breaking news
Womens hockey tournament
-
సింగపూర్పై 12–0తో గెలిచి ‘సూపర్–4’ దశకు భారత్
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. సింగపూర్ జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 12–0 గోల్స్తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవ్నీత్ కౌర్ (14వ, 20వ, 28వ నిమిషాల్లో), ముంతాజ్ ఖాన్ (2వ, 32వ, 39వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేశారు. నేహా (11వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించింది. లాల్రెమ్సియామి (13వ నిమిషంలో), ఉదిత (29వ నిమిషంలో), షరి్మలా (45వ నిమిషంలో), రుతుజా (53వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. థాయ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 11–0తో నెగ్గిన భారత్... జపాన్తో రెండో మ్యాచ్ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పూల్ ‘బి’లో భారత్, జపాన్ జట్లు ఏడు పాయింట్లతో సమంగా నిలిచినా... ఎక్కువ గోల్స్ చేసిన భారత్కు అగ్రస్థానం ఖాయమైంది. జపాన్కు రెండో స్థానం దక్కింది. పూల్ ‘బి’ నుంచి భారత్, జపాన్... పూల్ ‘ఎ’ నుంచి చైనా, దక్షిణ కొరియా జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధించాయి. బుధవారం జరిగే ‘సూపర్–4’ మ్యాచ్ల్లో కొరియాతో భారత్; జపాన్తో చైనా తలపడతాయి. ‘సూపర్–4’ మ్యాచ్లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత పొందుతాయి. విజేత జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. -
భారత్, జపాన్ మ్యాచ్ ‘డ్రా’
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారీ విజయంతో శుభారంభం చేసిన భారత జట్టు... డిఫెండింగ్ చాంపియన్ జపాన్తో రెండో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్లో 11–0 గోల్స్ తేడాతో థాయ్లాండ్ను చిత్తుచేసిన సలీమా టెటె సారథ్యంలోని టీమిండియా... శనివారం జపాన్తో రెండో మ్యాచ్ను 2–2తో ‘డ్రా’గా ముగించింది. పూల్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ పోరులో చివరి క్షణాల్లో నవ్నీత్ కౌర్ గోల్ చేసి జట్టును గట్టెక్కించింది. భారత్ తరఫున రుతుజ (30వ నిమిషంలో), నవ్నీత్ కౌర్ (60వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... జపాన్ తరఫున హిరోకా మురయామా (10వ నిమిషంలో), చికో ఫుజిబయాషి (58వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేసుకున్నారు. పూల్ ‘బి’లో భాగంగా శనివారమే జరిగిన మరో మ్యాచ్లో థాయ్లాండ్ 2–1 గోల్స్ తేడాతో సింగపూర్పై విజయం సాధించింది. లీగ్ దశలో చివరి మ్యాచ్లో సోమవారం సింగపూర్తో భారత్ తలపడనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటుండగా... ఒక్కో పూల్ నుంచి ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లు... సూపర్–4 దశకు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈ నెల 14న ఫైనల్ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న మహిళల వరల్డ్కప్నకు నేరుగా అర్హత సాధించనుంది. -
భారత్ భారీ విజయం
హాంగ్జౌ (చైనా): ప్రపంచ కప్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా... ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో బరిలోకి దిగిన భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్లాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్లో సలీమా టెటె సారథ్యంలోని టీమిండియా 11–0 గోల్స్ తేడాతో గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముంతాజ్ ఖాన్ (7వ, 49వ నిమిషాల్లో), ఉదిత (30వ, 52వ నిమిషాల్లో), బ్యూటీ డుంగ్డుంగ్ (45వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. సంగీత కుమారి (10వ నిమిషంలో), నవ్నీత్ కౌర్ (18వ నిమిషంలో), లాల్రెమ్సియామి (18వ నిమిషంలో), షర్మిలా దేవి (57వ నిమిషంలో), రుతుజా (60వ నిమిషంలో) టీమిండియాకు ఒక్కో గోల్ అందించారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత జట్టు విరామ సమయానికి 5–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓవరాల్గా తమకు లభించిన తొమ్మిది పెనాల్టీ కార్నర్లలో ఐదింటిని గోల్స్గా మలిచిన భారత జట్టు నాలుగింటిని వృథా చేసింది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్లో 30వ స్థానంలో ఉన్న థాయ్లాండ్ జట్టుకు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా దక్కలేదు. పూల్ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్లో జపాన్ 9–0తో సింగపూర్ జట్టును ఓడించగా... పూల్ ‘ఎ’లో జరిగిన రెండు మ్యాచ్ల్లో దక్షిణ కొరియా 9–0తో చైనీస్ తైపీపై, చైనా 8–0తో మలేసియాపై విజయం సాధించాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో జపాన్తో భారత్; థాయ్లాండ్తో సింగపూర్ తలపడతాయి. -
ప్రపంచ కప్ బెర్త్ లక్ష్యంగా...
హాంగ్జౌ (చైనా): సీనియర్ గోల్కీపర్ సవితా పూనియా... స్టార్ డ్రాగ్ ఫ్లికర్ దీపిక గైర్హాజరీలో.. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత జట్టు శుక్రవారం పూల్ ‘బి’లోని తమ తొలి మ్యాచ్లో థాయ్లాండ్తో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ తొమ్మిదో స్థానంలో... థాయ్లాండ్ 30వ స్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ భారీ విజయంపై గురి పెట్టింది. పూల్ ‘బి’లో భారత్, థాయ్లాండ్లతోపాటు జపాన్ (12వ ర్యాంక్), సింగపూర్ (31వ ర్యాంక్) జట్లున్నాయి. శుక్రవారం థాయ్లాండ్తో మ్యాచ్ తర్వాత... శనివారం జపాన్తో, సోమవారం సింగపూర్తో భారత్ ఆడుతుంది. పూల్ ‘ఎ’లో చైనా, దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు పూల్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్–4’ మ్యాచ్లు ముగిశాక టాప్–2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో టైటిల్ కోసం పోటీపడతాయి. ఆసియా కప్ విజేత జట్టుకు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్కు నేరుగా అర్హత లభిస్తుంది. చీలమండ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న మాజీ కెపె్టన్, గోల్కీపర్ సవితా పూనియా స్థానంలో గోల్ కీపింగ్ బాధ్యతలు బిచ్చూదేవి, బన్సారి సోలంకి తీసుకుంటారు. దీపిక లేని లోటును డిఫెన్స్లో ఉదిత, నిక్కీ ప్రధాన్, మనీషా చౌహాన్, ఇషిక, సుమన్ దేవి భర్తీ చేయాల్సి ఉంటుంది. నేహా, కెప్టెన్ సలీమా టెటె, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, సునెలితా టొప్పో, వైష్ణవిలతో భారత మిడ్ఫీల్డ్ పటిష్టంగా ఉంది. ఫార్వర్డ్ శ్రేణిలో నవ్నీత్ కౌర్, సంగీత, ముంతాజ్ ఖాన్, బ్యూటీ డుంగ్డుంగ్, రుతుజా, సాక్షి సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ టోర్నీ భారత చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్కు కూడా పరీక్షగా నిలువనుంది. ఇటీవల యూరోపియన్ అంచె ప్రొ లీగ్లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ప్రొ లీగ్లో భారత జట్టు 100 కంటే ఎక్కువ పెనాల్టీ కార్నర్లను సమర్పించుకోగా.. బెల్జియంతో జరిగిన పోరులో ఏకంగా 17 పెనాల్టీ కార్నర్లు ఉన్నాయి. 1985లో మొదలైన ఈ టోర్నీలో భారత జట్టు రెండుసార్లు (2004, 2017) చాంపియన్గా, రెండుసార్లు (1999, 2009) రన్నరప్గా నిలిచింది. మూడుసార్లు (1993, 2013, 2022) మూడో స్థానాన్ని పొందిన టీమిండియా ... రెండుసార్లు (1989, 2007) నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
యువ భారత్ ‘హ్యాట్రిక్’
రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన యువ భారత్... ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో షూటౌట్లో విజయం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1–1 గోల్స్తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 2–0తో గెలుపొందింది. మ్యాచ్లో భారత్ తరఫున కనిక (44వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున మిలాగ్రోస్ డెల్ వాలె (10వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. అర్జెంటీనా జట్టు తొలి క్వార్టర్లోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... మూడో క్వార్టర్లో కనిక గోల్తో భారత్ స్కోర్లు సమం చేయగలిగింది. షూటౌట్లో భారత్ తరఫున లాల్రిన్పుయి, లాల్థన్ట్లుంగి విజయవంతం అయ్యారు. యువ భారత జట్టు కెప్టెన్ నిధి గోల్కీపర్గా అర్జెంటీనా ప్లేయర్ల దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో భారర్లీ టోర్నమెంట్లో వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. తదుపరి మ్యాచ్లో శుక్రవారం చిలీతో భారత్ తలపడుతుంది. -
నేటి నుంచి జాతీయ మహిళల హాకీ టోర్నీ
పంచ్కులా: సీనియర్ మహిళల జాతీయ హాకీ చాంపియన్షిప్ను కొత్త ఫార్మాట్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 12 వరకు హరియాణాలోని పంచ్కులాలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. మొత్తం 28 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్లో ఈ 28 జట్లు ఎ, బి, సి గ్రూపుల్లో తలపడతాయి. ఈ తాజా ప్రదర్శనే ప్రామాణీకంగా తదుపరి సీజన్ గ్రూపుల్లో జట్లు మారతాయి. అంటే రంజీ క్రికెట్ తరహాలో రాష్ట్ర హాకీ జట్లు మూడు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తారు. తద్వారా ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి జట్ల మధ్య పోటీలు జరుగుతాయి. సిలో చిన్న జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే మధ్యమ స్థాయి ‘బి’కి... తర్వాత ఉత్తమ స్థాయి ‘ఎ’కి ఆయా జట్లకు ప్రమోషన్ లభిస్తుంది. తద్వారా బలమైన జట్టుతో బలహీనమైన జట్టు పోటీపడదు. సమఉజ్జీల మధ్యే సమరం జరగడం వల్ల పోటీ వాతావరణం క్రమంగా పెరిగి ఆయా జట్లు పురోగతి సాధిస్తాయని ‘హాకీ ఇండియా’ భావిస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల జట్లకు ‘ఎ’ డివిజన్లో పోటీపడే అవకాశం లభించలేదు. తెలంగాణ ‘బి’ డివిజన్లోని పూల్ ‘ఎ’లో ఉన్న ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్లతో తలపడుతుంది. ‘సి’ డివిజన్లోని పూల్ ‘బి’లో ఉన్న ఆంధ్రప్రదేశ్... పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్లతో పోటీ పడుతుంది. ‘ఎ’ డివిజన్లో... పూల్ ‘ఎ’: హరియాణా, ఒడిశా, కర్ణాటక; పూల్ ‘బి’: మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్; పూల్ ‘సి’: జార్ఖండ్, మిజోరం, తమిళనాడు; పూల్ ‘డి’: మధ్యప్రదేశ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్. ‘బి’ డివిజన్లో... పూల్ ‘ఎ’: తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్; పూల్ ‘బి’: ఢిల్లీ, ఛత్తీస్గఢ్, చండీగఢ్, హిమాచల్ప్రదేశ్. ‘సి’ డివిజన్లో... పూల్ ‘ఎ’: కేరళ, దాద్రా నాగర్ హవేలి, డామన్ అండ్ డియూ, గుజరాత్; పూల్ ‘బి’: ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్. -
జాతీయ మహిళల హాకీ విజేత హరియాణా
పుణే: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్షిప్ను హరియాణా సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో షూటౌట్ ద్వారా హరియాణా 3–0తో ఆతిథ్య మహారాష్ట్రను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1 గోల్స్తో సమంగా నిలిచాయి. హరియాణా తరఫున దీపిక పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించగా...మహారాష్ట్ర తరఫున అక్షత గోల్తో స్కోరు సమం చేసింది. షూటౌట్లో హరియాణా ప్లేయర్లలో నవనీత్ కౌర్, ఉష, సోనిక స్కోర్ చేయగా... మహారాష్ట్ర ప్లేయర్లలో ప్రియాంక, ఆకాంక్ష, రుతుజ గోల్ చేయడంలో విఫలమయ్యారు. -
విజేత భారత్
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్స వాలను పురస్కరించుకొని నిర్వహించిన మూడు దేశాల మహిళల టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీ లో భారత జట్టు రెండు మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో అజేయంగా నిలిచి టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 3–0తో స్పెయిన్పై గెలిచింది. భారత్ తరఫున వందన కటారియా (22వ ని.లో), మోనిక (48వ ని.లో), ఉదిత (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పురుషుల జట్టుకు కాంస్యం ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత జట్టు 2–1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్పై గెలిచింది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (15వ ని.లో), దిల్ప్రీత్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు థియరీ బ్రింక్మన్ (25వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. -
నేషన్స్ కప్ మహిళల హాకీ టోర్నీ విజేత భారత్
వాలెన్సియా: తొలిసారి నిర్వహించిన నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో సవితా పూనియా నాయకత్వంలోని టీమిండియా 1–0 గోల్ తేడాతో ఆతిథ్య స్పెయిన్ జట్టును ఓడించింది. ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గుర్జీత్ కౌర్ గోల్గా మలిచింది. ఈ విజయంతో భారత్ 2023–2024 ప్రొ లీగ్కు నేరుగా అర్హత సాధించింది. టైటిల్ నెగ్గిన భారత జట్టు సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది. చదవండి: FIFA WC 2022: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే -
భారత హాకీ జట్టులో కరోనా కలకలం..
Indian Womens Hockey Player Tested Positive For Covid: భారత మహిళల హాకీ జట్టులో కరోనా కలకలం రేపింది. సియోల్ వేదికగా జరుగుతున్న ఆసియా మహిళల హకీ టోర్నీలో భాగంగా బుధవారం భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉండగా.. మ్యాచ్కు ముందు జరిపిన వైద్య పరీక్షల్లో భారత క్రీడాకారిణికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆతిధ్య జట్టుతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈ విషయాన్ని దృవీకరించిన ఆసియా హాకీ ఫెడరేషన్.. మహమ్మారి బారిన పడిన క్రీడాకారిణి పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇదే టోర్నీలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో థాయ్లాండ్ను 13-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. చదవండి: ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు -
విజేత భారత్
కాన్బెర్రా (ఆ్రస్టేలియా): మూడు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో భారత్, ఆసీస్ 7 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్కు (+4) టైటిల్ ఖాయంకాగా... ఆసీస్ (+1) రన్నరప్గా నిలిచింది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింటిలో గెలిచిన భారత్... ఒకదాంట్లో ఓడి మరొక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. టోర్నీ మొత్తం అదరగొట్టిన యువ భారత్ చివరి మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 1–2తో ఓడిపోయింది. ఆసీస్ తరఫున ఎబిగైల్ విల్సన్ రెండు గోల్స్ చేయగా... భారత్కు గగన్దీప్ ఒక గోల్ అందించింది. -
చాంపియన్ భారత్
హిరోషిమా: మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీ చాంపియన్గా భారత్ అవతరించింది. ఇప్పటికే ఫైనల్స్ చేరడం ద్వారా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించిన భారత్ హిరోషిమాలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్పై విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తుది పోరులో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత్ జపాన్ను మట్టికరిపించింది. భారత్ తరపున మరోసారి రాణించిన గుర్జిత్ కౌర్ రెండు గోల్స్(45వ, 60వ నిమిషంలో) సాధించి విజయంలో కీలకపాత్ర పోషించింది. రాణి రాంపాల్(3వ నిమిషంలో) మరో గోల్ నమోదు చేసింది. జపాన్ తరపున నమోదైన ఏకైక గోల్ను మోరి కనోన్(11వ నిమిషంలో) సాధించింది. మ్యాచ్ మొత్తంలో భారత్ 26 సార్లు జపాన్ రక్షణ వలయంలోకి ప్రవేశించగా, జపాన్ కేవలం 13 సార్లు మాత్రమే భారత్ రక్షణ వలయంలోకి ప్రవేశించింది. మ్యాచ్లో భారత్కు 8 పెనాల్టీ కార్నర్స్ లభించగా జపాన్కు కేవలం 2 మాత్రమే లభించాయి. భారత్ సాధించిన మూడు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ల రూపంలో రావడం విశేషం. టోర్నీలో అపజయం ఎరుగని భారత్ మొత్తం 27 గోల్స్ చేయగా కేవలం 4 గోల్స్ను మాత్రమే ప్రత్యర్థులకు సమర్పించుకుంది. భారత కెప్టెన్ రాణి రాంపాల్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలవగా, గుర్జీత్ కౌర్ టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచింది. అంతకుముందు 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో చిలీ 3–1తో పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3–3 గోల్స్తో సమంగా ఉండటంతో షూటౌట్లో విజేతను నిర్ణయించారు. -
మహిళల హాకీ జట్టు బోణీ
యాంట్వర్ప్ (బెల్జియం): ఆరు దేశాల అండర్23 మహిళల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం తొలి మ్యాచ్లో భారత్ 41 గోల్స్ తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. ప్రీతి దూబే నాయకత్వంలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఈ మ్యాచ్లో ఐదో నిమిషంలో షాక్ తగిలింది. ఎడెల్ నిలాండ్ గోల్తో ఐర్లాండ్ 10 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న భారత్ 11వ నిమిషంలో జ్యోతి గోల్తో స్కోరును సమం చేసింది. 22వ నిమిషంలో ముంతాజ్ ఖాన్ భారత ఆధిక్యాన్ని 21కి పెంచగా... 28వ, 37వ నిమిషంలో మన్ప్రీత్ కౌర్ రెండు గోల్స్ చేయడంతో భారత విజయం ఖాయమైంది. -
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీకి రజని
ఈనెల 28న జపాన్లో మొదలయ్యే ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు రాణి రాంపాల్ నేతృత్వం వహించనుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన రజని ఎతిమరపు రెండో గోల్కీపర్గా జట్టులో స్థానాన్ని నిలబెట్టుకుంది. మరో గోల్కీపర్ సవిత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తుంది. కొత్త కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో తొలి టోర్నీలో బరిలోకి దిగుతున్న భారత్ విజేతగా నిలిస్తే వచ్చే ఏడాది ఇంగ్లండ్లో జరిగే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధిస్తుంది. -
సెమీస్లో భారత్ పరాజయం
బ్యాంకాక్: ఆసియా కప్ అండర్–18 మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్ సెమీఫైనల్లో ఓడిపోయింది. జపాన్తో జరిగిన మ్యాచ్లో షూటౌట్లో టీమిండియా 2–4 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 1–1తో సమఉజ్జీగా నిలువడంతో ఫలితం తేలడానికి షూటౌట్ను నిర్వహించారు.