Zaheer
-
‘ఇటాలియన్ మాఫియా’ : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట (ఫొటోలు)
-
అతనితో పెళ్లి అనగానే కుటుంబంలో గొడవలు: సోనాక్షి సిన్హా తండ్రి కామెంట్స్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా.. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకోనుంది. ఈ నెల 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమైంది. ముంబయిలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లికి సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరు అవుతున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లికి ముందు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పిన ఆయన.. ఆ తర్వాత నా ఏకైక కుమార్తె సోనాక్షినే అని చెప్పుకొచ్చాడు. ఈ రోజుల్లో పెళ్లికి పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరని.. వారి నిర్ణయాన్ని మాత్రమే తెలియజేస్తారని ఆయన అన్నారు.పెళ్లికి ముందు విభేదాలుసోనాక్షి తన ప్రియుడు ఇక్బాల్ను పెళ్లి చేసుకోనుందని తెలియగానే మా కుటుంబంలో విభేదాలు వచ్చాయని శతృఘ్న సిన్హా తెలిపారు. పెళ్లి అనేది అందరి ఇళ్లలో జరుగుతుందని.. వివాహనికి ముందు గొడవలు కూడా మామూలే అని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం అంతా బాగానే ఉందని వెల్లడించారు. సోనాక్షి, జహీర్ రిసెప్షన్కు తమ కుటుంబం హాజరవుతుందని శతృఘ్న తెలిపారు. కాగా.. పెళ్లికి ముందు సోనాక్షి, జహీర్ స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. -
హీరోయిన్ సోనాక్షిపెళ్లికి రెడీ,మెహెందీ ఫోటోలు వైరల్
-
స్టార్ హీరోయిన్ పెళ్లి హడావుడి.. బ్యాచిలర్ పార్టీ ఫొటోలు వైరల్
స్టార్ హీరో సోనాక్షి సిన్హా పెళ్లికి రెడీ అయిపోయింది. జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ని పెళ్లి చేసుకోబోతుంది. అయితే ఈ వివాహం జరగనుందని, తల్లిదండ్రులకు సోనాక్షి నిన్న మొన్నటి వరకు చెప్పలేదట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక పెళ్లి హడావుడి ఓ పక్క జరుగుతుండగా, మరోవైపు బ్యాచిలర్ పార్టీలు గ్రాండ్గా చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి:ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?)బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురే సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. దక్షిణాదిలోనూ రజనీకాంత్ 'లింగా' మూవీలో నటించింది. రీసెంట్ టైంలో ఈమెకు పెద్దగా కలిసి రావట్లేదు. ఈ క్రమంలోనే జహీర్ ఇక్బాల్ అనే నటుడితో ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇది జరిగిన కొన్నిరోజులకే పెళ్లి గురించి న్యూస్ బయటకొచ్చింది.పెళ్లి కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనాక్షి పెళ్లి నిజమేనని క్లారిటీ వచ్చేసింది. జూన్ 23న వీళ్ల పెళ్లి వేడుక జరగనుంది. ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. శుభకార్యానికి మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీల్లో కాబోయే వధూవరులు బిజీగా ఉన్నారు.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?) -
మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టింది. ఇంతకాలంగా కెరీర్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం పర్సనల్ లైఫ్పై శ్రద్ధ పెట్టింది. సింగిల్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టి మ్యారీడ్ లైఫ్కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతోంది.వారం రోజుల్లో పెళ్లిఈ నెల 23న ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లి చేసుకోనున్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు ఓ వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట వైరలయింది. ఇప్పటివరకు రూమర్డ్ లవ్ బర్డ్స్లా ఉన్నాం. ఇకమీద భార్యాభర్తలుగా మారబోతున్నాం. జూన్ 23న రోజు మీకు ఏ పని ఉన్నా దాన్ని పక్కన పెట్టి మా పెళ్లి వేడుకకు వచ్చేయండి అని ఇన్విటేషన్ కార్డులో రాసుకొచ్చారు.ఫాదర్స్డే.. ప్రియుడి ఇంట్లోఆదివారం (జూన్ 16) ఫాదర్స్ డే సందర్భంగా జహీర్ ఇక్బాల్ సోదరి, సెలబ్రిటీ స్టైలిస్ట్ సనం రతంసి ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో జహీర్ తన కుటుంబంతో కలిసి ఫోటోకు పోజిచ్చాడు. ఆ ఫోటోలో సోనాక్షి సిన్హ కూడా ఉండటం విశేషం. ఈ ఒక్క పిక్తో వీళ్ల పెళ్లి నిజమేనని ఖరారైపోయింది.చదవండి: నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు: వితికా షెరు -
సహనటుడితో హీరోయిన్ డేటింగ్.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవలే దహాద్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. అయితే దబాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాధోడ్ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. జూన్ 2న సోనాక్షి సిన్హా తన 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ తారలు శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి) అయితే ఆమె సహనటుడు జహీర్ ఇక్బాల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సోనాక్షి, జహీర్ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఈ జంట పలు ఈవెంట్లలో కనిపించారు. దీంతో ప్రతిసారీ సోషల్ మీడియాలో రిలేషన్ షిప్పై గాసిప్స్ వినిపించాయి. తాజాగా సోనాక్షి సిన్హా పుట్టినరోజు సందర్భంగా జహీర్ చేసిన పోస్ట్ డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తోంది. బర్త్ డే విషెష్ చెబుతూనే 'ఐ లవ్ యూ' అంటూ నోట్లో రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆమెతో దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. కాగా.. గత నెలలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ జహీర్ ఇక్బాల్తో సోనాక్షి సిన్హా సంబంధాన్ని దాదాపుగా ధృవీకరించారు. కాగా.. వీరిద్దరు కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. సోనాక్షి సిన్హా ప్రస్తుతం హర్రర్-కామెడీ చిత్రం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనుంది. ఆ తర్వాత నికితా రాయ్ మూవీ ది బుక్ ఆఫ్ డార్క్నెస్లో నటించనుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన బెస్ట్ ఫ్రెండ్.. వైరలవుతున్న ఫోటోలు) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
తమ రిలేషన్ను అధికారికంగా ప్రకటించిన లవ్బర్డ్స్
గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్తో డేటింగ్లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను కొట్టిపారేసింది ఈ జంట. అయినా వీరిద్దరి రిలేషన్పై రూమార్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, విందులు, వినోదాలకు హజరవ్వడమే. అంతేకాదు ఇద్దరు క్లోజ్గా దిగిన ఫొటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ ఫిక్సయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల సోనాక్షి బర్త్డే సందర్భంగా తమ సీక్రెట్ రిలేషన్ను అఫిషీయల్ చేసింది ఈ జంట. చదవండి: ‘విక్రమ్’.. 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఈ సందర్భంగా సోనాక్షితో కలిసి విమానంలో పయనిస్తున్న ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసిన ఇక్బాల్ ఆమెకు పబ్లిక్గా లవ్యూ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే. నన్ను చంపనందుకు థాంక్యూ. ఐ లవ్యూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై సోనాక్షి సైతం స్పందించింది. ‘ఐ లవ్యూ. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వస్తున్నా’ అని అతడి పోస్ట్పై కామెంట్ చేసింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని స్పష్టమైంది. ఇది చూసిన వీరి ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్బాల్ పోస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పదించారు. కాగా ఇటీవల సోనాక్షి చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ తన డ్రీమ్ నిజమైందంటూ క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్ని: బాలీవుడ్ డైరెక్టర్ అంతేకాదు ఈ ఫొటో పక్కనే ఉన్న వ్యక్తి కనిపించకుండ జాగ్రత్త పడింది. దీంతో ఇక్బాల్కు తనకు నిశ్చితార్థమైందని ఒక్కసారిగా వార్తలు గుప్పమనగా.. మిమ్మల్ని ఫూల్ చేశానంటూ మరో పోస్ట్ చేసింది సోనాక్షి. అది రింగ్ కాదని, తన కొత్త బ్రాండ్ నెయిల్ పాలిష్ను ప్రమోట్ చేశానంటూ నెటిజన్లకు షాకిచ్చింది. దబాంగ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షికి పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె ఏడాది ఒక సినిమా చేస్తూ వస్తోంది. ఇక జహీర్ ఇక్బాల్ 2019లో నోట్బుక్ మూవీతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ వెంటనే డబుల్ ఎక్సెల్ మూవీ చేశాడు. ఇందులో సోనాక్షితో జతకట్టాడు. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
అబ్బే అదేం లేదు
.. అంటున్నారు బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఏ వార్తను ఇలా కొట్టిపారేస్తున్నారంటే.. బాలీవుడ్ యంగ్ హీరో జహీర్ ఇక్బాల్తో తాను లవ్లో ఉన్నాననే విషయాన్ని. 2018 సోనాక్షికి వృత్తి రీత్యా సరిగ్గా కలసి రాలేదు. వ్యక్తిగతంగా మాత్రం ఈ యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఇంతకీ జహీర్ ఇక్బాల్ ఎవరంటే.. త్వరలోనే బాలీవుడ్కు పరిచయం కానున్న హీరో. సల్మాన్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘నోట్బుక్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారు. జహీర్, సోనాక్షీ కలవడానికి కారణం కూడా సల్మాన్ఖానే అని టాక్. రీసెంట్గా జరిగిన సల్మాన్ బర్త్డే సెలబ్రేషన్స్లో జహీర్తో కలసి పార్టీకు కూడా హాజరు అయ్యారట సోనాక్షి. అయితే ఈ వార్తలను సోనాక్షి కొట్టిపారేశారు. ‘మేం రిలేషన్లో లేము. మా ఇద్దరి మధ్యలో రొమాన్స్ ఏం లేదు’ అని సమాధానమిచ్చారు. మరి ఏమీ లేకుండా కలిసి ఎందుకు తిరుగుతున్నట్లబ్బా? అని కొందరి సందేహం. ఆ సంగతలా ఉంచి, సినిమాల విషయానికి వస్తే సోనాక్షి ‘ కళంక్’ అనే పీరియాడికల్ చిత్రంలో నటించారు. జహీర్ ‘నోట్బుక్’ చిత్రం మార్చిలో విడుదల కానుంది. -
2011 బాకీ తీరిందా?
గౌరవం.. విధేయత... ఈ రెండు విషయాల్ని అస్సలు మర్చిపోవద్దని నయా హీరో జహీర్కు సూచనలిస్తున్నారు సల్మాన్ ఖాన్. సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా జహీర్ ఇక్బాల్ అనే కొత్త కుర్రాణ్ని బాలీవుడ్కి పరిచయం చేయనున్నారు సల్మాన్ ఖాన్. ఎవరీ జహీర్ ఇక్బాల్ అంటే సల్మాన్ ఖాన్ చిన్ననాటి స్నేహితుడు ఇక్బాల్ తనయుడు. జహీర్ లాంచ్ గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇక్బాల్ నా చిన్ననాటి దోస్త్. టీనేజ్లో అతనే నా బ్యాంక్. అతనికింకా నేను 2011 రూపాయిలు బాకీ. దేవుడి దయ వల్ల వడ్డీ తీసుకోలేదు. అబ్బాయిని లాంచ్ చేస్తున్నాను కదా. అలాగే ఇక్బాల్ ఎప్పుడూ నీ బెస్ట్ ఇవ్వు. ఏం జరిగినా సరే’’ అని పేర్కొన్నారు సల్మాన్. కాశ్మీర్ బ్యాక్డ్రాప్లో జరిగే ఈ లవ్ స్టొరీని ‘ఫిల్మిస్థాన్’ ఫేమ్ నితిన్ కక్కర్ డైరెక్ట్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ కో–ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను మురాద్ కెటానీ, అశ్వినీ వార్దే సినీ స్టూడియోస్ నిర్మించనున్నారు. -
జహీర్, ద్రవిడ్ ఎంపికపై సీఓఏ సమీక్ష!
►సీఏసీ నిర్ణయంపై అసంతృప్తి ►సహాయక సిబ్బంది ఎంపిక కోచ్దే... శనివారం సమావేశం న్యూఢిల్లీ: స్టార్లతో కూడిన టీమిండియా జట్టు కోచింగ్ సిబ్బంది ఎంపిక మరో వివాదంగా మారింది. బౌలింగ్ కోచ్ విషయంలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి అసంతృప్తితో ఉండగా, ఆయనకు మద్దతుగా అన్నట్టు పరిపాలక కమిటీ (సీఓఏ) కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉంది. నిజానికి జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంపై సీఓఏ హర్షం వ్యక్తం చేసినా.. బ్యాటింగ్, బౌలింగ్ కోచ్లుగా రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లను తీసుకోవడంపై కమిటీ అంత సుముఖంగా లేదు. ఈ ఎంపికతో సీఏసీ తమ పరిధిని దాటి వ్యవహరించిందని పరిపాలక కమిటీ భావిస్తోంది. సీఏసీ విధి ప్రధాన కోచ్ను ఎంపిక చేయడం వరకే అని, సహాయక సిబ్బందిగా ఎవరుండాలనేది వారి పరిధి కాదని వ్యాఖ్యానించినట్టు మీడియా కథనం. సహాయక సిబ్బందిగా ఎవరుండాలనేది ప్రధాన కోచ్ విచక్షణకే వదిలేయాలని వారి అభిప్రా యం. దీంతో శనివారం ముంబైలో సమావేశం కానున్న సీఓఏ ఈ అంశంపై సమీక్ష చేయనుంది. ‘ద్రవిడ్ ఇప్పటికే అండర్–19, భారత్ ‘ఎ’ కోచ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ బాధ్యత ఆయనకు అదనపు భారం కానుంది. శనివా రం సహాయక సిబ్బంది విషయంలో సీఓఏ, బోర్డు ఓ నిర్ణయం తీసుకోనుంది. అంతిమంగా వీరి ఎంపికలో ప్రధాన కోచ్కే పూర్తి బాధ్యత ఉంటుంది’ అని సీఓఏ వర్గాలు పేర్కొన్నాయి. ఐ వాంట్ భరత్ అరుణ్: రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు నూతన కోచ్గా ఎంపికైన రవిశాస్త్రి ఇప్పుడు తనకు అనుకూలురైన సహాయక సిబ్బంది కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జట్టు బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ నియామకం శాస్త్రికి రుచిం చడం లేదు. ఆయన స్థానంలో ముందునుంచీ భరత్ అరుణ్ను ఈ పోస్టులోకి తేవాలని కోరుకున్నారు. అయితే గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మాత్రం ఆయన ఇష్టాన్ని పక్కనపెట్టి జహీర్కు బౌలింగ్ బాధ్యతలు అప్పగించింది. అయితే జహీర్ పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్గా ఏడాదిలో 250 రోజుల పాటు జట్టుకు సేవలందించలేడని, వంద రోజులకు మించి అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అందుకే అతడి వేతనం ఇంకా ఫైనల్ కాలేదు. దీంతో జహీర్ ఉన్నప్పటికీ అతడికి సహాయకంగానైనా భరత్ అరుణ్ కావాల్సిందేనని కొత్త కోచ్ పట్టుబడుతున్నారు. అంతకుముందు జట్టు బౌలింగ్ కోచ్గా రవిశాస్త్రి అరుణ్ కోసం గట్టిగానే పట్టుబట్టారు. అరుణ్ తప్ప తనకు ఎవరూ వద్దని శాస్త్రి గట్టిగా వాదించారు. సీఓఏను కలవనున్న రవిశాస్త్రి! ఈ పరిణామాల మధ్య ఈ వారాంతంలో పరిపాలక కమిటీ (సీఓఏ)ని శాస్త్రి కలిసే ఆలోచనలో ఉన్నారు. ‘జహీర్పై రవిశాస్త్రికి అత్యున్నత గౌరవం ఉంది. కానీ జట్టుకు ఫుల్టైమ్ బౌలింగ్ కోచ్ కావాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. బౌలర్ల కోసం రోడ్ మ్యాప్ను జహీర్ రూపొందిస్తే దాన్ని అరుణ్ అమలుపరుస్తాడు. శనివారం సీఓఏను కలిసి శ్రీలంక పర్యటనలోనే అరుణ్ను జట్టుతో పాటు పంపాలనే నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2014లో జో డేవిస్ నుంచి బాధ్యతలు తీసుకున్న భరత్ అరుణ్.. శాస్త్రితో కలిసి 2016 వరకు పనిచేశారు. క్రికెట్ కెరీర్ పెద్దగా లేకపోయినా గొప్ప అకాడమీ కోచ్గా మాత్రం ఆయన పేరు తెచ్చుకున్నారు. శాస్త్రి, అరుణ్ అండర్–19 నుంచే స్నేహితులు. అరుణ్ ఎన్సీఏ బౌలింగ్ కన్సల్టెంట్గా ఉన్న సమయంలో... అప్పుడు టీమ్ డైరెక్టర్గా ఉన్న రవిశాస్త్రి ఆయన్ని జట్టు బృందంలో చేర్చుకున్నారు. ఆయన్ని అడిగే నిర్ణయించాం: సీఏసీ టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్లుగా జహీర్, రాహుల్ ద్రవిడ్ నియామకం జరిగిపోయినా ఇంకా తన సొంత సహాయక సిబ్బంది కోసం కోచ్ రవిశాస్త్రి పట్టుబట్టడంపై క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు తమను బాధించాయని పరిపాలక కమిటీ (సీఓఏ)కి సీఏసీ లేఖ రాసింది. ‘జహీర్, ద్రవిడ్లను తీసుకోవడానికి ముందే శాస్త్రితో మాట్లాడాం. మా ఆలోచనను ఆయన అంగీకరించడంతో పాటు ఈ ఎంపిక జట్టుకు లాభిస్తుందని కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రవిశాస్త్రి అనుమతి తర్వాత జరిగిన ఎంపిక మాత్రమే’ అని ఆ లేఖలో సీఏసీ స్పష్టం చేసింది. మరోవైపు ద్రవిడ్, జహీర్ల ను పూర్తిస్థాయిలో కాకుండా ఒక్కో సిరీస్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసినట్లు బీసీసీఐ గురువారం వివరణ ఇచ్చింది. -
'ద్రవిడ్, జహీర్ లకే నా ఓటు'
మాజీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ను భారత క్రికెట్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీలోని ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ద్రవిడ్ ను కోచ్ గా నియమించాలని పేర్కొన్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందన్నారు. ఇరువురి అనుభవంతో భారత క్రికెట్ జట్టుకు ఎంతో లాభం జరుగుతుందనేది తన వ్యక్తి అభిప్రాయం మాత్రమేనని బజ్జీ స్పష్టం చేశాడు కానీ విరాట్ కొహ్లీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ పేరును రికమెండ్ చేశారు కదా అని ప్రశ్నించగా అతనికి కూడా కోచ్ గా ఉండేందుకు అన్ని అర్హతలున్నాయని బజ్జీ తెలిపాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీపై బజ్జీ ప్రశంసలు కురిపించారు. కోహ్లి ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందచదగ్గ విషయమన్నాడు. అతనిలో గెలవాలన్న తపన ముచ్చటగొలుపు తుందన్నాడు. ఇండియాలో జరుగుతున్న టీ20 మ్యచ్ ల వల్ల ప్రపంచ టీ20 కి ఇబ్బందులుంటాయనే వార్తలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, ఆర్సీబీలు ప్లే ఆఫ్ చేరుతాయని హర్భజన్ జోస్యం చెప్పాడు. -
ప్రాక్టీస్ లేకుండా టెస్ట్కు రెడీ