Vital
-
చిరుధాన్యాలతో.. విఠల్ చిత్రాలు!
ముప్పిడి విఠల్ ఓ ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్. కొన్ని సంవత్సరాలుగా రాంనగర్లో ఓ ఆర్ట్ గ్యాలరీని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్పొరేట్ విత్తన సంస్థ విఠల్ను సంప్రదించింది. సంస్థకు చెందిన కీలక వ్యక్తి ఉద్యోగ విరమణ పొందుతున్నారు. అతడికి గతంలో ఎవరూ ఇవ్వని ప్రత్యేకమైన జ్ఞాపికను ఇవ్వాలనుకుంటున్నాము చేసి పెట్టగలరా అని అడిగారు. దీనికి మీ సంస్థ నేచర్ ఆఫ్ వర్క్ ఏమిటి? అని అడిగాడు విఠల్. దీనికి బదులుగా విత్తనాలు అమ్మే సంస్థ అని చెప్పారు. వెంటనే చేసి పెడతాను అతడి ఫోటో ఒకటి నాకు ఇవ్వండి అని చెప్పారు. అలా స్కెచ్ ఆర్టిస్ట్ నుంచి చిరుధాన్యాల ఆర్టిస్ట్గా మారాడు విఠల్.. ఆ వివరాలు తెలుసుకుందాం.. – ముషీరాబాద్స్వతహాగా రైతు కుటుంబం నుంచి రావడం, సంస్థ కూడా విత్తనాలు అమ్మేది కావడం, విఠల్ కూడా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఆర్టిస్ట్ కావడంతో వారు చెప్పగానే వెంటనే కనెక్ట్ అయ్యాడు. విత్తనాలతోనే అతడి బొమ్మను గీసి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వడ్లు, పెసర్లు, మినుములు, కందులు, జోన్నలు వంటి చిరుధాన్యాలే వస్తువులుగా వాడి సుమారు 15 రోజుల పాటు కష్టపడి అందమైన ఫొటోను తయారు చేసి ఇచ్చాడు. దీంతో ఈ ఫొటో వారిని అమితంగా ఆకట్టుకుంది. దీంతో ఆ సంస్థకు ఆస్థాన ఆర్టీస్టుగా మారిపోయాడు.మలుపుతిప్పిన హర్షాబోగ్లే పెయింటింగ్..ఆ తరువాత సంస్థ ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షాబోగ్లే సన్మాన కార్యక్రమంలో ఆయనకు కూడా ఇటువంటి వర్క్తో ఫొటో చేయించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ డైరెక్టర్ జనరల్, హర్షబోగ్లేలు ఈ ఫొటోను చూసి ఎంతో ముగ్ధులయ్యారు. ఆ తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్కు ఇదే తరహా ఫొటోను ప్రజెంట్ చేయడంతో ఆయన కూడా ముగ్ధుడై ఇదే తరహాలో ప్రధాని నరేంద్రమోడీకి కూడా వేయాలని విఠల్ను కోరారు.యూపీలోని గోరఖ్పూర్లో కిసాన్ సమాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోడీకి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్ ముప్పిడి విఠల్ పెయింటింగ్నే జ్ఞాపికగా అందజేయడం దానికి మోడీ ముగ్ధుడవ్వడం గమనార్హం. ఆ తరువాత ఎలాగైనా మోడీని కలవాలనుకున్న విఠల్ మరో బొమ్మను వేసి ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్వయానా అందజేశారు. అలాగే రైతు బంధు స్కీమ్ ప్రకటించిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్కూ ఈ పెయింటింగ్ స్వయంగా అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెయింటింగ్ను తయారు చేస్తున్నారు.ఎలా వేస్తారు?మొదటగా పెన్సిల్తోచిత్రం ఔట్ లైన్ గీసుకుని వాటిపై ఫెవికాల్ రాస్తు ఒక్కొ వడ్ల గింజను పేర్చుతాడు. శరీర రంగును బట్టి ఏ విత్తనమైతే అక్కడ సరిపోతుందో దాన్ని పేర్చుకుంటూ సైజు చూసుకుంటూ పెయింటింగ్ వేస్తాడు. అప్పుడే చిత్రం ఎలా ఉంటుందో అలా రూపుదిద్దుకుంటుంది. ఒక్కో పెయింటింగ్ వేయడానికి 15–20 రోజుల సమయం పడుతుంది. అభిమానంతో మోడీ, కేసిఆర్లకు మాత్రమే ఉచితంగా పెయింటింగ్ వేసి ఇచ్చారు. ఇవి ప్రస్తుతం 30–40 వేల వరకూ విక్రయిస్తున్నారు.ఇదీ నేపథ్యం..మెదక్ జిల్లాకు చెందిన ముప్పిడి విఠల్ తెలుగు యూనివర్సిటీలో బీఎఫ్ఏలో పట్టాపొందారు. ల్యాండ్ స్కేప్ పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన విఠల్ ఆ వాతావరణంతోనే స్ఫూర్తి పొందారు. 30 సంవత్సరాల నుంచి ఇదే రంగంలో ఉంటూ గ్రామీణ వాతావరణాన్ని పల్లెల్లో మనకు కనపడే దృశ్యాలను కనులకు కట్టినట్లు తన పెయింటింగ్స్ ద్వారా చూయించడం అతడి గొప్పతనం. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్తో పాటు పలు జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్లలో తన ల్యాండ్ స్కేప్స్ను ప్రదర్శనకు పెట్టి అందరి మనన్నలూ పొందారు. పలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్నారు.చిరుధాన్యాల చిత్రాలు నా గుర్తింపు..సహజంగా నేను ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్ని. ఇదే నా జీవితం. కానీ చిరుధాన్యాలతో వేసిన చిత్రాలే గుర్తింపు తెచ్చాయి. నగరంలో ఎంతో మంది పేరుమోసిన ఆర్టిస్టులు తమ చిత్రాల ద్వారా లక్షలు, కోట్లల్లో సంపాదించిన వారు ఉన్నారు. కానీ నా చిత్రం ద్వారా ప్రధానమంత్రి వరకూ వెళ్లగలిగిన వారిలో నేను ఒక్కడినే. ఈ చిత్రాలే నాకు గుర్తింపు తెచ్చాయి. చిత్రాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాను. – ముప్పిడి విఠల్, ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్ -
బీఆర్ఎస్కు మరో షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు ఊహించని షాక్ తగిలింది. విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెల్లడించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నికపై కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విఠల్కు రూ.50వేలు జరిమానా కూడా విధించింది.అయితే, 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నామినేషన్ విత్ డ్రా చేయలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల అనంతరం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఇదే సమయంలో ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరోవైపు.. విఠల్ లాయర్ అభ్యర్థనతో తీర్పును కోర్టు.. నాలుగు వారాలు సస్పెండ్ చేసింది. -
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మూడేళ్లుగా అగ్రస్థానంలో ఏపీ
సాక్షి అనంతపురం : రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యాపారులది కీలక పాత్ర అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. అందుకే వారితో తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటోందన్నారు. అనంతపురం వాణిజ్య సలహా కమిటీ సమావేశం తొలిసారిగా జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో సోమవారం నిర్వహించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఏడీసీసీబీ చైర్ పర్సన్ లిఖిత, నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత, పాలసీ కమిషనర్ రవిశంకర్, సేల్స్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ, వ్యాపార సంస్థలు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ గతంలో జై జవాన్ – జై కిసాన్ వంటి నినాదాలతో సైనికులు, రైతులను సమాజంలో ఉన్నతంగా చూసినట్లుగానే తమ ప్రభుత్వం వ్యాపారులనూ అంతే ఉన్నతంగా చూస్తోందన్నారు. రాజుల కాలం నుంచి పన్నుల వసూలు ప్రక్రియ కొనసాగుతోందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానపర నిర్ణయాలతో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా రాష్ట్రాన్ని మూడేళ్లుగా నంబర్–1 స్థానంలో నిలుపుతున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఎగుమతుల్లో ఏడో స్థానం నుంచి 4వ స్థానానికి తేవడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించాలన్న సంకల్పంతో నియోజకవర్గానికో స్కిల్ డెవలప్మెంట్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో 66 స్కిల్ డెవలప్మెంట్ హబ్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాకో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పన్నుల భారం మోపం వ్యాపారులపై పన్నుల భారం ఎట్టి పరిస్థితుల్లోనూ మోపేది లేదని మంత్రి బుగ్గన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న పన్నుల భారాన్ని సైతం తగ్గించాలన్న పట్టుదలతో సీఎం జగన్ ఉన్నట్లు తెలిపారు. గోవాలో జరిగిన 35వ జీఎస్టీ మీటింగ్లో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనగా.. కేంద్రంతో మాట్లాడి చింతపండు, నాపరాయి, మామిడి గుజ్జుపై జీఎస్టీ లేకుండా చేసుకోవడంలో విజయం సాధించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, పెద్ద పన్ను చెల్లింపుదారుల కోసం రాష్ట్ర స్థాయిలో, డివిజినల్ స్థాయిలో ఎల్టీఓలను నియమించామని తెలిపారు. ఆడిటింగ్ విభాగాన్ని వేరు చేసి, నూతన సర్కిళ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక నుంచి జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి వాణిజ్య సలహా మండలి సమావేశాలు నిర్వహించి, పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతామన్నారు. ‘అనంత’పై జగన్కు ప్రత్యేక అభిమానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అనంతపురం జిల్లా అంటే ప్రత్యేక అభిమానమని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. అనంతపురం – కర్నూలు జిల్లాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ను జిల్లాకు తీసుకువచ్చామని తెలిపారు. దేశంలో కేవలం రెండు జిల్లాల కోసం ఏర్పాటవుతున్న పారిశ్రామిక కారిడార్ ఇంకెక్కడా లేదని వెల్లడించారు. ఇప్పటికే అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో కియా, సిమెంట్, స్టీల్ పరిశ్రమలు ఉండగా, కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్ తరహాలో పారిశ్రామిక అభివృద్ధి కనిపించనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధిలో గణనీయమైన ప్రగతి ‘మా ప్రభుత్వం వచ్చాక అనేక సంస్కరణలు తీసుకొచ్చి, విజయవంతంగా అమలు చేస్తోంది. వ్యాపారులకు పన్నుల భారం తగ్గించడం మొదలు, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. అభివృద్ధిలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. అందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న సూచికలే నిదర్శనమని’ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. అయినా రాష్ట్రంలోని ప్రతిపక్షానికి ఇవేవీ కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని చానళ్లు, పత్రికల్లో ప్రతికూల వార్తలు రాయిస్తూ, ప్రసారం చేయిస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇది మంచిది కాదంటూ హితవు పలికారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యాపారులను భాగస్వాములుగా తమ ప్రభుత్వం చూస్తోందన్నారు. నాసిన్ అభివృద్ధికి సహకారం గోరంట్ల : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) అకాడమీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. నాసిన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన గిరిజాశంకర్, ఇతర ఉన్నతాధికారులతో కలసి పరిశీలించి..పురోగతిపై సమీక్షించారు. ఈ అకాడమీలో భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇబ్బంది పెట్టొద్దు గార్మెంట్స్ పరిశ్రమకు రాయదుర్గం ప్రసిద్ధి చెందింది. అనంతపురం 100 కిలోమీటర్ల దూరం ఉండగా, కర్ణాటకలోని బళ్లారి కొద్ది దూరంలోనే ఉంది. రాయదుర్గం వాసులందరూ బళ్లారి నుంచి ముడి వస్త్రం తెచ్చుకొని కూలికి బట్టలు కుట్టి, తిరిగి బళ్లారికి తీసుకెళ్తారు. బట్ట తెచ్చేటప్పుడు, తీసుకెళ్లేటప్పుడు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వారిపై దాడులు చేసి, పెద్ద ఎత్తున జరిమానా విధిస్తున్నారు. ఉప్పు, పప్పు వంటి కిరాణా సరుకులు తెచ్చుకునే వారిపైనా దాడులు ఆపడం లేదు. ఇలాగైతే సామాన్యులు ఎలా బతకాలి? అటువంటి వారిపై అధికారులు దాడులు చేయడం గానీ, కేసులు పెట్టడం గానీ చేయకుండా చూడండి. – కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, పన్నులు తక్కువ ఉంటేనే చెల్లింపులు పామిడిలో జీన్స్, నైటీలు కుట్టి అమ్ముకునే కూలీలు ఎక్కువ. ఉరవకొండలో నేత కారి్మకులు ఎక్కువ. వీరందరూ కూలికి వస్త్రం తెచ్చుకొని కుట్టి, మళ్లీ కర్ణాటకకు తీసుకెళ్లి యజమానులకు ఇస్తుంటారు. కొందరు అతి తక్కువ ధరకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. వారు ఈ పని తప్ప మరే పనీ చేయలేరు. అటువంటి వారిని అధికారులు పన్నులు కట్టాలంటూ వేధిస్తున్నారు. పన్నులను విపరీతంగా పెంచి ఆదాయం పెంచుకోవాలనుకుంటేనే సమస్యలొస్తాయి. పన్ను భారం తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ నిజాయితీగా పన్ను కట్టేందుకు మొగ్గు చూపుతారు. – వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ (చదవండి: పరిటాల పాపం.. రైతులకు శాపం) -
MLC Polls: టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ కోటీశ్వరుడు..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ స్థానిక శాసనమండలి బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు వెల్లడయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ స్థిర, చరాస్తులు కలిపి మొత్తం ఆస్తులు రూ.6.20 కోట్లు ఉండగా, ఆయన భార్య పేరిట రూ.13.29 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక విఠల్ వివిధ బ్యాంకులకు రూ.23.29 లక్షలు బాకీ ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఇంద్రవెల్లి మండలానికి చెందిన పెందూర్ పుష్పరాణి స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ.50 లక్షలు ఉన్నాయి. ఎమ్మెల్సీ నామినేషన్తో సమర్పించిన అఫిడవిట్లో వీరిద్దరు వారి ఆస్తులను వెల్లడించారు. అలాగే పుష్పరాణిపై మూడు క్రిమినల్ కేసులు ఉండగా, ప్రస్తుతం అవి పెండింగ్లో ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ తనపై ఎలాంటి కేసులు లేవని తెలిపారు. చదవండి: MLC Elections: విఠల్ ఏకగ్రీవానికి టీఆర్ఎస్ విఫలయత్నం.. ‘విత్డ్రా’మా.. వివాదం పుష్పరాణి ఆస్తులు ఇలా.. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణి చరాస్తులు, స్థిరాస్తులు కలిపి మొత్తం రూ.50 లక్షలు ఉన్నాయి. వాటిని ఓ సారి పరిశీలిస్తే.. పుష్పరాణి వద్ద ప్రస్తుతం వెండి, బంగారం ఉంది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.25 లక్షలుగా ఉంది. పుష్పరాణి పేరున ఇంద్రవెల్లిలోని డొంగర్గావ్ సర్వే నంబర్ 77/225లో 3.39 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.25 లక్షలుగా ఉంది. విఠల్ ఆస్తులు ఇవీ.. దండె విఠల్ చరాస్తులు మొత్తం రూ.3కోట్ల 76లక్షల 33వేల 484 ఉన్నాయి. ప్రస్తుతం విఠల్ చేతిలో రూ.2లక్షల16వేల 500 నగదు ఉంది. హైదరాబాద్లోని ఐసీఐసీఐ బ్యాంకు పంజాగుట్ట, ఎస్బీఐ సనత్నగర్, యూనియన్ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.22.11లక్షలు ఉన్నాయి. నవీత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రూ.7.50 లక్షల షేర్, సాన్వీ ల్యాబొరేటరీస్లో రూ.1.65 కోట్ల షేర్, తాన్వీ హెల్త్ కేర్లో రూ.50 వేల షేర్, అనిక ఇన్ఫ్రా డెవలపర్స్లో రూ.28.25 లక్షల షేర్ ఉంది. ఇక తాన్వీ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1.38 కోట్లు, విఠల్ దగ్గరున్న 250 గ్రాముల జ్యావెల్లరీ విలువ రూ.12.50 లక్షలుగా ఉంది. స్థిరాస్తులు ఇలా.. విఠల్ పేరున మొత్తం స్థిరాస్తులు రూ.2కోట్ల 44లక్షల 64వేలు ఉన్నాయి. కాగజ్నగర్లోని వేంపల్లి శివారులో 10.08 ఎకరాల వ్యవసాయ భూమి, మోసం గ్రామ శివారులోని పలు సర్వే నంబర్లలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ రెంటి భూముల విలువ ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం రూ.44.64 లక్షలుగా ఉంది. రెబ్బెన మండల కేంద్రంలోని సర్వే నంబర్ 210లో 27,225 స్క్వేర్ ఫీట్స్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.20 లక్షలుగా ఉంది. ఇక సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో 1,953 స్క్వేర్ ఫీట్స్ స్థలంలో నివాస భవనం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.80 కోట్లు. ఇవే కాకుండా విఠల్ భార్య పేరున చరాస్తులు రూ.13.18 కోట్లు, స్థిరాస్తులు రూ.27.90 లక్షలుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఐసీఐసీఐ బ్యాంకులో విఠల్ తీసుకున్న హోమ్ లోన్కు సంబంధించి రూ.23.29 లక్షలు బాకీ ఉన్నారు. -
రెమిడెసివిర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ, కరోనా చికిత్సలో ప్రధానమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్కు ఏర్పడిన తీవ్ర కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుండి రెమిడెసివిర్ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో 4,50,000 మోతాదులను దిగుమతి చేసుకోనుంది. మొదటి విడతగా 75 వేల రెమిడెసివిర్ వయల్స్ను శుక్రవారం రిసీవ్ చేసుకోనుంది. దేశంలో భారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులతో రెమిడెసివర్ దిగుమతులపై దృష్టిపెట్టడంతో పాటు ఇప్పటికే దేశీయంగా ఈ ఔషధం ఎగుమతిని కేంద్రం నిషేధించింది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్, అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, యు ఈజిప్టు ఫార్మా మేజర్ ఇవా ఫార్మా సంస్థలనుంచి వీటిని కొనుగోలు చేయనుంది. రాబోయే ఒకటి రెండు రోజుల్లో గిలియడ్ సైన్సెస్ నుంచి భారత్కు 75వేల నుంచి లక్ష వయల్స్ వస్తాయని, మే 15లోగా లక్ష వయల్స్ చేరుతాయని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ తాజాగా ప్రకటించింది. వెల్లడించింది. అలాగే ఎవా ఫార్మా తొలుత పది వేల వయల్స్ దేశానికి అందించనుంది. జూలై వరకు ప్రతీ15 రోజులకొకసారి 50వేల వయల్స్ను వరకు మనదేశానికి పంపిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతోపాటు ప్రస్తుత కొరత నేపథ్యంలో ఈ ఔషద్ ఉత్పత్తులను పెంచడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలోని 7 దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వయల్స్ నుంచి 1.03 కోట్ల వయల్స్కు పెంచాయి. కాగా గత ఏడు రోజులలో (21-28 ఏప్రిల్) దేశవ్యాప్తంగా మొత్తం 13.73 లక్షల వయిల్స్ సరఫరా చేయగా, రోజువారీ రెమిడెసివర్ సరఫరా ఏప్రిల్ 11 న 67,900 డి ఏప్రిల్ 28 న 2.09 లక్షలకు పెరిగిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా శుక్రవారం ప్రకటించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,86,452 కొత్త కోవిడ్-19 కేసులు, 3,498 మరణాలు సంభవించాయి. 2,97,540 రోగులు డిశ్చార్జ్ అయ్యారు. -
మనకూ.. వైటల్ వెంటిలేటర్లు!
నాసా అభివృద్ధి చేసిన వైటల్ వెంటిలేటర్ను తయారు చేయడానికి మూడు భారతీయ కంపెనీలు లైసెన్సులు పొందాయి. కోవిడ్-19 రోగులకు క్లిష్టమైన పరిస్థితుల్లో చికిత్సనందించే ఈ వెంటిలేటర్లను తయారు చేసేందుకు ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ప్రాగ్ లిమిటెడ్, మేధా సర్వ్ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అనుమతి పొందినట్లు నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ కంపెనీలతోపాటు మరో 18 కంపెనీలకు ఈ అనుమతి లభించింది. వీటిలో 8 అమెరికన్ కంపెనీలు, 3 బ్రెజీలియన్ కంపెనీలు కూడా ఈ అనుమతులు పొందినట్లు నాసా వెల్లడించింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) క్యాలీఫోర్నియాలోని జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ(జేపీఎల్)లో ప్రత్యేకమైన వెంటిలేటర్లను అభివృద్ధి చేసింది. జేపీఎల్ ఇంజినీర్లు కరోనా రోగులకు సమర్థవంతంగా చికిత్సనందించే వైటల్ అనే వెంటిలేటర్ను రూపొందిచారు. అత్యవసర పరిస్థితులో ఈ వెంటిలేటర్ను వాడేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఏప్రిల్ 30న ఆమోదం తెలిపింది. డాక్టర్లు, మెడికల్ పరికరాల తయారీదారులను సంప్రదించి నాసా ఈ వైటల్ను అభివృద్ధి చేసింది. సంప్రదాయ వెంటిలేటర్ల కంటే అతితక్కువ వ్యయంతో వీటిని తయారు చేయవచ్చని నాసా పేర్కొంది. సాధారణ వెంటిలేటర్ తయారిలో వాడే పరికరాలలో 7 వంతు మాత్రమే వినియోగించి ఈ వైటల్ వెంటిలేటర్ను తయారు చేసినట్లు తెలియచేసింది. అయితే ఇది సమర్థవంతంగా పనిచేస్తుండడంతో అధిక మొత్తంలో వీటిని తయారు చేసేందుకు వివిధ కంపెనీలకు నాసా ఆనుమతులను మంజూరు చేస్తోంది. -
మతాతీత సంస్కరణలే మేలు
విశ్లేషణ ముస్లిం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు అని చెప్పి ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో నేటి పాలకుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అయ్యే రీతిలో వ్యవహరిస్తే అది ప్రజల మధ్య విద్వేషాలకు దారితీసి, దేశంలో మతపరమైన అశాంతికి ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉంది. దేశంలో 24 లక్షలమంది భర్తలు వదిలివేసిన స్త్రీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతర స్త్రీలే. వారు ఎంతో వ్యధకు, బతుకు బాధలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మహిళలందరికీ న్యాయం చేసే రీతిలో చట్టం రావాలి. ఇస్లాం మతం ప్రకారం తలాక్ తలాక్ తలాక్ అని ఒక భర్త మూడు సార్లు ఉచ్చరించినా లేదా ఫోన్లో గానీ, వాట్సాప్ వంటి వానిలో గానీ, మెసేజ్ ద్వారా సందేశం పంపినా ఆ భార్యకు భర్తతో విడాకులు జరిగిపోయినట్లేనని ప్రచారం! అందువలన ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనీ, ఈ విషాదస్థితి నుంచి వారిని విముక్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. ముస్లిం మహిళలకు సైతం మిగిలిన స్త్రీల వలే సమన్యాయం కలిగించేందుకు చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది కనుక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీ వివిధ పార్టీల ప్రతి నిధుల బృందానికి పంపి ఆసాంతం పరిశీలించిన తర్వాత, ఆ కమిటీ ఆమోదంతోనే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల వాదన! మూడుసార్లు తలాక్ అని చెప్పినంత మాత్రానే స్త్రీకి అన్యాయం చేస్తూ విడాకులు పొందే ఇస్లాం మత చట్టాన్ని రద్దు చేస్తే ప్రతిపక్షాలకు వ్యతిరేకత ఎందుకు? ముస్లిం మతతత్వవాదుల కొమ్ముకాయడం తప్ప మరేమిటి? అని మోదీ ప్రభుత్వ పెద్దల అభియోగం. సాధారణ దృష్టితో చూస్తే ఇది సవ్యం గానే తోస్తుంది. అయితే ఆ బిల్లు ప్రకారం అలా విడాకులు పొందిన ముస్లిం భర్తకు, మూడేళ్ల కఠిన కారాగారం విధించే అవకాశం ఉండటమే కాకుండా తాను విడాకులు ఇచ్చిన భార్యకు పోషణ నిమిత్తం కొంత భాగాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి గృహ హింసతో స్త్రీని శారీరకంగా, మానసికంగా హింసి స్తే–ఎలాగూ గృహహింస నిరోధక చట్టం ప్రకారం శిక్ష విధింపవచ్చు. ఇది అన్ని మతాల వారికి సమానమే. అలాంటప్పుడు ఒకే నేరానికి రెండు శిక్షలా అన్న సంగతి అటుంచి, భర్తను జైలులో నిర్బంధిస్తే, విడాకులు పొందిన భార్యకు పోషణ నిమిత్తం భరణం ఇమ్మంటే ఎలా తెచ్చి ఇస్తారు? అని మరో ధర్మసందేహం! ఇవేవీ అధిగమించలేని ఆటంకాలు కావు. కాలం చెల్లుతున్న తలాక్పై ఇంత రభసా..? పైకి ఏదో స్త్రీ జనోద్ధరణ కార్యంగా ప్రచారం చేసుకునే ఈ బిల్లు ముస్లిం మత వ్యతిరేక దుష్ప్రచారానికి ఆస్కారమిచ్చే రీతిలో ఉంది. ఇలా 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు పొందే అవకాశం నేటి ముస్లిం మత ఆచరణలో లేదు. అలా విడాకులు పొందేందుకు ఇస్లాం ప్రకారమే ఆచరణలో మొత్తం 5 నెలల వ్యవధిలో 3 సార్లు అలా తలాక్ అనాల్సి ఉంటుంది. ఈ లోపు భార్యాభర్తలకు చెందిన ఇరుపక్షాల పెద్దలు కూర్చుని, పరస్పర వాదనలు విని వారిని కలి పేందుకు ప్రయత్నించి, అవన్నీ విఫలమైన తర్వాతే తలాక్ అమలవుతుంది. నిజానికి కలహాల కాపురంలో పెద్దల జోక్యంతో పరిష్కారం కోసం జరిగే, సామరస్యపూర్వక యత్నం ఏ మతంలోని భార్యాభర్తల విషయంలోనైనా వాంఛనీయమే కదా. కాదు.. మా మతంలో అల్లా ఆదేశించిన దానిని సవరించే హక్కు పాలకులకు, ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నించే మత పెద్దలు అన్ని మతాలలో ఉండకపోరు. 4 వర్ణాలు అనే కులవిభజన నేనే చేశాను అని సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు. మరి అస్పృశ్యతతో సహా పరమ దుర్మార్గమైన ఈ వర్ణ వ్యవస్థ కొనసాగాల్సిందేనని ఎవరైనా హిందూ మతతత్వవాదులు అంటే అంగీకరించలేం కదా. అదలా ఉంచినా, హిందూమతంలో సతీసహగమనం, బహుభార్యత్వం ఆచారంగా అనుశ్రుతంగా ఉండేవి. అలాంటి దురాచారాలకు వ్యతిరేకంగా తీవ్ర అంతర్మథనం జరిగి వాటిని రద్దు చేయించుకోగలిగింది హిందూ సమాజం. అలాగే ఈ తలాక్ పేరుతో పురుషులు స్త్రీలను భోగవస్తువుగా చూడటం, వారిపట్ల అన్యాయంగా వ్యవహరించడం, కుటుంబ జీవితం అస్తవ్యస్తమై మహిళల పరిస్థితి దారుణ అణచివేతకు గురవడం వంటివాటిని ముస్లిం ప్రజానీకం, నేతలు మొదట గ్రహించి సంస్కరణలు తీసుకువచ్చారు. ముస్లిం లా లోనూ మార్పులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 3సార్లు వెనువెంటనే తలాక్ చెప్పడం ఇస్లాం చట్టంలో నేడు ఆచరణలో లేదు. పైగా ఈ తలాక్ వల్ల విడిపోయిన భార్యాభర్తలు ఇతర ఏ మతంతో పోల్చి చూసినా చాలా తక్కువ మందే ఉన్నారు. ముస్లిం స్త్రీకి ఆదినుంచే విడిపోయే హక్కు అంతే కాదు, ఇస్లాం చట్టంలో పురుషులకు తలాక్ ఎలా ఉన్నదో, అలాగే ముస్లిం స్త్రీలకు కూడా ‘కులా’ (విడిపోయే హక్కు) ఉన్నది. ముస్లిం స్త్రీ తన భర్త దుష్ప్రవర్తన వల్ల తానెంత వ్య«థ చెందుతున్నదో వారి మతగురువు ముందు వివరించి, తాను కూడా ‘కులా’ కోరవచ్చు. ఆయన ఇతర పెద్దలతో సంప్రదించి, ఆ హక్కు ఆమెకు మంజూరు చేయనూవచ్చు. అయితే అలాంటి హక్కు ద్వారా విడిపోయిన స్త్రీల సంఖ్య చాలా స్వల్పమే. ఒక ముస్లిం మతంలోనే స్త్రీలకు అన్యాయం జరుగుతున్నదని వాదించడం అసంబద్ధం. నిజానికి ఏ మతంలోనూ లేనట్లుగా ముస్లిం మతంలో చాలా ముందునుంచే స్త్రీకి ఆస్తిలో వాటా హక్కు ఉంది. ఆ మతంలోని మౌఢ్య పార్శా్వన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారు కానీ.. వైవాహిక బంధంలో పురుషునికెంత గౌరవం, హక్కూ ఉన్నదో స్త్రీకి కూడా అంతే సమానంగా ఉండాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఒకటి. ముస్లిం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు అని చెప్పి ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో నేటి పాలకుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అయ్యే రీతిలో వ్యవహరిస్తే అది ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో మతపరమైన అశాంతికి ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉంది. ఉదా‘‘ దేశంలో 24 లక్షలమంది భర్తలు వదిలివేసిన స్త్రీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతర స్త్రీలే. వారు ఎంతో వ్యథకు, బతుకుబాధలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మహిళలందరికీ న్యాయం చేసే రీతిలో చట్టం రావాలి. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశాన్ని పార్లమెంటులోనే నేరుగా ప్రస్తావించినట్లున్నారు. అలా భర్తచేత తిరస్కృతులైన ఒంటరి భార్యలందరికీ న్యాయం జరిగే చట్టం చేయడం అవసరం. దాదాపు అంతరించిపోతున్న ప్రస్తుత తలాక్ చట్టంతోపాటు, అదేదో ముస్లిం మతాచారాల పట్ల వ్యతిరేకత అన్న భావనకు తావు లేకుండా ఉండటం కోసమైనా మామూలు చట్టం చేయడం అత్యవసరం. పైగా, బహుభార్యత్వం అనే దురాచారం ముస్లి మతాచారంలోనే కాదు.. హిందూమతంలో సైతం ‘ఆరాధనీయంగా’ ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. చరిత్ర ప్రకారం మహమ్మద్ ప్రవక్తకు పలువురు భార్యలట. అందులో అనాథలు, వితంతువులు, పతితులు ఉన్నారని చెబుతారు. అలాంటి మహిళ లను ఉద్ధరించేందుకోసమే ఆయన అన్ని వివాహాలు చేసుకున్నారని విశ్వసించే వారూ ఉన్నారు. ఇక హిందూ దేవుళ్ల గురించి మనకు తెలిసిందే. మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామినే తీసుకుందాం. ‘శ్రీదేవి వంకకు చిలి పిగా చూడకు, అలివేలుమంగకు అలుక రానీయకు’ అంటూ ఆ జగత్పతి సైతం ఇద్దరు భార్యలను ఎలా ముద్దుగా చూసుకోవాలో సూచిస్తూ గానం చేస్తాం. ప్రవక్త మాదిరే కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సైతం తాను రామావతారంలో ఉన్నప్పుడు తనను ఆరాధించిన వారందరికీ ఈ అవతారంలో కుదరదు (ఏకపత్నీవ్రత) కనుక వచ్చే కృష్ణావతారంలో మీరందరూ గోపికలుగా జన్మించినప్పుడు మిమ్మల్ని స్వీకరిస్తాను అని వాగ్దానం చేశాడట. అందుకే కృష్ణుడికి పద్నాలుగు వేలమంది గోపికలు అని భక్తులు అంటుంటారు. మౌనం అంగీకారమా? అర్ధాంగీకారమా? ఎవరి విశ్వాసాలు వారివి కావచ్చు. కానీ మన లౌకిక వ్యవస్థలు అన్ని మతాలను సమానంగా చూడాలి. ప్రభుత్వం మతం విషయంలో ఒక్క మతాన్ని కూడా పక్షపాతంతో చూడరాదు. మతం వేరు, మతతత్వం వేరు. మన లౌకిక వ్యవస్థ మతాన్ని నిషేధించదు. అదే సమయంలో మతతత్వాన్ని సహించదు. దురదృష్టవశాత్తూ బీజేపీ నేతలు, మంత్రులు కూడా పరమత ద్వేషం ప్రవచిస్తున్నప్పుడు, వారిని మోదీవంటివారు కనీసం బహిరంగంగా ఖండించని ఫలితంగానే, మొన్న తలాక్పై చర్చ సందర్భంగా, ‘హిందూ సంస్కృతిలో కలవని ఇతరులకు, ఈ దేశంలోని ముస్లింలకు స్థానం ఉండదు, తమ ఇష్టం వచ్చిన దేశం వెళ్లిపోవచ్చు’నని ఆ పార్టీ నేతలు నిర్భయంగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మోదీ పాటించే మౌనవ్రతం అర్ధాంగీకారమేనా? ఇలా మతమూ, మతతత్వ ప్రాతిపదికన కాకుండా, మహిళలకు ఇంతకంటే గుణాత్మకంగా మెరుగైన జీవనం లభించాలంటే సహేతుకమైన సవరణలతో తలాక్ బిల్లు వంటివాటిని ఆమోదించడం అవసరం. అంతకంటే ముఖ్యంగా చట్టసభలలో కనీసం 33 శాతం స్థానాల్లో రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి. అప్పుడే మహిళలకు వాస్తవికంగా మేలు చేకూర్చే చట్టాలు రూపొందే అవకాశం పెరుగుతుంది. కానీ దశాబ్దాలుగా, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం లేదు. ఇప్పుడు బీజేపీకి పార్లమెంటులో సరిపడా మెజారిటీ ఉంది. ఈ తలాక్ బిల్లు సందర్భంగా ఆ పార్టీ నేతలు, ముస్లి మహిళలకు న్యాయం కలిగించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతిపక్షాలు సైతం కాస్త సవరణ కోరుతున్నాయే తప్ప గంపగుత్తగా ఈ బిల్లును వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు కూడా ఇదే అదును. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీ అయినా సరే మహిళా శ్రేయస్సు అటుంచితే, మహిళల ఓట్లను మరవజాలదు. పైగా అన్ని పార్టీలూ తరతమ భేదాలతో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేవే. చట్టసభలో సాధారణ రిజర్వేషన్ అమలయ్యేందుకు లేని అభ్యంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ఎందుకుండాలి? పైగా ప్రస్తుత పరిస్థితిలో ఇది సహేతుకమైన డిమాండే. లేకుంటే ఇప్పుడు చట్టసభలలో అసమానతలు గోచరిస్తున్నాయి. ప్రజలలో నూటికి 20 శాతం గర్భదరిద్రులు కాగా 60 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారు. కానీ పార్లమెంటులో నూటికి 50 శాతంపైగా సభ్యులు కోటీశ్వరులు. వారిలో 10 శాతం మంది మరీ కోటీశ్వరులు. మన ఓటర్లలో దాదాపు 50 శాతం మంది మహిళలు. చట్టసభల్లో నూటికి 10–12 మంది మాత్రమే మహిళలు. ప్రజానీకంలో అగ్రకులాలు, ఆధిపత్య కులాలు 15–20 శాతం ఉంటారు. పార్లమెంటులో మాత్రం వీరు 50 శాతం మించే ఉంటారు. ఇది వాస్తవం. దీన్ని బట్టి చూస్తే పార్లమెంటును నిజమైన ప్రజాప్రాతినిధ్య సంస్థగా మార్చాల్సిన అవసరం ఉంది. మతం, మతతత్వం, దైవం ఇవన్నీ విశ్వాసాలు. అందుకే మార్క్స్ మాటలు గుర్తుంచుకోవాలి. ‘తమ కష్టాలకు, కన్నీళ్లకు కారణం తెలియని వ్యక్తి మతం ఒడిలో సేద తీరుతాడు. బాధాతప్త హృదయం విడిచే వేడి నిట్టూర్పు వంటిది మతం’. కనుక కష్టాలకు, కన్నీళ్లకు కారణాలను తెలుసుకుని నివారించుకోగలిగిన మేర వేడి నిట్టూర్పులు, మతం ఒడిలో సేద తీరడాలు ఉండవు. కావలసింది అదే. మన కృషి ఆ దిశగా సాగాలి. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
సర్వే 'బంధనం'!
కొత్త కార్డుల మంజూరు స్మార్ట్పల్స్ సర్వేతో లింకు కీలకంగా మారనున్న ‘అనుసంధానం’ నిబంధనల మేరకు అర్హతలు ఉంటేనే మంజూరు ‘జన్మభూమి– మా ఊరు’లో పంపిణీ ఉండకపోవచ్చు జిల్లాలో 60 వేల మంది ఎదురుచూపు అనంతపురం అర్బన్ : అంతా భయపడినట్లే జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం ప్రజా సాధికార (స్మార్ట్ పల్స్) సర్వేతో లింక్ పెడుతోంది. సర్వే వివరాలను, దరఖాస్తులను అనుసంధానం చేయనుంది. సర్వే నిబంధనల మేరకు అర్హతలు ఉంటేనే రేషన్కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సర్వే ఇంకా పూర్తి కానందున జనవరిలో జరిగే ‘జన్మభూమి– మా ఊరు’ కార్యక్రమంలో కొత్త కార్డుల పంపిణీ ఉండకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 60 వేల మంది పేదలు ఎదురుచూస్తున్నారు. వీరి దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నారు. ఆరు అంచెల్లో దరఖాస్తుదారుని వివరాలను పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నట్లు గుర్తిస్తేనే కార్డు మంజూరు చేస్తారని సమాచారం. ఈ విధానంలో ఎక్కువ దరఖాస్తులపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. వాస్తవానికి సర్వే ద్వారా సేకరిస్తున్న సమాచారంతో రేషన్ కార్డులకు అర్హత కోల్పోతామని ఇప్పటికే పేదల్లో ఆందోళన ఉంది. సర్వే అనుసంధానం కీలకం ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారం కార్డుల మంజూరులో కీలకంగా మారుతుందని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఇదే జరిగితే పలువురికి రేషన్ కార్డులు మంజూరు కావు. రేషన్ కార్డు కావాలంటే ద్విచక్రవాహనం ఉండకూడదు. నెలసరి ఆదాయం రూ.11 వేలకు మించకూడదు. విద్యుత్ చార్జీ నెలసరి రూ.500 లోపు ఉండాలి. సొంత ఇల్లు 144 చదరపు అడుగులు మించి ఉండకూడదు. తాత్కాలిక/ ప్రైవేటు ఉద్యోగిగా ఉండకూడదు. వీటికి తోడు జన్మభూమి కమిటీ సిఫారసు ఉండాలి. ప్రస్తుతం పలువురు స్వయం ఉపాధి కోసం అప్పు చేసి ఆటోలు, ట్రాక్టర్లు, జీపులు, కార్లు వంటివి తెచ్చుకుని బాడుగలకు తిప్పుతున్నారు. వాహనాలు ఉన్నాయనే కారణంతో వీరు కార్డు పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. జన్మభూమిలో ఉండకపోవచ్చు ప్రజాసాధికార సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. సర్వే పూర్తయిన తరువాత వివరాలను అనుసంధానం చేస్తారు. అటు తరువాత దరఖాస్తుదారుల వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిశీలించాల్సి ఉంటుంది. సర్వేనే పూర్తి కానందున జనవరిలో జరగనున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో రేషన్ కార్డుల పంపిణీ ఉండకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
గ్రూప్-2కు పకడ్బందీ ఏర్పాట్లు
వికారాబాద్: పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వచ్చేనెలలో గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ తెలిపారు. వచ్చేనెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై వికారాబాద్లో జేసీ సురేష్ పొద్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రూప్-2 పరీక్షకు 8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్, అక్రమాలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పరీక్షల సక్రమ నిర్వహణకు అధికార యంత్రాంగం సహకరించాలని ఆయన సూచించారు. కొత్త జిల్లాలు ఆవిర్భవించక ముందు 500 పోస్టుల ఖాళీలు భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించిందని, కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేయి పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఐదు వేలకు పైగా అభ్యర్థులు ఎంపికై పలు శాఖల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. మరో 5000మంది ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఎంపికకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రూప్-2 పరీక్షలు పూర్తి కాగానే మరో ఆరు వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రెండున్నరేళ్ల కాలంలో 26 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల మంది అత్యధికంగా ఒకేసారి గ్రూప్-2 పరీక్షలు రాశారని, ప్రస్తుతం ఒకేసారి 8 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోనే 400 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామని, సుమారు 3.50 లక్షల మంది పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. -
సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగం: ఘంటా చక్రపాణి
హైదరాబాద్: రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) పని చేస్తుందని చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. నిరుద్యోగుల సామర్ధ్యన్ని బట్టి ఉద్యోగాలు వస్తాయన్నారు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గనని ఆయన చెప్పారు. అవినీతి రహిత ఆదర్శ వ్యవస్థగా టిఎస్పిఎస్సి పని చేస్తుందని తెలిపారు. టిఎస్పిఎస్సి సభ్యులు పారదర్శకంగా పని చేసి బంగారు తెలంగాణ నిర్మించాలని ఆయన పిలుపు ఇచ్చారు. తెలంగాణ నిరుద్యోగులకు రెండుమూడు నెలల్లో ఉద్యోగనియామకాల నోటిఫికేషన్ వెలువడుతుందని చక్రపాణి చెప్పారు. టిఎస్పిఎస్సి సభ్యుడు విఠల్ మాట్లాడుతూ ఇక కమిషన్ కార్యాలయం ముందు నిరుద్యోగుల ధర్నాలు ఉండవన్నారు. కమిషన్ సభ్యులుగా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే అదర్శంగా టిఎస్పిఎస్సిని తయారు చేస్తామన్నారు. ** -
ఏ ఒక్క ఉద్యోగీ ఆంధ్రకు వెళ్లడు
తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఏ ఒక్క తెలంగాణ ఉద్యోగి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాలనే ఆలోచనలో లేడని టీజేఏసీ కో చైర్మన్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ శనివారం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో దాదాపు 10 వేల మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పత్రికల్లో (సాక్షి కాదు) ఊహా జనిత వార్తలు రాశారని ఆయన మండిపడ్డారు. పదవీ విరమణ పరిమితిని 60 ఏళ్లకే కాదు 120 ఏళ్లకు పెంచినా ఏ ఒక్క తెలంగాణ ఉద్యోగి ఆంధ్రకు వెళ్లడని కరాఖండిగా తేల్చి చెప్పారు. కింది స్థాయి నుంచి గ్రూప్-1 స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఈ ప్రాంత ఆత్మగౌరవం కోసం పోరాడినవారేనని.. వీరిలో ఏ ఒక్కరూ ఆంధ్రకు వెళ్లడానికి మానసికంగా, భౌతికంగా సిద్ధంగా లేరన్నారు. ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ .. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు వెల్లడించకుండా మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. కమిటీపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తుండడంతోనే ఆలస్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. -
టీ-ఉద్యోగుల నేత విఠల్ సీమాంధ్రకు కేటాయింఫు
-
ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ఉద్యోగ నేత
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజన అంశం కాక రాజేస్తోంది. ఇప్పటికే సచివాయల ఉద్యోగుల మధ్య స్థానికత చిచ్చు రాజేసింది. విద్యాశాఖ ఉద్యోగుల విభజనలో ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం వివాస్పదంగా మారింది. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ ను ఆంధ్రప్రదేశ్కు కేటాయింటారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా తనను సీమాంధ్రకు కేటాయించారని ఆరోపించారు. తెలంగాణ పుట్టి ఉద్యమాలు చేసిన నా పరిస్థితే ఇలా ఉంటే మిలిగినవారి పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని విఠల్ చెప్పారు. విఠల్ ఇంటర్ విద్యాశాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.