water inflow
-
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద
-
జూరాల ఉగ్రరూపం
-
ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం
-
భయం గుప్పిట్లో కొల్లేరు
-
ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
-
ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ
-
శ్రీశైలం వద్ద కృష్ణమ్మ అందాలు డ్రోన్ వీడియో
-
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
-
జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి.. ఎత్తిన గేట్లు..
-
భద్రాద్రికి పోటెత్తిన గోదావరి పరవళ్లు..
-
జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి
-
జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి
-
మానేరు డ్యామ్ కు భారీ వరద..
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం
-
జలకళను సంతరించుకున్న తుంగభద్ర డ్యామ్
-
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు భారీగా వరద, 10 గేట్లు ఎత్తివేత
-
జూరాలకు పెరుగుతున్న వరద ఉధృతి
-
16 గేట్లు ఎత్తి నీళ్లు వదులుతున్న అధికారులు
-
ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద ఉధృతి
-
నిండుకుండలా హిమాయత్సాగర్ జలాశయం
-
జూరాల, శ్రీశైలానికి భారీ ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: గత నాలుగు రోజులుగా ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ల పరిధిలో కొనసాగుతున్న వర్షాలకు తోడు స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కులను దిగువనున్న నారాయణపూర్కు విడుదల చేస్తుండగా అక్కడి నుంచి 62 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రానికి జూరాలకు 79 వేల క్యూసెక్కులు వస్తుండగా లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలానికి 99 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండటంతో అక్కడ నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 41.11 టీఎంసీలకు చేరింది. ఇక ఇక్కడి నుంచి 7 వేల క్యూసెక్కులను వదిలేస్తుండటంతో నాగార్జునసాగర్లోకి 9 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో అక్కడ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం నిల్వ 169.71 టీఎంసీలకు చేరింది. మరోవైపు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. -
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
-
నిండుకుండలా కర్నూలు జిల్లాలోని జలశయాలు
-
ప్రకాశం బ్యారేజ్కు పోటెత్తిన వరద
సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్కు వరద పోటేత్తుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో.. గంట గంటకూ బ్యారేజ్లోకి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం లక్షా 50 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజ్లోరి చేరింది. దీంతో అధికారులు 70 గేట్లను ఎత్తి.. లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. బ్యారేజ్లోకి వరద ప్రవాహం అర్ధరాత్రికి అనుహ్యంగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ప్రవాహం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.. ఎగువ, దిగువ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒకవైపు అల్పపీడనం, మరోవైపు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లను తిరిగి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, విజయవాడలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. -
వరద తగ్గె.. గేట్లు మూసె
సాక్షి, హైదరాబాద్ : కొన్నిరోజులుగా లక్షల క్యూసెక్కులతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వర్షాలు తగ్గడంతో బేసిన్లో ఎగువన ఆల్మట్టికి ఇన్ఫ్లో గణనీయంగా తగ్గింది. దీంతో దిగువన నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా వరద తగ్గుతుండటంతో ప్రాజెక్టుల్లో గేట్లను ఒకొక్కటిగా మూసివేస్తూ నీటి నిల్వల పెంపుదలపై అధికారులు దృష్టిసారించారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నిల్వ 129 టీఎంసీలుకాగా 120 టీఎంసీల్లో నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్లోనూ గేట్లు మూసివేసి నీటిమట్టాన్ని పెంచుతున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం 3.16 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు అవుట్ ఫ్లోను కూడా తగ్గించి 2.45 లక్షల క్యూసెక్కులను దిగువన సాగర్కు వదులుతున్నారు. సాగర్లో ప్రస్తుతం 301 టీఎంసీల నీటి నిల్వ ఉండగా 4.21 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆ నీటినంతా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. -
బెంగ తీర్చే ‘తుంగ’.. కృష్ణమ్మ ఉత్తుంగ
సాక్షి, కర్నూలు : బెంగ తీర్చడానికి ‘తుంగ’ ఉధృతంగా ముందుకు సాగుతోంది. ‘తుంగభద్రమ్మ’ను చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు కృష్ణమ్మ ఉత్తుంగ తరంగమై మహోధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలాన్ని వేగంగా నింపుతూ..ముందుకు కదలడానికి సమాయత్తమవుతోంది. ఈ పరిణామాలతో ‘సీమ’ రైతుల గుండెల్లో సంతోషం ఉప్పొంగుతోంది. అప్పర్ తుంగ నుంచి భారీ వరద ఇన్నాళ్లూ హెచ్చుతగ్గుల నీటి చేరికతో ఉన్న తుంగభద్ర డ్యాంలోకి ప్రస్తుతం భారీ ప్రవాహం మొదలుకానుంది. ఎగువన శివమొగ్గ జిల్లాలో నిర్మించిన అప్పర్ తుంగ(గాజనూరు) ప్రాజెక్ట్ నుంచి దిగువకు 95,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు గురువారం సాయంత్రానికి తుంగభద్ర జలాశయానికి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో 40,781 క్యూసెక్కులు ఉంది. అప్పర్ తుంగ ప్రాజెక్ట్ నుంచి విడుదలయిన నీటితో గురువారం సాయంత్రానికి ఇన్ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటవచ్చని జలాశయం అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమలలోని వర్శపర్వతాలతో పాటు చిక్మగళూరు, హావేరి జిల్లాల్లో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుంగ నదిలో వరద ఉధృతి భారీగా పెరిగింది. తుంగ డ్యాంలోకి 95,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 3.24 టీఎంసీలు. డ్యాంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో అధికారులు 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. భద్రలోనూ పోటెత్తిన వరద శివమొగ్గ జిల్లాలో కూడా ఎడతెరిపి లేని వర్షాలతో భద్ర నదిలోనూ వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. భద్రావతి వద్ద నిర్మించిన భద్ర ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో బుధవారం 41,487 క్యూసెక్కులకు చేరుకుంది. ఇన్ఫ్లో భారీగా ఉండడంతో నీటి నిల్వ 38 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 63 టీఎంసీలు. మరో మూడు, నాలుగు రోజుల్లో ప్రాజెక్ట్లో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరే అవకాశం ఉంది. దీంతో భద్ర నుంచి కూడా దిగువన ఉన్న తుంగభద్ర ప్రాజెక్ట్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 1610.8 అడుగుల వద్ద 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 40,781 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 1011 క్యూసెక్కులు. జలాశయంలోకి భారీ వరద ప్రవాహాన్ని అంచనా వేసిన కర్ణాటక ఇరిగేషన్ అధికారులు బుధవారం కర్ణాటక పరిధిలోని ఎల్లెల్సీ కుడి, ఎడమ కాలువలు, రాయబసవన కెనాల్, విజయనగర కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఒకట్రెండు రోజుల్లో జిల్లా ఇరిగేషన్ అధికారులు కూడా తుంగభద్ర దిగువ కాలువ కింద ఉన్న జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఖరీఫ్ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోటెత్తుతున్న కృష్ణమ్మ కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. నదిలో నీటి ప్రవాహం సుమారు 5 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. ఆల్మట్టి డ్యాంకు ఎగువ భాగంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం ఉంది. వచ్చిన నీటినంతా ఆల్మట్టి గేట్లన్నీ పైకెత్తి దిగువకు వదిలేస్తున్నారు. అలాగే నారాయణపూర్ జలాశయం నుంచి 4.65 లక్షల క్యూసెక్కులు, జూరాల నుంచి 3,41,512 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 872.70 అడుగుల నీటి మట్టంతో 153.16 టీఎంసీల నీరు నిల్వఉంది. డ్యాంలోకి ఎగువ నుంచి వస్తున్న నీరు నేటి ఉదయానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. ఫలితంగా డ్యాంలో నీటినిల్వ 175 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. ఎగువ నుంచి వచ్చే నీటిని బట్టి శుక్రవారం ఉదయానికి 205 టీఎంసీలకు చేరితే గేట్లు ఎత్తి దిగువకు వదిలేందుకు ఇంజినీర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ సాగర్ వైపు 74,496 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా బుధవారం సాయంత్రానికి 10 వేల క్యూసెక్కుల వరద జలాలను, హంద్రీ–నీవా ద్వారా 1013 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి స్కీమ్ ద్వారా 1,600 క్యూసెక్కులు, ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా కేసీకి 245 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
నిర్మల్ కడెం ప్రాజెక్టుకు భారీగా వరద
-
శ్రీరాంసాగర్ లోకి భారీగా ఇన్ఫ్లో
నిజామాబాద్ : ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ జిల్లా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు 35 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్టు ఎస్సారెస్పీ డీఈఈ జగదీశ్ తెలిపారు. ఈ జలాలు ఎస్సారెస్పీకి సోమవారం మధ్యాహ్నానికి చేరుకుంటాయన్నారు. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1074.00 అడుగుల (37.379 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టుకూ వరద కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 698.575 అడుగులు (7.233 టీఎంసీలు) ఉన్నది. ఆదివారం ప్రాజెక్టులోకి 735 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. కుడి కాల్వ ద్వారా 19 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 841 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
సోమశిలకు 29 వేల క్యూసెక్కులు
సోమశిల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి గురువారం సాయంత్రానికి 29 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో జలాశయంలో నీటి మట్టం 11.3 టీఎంసీలకు చేరింది. నంద్యాల సమీపంలోని రాజోలుబండ ఆనకట్టవద్ద ఉదయం 22 వేల క్యూసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 12 వేల క్యూసెక్కులకు తగ్గింది. పెన్నానది ప్రధాన హెడ్ రెగ్యులేటర్ అయిన వైఎస్సార్జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద ఉదయం 32 వేల క్యూసెక్కులు వరద కొనసాగగా, రాత్రికి 19వేల క్యూసెక్కులుగా నమోదైంది. చెన్నూరు గేజ్వద్ద ఉదయం 35వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా, రాత్రికి 26వేల క్యూసెక్కులకు తగ్గుముఖం పట్టింది. సోమశిల జలాశయానికి ఉదయం 22వేల క్యూసెక్కుల వంతున కొనసాగిన వరద, మధ్యాహ్నం 27 వేల క్యూసెక్కులకు పెరిగింది. రాత్రికి 29వేల క్యూసెక్కుల వంతున ప్రవహిస్తోంది. జలాశయంలో ఉదయం 10.01 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం రాత్రికి 11.321 టీఎంసీలకు చేరుకుంది. వరద ప్రవాహం కొనసాగితే నీటిమట్టం 15 టీఎంసీలకు చేరుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. -
సోమశిలకు 6348 క్యూసెక్కులు
సోమశిల : రాయలసీమలో కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి ఆదివారం ఉదయం 6348 క్యూసెక్కుల వంతున వరద కొనసాగుతోంది. పెన్నానది ఉపనది కుందూనది శనివారం రాత్రి 4 వేల క్యూసెక్కుల వంతున ప్రవహించింది. ఉదయానికి ఈ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. పాపాఘ్ని నదిలో ఉదయం 6వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహించింది. వైఎస్సార్ జిల్లా వద్ద పెన్నా నదిలో ఉదయం 12500 క్యూసెక్కుల వరద కొనసాగగా, మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టి 6,500 క్యూసెక్కులకు చేరింది. బద్వేలు, మైదుకూరు, తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సిద్దవటం వద్ద పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం జలాశయానికి చేరేందుకు మరో రెండు రోజులు పట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 11.033 టీఎంసీలు, 84.302 మీటర్లు, 276.68 అడుగుల నీటి మట్టం ఉంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 3 వేల క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలో 7.4 మీ.మీ.ల వర్షపాతం నమోదైంది.