమారుడిపై చర్యలు తీసుకోండి
సాక్షి బెంగళూరు: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన కర్ణాటక సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విజయేంద్ర ఆలయంలో పూజలు చేసిన ఘటనపై లెట్కిట్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా, న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నంజనగూడు ఆలయానికి విజయేంద్ర వెళ్లడం నిజమేనని, 5నిమిషాలు మాత్రమే ఆయన ఆలయంలో ఉన్నారని అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ ఈ ఘటనను సమర్థించే ప్రయత్నం చేశారు. దీనిపై హైకోర్టు మండిపడింది. ఆలయంలోకి ప్రవేశించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. చదవండి: ఒకటి రెండూ కాదు.. వందేళ్లకు పైబడ్డ చరిత్ర, మరెన్నో విశేషాలు! -
నేను సూపర్ సీఎంను కాదు:సీఎం కుమారుడు
బెంగళూరు : నేను సూపర్ సీఎంను కాదు, సీఎం యడియూరప్ప పనుల్లో నేను జోక్యం చేసుకోవడం లేదు అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. శనివారం గవిగంగాధరేశ్వర దేవాలయంలో ఆయన పూజలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ నా పరిమితి ఏమిటనేది తెలుసు, నేను సీఎం కుమారుడిని అయినా తండ్రి పనుల్లో వేలు పెట్టడం లేదు అన్నారు. కాగా, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బడ్జెట్ ద్వారా సమాధానం చెబుతానని సీఎం యడియూరప్ప తెలిపారు. శనివారం సాయంత్రం మైసూరులోని మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ను రూపొందిస్తున్నా, రెండు శాఖలతో మాత్రమే సమావేశం జరపాల్సి ఉంది అన్నారు. ప్రభుత్వం టేకాఫ్ కాలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బడ్జెట్ ద్వారానే బదులిస్తానన్నారు. రిజర్వేషన్ల కోసం ఆయా సామాజికవర్గాలు చేస్తున్న పోరాటాన్ని అర్థం చేసుకోగలనని, వారందరికి తప్పక న్యాయం చేస్తానని చెప్పారు. -
ఆవేదనతో ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్య
మైసూరు: కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప కొడుకు విజయేంద్రకు పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆవేదన చెందిన ఇద్దరు కార్యకర్తలు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్రకు పోటీగా యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను వరుణ స్థానం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ యోచించింది. దీంతో విజయేంద్ర నియోజకవర్గంలో రెండు వారాలపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే అధిష్టానం చివరి నిమిషంలో విజయేంద్రకు మొండిచేయి చూపింది. దీంతో గర్గేశ్వరినికి చెందిన హెళవరహుండి గూళప్ప, సరగూరుకు చెందిన బసవణ్ణలు ఆవేదన చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యచేసుకున్నారు. -
బరిలో సీఎంల తనయులు
సాక్షి, బెంగళూరు: కన్నడనాట విధానసభ ఎన్నికల్లో ప్రస్తుత, పలువురు మాజీ ముఖ్యమంత్రుల తనయులు బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్ర వరుణ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతారని గతంలో ప్రకటించారు. అయితే ఆయనకు వరుణ నుంచి ఇంకా టికెట్ కేటాయించకపోయినప్పటికీ, విజయేంద్ర ఆ స్థానంలో పోటీ చేయడం దాదాపు నిశ్చయమేననీ, త్వరలోనే బీజేపీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం సిద్దరామయ్య తన ప్రస్తుత నియోజకవర్గం వరుణను వదిలేసి చాముండేశ్వరి నుంచి బరిలోదిగారు. యతీంద్రతో పాటు దాదాపు 10 మంది వరకు మాజీ సీఎంల వారసులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. గతంలో సీఎంలుగా చేసిన గుండూరావు, జేహెచ్ పటేల్, ఎస్ఆర్ బొమ్మై, ధరమ్ సింగ్ తదితరులు కొడుకులను ఈసారి విధానసభ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిపారు. ఇక మాజీ సీఎం బంగారప్ప ఇద్దరు పుత్రులు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. కుమార బంగారప్ప బీజేపీ నుంచి, మధు బంగారప్ప కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారులిద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా దేవెగౌడ కొడుకు, మాజీ సీఎం కుమారస్వామే. యతీంద్ర వర్సెస్ విజయేంద్ర.. ప్రస్తుత ఎన్నిల్లో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులైన సిద్దరామయ్య, యడ్యూరప్ప వారసులు ఇద్దరూ ఒకే స్థానం నుంచి పోటీ చేస్తుండటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కుటుంబ రాజకీయాలకు ఆద్యుడైన దేవెగౌడను గతంలో సిద్దరామయ్య విమర్శించేవారు. జేహెచ్ పటేల్ కుమారుడు మహిమా పటేల్ దావణగెరి జిల్లాలోని చెన్నగిరి నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థిగా, ధరంసింగ్ తనయుడు అజయ్ సింగ్ కలబురిగి జిల్లాలోని జీవర్గి నుంచి, హావేరి జిల్లాలోని శిగ్గావ నుంచి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ బొమ్మై బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. అలాగే దివంగత మాజీ సీఎం గుండూరావ్ కొడకు, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేష్ 5వ సారి ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆయన ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బెంగళూరులోని గాంధీనగర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పోటీలో శ్రీమంతులు దొడ్డబళ్లాపురం: కర్ణాటక ఎన్నికల బరిలో పలువురు శ్రీమంతులు దిగుతున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలుచేసిన వారిలో కొందరి ఆస్తులు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంటీబీ నాగరాజు తమ కుటుంబ ఆస్తి విలువ రూ.1,015కోట్లుగా పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ.102 కోట్లుగా చూపగా, రూ.27 కోట్ల 70 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తమ మొత్తం ఆస్తి విలువను రూ.470కోట్లుగా ప్రకటించడం గమనార్హం. అంటే ఈ ఐదేళ్లలో అది రెట్టింపైంది. కాగా, కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన విద్యుత్ మంత్రి డీకే శివకుమార్ ఆస్తి కూడా గత ఎన్నికల సమయంలో ప్రకటించిన దానికి రెట్టింపైంది. ఈసారి ఆయన తన ఆస్తి విలువను రూ.549 కోట్లుగా ప్రకటించారు. 2008లో కేవలం రూ.75కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి 2013 ఎన్నికల నాటికి రూ. 251 కోట్లకు పెరిగింది. కాగా, శుక్రవారం మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నామినేషన్ వేశారు. ఎంటీబీ నాగరాజు -
విజయేంద్ర బాహుబలి
-
హెచ్పీసీఎల్ చెస్కు విజయేంద్ర
సాక్షి, హైదరాబాద్: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) చెస్ జట్టుకు విజయేంద్ర కుమార్, రాహుల్ గుప్తా ఎంపికయ్యారు. వీరితో పాటు మరో ఇద్దరు అజిత్, గోలప్ దాస్లు కూడా నగరం నుంచి అర్హత సాధించారు. హైటెక్ సిటీలోని హెచ్పీసీఎల్ బిల్డింగ్లో గురువారం నిర్వహించిన సెలక్షన్ టోర్నమెంట్లో విజయేంద్ర ఏడు రౌండ్లకు గాను 6.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ సెలక్షన్ టోర్నీలో రాహుల్ గుప్తా కూడా ఆరున్నర పాయింట్లు సాధించినప్పటికీ ప్రోగ్రెసివ్ స్కోరు ఆధారంగా రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అజిత్ (5), గోలప్ దాస్ (4)లు వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందారు. వీరంతా జాతీయ స్థాయిలో జరిగే ఆలిండియా హెచ్పీసీఎల్ చెస్ చాంపియన్షిప్లో పాల్గొననున్నారు. ఈ టోర్నీ ఈ నెల 23, 24 తేదీల్లో మంగళూరు (కర్ణాటక)లో జరగనుంది.