Women Chief Ministers
-
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. రికార్డులురెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులుదేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.సుష్మా స్వరాజ్ (బీజేపీ) బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.షీలా దీక్షిత్, (కాంగ్రెస్)కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు. అతిషి మార్లెనా సింగ్ (ఆప్)8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.రేఖా గుప్తా(బీజేపీ)రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
సీఎం పీఠంపై మహిళా శక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశి దేశ చరిత్రలో 17వ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. అంతేకాదు ఇప్పటిదాకా ఢిల్లీ సీఎంగా పనిచేసిన మహిళల్లో అత్యంత పిన్నవయసు్కరాలు అతిశి. ఆమె వయసు కేవలం 43 ఏళ్లు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా సీఎంలలో రెండో సీఎం ఆతిశి. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహిళా ముఖ్యమంత్రులు సుచేతా కృపలానీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ రికార్డు సృష్టించారు. ఆమె 1963 నుంచి 1967 దాకా ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. నందిని శతపథి దేశంలో రెండో మహిళా సీఎం నందిని శతపథి. 1972 నుంచి 1976 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇందిరా గాందీకి ఆమె అత్యంత సన్నిహితురాలు. శశికళ కకోద్కర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత శశికళ కకోద్కర్ 1973 నుంచి 1979 దాకా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా, డయ్యూడామన్కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1987లో గోవాకు రాష్ట్ర హోదా లభించింది. అన్వర తైమూర్ దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా అన్వర తైమూర్ రికార్డుకెక్కారు. ఆమె 1980 నుంచి 1981 దాకా అస్సాం సీఎంగా పనిచేశారు. వి.ఎన్.జానకి రామచంద్రన్ ప్రఖ్యాత తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకి రామచంద్రన్ తమిళనాడు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 1988లో భర్త ఎంజీఆర్ మరణం తర్వాత కేవలం 23 రోజులపాటు సీఎంగా పనిచేశారు. జె.జయలలిత ఎంజీఆర్ శిష్యురాలు, డీఎంకే నేత, ప్రముఖ సినీ నటి జె.జయలలిత ఆరు పర్యాయాలు తమిళనాడు సీఎంగా సేవలందించారు. మొత్తం 14 ఏళ్లకుపైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మాయావతి బహుజన సమాజ్ పారీ్ట(బీఎస్పీ) అధినేత మాయావతి నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. మొత్తం ఏడు సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు. రాజీందర్ కౌర్ భట్టాల్ పంజాబ్కు ఇప్పటిదాకా ఏకైక మహిళా సీఎంగా రాజీందర్ కౌర్ భట్టాల్ రికార్డుకెక్కారు. ఆమె 1996 నుంచి 1997 దాకా పంజాబ్ సీఎంగా పనిచేశారు. రబ్రీ దేవి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడంతో ఆయన భార్య రబ్రీ దేవి 1997లో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్లో ఇప్పటివరకు ఏకైక మహిళా సీఎం రబ్రీ దేవి. సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. 1998లో ఆమె 52 రోజులపాటు ఈ పదవిలో కొనసాగారు. షీలా దీక్షిత్ ఢిల్లీ రెండో మహిళా సీఎం షీలా దీక్షిత్. ఢిల్లీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు నెలకొల్పారు. ఆమె 1998 నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమా భారతి రామ జన్మభూమి ఉద్యమ నేత, ఫైర్బ్రాండ్ ఉమా భారతి 2003 నుంచి 2004 దాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. వసుంధర రాజే గ్వాలియర్ మహారాజు జీవాజిరావు సింధియా, విజయరాజే సింధియా దంపతుల కుమార్తె అయిన వసుంధర రాజే రెండు పర్యాయాల్లో 10 సంవత్సరాలపాటు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆనందిబెన్ పటేల్ గుజరాత్కు ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్. నరేంద్ర మోదీ తర్వాత ఆమె 2014 నుంచి 2016 దాకా సీఎంగా పనిచేశారు. మహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ) నేత మహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 2016 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు. ఆతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి వరుస: షీలా దీక్షిత్, ఉమా భారతి, ఆనందీబెన్ పటేల్, మెహబూబా ముఫ్తీ, జానకీ రామచంద్రన్, మాయావతి రెండో వరుస: నందినీ శతపథి, అన్వర తైమూర్, రబ్డీదేవి, శశికళా కకోడ్కర్, వసుంధరా రాజె సింధియామూడో వరుస: సుష్మా స్వరాజ్, సుచేతా కృపలానీ, రాజీందర్ కౌర్, మమతా బెనర్జీ, జయలలిత. -
వచ్చే పదేళ్లలో 50 శాతం మహిళా సీఎంలు
కొచ్చీ: కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని మరింత ప్రోత్సహించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పార్టిలో ఇంకా చాలామంది మహిళా నాయకులను తయారు చేయాలని, దేశంలో వచ్చే పదేళ్లలో 50 శాత మంది మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నదే తమ కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం కేరళలోని కొచీ్చలో మహిళా కాంగ్రెస్ నేతల సదస్సు ‘ఉత్సాహ్’ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రులు కావడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగిన మహిళా నాయకులు కాంగ్రెస్లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రయతి్నంచాలి, లక్ష్యం సాధించాలి అని సూచించారు. ఈరోజు నుంచి వచ్చే పది సంవత్సరాల్లో దేశంలో 50 శాతం మంది ముఖ్యమంత్రులు మహిళలే ఉండాలని, అదే మన లక్ష్యమని ఉద్ఘాటించారు. మహిళా బిల్లు అమల్లో జాప్యమెందుకు? ఆర్ఎస్ఎస్, బీజేపీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవి రెండూ పూర్తిగా పురుషాధిక్య సంస్థలని ఆరోపించారు. అధికారంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంగీకరించదని చెప్పారు. మొత్తం ఆర్ఎస్ఎస్ చరిత్రను గమనిస్తే ఏనాడూ ఆ సంస్థలో మహిళల భాగస్వామ్యం లేదని గుర్తుచేశారు. మహిళలను ప్రోత్సహించే విషయంలో కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోవడం దారుణమని రాహుల్ మండిపడ్డారు. జాప్యం ఎందుకని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఆమోదం పొందాక దశాబ్దం తర్వాత అమలు చేసే బిల్లును తాను ఏప్పుడూ చూడలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు విషయంలో మాత్రమే ఇలా జరుగుతోందని తప్పుపట్టారు. ఇదంతా బీజేపీ ప్రభుత్వ నిర్వాకమేనని ఆక్షేపించారు. మైక్రోఫోన్ను ప్రజల వైపు మళ్లిస్తున్నా.. ఢిల్లీలో ఉండే కొందరు నాయకులు లౌడ్స్పీకర్లు, కెమెరాలను వారివైపే తిప్పుకుంటున్నారని రాహుల్ గాంధీ పరోక్షంగా బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు. తాను మాత్రం మైక్రోఫోన్ను ప్రజల వైపు మళ్లిస్తున్నానని చెప్పారు. సమస్యలను చెప్పుకొనే అవకాశం ప్రజలకు ఇస్తున్నానని తెలిపారు. -
వీరబాల
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపానీ నిన్న ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఆనందీబెన్కు ఇంకా 15 నెలల పదవీకాలం మిగిలే ఉంది. కానీ ఆమె దిగిపోయారు. రూపానీ చొరవ ఉన్న నాయకుడు కాదు. కానీ ఆయన ఎదిగిపోయారు! బాల్యంలో అసమాన క్రీడా ప్రతిభను కనబరిచి ‘వీర్ బాల’ అవార్డు అందుకున్న ఆనందీబెన్ను... ఈ రాజకీయ క్రీడా పరిణామాలు ఏ మాత్రం నివ్వెరపరచలేవని పదవి బదలాయింపులో ఆమె ప్రదర్శించిన పెద్దరికాన్ని బట్టి స్పష్టమవుతోంది. ఇద్దరూ మహిళా ముఖ్యమంత్రులే కావడం మినహా ఏ పోలికా, పొంతన లేని రాష్ట్రాలు కశ్మీర్, గుజరాత్. అయితే అవే రాష్ట్రాలు ఇప్పుడు అశాంతికి, అస్థిరతకు అక్కాచెల్లెళ్లు అయ్యాయి! అక్కడ ఉగ్రవాదం, ఇక్కడ ఆగ్రహవాదం. కశ్మీర్ను పొరుగు దేశం నుంచి కాపాడుకోవాలి. గుజరాత్ను పార్టీ తప్పిదాల నుంచి గట్టెక్కించుకోవాలి. నిజానికి కశ్మీర్ కన్నా, గుజరాతే ప్రస్తుతం నరేంద్ర మోదీకి పెద్ద సమస్య! వచ్చే ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో గెలవడానికి మోదీ కదిపిన మొట్ట మొదటి పావు ఆనందినీబెన్. పటేళ్ల రిజర్వేషన్ల గొడవను ఆపలేకపోయారని, ‘ఉనా’లో దళితుల రక్తం పార్టీపై చిందకుండా జాగ్రత్త వహించలేకపోయారని ఆమెపై ప్రధాన ఆరోపణ.. ప్రధాని ఆరోపణ కూడా! రమ్మందీ ఆయనే... పొమ్మందీ ఆయనే ఆనందీబెన్.. బీజేపీలో సీనియర్ నాయకురాలు. లేదా ‘నిజమైన నాయకులలో’ సీనియర్. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆమె చెప్పిన కారణం కూడా ఈ సీనియారిటీనే! ‘‘డెబ్బయ్ ఐదేళ్లు వచ్చిన వాళ్లు కీలక బాధ్యతల నుంచి వైదొలగాలన్నది పార్టీ అభిమతం. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని ఆమె తన రాజీనామాకు ముందు ప్రకటించారు. (వాస్తవానికి ఈ ఏడాది నవంబరుకు గానీ ఆనందీబెన్ 75లోకి అడుగుపెట్టరు). దేశ ప్రధాని అయ్యాక, తన స్థానంలో గుజరాత్కు ఆనందీబెన్ను ముఖ్యమంత్రిగా సూచించిందీ మోదీనే, ఇప్పుడు ఆమెను దించేయమన్న సంకేతాలు పంపిందీ మోదీనే. బెన్దీ, మోదీదీ ఒకే స్కూలు! మోదీ కన్నా సీనియర్ ఆనందీబెన్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. విస్నగర్ (మెహ్సానా)లోని ఎన్.ఎం.హైస్కూల్ అది. ఇద్దరికీ వయసులో పదేళ్లు తేడా. అదే సీనియారిటీ ఆమె ఆలోచనా విధానంలోనూ కనిపిస్తుంది. మోదీది రాజకీయ చతురత. ఆనందీబెన్ది రాజకీయాలకు అతీతమైన పరిణతి. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక కూడా ప్రధానంగా ఆమె స్త్రీల విద్య, అభివృద్ధి కోసమే శ్రమించారు. గుజరాత్ విద్యాశాఖ మంత్రిగా ఆనందీబెన్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, చూపిన చొరవ కారణంగానే ఆ రాష్ట్రంలో 2001లో 37గా ఉన్న బాలికల డ్రాపవుట్స్ (మధ్యలో చదువు మానేసేవారు) శాతం 2013 నాటికి 2 శాతానికి తగ్గిపోవడం అప్పట్లో దేశానికే ఒక ఆదర్శ పరిణామం అయింది. 700 మందిల్లో ఒకే ఒక అమ్మాయి! ఆనందీబెన్ చదివిన ప్రాథమిక పాఠశాలలో నాల్గవ తరగతి వరకు ఆమె ఒక్కతే అమ్మాయి. మిగతా 700 మందీ అబ్బాయిలు! ఆ వయసులోనే ఆమెకది అసహజంగా కనిపించింది. బడి టైమ్లో బడిలో లేకుండా ఈ ఆడపిల్లలంతా ఎక్కడ ఉన్నట్టు? అనే ప్రశ్న ఆమెను వేధించింది. తండ్రిని అడిగింది. ‘‘ఇంకెక్కడ? ఇంట్లో’’ అని అన్నారు ఆయన. ఎందుకు ఇంట్లోనే ఉండిపోవాలి? మళ్లీ ఇంకో ప్రశ్న. హైస్కూల్లోనూ అంతే. తనతో కలిపి ముగ్గురు విద్యార్థినులు. బియస్సీలో అయితే తనొక్కతే ఆడపిల్ల. ఈ పరిస్థితి మార్చాలని ఆనాడే నిర్ణయించుకున్నారు ఆనందీబెన్. టీచర్గా చేతనైనంత చేశారు. చేతికి పవర్ వచ్చాక ఎవరూ చేయనంత చేశారు. అనుకోకుండా ఓ రోజు! 1987 వరకు ఆనందీబెన్ టీచర్గానే ఉన్నారు. ఆ ఏడాది ఓ రోజు స్కూల్ పిల్లలతో కలిసి పిక్నిక్కి వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తూ ఇద్దరు విద్యార్థినులు సర్దార్ సరోవర్ రిజర్వాయర్లో పడిపోయారు. నీళ్లలోంచి వాళ్ల ఆక్రందనలు, ఒడ్డున మిగతా పిల్లలు, టీచర్ల హాహాకారాలు! ఆనందీబెన్ చురుగ్గా కదిలి రిజర్వాయర్లోకి దూకేశారు. ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ పిల్లలిద్దర్నీ క్షేమంగా గట్టుపైకి తెచ్చారు. ప్రాణాలకు తెగించి ఆమె చూపిన సాహసానికి ఆనందీబెన్కి రాష్ట్రపతి ధీరవనిత (బ్రేవరీ) అవార్డు వచ్చింది. ఆ వెంటనే బి.జె.పి. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి, ఆమెను ఏకంగా గుజరాత్ మహిళా మోర్చాకు అధ్యక్షురాలిని చేసింది. డైనమిజం.. ఆమె నైజం 1992లో విరామ్గ్రామ్ జిల్లాలో ‘బర్డ్ఫ్లూ’ ప్రబలింది. ఎవరికైనా బర్డ్ఫ్లూ సోకిందని తెలిస్తే చాలు ఆ దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడే మనస్తత్వం కూడా ప్రబలింది. అలాంటి భయానక వాతావరణంలో ఆనందీ పార్టీ వ్యవహారాలను పక్కనపెట్టి జనం మధ్యే ఉండిపోయారు. అధికార యంత్రాంగానికీ, స్థానిక ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా నిద్రాహారాలు మాని మరీ పనిచేశారు! అది ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ ఏడాది కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు పార్టీ నిర్వహించిన ‘ఏక్తాయాత్ర’లో నాటి అగ్రనేత మురళీ మనోహర్ జోషి పక్కన ఆనందిబెన్ ఒక్కరికే స్థానం లభించింది. రెండేళ్ల తర్వాత 1994లో ఆమె రాజ్యసభ సభ్యురాలయ్యారు. ఎంపీ హోదాలో 1995లో చైనాలోని బీజింగ్లో జరిగిన ‘నాల్గవ ప్రపంచ మహిళా సదస్సు’లో భారతదేశ ప్రతినిధిగా పాల్గొని వచ్చారు. ఆశించనవీ, ఊహించనివే అన్నీ! ఆనందీబెన్ రాజకీయ జీవితంలో ప్రతి పరిణామం అనుకోకుండా, ఆశించకుండా, ఊహించకుండా జరిగిందే! 31 ఏళ్ల పాటు పిల్లలకు పాఠాలు బోధించిన ఈ ఉపాధ్యాయురాలు... దాదాపు అంతేకాలం రాజకీయాల్లో ఒక విద్యార్థినిగా ఎన్నో పాఠాలను నేర్చుకునే ఉంటారు. పిల్లలకు మంచేదో, చెడేదో చెప్పగలిగిన ఒక టీచర్... ప్రజలకు ‘మంచిది కాని దాన్ని’ చెయ్యకుండా ఉండడానికి మాత్రం ఎందుకు వెనకాడతారు? అది పార్టీ అభీష్టానికి వ్యతిరేకమే అయినా ఎందుకు తన ఆత్మప్రబోధానుసారం నడుచుకోకుండా ఉంటారు? అలా చేసినందుకే, ఓటు బ్యాంకు అనుకున్న పటేళ్ల ఉద్యమాన్ని అణిచివేసినందుకే, ‘ఉనా’ హింసాకాండలో హిందూత్వ వాదులను వెనకేసుకు రాకుండా తన మౌనంతో దళితుల పక్షాన నిలిచినందుకే... గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆమె తన 75వ పుట్టినరోజును జరుపుకునే అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఆమె పంజాబ్ గవర్నర్గా తన బర్త్డే ని జరుపుకునే అవకాశాలూ లేకపోలేదు. ఆనందీబెన్ భర్త మఫత్ లాల్ పటేల్ (79): విద్యారంగంలో, రాజకీయాలలో తన భార్య ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయిన మఫత్లాల్ గత 30 ఏళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఆమెకు వ్యతిరేకంగా గతంలో ఆయన అనేకసార్లు మోదీకి, అద్వానీకి లేఖలు కూడా రాశారు. ఆనందిబెన్ పటేల్ (74) నిన్నటి దాకా గుజరాత్ ముఖ్యమంత్రి పూర్తి పేరు : ఆనందిబెన్ మఫత్లాల్ పటేల్ జననం : 21 నవంబర్ 1941 జన్మస్థలం : ఖరోద్, గుజరాత్ భర్త : మఫత్లాల్సై ,కాలజీ ప్రొఫెసర్ (వివాహం 29 మే 1962), విడిగా జీవనం (1985 నుంచి) సంతానం : అనార్ (కూతురు), సంజయ్ (కొడుకు) మనవడు, మనవరాలు : ధర్మ్, సంస్కృతి చదువు : బి.ఎస్సీ. (1960 బ్యాచ్) తర్వాత విరామాలతో... ఎమ్మెస్సీ, బి.ఇడి, ఎం.ఇడి. తొలి ఉద్యోగం : సైన్స్, మ్యాథ్స్ టీచర్ రాజకీయరంగ ప్రవేశం : 1987 (46 ఏళ్ల వయసులో) వీరబాల * ఆనందిబెన్ స్థానికంగా ఉండే ఎన్.ఎం. హైస్కూల్లో చదువుకున్నారు. ఆ స్కూల్లో ఆనంది సహా ముగ్గురే విద్యార్థినులు! * ఆనంది మంచి అథ్లెట్. జిల్లా స్థాయిలో వరుసగా మూడేళ్లు ఛాంపియన్గా నిలబడ్డారు. * మెహ్సానా జిల్లా మొత్తం మీద చురుకైన క్రీడాకారిణిగా ‘వీర్బాల’ అవార్డు అందుకున్నారు. ఇవి కాక... * అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తులలో ఒకరిగా ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ అవార్డు (2014). * ఉత్తమ ఉపాధ్యాయినిగా గవర్నర్ అవార్డు (1988) * ఉత్తమ ఉపాధ్యాయినిగా, ధీరవనితగా రాష్ట్రపతి అవార్డు (1989) * సర్దార్ పటేల్ అవార్డు (పటేల్ జాగృతి మండల్) 1999 * విద్యా గౌరి అవార్డు (శ్రీ తపోధన్ బ్రహ్మణ్ వికాస్ మండల్) 2002 * ధరతి వికాస్ మండల్ స్త్రీ జనోద్ధరణ అవార్డు పెళ్లయ్యాకే పెద్ద డిగ్రీలన్నీ! * ‘మహిళా వికాస్ గృహ్’లో 50 మంది వితంతువులకు ఒకేషనల్ కోర్సులో పాఠాలు చెప్పారు. * భర్తతో కలిసి 1965లో అహ్మదాబాద్ వెళ్లి సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. * ఆనంది మెట్టినిల్లు పెద్దది. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే, బి.ఇడి. పూర్తి చేశారు. తర్వాత ఎమ్మెస్సీ చేశారు. * ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ సాధించారు. * 1967-1970 మధ్య అహ్మదాబాద్లోని మొిహ నిబా కన్యా విద్యాలయలో సైన్స్, మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు. అదే స్కూల్కి ప్రిన్సిపల్ అయ్యారు! చేపట్టిన బాధ్యతలు * విద్య, సాంకేతిక విద్య, స్త్రీ శిశు సంక్షేమం; క్రీడలు, యువజన, సాంస్కృతిక మంత్రిత్వశాఖలు (1998-2007). * రెవిన్యూ, విపత్తు నిర్వహణ; రోడ్లు, భవనాలు, స్త్రీ,శిశు సంక్షేమం (2007-2014). * గుజరాత్ తొలి మహిళాముఖ్యమంత్రిగా 22 మే 2014 నుంచి - 7 ఆగస్టు 2016 వరకు. * 1998లో రాజ్యసభకు రాజీనామా చేసి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని మండల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు తర్వాత వరుసగా 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 2014లో గుజరాత్ సి.ఎం.అయ్యారు.