waranga district
-
దళితుల సమాధులు స్వాహా..
హన్మకొండ చౌరస్తా: భూకబ్జాకోరులపై నగర పోలీ స్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు బకాసురులు మాత్రం మమ్మల్నేమీ చేయలేరన్న ధీమాతో యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్న బకాసురులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా శ్మశానవాటికనే మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వివరా లిలా ఉన్నాయి. హనుమకొండలోని 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డలో దళితులే అత్యధికంగా నివసిస్తుంటారు. సుమారు దశాబ్దకాలం క్రితం వరకు కూడా ఇక్కడ సామాజికంగా వెనుకబాటును అనుభవించారు. పెద్దమ్మగడ్డ వాసుల శ్మశానవాటికకు ఎసరు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దళిత ప్రాంతం పెద్దమ్మగడ్డ. అలాంటి దళితులకు చెందిన సమాధుల గడ్డ ఇప్పుడు కనుమరుగవుతోంది. పెద్దమ్మగడ్డ సమీపంలోనే నాలా వెంట ప్రధాన రహదా రికి ఆనుకుని ఉన్న సమాధుల్లో 99శాతం మాయమయ్యాయి. మిగిలిన ఒకటి రెండు సమాధులను సైతం నేలమట్టం చేసే పనిలో కబ్జాదారులు ఉన్నా రు. ప్రధాన రహదారి వెంటే సుమారు రెండెకరాల విలువైన స్థలం కావడంతో కోట్ల రూపాయల ధర పలుకుతోంది. దీంతో ఏడాది కాలంగా కొందరు కబ్జారాయుళ్లు రాజకీయ నాయకుల అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా సమాధులను నేలమట్టం చేస్తూ మొరంతో ఆనవాళ్లు లేకుండా చదును చేస్తున్నారు. అయినా రెవెన్యూ, బల్దియా అధికారులు పట్టించుకోకపోవడంౖపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
విధి ఆడిన వింత నాటకం.. పెళ్లింట పెను విషాదం
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. రేపు పెళ్లిచేసుకోబోతున్న వరుడు.. విధి ఆడిన వింత నాటకంలో తనువు చాలించాడు. దీంతో, పెళ్ళిసందడితో ఉండాల్సిన ఇళ్ళు శోకసంద్రంగా మారింది. కరెంట్ షాక్ రూపంలో వరుడిని మృత్యువు వెంటాండింది. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంతండాకు చెందిన భూక్య బాలాజీ కాంతి దంపుతుల ఏకైక కుమారుడు భూక్య యాకుబ్. కాగా, యాకుబ్కు గార్ల మండలం పిక్లీతండాకు చెందిన అమ్మాయితో శుక్రవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన యాకుబ్, ఇంట్లో నీళ్ళ కోసం బోరు(మోటార్) ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. అయితే, మరికొద్ది గంటల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడంతో పెళ్లింట విషాదం అలముకుంది. పెళ్ళికొడుకు మృతితో కన్నవారితోపాటు బంధుమిత్రులు బోరున విలపించారు. ఎదిగిన కొడుకు ఓ ఇంటివాడు అవుతున్న తరుణంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, యాకుబ్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో రేణుకకు బెయిల్ -
అయ్యో మల్లికార్జునా!.. ఎంత పనిచేశావయ్యా!
సాక్షి, కాజీపేట: దైవదర్శనం చేసుకుని... మొక్కలు చెల్లించుకున్నారు.. కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఇళ్లకు బయలుదేరారు.. మధ్యలో కాసేపు విరామం తీసుకుని భోజనం పూర్తిచేశా రు.. ఆ తర్వాత వాహనంలో బయలుదేరిన వారికి అదే చివరి ప్రయాణం అవుతుందని తెలియదు.. ఒక్కసారి మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న పగడాల దుర్గాప్రసాద్తో పాటు ఆయన భార్య, చిన్నకుమారుడు, అక్కా, బావలు కన్నుమూశారు.. రెప్పపాటులో జరిగిన ఈ ఘోరంతో ఆ కుటుంబంలో దుర్గాప్రసాద్ తల్లి, మరో కుమారుడు మాత్రమే మిగలడం విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ వద్ద జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన దుర్గాప్రసాద్ కాజీపేట వాసి కాగా.. మట్టెవాడ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రహమత్నగర్కు చెందిన దుర్గాప్రసాద్ మట్టెవాడ పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భార్య, కుమారుడు, అక్కాబావలతో కలిసి ఆదివారం వెళ్లాడు.. దైవదర్శనం అనంతరం అక్కడే బస చేసిన వారు సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు.. అయితే, అదే చివరి ప్రయాణమవుతుందని వారికి తెలియదు.. మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా అమనగల్లు వద్ద భోజనం చేసి వస్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైకి లారీ దూసుకొచ్చింది. ఆ లారీని వీరు వెళ్తున్న ఇన్నోవా వేగంగా ఢీకొట్టింది.. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, ఆయన భార్య, విజయలక్ష్మి, కుమారుడు శంతన్కుమార్తో పాటు అక్కాబావలు పద్మ, రాజు సైతం మృతి చెందారు.. వీరు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు అందులో చిక్కుకుపోయాయి.. ప్రమాదంలో దుర్గాప్రసాద్, ఆయన సతీమణి, కుమారుడు మృతి చెందగా అనారోగ్యంతో ఇక్కడే ఉండిపోయిన తల్లి, ఆస్ట్రేలియాలో ఉంటున్న మరో కుమారుడు శ్రయాజ్ మాత్రం కుటుంబంలో మిగిలినట్లయింది.. విషయం తెలియగానే ఆయన నివాసముండే రహమత్నగర్తో పాటు పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లన్న దర్శనం కోసం.. కాజీపేట 52వ డివిజన్ రహమత్నగర్ కాలనీకి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పగడాల దుర్గాప్రసాద్ (50) తన భార్య విజయలక్ష్మి(46), చిన్నకొడుకు శంతన్కుమార్(25), హైదరాబాద్ కు చెందిన బావ రాజు, అక్క పద్మతో కలిసి ఆదివారం ఉదయం కర్నూల్ జిల్లా శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లారు. రాత్రి అక్కడే బసచేసిన వారు దైవదర్శనం అనంతరం సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఓ హోటల్లో భోజ నం చేశారు. ఈమేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగ ల్లు మండలం మేడిగడ్డతండా గేటు వద్ద హైదరా బాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న లారీ కుడివైపున ఉన్న శ్రీలక్ష్మీ గణపతి వే బ్రిడ్జి వద్దకు ఒక్కసారిగా మళ్లింది. దీంతో వేగంగా వస్తున్న ఇన్నోవా లారీ ముందు భాగంలోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, శంతన్, రాజు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మి, పద్మజ ఆమనగల్లు ప్రభుత్వాçస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారం భించేలోపే కన్నుమూశారు. ఇన్నోవా డ్రైవర్ ఖలీల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పోలీసు అధికారుల పర్యవేక్షణ ఆమన్గల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్గప్రసాద్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కాజీపేటకు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లను సీపీ డాక్టర్ విశ్వనా«థ్ రవీందర్ పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించి సోమవారం రాత్రిలోగా పోస్టుమార్టం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ మేరకు మృతదేహాలు మంగళవారం తెల్లవారుజాము వరకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిసింది. కాజీపేట సీఐ అజయ్తోపాటు పోలీసు సిబ్బంది మృతుడి ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. దుర్గాప్రసాద్ పెద్దకుమారుడు శ్రయా జ్ ఆస్ట్రేలియా నుంచి బయలుదేరగా మంగళవారం మధ్యాహ్నంలోగా హైదరాబాద్ చేరుకుంటాడని తెలిసింది. ఆయన కాజీపేటకు రాగానే పోలీసులాంఛనలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కేసుల ఛేదనలో దిట్ట ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు పోలీసు స్టేషన్లలో పనిచేసిన దుర్గాప్రసాద్కు ఉన్నతాధికారుల వద్ద మంచి పేరు ఉంది. ఎక్కువగా క్రైం విభాగంలో పనిచేసిన ఆయన కేసుల ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించేవాడని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పనితీరును మెచ్చిన అధికారులు ఎక్కువగా నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇచ్చేవారని తెలిసింది ఇదీ కుటుంబ నేపథ్యం రైల్వేలో లోకో ఇన్స్పెక్టర్గా పనిచేసే పుల్లయ్య 1971లో రహమత్నగర్లో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. పుల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆమన్గల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూతురు పద్మ, అల్లుడు రాజు, కొడుకు దుర్గాప్రసాద్, కోడలు విజయలక్ష్మి, మనవడు శంతన్కుమార్ మృతి చెందారు. కొద్దికాలం క్రితం పుల్లయ్య మరణించడంతో తల్లి పూలమ్మ వృద్ధాప్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఇక దుర్గాప్రసాద్ కుమారుడు శంతన్కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా దుర్గాప్రసాద్ మట్టెవాడ పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. పెద్దకుమారుడు శ్రయాజ్ ఆస్ట్రేలియాలో ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. దైవభక్తి ఎక్కువ దుర్గా ప్రసాద్కు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ. 2018లో పదోన్నతి వచ్చిన తరక్వాత పలు దేవాలయాలకు వస్తానని మొక్కుకున్నట్లు సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇటీవలే వేములవాడ, కొండగట్లు ఆలయాలను కుటుంబ సభ్యులతో సందర్శించుకోని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిసింది. శనివారం విధులు నిర్వర్తించిన దుర్గాప్రసాద్ ఆది, సోమవారం రెండు రోజుల పాటు సెలవు పెట్టి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ దైవ దర్శనం చేసుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడం అందరినీ కలిచివేసింది. అధికారుల సంతాపం వరంగల్ క్రైం/రామన్నపేట: హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ మృతి పట్ల వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ నరసింహ, ఏసీపీ నర్సయ్య, మట్టెవాడ ఇన్స్పెక్టర్ జీవన్రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, దీపక్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్కుమార్ తదితరులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి ప్రకటించి సంతాపం తెలిపారు. ఉద్యోగుల దిగ్భ్రాంతి వరంగల్ క్రైం: మట్టెవాడ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న దుర్గాప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియగానే సహచర ఉద్యోగులు, పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాం తికి గురయ్యారు. 1990 బ్యాచ్కి చెందిన దుర్గాప్రసాద్ మొగుళ్లపల్లి, మడికొండ, స్టేషన్ఘున్పూర్, సుబేదారి, మట్టెవాడ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2014 డిసెంబర్లో జరిగిన బదిలీల్లో మట్టెవాడ వెళ్లారు. అక్కడే ఆయనకు 2018 ఫిబ్రవరిలో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి వచ్చింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి తీర్ధయాత్రలకు వెళ్లిన తన కొడుకు, కుమార్తెల కుటుంబాలు కన్నుమూశాయన్న విషయం తెలుసుకున్న దుర్గప్రసాద్ తల్లి పూలమ్మ బోరున విలపిస్తున్నారు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు, పెద్దకూతురు, అల్లుడితో పాటు భార్య, కోడలు ప్రమాదంలో చనిపోయారని ఇంటి పక్కల వారు చెప్పడంతో తల్లి ఆచేతనంగా మారిపోయింది. మాట రాకుండా మంచంలోనే పడిపోవడం చూపరులను కలిచివేసింది. ఉన్నతాధికారుల పరిశీలన ఆమనగల్లు:ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆమనగల్లు ఎస్ఐ మల్లీశ్వర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్నోవా వాహనంలో చిక్కుకున్న మతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీశారు. ఇక ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఘటన స్థలాన్ని సోమవారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ ప్రసాద్రావ్, షాద్నగర్ ట్రాఫిక్ సీఐ సునీల్, ఆమనగల్లు సీఐ నర్సింహారెడ్డి పరిశీలించారు. అందరితో కలివిడిగా.. రోడ్డు ప్రమాదంలో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబం రహమత్నగర్లో అందరితో కలివిడిగా ఉండేవారు. పండుగలు, పబ్బలకు హాజరవుతూ చిన్నాపెద్ద తేడా లేకుండా కలిసిపోయే వారు. వినాయక చవితి, శ్రీరామనవమి, ఉగాది వేడుకలను కాలనీవాసులతో కలిసి ఘనంగా రుపుకోవడానికి ప్రాధాన్యతనివ్వడమే కాకుండా నిర్వహణకు చేయూతనిచ్చేవారు. సహచర మిత్రుల్లో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి పరిష్కరించేవాడనే పేరుంది. -
‘బెల్ట్’ కిక్కు
జనగామ: గ్రామాల్లో ‘బెల్ట్’ కిక్కెక్కిస్తోంది. వేసవి ప్రభావంతో నీటికి కష్టాలు ప్రారంభమైనా.. మద్యం మాత్రం ఏరులై పారుతోంది. అనధికార సిట్టింగ్లు బార్లను తలపిస్తున్నాయి. ఫుల్ బాటిల్పై రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గుడుంబా అమ్మకాలపై దృష్టి సారించిన ఎక్సైజ్ శాఖ బెల్ట్ దుకాణాలను చూసీచూడనట్లు వదిలేస్తోంది. దీంతో వారి ఇష్టారాజ్యం కొనసాగుతోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్ పూర్, పాలకుర్తి నియోజక వర్గాల పరిధిలోని 12 మండలాల్లో నాలుగు వేల వరకు బెల్ట్ దుకాణాలు ఉండొచ్చని అంచనా. బెల్ట్ దుకాణాల ద్వారా ప్రతి రోజు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది. జనగామ జిల్లా పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు గ్రామాల్లో బెల్ట్ దుకాణాల జోరు విచ్ఛలవిడిగా కొనసాగుతుంది. గతంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించే వరకు బెల్ట్ షాపుల అమ్మకాలు గుట్టుగా సాగాయి. మద్యం దుకాణాలు ఊరికి దూరంగా.. రహదారులకు దగ్గరగా ఉండేవి. బెల్ట్షాపులు మాత్రం ఇళ్లకు దూరంగా.. రహదారులకు దగ్గరగా వచ్చేశాయి. 2017 జూలై ఒకటో తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కార్పోరేషన్, మునిసిపల్ పరి ధిలో మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు మండల, పట్టణ ప్రాం తాల్లో జాతీయ, రాష్ట్ర హైవేలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. మద్యం దుకాణాలు కనిపించక.... హైవేలపై ప్రయాణం చేసే సమయంలో చాలా మంది మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవాళ్లు. రహదారిపై వైన్స్ కనిపించగానే మద్యం సేవించేవారు. సుప్రీం కోర్టు కఠినమైన నిబంధనలతో తీర్పు వెలువరించింది. దీంతో మద్యం దుకాణాలు హైవేల నుంచి గ్రామాల్లోకి వెళ్లినా, వాటి స్థానంలో కొత్తగా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి..వెలుస్తున్నాయి. బార్లను తలపిస్తున్న.. బెల్ట్ దుకాణాలు జిల్లాలోని అనేకచోట్ల బెల్ట్షాపుల నిర్వహణ బార్లను తలపిస్తున్నాయి. దీంతో ఎప్పటి లాగే హైవేలపై ప్రయాణించే వారు ఏ చీకూ చింతా లేకుండా ‘మత్తు’ లోకి దిగుతున్నారు. అనధికారిక ఆదేశాల మేరకు కొనసాగుతున్న బెల్ట్ దుకాణాలపై ఎక్సైజ్ శాఖ చూసిచూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత మండలాలకు చెందిన వైన్స్ల నుంచి కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకు వస్తున్నారు. అదనపు వడ్డింపు బెల్ట్ దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అదనపు వడ్డింపుతో మత్తును వదిలిస్తున్నారు. క్వార్టర్కు రూ. 20 నుంచి రూ.30 వరకు అదనంగా తీసుకుంటున్నారనే గొడవలు అంతటా జరుగుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని వైన్స్ దుకాణాల్లో కూడా ఎమ్మార్పీకంటే అదనంగా ధరలు తీసుకుంటుండడంతో.. నిత్యం మాటల యుద్ధం జరుగుతుంది. ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తాం. బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే చర్యలు త ప్పవు.ఎప్పటికప్పుడు దాడులు కొనసాగిస్తున్నాం. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.వైన్స్ల్లో అదనపు ధరలకు విక్రయిస్తే..కేసులు నమోదు చేస్తాం. – సుధీర్, ఎస్సై ఎక్సైజ్ శాఖ, జనగామ -
పైసా వసూల్
వినోదం కోసం వెళ్లిన వారికి థియేటర్ల యజమానులు అధిక ధరలతో సినిమా చూపిస్తున్నారు. వాహనాల పార్కింగ్కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఐదు థియేటర్లు ఉండగా, అందులో పార్కింగ్ పేరిట ప్రేక్షకుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని థియేటర్లలోనైతే వాహనాల పార్కింగ్కు ప్రత్యే క స్థలం లేదు. సినిమాలకు అనుగుణంగా టికెట్ల ధరలు పెంచే హక్కులు ప్రభుత్వం యా జమాన్యాలకు ఇచ్చింది. అయినప్పటికీ టికెట్ల ధరలు పెంచడంతో పాటు పార్కింగ్కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. పార్కింగ్ చేసిన వాహనాలు విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. ప్రత్యేకంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. కార్లకు రూ.30ల, ఆటోలకు, ద్విచక్రవాహనాలకు రూ.20, సైకిళ్లకు రూ.10లు వసూలు చేస్తూ సినిమాకు వచ్చిన వారి జేబు గుల్ల చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సినిమాకు వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న రశీదు ఇలా ఒక్క థియేటర్లో ఒక షోకు సుమారు 100 వరకు వాహనాలు వస్తుండగా వాటికి రూ. 1000 నుంచి రూ.2000 వేల వరకు వసూలు అవుతున్నాయి. ఇలా ఒక రోజులో నాలుగు షోలకు రూ.4వేల నుంచి రూ.8వేల వరకు వసూలవుతున్నాయి. జిల్లా కేంద్రంలో థియేటర్లు 5 ఒక థియేటర్లో ఉండే సీట్లు 400-500 ఒక షోకు పార్కింగ్ చేసే ద్విచక్ర వాహనాలు 100 పార్కింగ్ చేసే ఆటోలు 10 పార్కింగ్ చేసే ఆటోలు 10 ఉన్నత వర్గాల వారు వచ్చే కార్లు 5 అన్నీ అసౌకర్యలే.. సినిమా థియేటర్కు వచ్చిన వారిని అసౌకర్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. థియేటర్లలో మూత్రశాలలు, మరుగుదొడ్లు సినిమాకు వచ్చిన వందలాది మందికి సరిపోక, శుభ్రంగా లేకపోవటంతో సినిమాకు వచ్చిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. విరామ సమయంలో కూల్డ్రింక్స్, స్నాక్స్ కొనుగోలు చేసేవారు ఎక్కువ రోజులు నిల్వ ఉంచినవి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట లభించే ధరల కంటే రూ.5 నుంచి రూ.10ల వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు దగాకు గురికావాల్సి వస్తోంది. పేరున్న హీరో సినిమా వస్తే సినిమా యాజమాన్యం ఏకంగా టికెట్ ధరలు పెంచేస్తోంది. ఇప్పటకైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. -
కాంగ్రెస్ గూటికి ‘అచ్చ’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న అచ్చ విద్యాసాగర్ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున అచ్చ విద్యాసాగర్ 2009లో పోటీ చేశారు. సుదీర్ఘకాలం పాటు టీఆర్ఎస్లో పని చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ అచ్చ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై గతంలో బహిరంగ లేఖ రాశారు. వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ విషయమై పార్టీ నుంచి స్పందన లేదు. దీంతో కొంత కాలం వేచి చూసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ప్రజాచైతన్య యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు టచ్లోకి రావడం, రాజకీయ భవితవ్యంపై కచ్చితమైన హామీ రావడంతో టీఆర్ఎస్ ను వీడేందుకు అచ్చ ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 11న గాంధీభవన్, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కార్యక్రమానికి వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు 150 వాహనాలతో భారీ కాన్వాయ్గా వెళ్లేందుకు అచ్చ అనుచరులు అంతా సిద్ధం చేస్తున్నారు. -
అక్షరాలా మోసం...!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అక్షరాలు, అంకెలను ఆధారంగా చేసుకుని చిట్ఫండ్ సంస్థలు తిమ్మిని బమ్మి చేస్తున్నాయి. పూచిక పుల్లలను పసిడి బిల్ల లుగా పేర్కొంటూ మాయ చేస్తున్నాయి. చిట్, రిజిస్ట్రార్ చట్టంలో ఉన్న వెసులుబాట్లు అధికారుల పర్యవేక్షణ లోపంతో లొసుగులుగా మారాయి. ఫలితంగా ప్రజలు తమ తమ అవసరాల కోసం చెమటోడ్చి పైసాపైసా కూడబెట్టి చిట్ఫండ్లో మదుపు చేసుకున్న సొమ్ముకు గ్యారంటీ లేకుండా పోయింది. వెసులుబాటుతో కొత్త ఎత్తుగడ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిట్ఫండ్ సంస్థ నిర్వాహకులు చిట్ నిర్వహించే మొత్తానికి సమానమైన నగదును చిట్, రిజిస్ట్రార్ సంస్థ వద్ద డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు పది మంది సభ్యులతో 24 నెలలపాటు రూ.10 లక్షల విలువైన చిట్టీని నిర్వహించేందుకు అనుమతి తీసుకోవాలంటే అంత మొత్తాన్ని చిట్, రిజిస్ట్రార్ వద్ద సెక్యూరిటీ డిపాజిట్గా పెట్టాలి. చిట్ నిర్వహణ కాలంలో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు నెలనెలా చిట్టీæ కడుతున్న సభ్యులకు నష్టం జరగకుండా డిపాజిట్ చేసిన నగదు నుంచి చిట్, రిజిస్ట్రార్ అధికారులు చెల్లించే అవకాశం ఉంది. గతంలో చిట్ మొత్తం విలువలో పది శాతం నగదు గ్యారంటీ డిపాజిట్ చేస్తే సరిపోయేది. కాలక్రమేణా బోర్డు తిప్పేస్తున్న చిట్ఫండ్ కంపెనీల సంఖ్య పెరిగిపోవడంతో చిట్ సభ్యులు నష్టపోకుండా ఉండేందుకు వీలు గా చిట్, రిజిస్ట్రేషన్ చట్టాల్లో మార్పులు తెచ్చా రు. సెక్యూరిటీ డిపాజిట్ విలువను చిట్ విలు వకు సమానం చేశారు. అంటే పది లక్షల విలు వైన చిట్టీ నిర్వహించేందుకు అనుమతి కావాల ంటే రూ పది లక్షల నగదును సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి. ఈ నిబంధన కారణంగా సె క్యూరిటీ డిపాజిట్ కోసం భారీ స్థాయిలో నగదు సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. దీ న్ని అధిగమించేందుకు స్థిరాస్తులను సెక్యురిటీగా తనఖా పెట్టుకునే వెసులుబాటు కల్పించా రు. దీన్ని ఆసరాగా చేసుకుని చిట్ఫండ్ కంపెనీలు కొత్త ఎత్తుడగలకు తెరలేపాయి. పట్టించుకోని అధికారులు స్థిరాస్తులను గ్యారంటీగా చూపించే వెసులుబాటును పలు చిట్ఫండ్ కంపెనీలు అడ్డగోలుగా ఉపయోగించుకుంటున్నాయి. స్థిరాస్తులకు మార్కెట్లో ఉన్న విలువను మించి పేర్కొంటున్నాయి. ఉదాహరణకు ఎకరం స్థలం విలువ మార్కెట్లో రూ.10 లక్షలు ఉంటే.. దాన్ని కోటి రూపాయలుగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ విలువనే గ్యారెంటీలుగా పేర్కొంటూ దానికి తగ్గట్లుగా (రూ.కోటి) చిట్టీలు నిర్వహించే అనుమతి పొందుతున్నారు. రిజిస్ట్రేషన్లో పేర్కొన్నట్లు ఆయా స్థలాలకు విలువను మదింపు చేసే విచక్షణాధికారం చిట్, రిజిస్ట్రార్ అధికారులకు ఉంది. పైసాపైసా కూడబెట్టి భవిష్యత్ కోసం దాచుకునే సామాన్యుల సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత చిట్, రిజిస్ట్రార్లకు ఉంది. కానీ.. రిజిస్ట్రేషన్ విలువను బట్టి ఎడా పెడా కొత్త చిట్టీలకు అనుమతులు ఇస్తున్నారు. సాంకేతికంగా ఎక్కడ తప్పు జరగలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏవైనా అవాంచనీయ సం ఘటనలు తలెత్తితే.. ఆయా చిట్ఫండ్ కంపెనీ గ్యారెంటీ విలువ తక్కువగా ఉండడం వల్ల చిట్టీదారులు నిండా ముగినిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. చిట్టీలకు కట్టిన డబ్బులు తిరిగి వారికి రావడం కష్టసాధ్యంగా మారుతోంది. చిట్ విలువకు రెండింతల మార్టిగేజ్.. చిట్టీ విలువకు రెండింతలు వచ్చే విధంగా మార్టిగేజ్ (భూమి తనఖా) నిర్ధారణ చేస్తాం. భూమి స్వరూపం, మార్కెట్, ప్రభుత్వ విలువ తదితర అంశాలు బేరీజు వేస్తాం. స్థిరాస్తి వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించిన అనంతరమే చిట్ఫండ్ కంపెనీలకు అనుమతులు ఇస్తున్నాం. ప్రస్తుతం మార్టిగేజ్కు బదులు ఫిక్స్డ్ డిపాజిట్లను స్వీకరిస్తున్నాం. – సుజాత, చిట్ సహాయక రిజిస్ట్రార్ ప్రచార ఆర్భాటంతో వెంచర్ల విలువ పెంపు స్థలాలకు విలువను పెంచేందుకు చిట్ఫండ్ కంపెనీల నిర్వాహకులు ఎడాపెడా రియల్ వెంచర్లు చేస్తున్నారు. ఊరికి పది కిలోమీటర్ల దూరంలో గుట్టలు, పంట పొలాల్లో చవకగా దొరికే భూములను కొనేస్తున్నారు. ఈ భూములన్నీ కొద్ది రోజుల్లోనే రియల్ వెంచర్లుగా మారుతున్నాయి. ఆ తర్వాత ప్రచార ఆర్భాటం చేస్తూ కృత్రిమంగా ఆ స్థలాల విలువను పెంచుతున్నారు. ఈ తరహా ఎత్తుగడలను అరికట్టడంలో చిట్, రిజిస్ట్రార్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థలాలకు సంబంధించిన వాస్తవ విలువను మదింపు చేయడంలో నిబద్ధతతో వ్యవహరించకుండా చిట్ఫండ్ కంపెనీ నిర్వాహకులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి సహకారం వల్లే ఈ దందా మూడు స్థలాలు.. ఆరు చిట్టీలు అన్నట్లుగా నడుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అభ్యంతరాలు.. 23వేలు
10వేలకుపైగా వరంగల్ జిల్లాపైనే.. రాష్ట్రంలో జిల్లా 4వ స్థానం జిల్లాల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలకు ముగిసిన గడువు కొనసాగుతున్న జిల్లా స్థాయి పరిశీలన ప్రకియ హన్మకొండ అర్బన్ : జిల్లాల పునర్విభజన ముసాయిదాపై జిల్లా నుంచి మొత్తం 23వేల అభ్యంతరాలు అందాయి. వీటిలో ఆన్లైన్ ద్వారా 15వేలకు పైగా రాగా.. మిగతావి కలెక్టరేట్లో అధికారులకు, ప్రత్యేక విభాగంలో నేరుగా అందజేశారు. మొత్తం 23వేల అప్పీళ్లలో వరంగల్ జిల్లాపైనే అత్యధికంగా 10వేలకు పైగా రావడం విశేషం. మొత్తం అప్పీళ్లను అధికారులు ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసి కలెక్టర్ పరిశీలన అనంతరం మళ్లీ అప్లోడ్ చేస్తున్నారు. ముసాయిదా ప్రకటించిన నాటి నుంచి 30రోజుల గడువు మంగళవారం(20వతేదీ)తో ముగియడంతో అధికారులు కలెక్టరేట్ అప్పీళ్ల స్వీకరణ కార్యక్రమం సాయంత్రం నుంచి ఆపేశారు. అన్లైన్లో మాత్రం అర్ధరాత్రి వరకు అప్లోడ్ అయ్యాయి. అధికారులకు అందిన మొత్తం అప్పీళ్లలో సుమారు 1500 వరకు వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగతావి ప్రభుత్వానికి పంపుతున్నారు. కలెక్టరేట్లో అందిన వాటిలో అప్పీళ్లలో కాగితాల సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల పరిశీలన, అప్లోడ్ పనులు కొంత ఆలస్యంగా సాగుతున్నాయి. ప్రక్రియ పూర్తి కావడానికి ఒకటి రెండురోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా మంగళవారం రాత్రి వరకు అందిన అప్పీళ్ల వివరాలు.. జిల్లా జిల్లాపై డివిజన్పై మండలంపై మొత్తం హన్మకొండ 2476 306 373 3155 జయశంకర్ 1093 57 92 1242 మహబూబాబాద్ 154 673 88 915 వరంగల్ 9388 110 865 10363 =========================================== మొత్తం 13111 1146 1418 15675 -
ధర్డ్ డిగ్రీ చదువులు