ZPTC Election
-
ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికలను తొలుత నిర్వహించాలని.. అనంతరం పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఈ రెండింటినీ కొన్నిరోజుల అంతరంతో జరపాలనే ప్రతిపాదనతోపాటు.. వీలైతే సమాంతరంగా ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉ న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాకున్నా.. తొలుత పరిషత్లకు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ, తర్వాత నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టత వస్తుందని వివరిస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. సమగ్ర కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు (ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 42 శాతానికి), ఎస్సీ వర్గీకరణ నివేదిక తదితర అంశాలపై మంగళవారం కేబినెట్లో భేటీలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 50శాతానికి మించకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం పార్లమెంటుకు పంపే అవకాశం ఉంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంచాయతీలు, మండలాలు, జిల్లాల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15లోగా షెడ్యూల్! స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీలోగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. తర్వాత వారం గడువిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయవచ్చని అంటున్నాయి. వచ్చే నెల మొదట్లో ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. టెన్త్ పరీక్షలు మొదలయ్యేలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, వాటిని ఒక విడతలో ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, అభ్యర్థులంతా స్వతంత్రులుగానే పోటీ చేసే విధానంలో జరుగుతాయి కాబట్టి.. వాటిని విడిగా నిర్వహించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించి.. ఏ విడతకు ఆ విడతలో పోలింగ్ ముగిశాక సాయంత్రమే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పేర్కొన్న నేపథ్యంలో.. దీనివైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్రంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ ఆర్డీ) అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చూడటం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మార్పులు చేర్పులు, కొత్తగా ఏర్పడిన 34 మండలాల్లో ఎంపీటీసీ సీట్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సోమవారం కసరత్తు పూర్తి చేశారు. జిల్లాల వారీగా పునర్విభజన (కార్వింగ్) చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారు. ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఏసీఎల్బీ), ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్ టెలీకాన్ఫరెన్స్, గూగుల్ మీట్లు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీల మ్యాపింగ్, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల లెక్కలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికలు జరిపేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది, బ్యాలెట్ బాక్స్లు, ఇతర రవాణా ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) నియామకం, ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సమీక్షించారు. -
AP: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే
సాక్షి, అమరావతి: ఏకగ్రీవంగా గెలిచిన విజేతలు ప్రమాణ స్వీకారానికి ముందే చనిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు జెడ్పీటీసీ స్థానాలు ఈసారి కూడా ఏకగ్రీవాలే అయ్యాయి. మూడింటికి మూడు చోట్లా మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ జిల్లా లింగాల, గుంటూరు జిల్లా కారంపూడి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానాల్లో గతంలో ఏకగ్రీవంగా గెలిచిన వారు మరణించడంతో ఈ నెల 16న ఉప ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా అన్ని చోట్లా అధికార పార్టీ అభ్యర్ధులే బరిలో నిలవడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కలకడ.. వైఎస్సార్సీపీదే ఇక వీటికి తోడు మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు, పోలింగ్కు మధ్య పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు మరణించడంతో వాయిదా పడ్డ 11 జెడ్పీటీసీ స్థానాలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. వీటిల్లో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. చనిపోయిన అభ్యర్ధికి సంబంధించిన రాజకీయ పార్టీ నుంచి అదనంగా నామినేషన్ దాఖలుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. చిత్తూరు జిల్లా కలకడ జెడ్పీటీసీ స్థానంలో మరణించిన టీడీపీ అభ్యర్థికి బదులుగా ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీలో నిలవలేదు. అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఒక్కరే పోటీలో ఉండడంతో ఆ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 10 జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 40 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. సర్పంచి, వార్డు పదవులకు 14న పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా 500 గ్రామ పంచాయతీల పరిధిలో 69 సర్పంచి, 533 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 30 సర్పంచి స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. మరో 4 చోట్ల ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 35 చోట్ల 109 మంది పోటీలో ఉండగా అక్కడ ఈ నెల 14వ తేదీ పోలింగ్ జరగనుంది. 533 వార్డు సభ్యుల పదవుల్లో 380 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మరో 85 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 68 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 192 మంది పోటీలో ఉన్నారు. 50 ఎంపీటీసీలు ఏకగ్రీవం.. ఎన్నికలు ఆగిపోవడం, గెలిచిన వారు మృతి చెందడం లాంటి కారణాలతో 176 ఎంపీటీసీ స్థానాల్లో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి 50 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో 46 చోట్ల అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా మూడు చోట్ల టీడీపీ, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్ధి ఏకగ్రీవంగా గెలుపొందారు. మరో మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. మిగిలిన 123 చోట్ల ఎన్నికలు జరగనుండగా 328 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేచోట ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరగనుంది. -
AP: చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి..
నెల్లూరు (పొగతోట) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సభ్యులు తమ చంటిబిడ్డలతో హాజరయ్యారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న, తడ జెడ్పీటీసీ సభ్యురాలు ఇందుమతి రోజుల బిడ్డలతో హాజరయ్యారు. వీరిని సహాయకుల వద్ద ఉంచి వారు ప్రమాణ స్వీకారం చేశారు. రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న జెడ్పీ వైస్ చైర్పర్సన్గా ఎంపికయ్యారు. -
నేడు విశాఖ జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ ఎన్నిక
-
AP: జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ
అనంతపురం: నూతనంగా ఎన్నికైన 62 జడ్పీటీసీల ప్రమాణస్వీకారం పూర్తి అయింది. జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వలి, అహ్మద్ బాషా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ నదీం అహ్మద్, ఏపీ నాటక అకాడమీ ఛైర్ పర్సన్ హరిత పాల్గొన్నారు. ► విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పరిషత్ వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థుల కోలాహలం నెలకొంది. మొత్తం 38 స్థానాలకు గాను 36 మంది జడ్పీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్తో పాటు వైస్ చైర్మన్ పదవులు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ఇదంతా సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ ఫలాలు అందించిన విజయంగా పేర్కొన్నారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ సారి జడ్పీ చైర్ పర్సన్ పదవి గిరిజన ప్రాంతానికి దక్కడంతో సంతోషంగా ఉందన్నారు. ► వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యులుగా ఇద్దరు మైనారిటీలకు అవకాశం. ► కరీముల్లా, షేక్ అన్వర్ బాష లను కో అప్షన్ మెంబర్లుగా ఏకగ్రీవ ఎన్నిక. ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయరామ రాజు. జిల్లాల వారీగా జడ్పీ ఛైర్మన్గా ఎన్నిక కానున్నది వీరే.. ► అనంతపురం జిల్లా: బోయ గిరిజమ్మ (బీసీ) ► చిత్తూరు జిల్లా: శ్రీనివాసులు ( బీసీ) ► తూర్పు గోదావరి జిల్లా: వేణుగోపాల్ రావు (ఎస్సీ) ► పశ్చిమ గోదావరి జిల్లా: కవురు శ్రీనివాస్ (బీసీ) ► గుంటూరు జిల్లా: హెనీ క్రిస్టినా( ఎస్సీ) ► కర్నూలు జిల్లా: వెంకట సుబ్బారెడ్డి( ఓసీ) ► కృష్ణా జిల్లా: ఉప్పాళ్ల హారిక( బీసీ) ► నెల్లూరు జిల్లా: ఆనం అరుణమ్మ( ఓసీ) ► ప్రకాశం జిల్లా: వెంకాయమ్మ (ఓసీ) ► వైఎస్సార్ కడప జిల్లా: ఆకేపాటి అమర్నాథ్రెడ్డి (ఓసీ) ► విశాఖపట్నం జిల్లా: జల్లిపల్లి సుభద్ర (ఎస్టీ) ► విజయనగరం జిల్లా: మజ్జి శ్రీనివాసరావు (బీసీ) ► శ్రీకాకుళం జిల్లా: విజయ( సూర్య బలిజ) మధ్యాహ్నం 3 గంటకు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. జడ్పీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. కలెక్టర్లు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్తో ప్రమాణం చేయుంచనున్నారు. ► కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నిక కానున్న ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మేడా మల్లికార్జున్రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. ► కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం మధ్యాహ్నం జరగనుంది. అందులో భాగంగా ముందుగా కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్గా శ్రీనివాసులు( వి.కోట జడ్పిటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ), వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్గా ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ఎన్నిక కానున్నారు. కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీసీ మహిళ జడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. 13 జిల్లాల్లో చైర పర్సన్, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్ చైర్ పర్సన్లకు ఎన్నిక జరగనుంది.13 జిల్లా పరిషత్లు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులు దక్కనున్నాయి. నూరుశాతం జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం దేశంలోనే ఇదే ప్రథమం. -
4 జిల్లాలు క్లీన్ స్వీప్: వైఎస్సార్సీపీ విజయ ఢంకా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా అవతరించింది. రాష్ట్రంలో విజయాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించింది. జిల్లాలవారీగా చూడగా ప్రకాశం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసి విజయఢంకా మోగించింది. ప్రకాశం జిల్లాలో జరిగిన 55 జెడ్పీటీసీ ఎన్నికల్లో 55ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక విజయనగరం జిల్లాలో 34కు 34 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. కర్నూలు జిల్లాలో 52 స్థానాలను సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చిత్తూరు జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయ నాదం మోగించింది. -
విజయం అందించిన ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు: సజ్జల
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో అపూర్వ విజయం అందించిన ప్రజలకు పార్టీ, సీఎం జగన్మోహన్రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల విజయంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన స్పందించారు. ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ఆశీస్సులు ఇచ్చారు. టీడీపీ కార్యకర్తగా పనిచేసిన నిమ్మగడ్డ, కోర్టులకు వెళ్లి ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకి కూడా కృతజ్ఞతలు. ఏ రాజకీయ పార్టీ వ్యవహరించని రీతిలో టీడీపీ డాంభికాన్ని ప్రదర్శిస్తోంది. అచ్చెన్న దమ్ముంటే ఎన్నికలు పెట్టండి.. అంటున్నాడు.. 2019లో బొక్కబోర్లా పడ్డా బుద్ధి రాలేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలనే పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా పరిశీలించి ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. బడుగుల జీవితాల్లో వెలుగు నింపడానికి చేస్తున్న కృషికి ప్రజలు శభాష్ అని తీర్పు ఇచ్చారు. విశ్వసనీయత నచ్చితే ప్రజలు ఎలా అక్కున చేర్చుకుంటారో స్పష్టంగా కనిపించింది. కొన్ని పార్టీలు గుణపాఠాలు నేర్చుకోవడానికి కూడా ఈ ఫలితాలు ఉపయోగపడతాయి. నిజమైన సమానత్వం ఇవ్వగలిగితే... అన్ని రకాల పేదరికాన్ని పారద్రోలగలిగితే ఫలితాలు ఎలా ఉంటాయో కనిపించాయి’ అని సజ్జల తెలిపారు. ‘2020లో మొదలైన ఈ ప్రక్రియ 2021 సెప్టెంబర్ 19వ తేదీన ముగియడం వారి పుణ్యమే. 2018లో జరగాల్సిన ఎన్నికలు ఇవి జనం ఛీ కొడతారని చంద్రబాబు ఎన్నికలు పెట్టలేదు. 2014లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలకు మేము చంద్రబాబులా భయపడలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలై ప్రజల్లో స్పందన చూసి వాళ్లకి దిక్కు తెలియలేదు. అభ్యర్థుల భవిష్యత్తును వీరి దుర్మార్గపు కుట్రల వల్ల ఇబ్బంది పెట్టారు. మీరు పదిసార్లు వాయిదా వేసినా మళ్లీ మేమే వస్తామని ఆనాడే చెప్పాం. ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలో తెలుసుకోకుండా కుట్రలపై కుట్రలు చేశారు’ అని సజ్జల మండిపడ్డారు. -
ZPTC MPTC ఎన్నికల ఫలితాల మీద స్పెషల్ డిబేట్
-
పరిషత్ తీర్పు: చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ
-
పరిషత్ తీర్పు: చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్లలో 11 జెడ్పీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 40 వైఎస్సార్సీపీ సొంతం. గుంటూరు: 57 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్సీపీ విజయం ప్రకాశం: 55 స్థానాల్లో 55 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. విశాఖపట్టణం: 39 స్థానాల్లో 33 వైఎస్సార్సీపీ గెలుపు. టీడీపీ ఒకటి, సీపీఎం ఒకచోట గెలిచింది. విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 28 వైఎస్సార్సీపీ కైవసం అనంతపురం: 62 స్థానాల్లో 60 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. ఒకటి టీడీపీ, ఇతరులు మరో చోట గెలిచారు. చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 వైఎస్సార్సీపీ విజయం వైఎస్సార్ కడప: 50 స్థానాల్లో 46 గెలిచిన వైఎస్సార్సీపీ కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 20 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్సీపీ కైవసం. -
పుట్టపర్తిలో 6 జెడ్పీ స్థానాలు వైఎస్సార్సీపీ వశం
సాక్షి, అనంతపురం: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అనంతపురం జిల్లా మొత్తం వార్ వన్ సైడ్గా మారింది. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకుంది. నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఆమడగూరు, ఓబులదేవచెరువు, కొత్తచెరువు, నల్లమాడ, బుక్కపట్నం జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఈ విజయంతో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి ప్రజలు భారీగా ఓట్లేశారని పేర్కొన్నారు. ప్రజారంజక పాలనకు మరోసారి ప్రజలు అఖండ విజయం అందించారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. -
వైస్సార్సీపీ హవా..!
-
‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’
సాక్షి, చిత్తూరు: ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీదే విజయం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఆయన ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని’ పెద్దిరెడ్డి హితవు పలికారు. చదవండి: ‘మందు ఉంటే మత్తు మాటలు అయ్యన్నకు అలవాటు’ గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారు: జోగి రమేష్ -
ఎన్నికల కౌంటింగ్కు ముహూర్తం ఫిక్స్
-
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇన్ని రోజులు పరిషత్ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. ప్రజస్వామ్య ప్రక్రియను అడ్డుకునే కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంతో మరికొంత సమయం వాయిదా పడిందన్నారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండగా అప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా చేశారని సజ్జల తెలిపారు. ప్రభుత్వంతో చర్చించకుండానే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే నిమ్మగడ్డ అమలు చేశారని అన్నారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఎన్నికల ప్రక్రియను హత్య చేసిన దోషి చంద్రబాబు అని సజ్జల మండిపడ్డారు. అడ్డదారులు తొక్కడమే బాబు నైజం అని దుయ్యబట్టారు. ఏడాది తర్వాత ఈ రోజుకు గ్రహణం వీడిందన్నారు. మహిళల భద్రతో కోసం దిశ చట్టం తీసుకోచ్చామని తెలిపారు. 53 లక్షల మందికిపైగా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం ప్రతులను తగులబెట్టారంటే లోకేష్ మానసికస్థితి అర్థం చేసుకోవాలన్నారు. దిశ చట్టం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, తమకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు చేయగలుగుతున్నారని సజ్జల పేర్కొన్నారు. -
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో వాయిదా పడింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ని ఎస్ఈసీ ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల మేరకే జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్ఈసీ పేర్కొంది. నేడు హైకోర్టు.. కౌంటింగ్కు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్ఈసీ కసరత్తు ప్రారంభించింది. చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య! సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ -
MPTC ZPTC ఎన్నికల కౌంటింగ్ జరపాలని హైకోర్టు లో పిటిషన్లు
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్పై ఏపీ హైకోర్టులో పిటిషన్లు
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. కేసు విచారణలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని కోరారు. కోర్టు దీనిపై తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు షాక్
-
హిందూపురంలో బాలకృష్ణకు ఝలక్
సాక్షి, అనంతపురం: హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలను టీడీపీ నేతలు ధిక్కరించారు. బాబు ఆదేశాలను లెక్కచేయకుండా తెలుగు తమ్ముళ్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థి ఆనంద్, ఎంపీటీసీ అభ్యర్థి అశ్విణికి టీడీపీ నేతలు ప్రచారం మొదులుపెట్టారు. అదీకాకుండా చంద్రబాబు బహిష్కరణ ఆదేశాలు పట్టించుకోమని హిందూపురంకు చెందిన పలువురు టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. చంద్రబాబుకు చుక్కెదురు పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న పిలుపుని తెలుగు తమ్ముళ్లు బేఖాతరు చేశారు. ఎంపీటీసీ, జెడ్పిటీసీ అభ్యర్థుల తరపున టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో టీడీపీ జెడ్పిటీసీ అభ్యర్థి వట్టూరి వెంకట రాంబాబు, ఎంపీటీసీ అభ్యర్థి సరిపల్లి పద్మ తరపున మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నియోజకవర్గ ఇంచార్జి వలవల బాబ్జి ప్రచారం చేస్తున్నారు. బయటపడ్డ టీడీపీ లోపాయకారి ప్రచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటన చేసినా లోపాయకారిగా టీడీపీ అభ్యర్థిలు పోటీలో కొనసాగాలని అంతర్గత ఆదేశాలు జారీచేశారు. ఇదే విషయాన్ని సొంతపార్టీ అభ్యర్థులే చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు ఎన్నికలు బహిష్కరించామని చెబుతునే మరోవైపు ఎన్నికల ప్రచారం చేస్తుండటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు జడ్పిటీసీ అభ్యర్థి బీరం శిరీష ఎన్నికలకు ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. అధినేత చంద్రబాబు సూచన మేరకే పోటీలో కొనసాగుతున్నామని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీలో ఉంటామని అంటున్నారు. చదవండి: దివాళాకోరు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ -
పశ్చిమ గోదావరి జిల్లా లో జోరుగా పరిషత్ ఎన్నికల ప్రచారం
-
ప్రభుత్వ పథకాలే అభ్యర్థుల గెలిపిస్తాయిని ధీమా
-
జనం ఓటేయరనే ఎన్నికల బహిష్కరణ
సాక్షి, అమరావతి: టీడీపీకి ఎలాగూ ప్రజలు ఓటేయరని తెలిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ పార్టీ అంటోందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీని బహిష్కరించారని ఆయన అన్నారు. ఇప్పటికే టీడీపీకి చెందినవారు నామినేషన్లు వేశారని, ఒకవేళ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించినా బ్యాలెట్లో టీడీపీ గుర్తు ఉంటుందని చెప్పారు. నిన్నటి వరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఆట ఆడారని, ఇప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఎస్ఈసీగా వచ్చేసరికి ఎన్నికలు వద్దంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేర్ని నాని గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. నారా వారి పుత్రరత్నం లోకేశ్ ఎల్ బోర్డ్ పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, ఇంకో 30 ఏళ్లయినా ఎల్ బోర్డ్ అలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై లోకేశ్ మాట్లాడుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారని నాని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తన 20 నెలల పాలనలోనే మేనిఫెస్టోలోని అంశాల్లో 90 శాతానికిపైగా అమలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
నిమ్మగడ్డ దాగుడుమూతలు
సాక్షి, అమరావతి: గతేడాది మధ్యలో నిలిపివేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ దాగుడుమూతలాడుతున్నారు. ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించినప్పటికీ నిమ్మగడ్డ మాత్రం తాను హైదరాబాద్లో ఉన్నానంటూ సమాచారమిచ్చి ముఖం చాటేయడం గమనార్హం. ఏడాది క్రితం మధ్యలో నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఆదేశించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం గవర్నర్ను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలిఉన్న ఆ ఎన్నికలను పూర్తి చేసేలా ఆదేశించాలని సీఎస్ కోరారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ఆరు రోజుల్లో ముగిసిపోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే వ్యాక్సినేషన్ను పూర్తి స్థాయిలో వేగవంతంగా చేపట్టవచ్చని ప్రభుత్వం తరపున సీఎస్ నివేదించారు. ఈ క్రమంలో ఈ అంశాలపై చర్చించేందుకే తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. సెలవు కాదు.. విధుల్లోనే ఉన్నా నిమ్మగడ్డ శుక్రవారం సెలవులో లేరని, అధికారికంగా ఆయన విధుల్లోనే ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గత నాలుగు రోజులుగా నిమ్మగడ్డ హైదరాబాద్లోని తన ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని, 18న జరిగిన మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలను ఆయన అక్కడ నుంచే పర్యవేక్షించారని పేర్కొన్నాయి. కాగా ఈ నెల 22 నుంచి 24వతేదీ వరకు ఎల్టీసీపై తమిళనాడులోని మధురై, రామేశ్వరం పర్యటనకు వెళ్లేందుకు గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది. కలవకపోవడం ధిక్కారమే.. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా అధికార యంత్రాంగం అంతా ఈ ప్రక్రియలో నిమగ్నమైనందున ఈ ఏడాది జనవరిలో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ వైద్య ఆరోగ్య శాఖ నివేదికతో సహా ఎస్ఈసీకి తెలియచేశారు. అయినప్పటికీ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టుబట్టి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఆగమేఘాలపై నిర్వహించి ఏడాది క్రితం మధ్యలో ఆపేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి మాత్రం పట్టించుకోలేదు. న్యాయపరంగా ఎటువంటి ఆటంకాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డ ఆ ఎన్నికల నిర్వహణకు సుముఖత చూపడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ అంశాలపై చర్చించేందుకు తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ ఆదేశించినా ఏవో సాకులు చెప్పి రాకపోవడం నిమ్మగడ్డ ధిక్కార ధోరణికి నిదర్శనమనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
పరిషత్ ఎన్నికలూ పూర్తయితే...వేగంగా వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఇక కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అందువల్ల వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిం చాలని అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా తిరిగి ఉధృతం అవుతోందని, మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను త్వరగా ముగించి వ్యాక్సి నేషన్ను వేగవంతం చేయడం అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ వ్యాక్సినేషన్కు భంగకరంగా మారిందన్నారు. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్పై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు వీలుంటుందన్నారు. కోవిడ్ వ్యాప్తి తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచా లన్నా ఎన్నికల ప్రక్రియ అడ్డంకిగా మారే అవకాశం ఉందన్నారు. ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చిన చోట్ల రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తే ప్రజలు ఎన్నికల ప్రక్రియకు దూరమై ఓటు వేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కోవిడ్పై ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై సీఎం జగన్ సమీక్షించారు. డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిష నర్ భాస్కర్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు మహారాష్ట్రలో కరోనా నియంత్రణకు టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని సక్రమంగా పాటించకపోవడంతో సెకండ్ వేవ్ ముప్పు ముంగిట నిలిచిందనే విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు ఆళ్ల నాని, సుచరిత తదితరులు జాప్యం జరుగుతోంది... అధికార యంత్రాంగం అంతా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కావడం వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవరోధంగా మారిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గతేడాది మధ్యలో ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కేవలం ఆరు రోజుల్లో ముగించవచ్చని, వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇవి కూడా నిర్వహించి ఉంటే బాగుండేదని, కానీ అలా జరగలేదని, జాప్యం జరుగుతూ వస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిషత్ ఎన్నికల్లో మిగిలిపోయిన ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్ను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చన్నారు. లేదంటే వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ చేయడం, పరీక్షలు నిర్వహించడం కష్టం అవుతుందన్నారు. సచివాలయాలు యూనిట్గా వాక్సినేషన్.. వ్యాక్సినేషన్ను ఉద్ధృతంగా చేపట్టేందుకు గ్రామ సచివాలయాలను యూనిట్గా తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. సంబంధిత సచివాలయం పరిధిలో ఉన్న వారికి వ్యాక్సినేషన్ను పూర్తి చేయడంపై దృష్టిపెట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్లు సత్వరమే అందించాలన్నారు. వ్యాక్సినేషన్పై సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో నూటికి నూరుశాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఈ ఏడాది ఫిబ్రవరి 18న జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మొదటిదశ నుంచి విచారణ జరపాలని కలెక్టర్లను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల ప్రకారం గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికను ప్రకటించి తీరాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికపై వారి ప్రత్యర్థులకు ఏవైనా అభ్యంతరాలుంటే, వారు సంబంధిత ఎన్నికల ట్రిబ్యునల్లో ఆ ఎన్నికను సవాలు చేసుకోవచ్చునంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు, ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఈ మధ్యలో ఎన్నికలకు సంబంధించి వచ్చే ఏ ఫిర్యాదుపైన కూడా విచారణ జరిపే అధికారం ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల్లోని రూల్ 99 ప్రకారం ఎన్నికల కమిషన్కు లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఎన్నికను రద్దు చేసే అధికారం కూడా ఎన్నికలకు కమిషన్కు లేదని స్పష్టం చేసింది. ఎన్నికల్లో మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాలు విచారణ చేయదగ్గవే అయినా కూడా, అందులో జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల కమిషన్కు లేదంది. ఓసారి ఎన్నిక ముగిసిన తరువాత ఎన్నికలకు సంబంధించిన వివాదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ట్రిబ్యునల్ మాత్రమే విచారణ జరపాలని చట్టం చెబుతోందని గుర్తుచేసింది. మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాల విషయంలో స్పష్టమైన, నిర్దిష్ట ఆధారాలు ఉండాలంది. ఇలాంటివాటిని న్యాయపరంగా సుశిక్షితులైన న్యాయాధికారి మాత్రమే విచారణ జరపగలరని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం తీర్పు చెప్పారు. ఎన్నికల కమిషనర్ గత నెల 18న జారీచేసిన ఉత్తర్వులతో పాటు బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి, వాటిని రద్దుచేయాలని కోరుత్తూ ఫారం–10 అందుకున్న పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు గత వారం వాయిదా వేసిన తీర్పును మంగళవారం వెలువరించారు. సమాచారం సేకరించవచ్చు ఎన్నికల ప్రక్రియలో లోపాలను సవరించేందుకు ఎన్నికల అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించవచ్చని, సమాచార సేకరణకు మాత్రమే కమిషన్ విచారణను పరిమితం చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికంగా వ్యవహరించని ఎన్నికల అధికారులపై, సిబ్బంది చర్యలు తీసుకునేందుకు సైతం సమాచారం సేకరించవచ్చన్నారు. సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వీయ అవసరాల నిమిత్తం లేదా చట్ట సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి, శాసనసభకు, పార్లమెంట్కు పంపొచ్చని పేర్కొన్నారు. తీర్పు వెలువరించిన తరువాత అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయన్న కారణంతో ఎన్నికల కమిషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాలు ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదంటూ ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని కోరారు. అలా చేయడం ద్వారా సమస్యలు వస్తాయన్న న్యాయమూర్తి.. అది ఈ వ్యాజ్యాలతో సంబంధం లేని స్వతంత్ర అంశమని చెప్పారు. జనసేన పిటిషన్పై విచారణ 23కి వాయిదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు విచారణను వాయిదా వేశారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా ఉపసంహరింప చేసిన నామినేషన్లను పునరుద్ధరించే అంశంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు సోమవారం ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కడైనా అభ్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపచేశారని నిర్ధారణ అయితే వాటిని పునరుద్ధరించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు గత నెల 18న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు కాగా.. వాటిపై సోమవారం తుది విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి, వీఆర్ఎన్ ప్రశాంత్, వీఆర్ రెడ్డి, జీఆర్ సుధాకర్ తదితరులు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. పత్రికా కథనాల ఆధారంగా ఎలా నిర్ణయిస్తారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఒకే నామినేషన్ వచ్చిన చోట నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారులు ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తక్షణమే ప్రకటించి ఫారం–10, ఎంపీటీసీ, జెడ్పీసీలుగా గెలుపొందినట్టు ఫారం 29 జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రసుత కేసులో కూడా రిటర్నింగ్ అధికారులు నిబంధనల మేరకే నడుచుకున్నారని తెలిపారు. వీటిపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించడమే మార్గమని వివరించారు. పత్రికల్లో ప్రచురితమైన కథనాలను ఆధారంగా చేసుకుని బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఎన్నికల కమిషనర్ ఓ నిర్ణయానికి వచ్చారని, ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జనసేన పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణను న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ నెల 15కి వాయిదా వేశారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యాజ్యాల్లో విచారణ 8కి వాయిదా
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేసి, ఆ కాపీలను పిటిషనర్లు, ఇతర ప్రతివాదులకు అందచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేయకపోతే, ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు లేనట్లుగానే భావించి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత నెల 18న ఉత్తర్వులిచ్చారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై ఫిబ్రవరి 20వ తేదీకల్లా నివేదికివ్వాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులకనుగుణంగా అదేరోజు ప్రెస్నోట్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను, ప్రెస్నోట్ను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి.. రద్దు చేయాలని కోరుతూ పలువురు పిటిషన్లు వేశారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాలన్నీ గత వారం విచారణకు రాగా, కౌంటర్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ గడువు కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. మార్చి 3 వరకు గడువిచ్చారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వివేక్ చంద్రశేఖర్, ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్లు స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. ఈ నెల 3వ తేదీకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని సుమన్ అన్నారు. అందుకే కౌంటర్ల దాఖలులో జాప్యం చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ.. కౌంటర్ల దాఖలులో జరిగిన జాప్యానికి కోర్టును క్షమాపణ కోరారు. విచారణను సోమవారానికి వాయిదా వేస్తే, ఆలోగా కౌంటర్ల కాపీలను అందరికీ అందచేస్తామని అభ్యర్థించారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
తాజా నోటిఫికేషన్ అక్కర్లేదు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హైకోర్టుకు నివేదించింది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ తెలిపారు. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉండగా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఇప్పటికే ఇదే అంశంపై వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ఈ వ్యాజ్యాన్ని కూడా వాటితో పాటు కలిపి విచారించాలని కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని కూడా ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులిచ్చారు. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని, ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఈ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ పథకాన్ని అడ్డుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్పై తదుపరి విచారణ అవసరమో లేదో ఎన్నికల కమిషనర్తో మాట్లాడి చెబుతామన్నారు. ఇందుకు అంగీకరిం చిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ఎ.కె. గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ధర్మశ్రీ చతురత!
చోడవరం: జిల్లాలో చోడవరం నియోజకవర్గం ఓ సంచలనం సృష్టించింది. గతంలో ఎప్పుడూలేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడంలో సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రదర్శించిన చతురుత ప్రత్యర్థి పార్టీ నాయకులకు దిమ్మతిరిగేలా చేసింది. గతంలో టీడీపీకి కంచుకోగా ఉన్న చోడవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సత్తా చూపిన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవ స్థానాలు దక్కించుకొని మరోసారి ప్రత్యర్థుల స్థానాల్లో పాగా వేసింది. నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాలు ఉండగా చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రోలుగుంట, రావికమతం మండలాల జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 11 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం కాగా మరో 30 స్థానాలు టీడీపీ అభ్యర్థులు విత్డ్రా అయ్యేలా చేయడంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ చేసిన ప్రయత్నం పార్టీ కేడర్లో నూతనుత్సాహాన్ని నింపింది. రోలుగుంట, రావికమతం జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఆయన పావులు కదిపి విజయం సా«ధించారు. రోలుగుంట జెడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోగా రావికమతం జెడ్పీటీసీ స్థానం టీడీపీ అభ్యర్థి విత్డ్రా అయ్యారు. జనసేన అభ్యర్థి విత్డ్రాకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ సమాయానికి ఆయన అందుబాటులో లేకపోవడంతో పోటీ కేవలం నామమాత్రంగానే మారింది. దీనితో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నట్టయ్యింది. ఇక చోడవరం, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ స్థానాలు కూడా ఆ పార్టీ దక్కించుకునేలా ధర్మశ్రీ చూపిన చొరవ ఆ పార్టీ విజయానికి చేరువ చేసినట్టుగా ఉంది. నాలుగు మండలాల్లో 80 శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు దర్కించుకుని నాలుగు ఎంపీపీ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకునేలా ఎమ్మెల్యే ధర్మశ్రీ పావులు కదిపి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను సైతం తమకు అనుకూలంగా మార్చుకొని సత్తాచాటారు. ధర్మశ్రీ చొరవ వైఎస్సార్సీపీలో నూతనుత్తేజాన్ని నింపింది. స్థానిక ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేస్తామని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. -
ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరోనా వైరస్ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. కాగా, ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, కేవలం జరగాల్సిన ఎన్నికలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని స్పష్టం చేశారు. ఏకగీవ్రంగా ఎన్నికైన వారు ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఎన్నికల నియామవళి యధావిధిగా కొనసాగుతుందన్నారు. నిలిపివేత మాత్రమే.. రద్దు కాదు ఈ ఎన్నిక ప్రక్రియ నిలిపివేత మాత్రమేనని, రద్దు కాదనే విషయాన్ని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆరువారాల అనంతరం ఎన్నికలు జరుగుతాయన్నారు. వాయిదా ప్రక్రియ ముగిసిన తర్వాత సమీక్ష నిర్వహించి పంచాయితీల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. నామినేషన్ వేసిన వారిని భయభ్రాంతులకి గురిచేయకూడదన్నారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే గ్రామవాలంటీర్ల నుంచి అనేక ఫిర్యాదు వస్తున్నాయని, ఉద్యోగుల వ్యక్తిగత, ఆరోగ్య భద్రత కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే అన్ని స్కూళ్లు, మాల్స్ మూసేసిందని, తాము కూడా అత్యవసర సమీక్ష నిర్వహించిన తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. అత్యవరస పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఉంటాయన్నారు. పంచాయితీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉందని, ఎన్నికలకు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని పలు పార్టీలు, సామాజిక సంఘాలు చెప్పడంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా ఎఫెక్ట్ పై పూర్తిస్ధాయిలో విచారణ చేశామని, కరోనా వైరస్ను నోటిఫై డిజాస్టర్ గా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారని గుర్తు చేశారు. బ్యాలెట్ పేపర్ వాడడం వల్ల ఓటుకి ఎక్కువ సమయం పడుతుందని, చాలా సేపు క్యూలో నిలబడాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పేపర్ వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని, విధిలేని పరిస్దితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆరువారాలు నిలిపివేస్తున్నామన్నారు. (ఏకగ్రీవాల హోరు.. వైఎస్సార్సీపీ జోరు) -
బెడిసికొట్టిన జనసేన కిడ్నాప్ డ్రామా
సాక్షి, తిరుపతి: ఎన్నికల వేళ జనసేన పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్ డ్రామా చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత తన ఇంట్లోనే దాచిపెట్టి కిడ్నాప్ డ్రామా మొదలుపెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులే కిడ్నాప్ చేశారని ఆరోపణలు గుప్పించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. (వెంటాడి కత్తులతో నరికిన జనసేన కార్యకర్తలు) షాహిద్ కనబడటం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగారు. వినుత ఇంట్లో సోదాలు జరిపేందుకు రేణిగుంట పోలీసులు యత్నించగా జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్, ఇతర నాయకులు అడ్డుకున్నారు. తాము తలచుకుంటే కేంద్ర హోం శాఖ దిగుతుందంటూ బెదిరింపులకు దిగారు. జనసేన నాయకురాలు నగరం వినుత, కోట చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి డ్రామా బెడిసికొట్టడంతో జనసేన నేతలు కంగుతిన్నారు. (ఇది ఫెవికాల్ బంధం) -
అభివృద్ధిలో ‘స్థానిక’ పాలనే కీలకం
పార్వతీపురం: దేశ, రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక పాలన కీలకం. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిధులు చక్కగా సది్వనియోగం అయితే... ప్రత్యామ్నాయంగా రాష్ట్రం, దేశం అభివృద్ధిచెందుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధి సూచిక అన్న నినాదం అందరికీ తెలిసిందే. గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే స్థానిక సంస్థలు బలోపేతం కావల్సిందేనని అందరూ అంగీకరించాల్సిన విషయం. స్థానిక సంస్థల ఏర్పాటుతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసంఘం నిధులు విడుదలై గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 5వేల కోట్లవరకు వెనక్కి పోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి గత 18నెలలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడమే కారణం. నిధులు సద్వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అయితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా బరిలో నిలిచేవారిలో కొందరికి విధులు, అధికారాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం సహజమే. ఓటర్లు కూడా తాము ఎన్నుకున్న నాయకుడు నెరవేర్చాల్సిన బాధ్యత, ప్రాధాన్యాలు తెలుసుకోవాలి. ఎంపీటీసీలు ఏంచేయాలి... విధులు, అధికారాలు.. జెడ్పీటీసీలు పరిస్థితి తదితర అంశాలను తెలుసుకుందాం. జెడ్పీటీసీల ఆవశ్యకత ఇలా... జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ చట్టం పక్కాగా అమలై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమకూరి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే జిల్లా పరిషత్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిందే. జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. ఏ తీర్మాణాలు ఆమోదించాలన్నా మెజార్టీ సభ్యులు తప్పనిసరి. ఆమోదించే కార్యక్రమాలు సక్రమంగా నిర్వíర్తించే బాధ్యత సభ్యులపై ఉంటుంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వీరు ముందుకెళ్లాలి. మండల పరిధిలో జిల్లా ప్రాదేశిక సభ్యులను ఆయా మండల ప్రజలు నేరుగా ఓటుహక్కుతో ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలోని ఎన్నికకాబడిన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎంపిక చేస్తారు. జెడ్పీటీసీలు మండలంలోని ప్రజల్ని సమన్వయపరచి అభివృద్ధి, పాలనలో భాగస్వామ్యులవుతారు. జిల్లాపరిషత్ నిర్వహణలో లోపాలు, అలసత్వం, నిధుల దుర్వినియోగంపై జెడ్పీ చైర్మన్, సీఈఓల దృష్టికి తీసుకెళ్లవచ్చు. 15 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి జెడ్పీ పరిపాలనపై సమావేశాల్లో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సీఈఓ ప్రతీ మూడు నెలలకు ఒకమారు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక నివేదికపై చర్చిస్తారు. అన్ని ప్రభుత్వ, జెడ్పీ అధికారిక ఉత్సవాలకు, కార్యక్రమాలకు జెడ్పీటీసీలను తప్పనిసరిగా అహ్వానించాలి. నియోజకవర్గ ఆర్థిక సలహా కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జెడ్పీ పాఠశాలల స్థితిగతుల మెరుగుకు సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు అందించవచ్చు. నియోజకవర్గ నీటి వినియోగ పరిరక్షణ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎంపీటీసీల అధికారాలు.. విధులు ఎంపీటీసీలు మండల పరిషత్లో ఓటు హక్కును వినియోగించుకుని మండలాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీలకు సంబంధిత ప్రాదేశిక సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపీపీ పదవి పరోక్ష ఎన్నిక ద్వారా ఎంపీటీసీలు అధ్యక్షుడ్ని, ఉపాధ్యాక్షుడిని ఎన్నుకునే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. దీంతో మండలాభివృద్ధిలో ఎంపీటీసీలే కీలకం అవుతారు. కొత్తగా ఎంపికైన ఎంపీటీసీలు తొలిమూడు సమావేశాలలోపు ప్రమాణ స్వీకారం చేయాలి. లేనిపక్షంలో వారి సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో పాటు వరుస మూడు సమావేశాలకు గైర్హాజరైన సభ్యత్వం పోతుంది. ఆయా పరిధి గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ శాశ్వత అహ్వానితుడవుతారు. పాలకవర్గంలో మాత్రం ఓటు వేసే హక్కు ఉండదు. పంచాయతీ అభివృద్ధిపై సూచనలు, సలహాల మేరకు పరిమితమవుతాడే తప్ప నిర్ణయాధికారం మాత్రం ఉండదు. వారి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలల విద్యాప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల దురి్వనియోగం అయితే ప్రశ్నించే అధికారం ఉంటుంది. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు
-
ఏపీలో మోగిన పుర భేరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలతోపాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 15 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మూడు చోట్ల కోర్టు కేసులతో వాయిదా పడ్డాయి. కాకినాడ స్థానానికి 2017లోనే ఎన్నిక జరిగినందున ఇప్పుడు నిర్వహించడం లేదు. ఇక 104 మున్సిపల్, నగర పంచాయతీలకుగానూ 75 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు కేసులు, కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావడం తదితర కారణాలతో 29 చోట్ల ఎన్నికలు వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్ మీడియాకు తెలిపారు. పామిడి నగర పంచాయతీ డౌన్గ్రేడ్కు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఎన్నిక జరపడం లేదన్నారు. వాయిదా వేసిన చోట ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై ఏమాత్రం ఉండదన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ను మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తర్వాతే చేపడతామన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటిపై ఉండదని పేర్కొన్నారు. - సాంకేతిక కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డ చోట కొద్ది వారాల వ్యవధిలోనే నిర్వహిస్తాం. - రాజధాని గ్రామాలను అమరావతి మున్సిపల్ కార్పొరేషన్గా చేయాలని ప్రతిపాదన ఉంది. అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కొద్ది వారాలకు మించి సమయం పట్టదు. ఎన్నికల డిపాజిట్ నిబంధనలివీ - మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్గా పోటీ చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 2,500, ఇతరులు రూ.5,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలి. - మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో కౌన్సిలరుగా పోటీ చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.1,500, ఇతరులు రూ.3,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలి. - మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పోటీ చేసే వారి గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి రూ.2 లక్షలు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకు రూ.1.50 లక్షలు, నగర పంచాయతీల్లో కౌన్సిలర్లకు రూ.లక్ష ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిగా నిర్థారించారు. -
మధ్యాహ్నం అభ్యర్ధుల జాబితా ప్రకటన
-
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
మహిళలకే పెద్ద‘పీఠం’
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రెండు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భారీ కానుకను అందజేసింది. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లా పరిషత్లు ఉండగా, అందులో సగానికంటే పైగా అంటే.. ఏడు జెడ్పీ చైర్మన్ పదవులను మహిళలకు రిజర్వు చేసింది. దీంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మహిళలే జడ్పీ చైర్పర్సన్లుగా రాబోతున్నారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. అలాగే, రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్లను కూడా శుక్రవారం ఉదయానికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేశారు. ఈ జాబితాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అందజేశారు. ఎంపీపీ, జెడ్పీటీసీల్లో మహిళలకే పెద్దపీట ఇదిలా ఉండగా, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లలోనూ సగానికి పైగా పదవులు మహిళలకే రిజర్వు అయ్యాయి. 660 మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవులు ఉండగా.. అందులో 334 పదవులు, 660 జెడ్పీటీసీ స్థానాల్లో 335 మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 9,639 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలో 4,769 ఎంపీటీసీ స్థానాలు కూడా మహిళలకే రిజర్వు అయ్యాయి. కాగా, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లలో జిల్లాను యూనిట్గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే, మండలాన్ని యూనిట్గా తీసుకుని ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. -
రాజకీయ పార్టీలతో.. 17న ఈసీ భేటీ
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 17వ తేదీ శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాసినట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ సమావేశం ఉ.11గంటలకు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా ఆర్హత సాధించిన వాటిలో అధికార వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను సమావేశానికి హాజరుకావాలంటూ అధికారులు లేఖ రాశారు. జనసేన పార్టీకి గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా అర్హత లేకపోయినప్పటికీ.. నిర్ణీత గుర్తు కలిగి ఉన్న రిజస్టర్డ్ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకోవడంతో ఆ పార్టీని కూడా సమావేశానికి ఆహ్వానించారు. వీటితో పాటు రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్, బీఎస్పీలకు కూడా లేఖలు రాశారు. వీటితో పాటు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేతోపాటు వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మరో ఆరు పార్టీలను కూడా ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. -
‘పుర’ పోరుకు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు పూర్తికాగానే అదే ఊపులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలోగానీ మార్చి మొదటి వారంలోగానీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 110 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వాటిలో 14 కార్పొరేషన్లు, 5 సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 7 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 12 మొదటి గ్రేడ్ మున్సిపాలిటీలు, 26 రెండో గ్రేడ్ మున్సిపాలిటీలు, 22 మూడో గ్రేడ్ మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కాకినాడ కార్పొరేషన్కు 2017లో ఎన్నికలు నిర్వహించారు. మరోవైపు.. కొత్తగా 10 మున్సిపాలిటీలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వీటిపై వారం రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ఊపందుకున్న వార్డుల పునర్విభజన 2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే దాదాపు 90 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల సంఖ్యను పెంచారు. మిగిలిన మున్సిపాలిటీలలోనూ ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు వీలుగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు నిర్ణయించే దిశగా పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. కార్పొరేటర్లు, మేయర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేయడం, వార్డుల పునర్విభజనపై ప్రభుత్వానికి ఉన్న అధికారాలను రాష్ట్ర మున్సిపల్ కమిషనర్– డైరెక్టర్, జిల్లా కలెక్టర్లకు దఖలుపరుస్తూ పురపాలక శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలను మూడ్రోజుల్లో పూర్తిచేయాలని పురపాలక కమిషనర్– డైరెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే పరిశీలించి ఆమోదించాలని భావిస్తున్నారు. అలాగే, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ధారించనున్నారు. వీటితోపాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్ల ప్రక్రియను ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 10కల్లా తుది ఓటర్ల జాబితా మున్సిపల్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను రూపొందించే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలు, వినతులను పరిశీలించిన మీదట మొత్తం ప్రక్రియను ఫిబ్రవరి 10 నాటికి పూర్తిచేసి తుది ఓటర్ల జాబితాలను సిద్ధంచేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. పరోక్ష పద్ధతిలోనే మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికలు గతంలో నిర్వహించిన విధంగానే మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మొత్తం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను మార్చి మొదటి వారానికల్లా ముగించాలని పురపాలక శాఖ భావిస్తోంది. అంటే.. ఫిబ్రవరి చివరి వారంలోగానీ మార్చి మొదటి వారంలోగానీ పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి. కార్పొరేటర్లు/కౌన్సిలర్ల ఎన్నికలు ముగిసిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తారు. అందుకు వీలుగా ఎన్నికల సన్నాహాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ విజయ్కుమార్ ఆదేశించారు. -
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండు దశల్లో ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 45 రోజుల్లో జిల్లా పరిషత్లు, మండల పరిషత్లకు నూతన చైర్మన్లు, అధ్యక్షులు కొలువుదీరనున్నారు. వచ్చే నెలన్నర రోజుల వ్యవధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి ప్రక్రియ ముగిసి నూతన సారథులను ఎన్నుకోవడం పూర్తి కానుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 333 మండలాల్లో తొలివిడతలో, 327 మండలాల్లో రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలో సగం మండలాల చొప్పున రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజులకు రెండో దశ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. 17 సాయంత్రం షెడ్యూల్ విడుదల.. - ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల షెడ్యూల్కు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. - ఈనెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అదే రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తారు. - రాష్ట్రంలో 660 మండలాలు ఉండగా 333 జడ్పీటీసీలకు, 5,352 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 327 జడ్పీటీసీలకు, 4877 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల అనంతరం మూడు రోజుల వ్యవధితో జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. - 660 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ఒకే రోజు జరుగుతుంది. 13 జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికను కూడా ఒకే రోజు నిర్వహిస్తారు. - జడ్పీటీసీ స్థానాలకు జిల్లా కలెక్టరు కార్యాలయం లేదా జడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. - ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. - రెండు విడతల్లో మొత్తం 660 జడ్పీటీసీ, 10,229 ఎంపీటీసీ స్థానాలకు 34,320 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. - బ్యాలెట్ పేపర్ విధానంలో పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల నిర్వహణకు మొత్తం నాలుగు రకాల బ్యాలెట్ బాక్స్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. చిన్నది, మధ్యస్తం, పెద్దది, జంబో తరహాలో బ్యాలెట్ బాక్స్లను వర్గీకరించారు. అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. - పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం 30 గుర్తులను (ఫ్రీ సింబల్స్) సిద్ధం చేశారు. - మొదటి దశ ఎన్నికల్లో 1,45,05,502 మంది ఓటర్లు, రెండో దశలో 1,36,17,833 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. - మొత్తం 2,17,908 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. - ప్రతి కేంద్రంలో పోలింగ్ అధికారితో పాటు మరో ఐదుగురు సిబ్బంది ఉంటారు. మండల పరిధిలో కొంతమంది సిబ్బందిని అదనంగా ఉంచుతారు. ఏర్పాట్లపై చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 17వ తేదీన షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ శుక్రవారం కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై చర్చించారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటైన చోట, ఉన్నవాటిని రెండుగా విభజించిన చోట ఎన్నికల నిర్వహణకు కొత్తగా ఓటర్ల జాబితా, వార్డులను వర్గీకరించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే ప్రక్రియను ఫిబ్రవరి 8 నాటికి పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఎన్నికల సిబ్బందికి ఒక విడత శిక్షణ పూర్తి కావాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను తెప్పించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్తో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
పంచాయతీల్లో మహిళలకే అగ్రపీఠం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్దపీట వేసింది. మొత్తం పదవుల్లో సగానికి పైగా మహిళలకే రిజర్వు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్ష, జెడ్పీ చైర్మన్ పదవులతో పాటు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల్లోనూ సగం స్థానాలను మహిళలకు కేటాయించింది. ఆయా పదవుల రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం మంగళవారమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసిన విషయం తెలిసిందే. మొత్తం 1,55,629 పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయగా.. అందులో 79,485 పదవులను మహిళలకు రిజర్వు చేశారు. రాష్ట్రంలో మొత్తం 12,951 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవుల్లో 6,472, మొత్తం 1,31,116 వార్డు సభ్యుల పదవుల్లో 67,106 పదవులను మహిళలకు కేటాయించారు. మొత్తం 10,229 ఎంపీటీసీ పదవుల్లో 5,240 పదవులు, 660 మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో 330 పదవులు, మొత్తం 660 జెడ్పీటీసీ పదవుల్లో 331 పదవులు, 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు గాను 6 పదవులను మహిళలకే రిజర్వు చేయడం గమనార్హం. ఎస్సీలు, జనరల్కు పెరిగిన అవకాశాలు 2018 ఆగస్టులో సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తేల్చలేక పంచాయతీరాజ్ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎవరికీ నష్టం జరగకుండా రిజర్వేషన్లు ఖరారు చేసింది. 2006లో జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీలకు 18.30 శాతం, 2013 ఎన్నికల్లో 18.88 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించగా, ఈసారి ఆ కేటగిరీకి 19.08 శాతం రిజర్వేషన్లు కల్పించారు. జనరల్ కేటగిరీకి 2006లో 39.45 శాతం, 2013లో 37.97 శాతం పదవులు రిజర్వు కాగా, ఈసారి ఏకంగా 40.15 శాతం పదవులను రిజర్వు చేశారు. 2006, 2013 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా బీసీలకు 34 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జనాభా తక్కువగా ఉంది. ఎస్టీలకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించారు. 2020 ఎన్నికల్లో మొత్తం పదవుల్లో ఎవరికెన్ని.. -
నాడు గల్ఫ్ కార్మికుడు.. నేడు జెడ్పీటీసీ సభ్యుడు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): నిన్నటి వరకు గల్ఫ్ కార్మికుడిగా కొనసాగిన గుల్లె రాజేశ్వర్ నేటి నుంచి ఏర్గట్ల మండల తొలి జెడ్పీటీసీ సభ్యుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. జీవనోపాధి కోసం ఎన్నో ఏళ్ల పాటు గల్ఫ్లో పని చేసిన గుల్లె రాజేశ్వర్ తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. అంతేకాక జిల్లా పరిషత్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఫ్లోర్ లీడర్గా బాధ్యతలను నిర్వహించడానికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఏర్గట్లకు చెందిన రాజేశ్వర్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. వ్యవసాయం ఉన్నా ఉపాధి కోసం 2002లో గల్ఫ్ పయనం అయ్యాడు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా చేరిన రాజేశ్వర్ తన వృత్తి నైపుణ్యంతో సూపర్వైజర్ స్థాయికి ఎదిగాడు. తాను ఆర్థికంగా స్థిరపడడంతో పాటు పది మందికి పని కల్పిం చాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి 2010లో స్నేహితులు, బంధువుల సహకారంతో సప్లయింగ్ కంపెనీని కువైట్లో ప్రారంభించాడు. మరామిష్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీని స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. కువైట్లో తన కంపెనీ సక్సెస్ కావడంతో ఇటీవల దుబాయ్ లో కూడా మరో కంపెనీని స్నేహితుల భాగస్వామ్యంతో ప్రారంభించాడు. అయితే కువైట్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం బాధ్యతలను స్వీకరించి సేవా కార్యక్రమాలను కొనసాగించాడు. కువైట్లో క్షమాభిక్ష అమలు జరిగిన సమయంలో ఎంతో మంది ఖల్లివెల్లి కార్మికులు ఇళ్లకు చేరుకోవడానికి విమాన టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో అందించి పార్టీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో అతని సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఏర్గట్ల జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అవకాశం కల్పించగా ఆయనను జెడ్పీటీసీ పదవి వరిం చింది. జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన రాజేశ్వర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు జిల్లా పరిషత్లో పార్టీ ఫ్లోర్ లీడర్గాను వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. -
పీఠం దిగనున్న పరిషత్ పాలకులు
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ఐదేళ్ల పాటు ‘పరిషత్’లను ఏలిన పాలకులు పీఠం దిగే సమయం ఆసన్నమైంది. మండలాల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జెడ్పీ అధ్యక్షురాలి పదవీ కాలం ముగియనుంది. ఎన్ని కల నిబంధనల ప్రకారం ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఈ నెల 4తో జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మాజీలు కానున్నారు. జిల్లాలో అన్ని మండలా ల్లోనూ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ జె.నివాస్, జేసీ శ్రీని వాసులు, తదితర ఉన్నతాధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ పంచా యతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మండలాల్లో కూడా ప్రత్యేకాధికారుల పాలన రంగంలోకి రానుంది. జిల్లాలో ఉన్న 38 మండలాల్లో మళ్లీ ఎన్నికలయ్యేంతవరకు ప్రత్యేకాధికారులు విధుల్లో ఉండనున్నారు. తాజా పరిస్థితుల ప్రకారం జిల్లా వ్యా ప్తంగా మండల, జిల్లా పరిషత్ స్థాయి పాలకులు మొత్తం 753 మంది ప్రతినిధులు మాజీలు కానున్నారు. జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ మండలాల్లో ప్రత్యేకాధికారులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో మండల స్థాయి అధికారులు, మండలాల్లో జిల్లా స్థాయి అధికారుల పాలన ఉండాలనే నిబంధన మేరకు చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న మొత్తం 37 మంది జిల్లా పరిషత్ ప్రాధేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ), ఇద్దరు కో ఆప్షన్ మెంబర్లతో పాటు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న చౌదరి ధనలక్ష్మి కూడా ఈ నెల 4వ తేదీనే పీఠం దిగనున్నారు. అనంత రం జెడ్పీ పాలక బాధ్యతలు జిల్లా కలెక్టర్ జె. నివాస్ చేపట్టనున్నారు. దీంతో జిల్లా పరిషత్లో మళ్లీ పాలక వర్గం నియామకం అయ్యేంత వరకు ఇక్కడ కలెక్టర్ పాలన కొనసాగనుంది. ఇందుకోసం జెడ్పీలో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. 3న ‘పరిషత్’ ఓటర్ల జాబితాలు విడుదల.. జిల్లాలో అన్ని మండలాలు, జిల్లా పరిషత్ల్లో ప్రత్యేక అధికారుల పాలన కోసం ఓ వైపు అధికా రులు కసరత్తు చేస్తుండగా, మరోవైపు పరిషత్ ఎన్నికల నిర్వహణకు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మండలాల వారీగా ఈ నెల 3న ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నా రు. ఈ మేరకు ఎంపీటీసీల ఓటర్ల జాబితాలను ఎంపీడీవోలు, జెడ్పీటీసీల ఓటర్ల జాబితాలను జెడ్పీ సీఈవో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పంచా యతీల్లో ఎన్నికల కోసం ఎస్సీలు, ఎస్టీలు, బీసీల వారీగా ఓటర్లను ఫొటోలు, డోర్ నంబర్లతో సహా సిద్ధం చేశారు. వీటి ద్వారా ఎంపీటీసీల పరిధి మేరకు అధికారులు ప్రత్యేక జాబితాలను తయారు చేయించారు. జెడ్పీటీసీల ఎన్నికలకు కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జూలై 3వ తేదీ నాటికి ఈ జాబితాలను అందుబాటులో ఉండేలా ప్రచురణ చేయాలని సూచిం చారు. ఈ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యా రు. దీంతో మండల స్థాయిలో ఎన్నిక ల వాతావరణం కన్పిస్తోంది. ఎక్కడికక్కడ చర్చలు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అత్యధిక మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు, త్వరలో జరుగున్న ‘స్థానిక’ ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో మెజార్టీ ఇస్తారనే చర్చలు జోరందుకున్నాయి. అరసవల్లి: ఐదేళ్ల పాటు ‘పరిషత్’లను ఏలిన పాలకులు పీఠం దిగే సమయం ఆసన్నమైంది. మండలాల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జెడ్పీ అధ్యక్షురాలి పదవీ కాలం ముగియనుంది. ఎన్ని కల నిబంధనల ప్రకారం ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఈ నెల 4తో జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మాజీలు కానున్నారు. జిల్లాలో అన్ని మండలా ల్లోనూ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ జె.నివాస్, జేసీ శ్రీని వాసులు, తదితర ఉన్నతాధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ పంచా యతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మండలాల్లో కూడా ప్రత్యేకాధికారుల పాలన రంగంలోకి రానుంది. జిల్లాలో ఉన్న 38 మండలాల్లో మళ్లీ ఎన్నికలయ్యేంతవరకు ప్రత్యేకాధికారులు విధుల్లో ఉండనున్నారు. తాజా పరిస్థితుల ప్రకారం జిల్లా వ్యా ప్తంగా మండల, జిల్లా పరిషత్ స్థాయి పాలకులు మొత్తం 753 మంది ప్రతినిధులు మాజీలు కానున్నారు. జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ మండలాల్లో ప్రత్యేకాధికారులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో మండ ల స్థాయి అధికారులు, మండలాల్లో జిల్లా స్థాయి అధికారుల పాలన ఉండాలనే నిబంధన మేరకు చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న మొత్తం 37 మంది జిల్లా పరిషత్ ప్రాధేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ), ఇద్దరు కో ఆప్షన్ మెంబర్లతో పాటు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న చౌదరి ధనలక్ష్మి కూడా ఈ నెల 4వ తేదీనే పీఠం దిగనున్నారు. అనంత రం జెడ్పీ పాలక బాధ్యతలు జిల్లా కలెక్టర్ జె. నివాస్ చేపట్టనున్నారు. దీంతో జిల్లా పరిషత్లో మళ్లీ పాలక వర్గం నియామకం అయ్యేంత వరకు ఇక్కడ కలెక్టర్ పాలన కొనసాగనుంది. ఇందుకోసం జెడ్పీలో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 637 మంది మండల పరిషత్ ప్రాధేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ)తో పాటు 38 మంది మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), 38 మంది మండల కో ఆప్షన్ మెంబర్లకు కూడా ఈ నెల 3వ తేదీతో పదవీకాలం ముగియనుంది. 4వ తేదీ నుంచి మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ఇందుకోసం జిల్లా స్థాయి అధికారులను గుర్తించే పనిలో ఉన్నతాధికారులు బిజీ అయ్యారు. ఇందులో పలు అత్యవసర ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులను మినహాయింపు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
కొలిక్కిరాలే !
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రాదేశిక ఎన్నికలు పూర్తయ్యాయి. జెడ్పీ చైర్పర్సన్లు.. చైర్మన్లు.. వైస్ చైర్మన్లు.. జెడ్పీటీసీలు.. ఎంపీటీసీలు ఎవరో తేలిపోయారు. వచ్చే నెల ఐదో తేదీన మహబూబ్నగర్తో పాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా పరిషత్లు కొలువుదీరనున్నాయి. అదే రోజు నుంచి ఆయా పరిషత్లలో పాలన ప్రారంభం కానుంది. కానీ.. కొత్తగా కొలువుదీరిన జిల్లాల్లో పరిషత్ కార్యాలయాల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. కనీసం కొత్త పరిషత్ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల కేటాయింపు జరగలేదు. మిగిలిన పక్షం రోజుల్లో జెడ్పీ భవనాల ఖరారు.. ఉద్యోగుల నియామకాలు అధికారులకు సవాలుగా మారింది. మరోవైపు ఉద్యోగుల నియామకాలు, భవనాల ఎంపికకు సంబంధించి ఈనెల 15న పంచాయతీరాజ్ కమిషనర్తో జెడ్పీ సీఈఓలతో జరగాల్సిన సమావేశం రద్దు కావడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సమావేశం తర్వాతే భవనాల ఖరారు, ఉద్యోగుల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని జెడ్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అరకొర సదుపాయాల మధ్య కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయనే భావన ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, చైర్మన్లు, సీఈఓలకు ప్రభుత్వం కొత్త వాహనాలు కేటాయించింది. ఈ వాహనాలు ఈ నెలాఖరులోగా ఆయా జిల్లాలకు చేరుకుంటాయని సమాచారం. ∙కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో 64 మండలాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా చారగొండ, పదర, మూసాపేట, రాజాపూర్, మదనాపురం, చిన్నంబావి, మరికల్, మహబూబ్నగర్ రూరల్, కృష్ణ, ఊర్కొకొండ, పెంట్లవెల్లి, రాజోలి, ఉండవెల్లి, కేటీ దొడ్డి, రేవల్లి, శ్రీరంగాపురం, అమరచింత మొత్తం 17 మండలాలు ఏర్పాటయ్యాయి. దీంతో మండలాల సంఖ్య 81కు చేరింది. అదే సమయంలో పది మండలాలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కలిశాయి. దీంతో ఉమ్మడి పాలమూరు 71 మండలాలకు పరిమితమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో కొత్తగా నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఏర్పాటు చేశారు. 15 మండలాలతో మహబూబ్నగర్ జిల్లా ఏర్పాటు కాగా 11 మండలాలతో నారాయణపేట, 20 మండలాలతో నాగర్కర్నూల్, 12 మండలాలతో జోగులాంబ గద్వాల, 14 మండలాలతో వనపర్తి జిల్లా ఏర్పాటైంది. తాజాగా గత నెలలో మూడు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి. వచ్చే నెల నాలుగో తేదీన ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుంది. మరుసటి రోజే ఎన్నికయిన కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. గడువులోగా గగనమే...! కొత్తగా కొలువుదీరిన జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఇంతవరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. కనీసం భవనాలు సైతం ఖరారు కాలేదు. పాత మహబూబ్నగర్ జిల్లా పరిషత్ కార్యాలయాన్ని మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో పరిషత్ కార్యాలయాల భవనాలు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో భవనాలు లేకపోవడంతో బిజినేపల్లిలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని జెడ్పీకి కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అటు వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రాల్లో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ భవనాలు, నారాయణపేటలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం జిల్లా పరిషత్ కార్యాలయాలకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వాన్ని నివేదించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తర్వాత భవనాలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఐదు జిల్లా పరిషత్లు.. 60 మంది ఉద్యోగులు కొత్తగా కొలువుదీరనున్న జెడ్పీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల విభజన, కేటాయింపుల విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కొత్తగా కొలువుదీరనున్న జెడ్పీ కార్యాలయాల్లో ఉద్యోగుల కేటాయింపు ఏ ప్రాతిపదికన జరుగుతుందో అనే ఉత్కంఠ ఆయా ఉద్యోగుల్లో నెలకొంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేస్తోన్న ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు కానున్న జెడ్పీలకు సమానంగా విభజించాలని ప్రాథమికంగా> నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో ఐదుగురు డీప్యూటీ సీఈఓలున్నారు. వీరందరికీ కొత్త జిల్లా పరిషత్లకు ఇన్చార్జ్ సీఈఓలుగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జెడ్పీలో మొత్తం 60మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఏడుగురు సూపరింటెండెంట్లు ఉండగా మహబూబ్నగర్ జెడ్పీకి ముగ్గురిని, మిగిలిన నాలుగు జెడ్పీ కార్యాలయాలకు ఒక్కొక్కరి చొప్పున నియమించాలని నిర్ణయించారు. 13మంది సీనియర్ అసిస్టెంట్లు ఉండగా నాగర్కర్నూల్కు నలుగురు, మహబూబ్నగర్కు ముగ్గురు, మిగిలిన మూడు జెడ్పీలకు ఇద్దరి చొప్పున కేటాయించనున్నారు. 21 మంది జూనియర్ అసిస్టెంట్లలో మహబూబ్నగర్కు తొమ్మిది మంది, మిగిలిన నాలుగు జెడ్పీలకు ముగ్గురి చొప్పున, ఉన్న ఐదుగురి టైపిస్ట్లలో ఒక్కొక్కరికి ఒక్కో జెడ్పీకి, 14 మంది అటెండర్లలో మహబూబ్నగర్ జెడ్పీ కార్యాలయానికి పది మంది, మిగిలిన నాలుగు జెడ్పీలకు ఒక్కొక్కరి చొప్పున కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. అయితే.. ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకే ఉద్యోగుల విభజన జరగనుంది. అలాగే.. ప్రస్తుతం ఉమ్మడి జెడ్పీ కార్యాలయంలో అటెండర్ మొదలు డిప్యూటీ సీఈఓలుగా పని చేస్తోన్న అందరికీ పదోన్నతులు వచ్చే అవకాశాలుండడంతో ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
కొలిక్కిరాని.. విభజన
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై రోజులు గడిస్తే... ఉమ్మడి నల్ల గొండ జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. జిల్లా పునర్విభజనతో అదనంగా ఏర్పాటైన సూర్యాపేట, యాదాద్రి భువనగిరి సహా నల్లగొండ జెడ్పీలకు కొత్త పాలక వర్గాల ఎన్నిక ఇప్పటికే పూర్తయ్యింది. జూలై 4వ తేదీన పాత పాలకవర్గం దిగిపోగానే.. కొత్త పాలవర్గం పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ... నల్లగొండ జెడ్పీకి మినహా మిగిలిన రెండు జెడ్పీలకు ఇప్పటి దాకా కొత్త భవనాలను సిద్ధం చేయలేదు. మరీ ముఖ్యంగా జెడ్పీ విభజన ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 59 మండలాలు ఉండగా.. మూడు జిల్లాలుగా పునర్విభజన జరిగాక.. మండలాల సంఖ్య ఏకంగా 71కి చేరింది. నల్లగొండ –31, సూర్యాపేట–23, యాదాద్రి భువనగిరి–17 మండలాలతో జిల్లాలుగా కొలువుదీరాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ఇప్పటికీ వసతుల్లేవు. ఇప్పుడు కొత్త జిల్లాపరిషత్ల పరిస్థితీ అదే తరహాలో ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా పరిషత్ అధికారులు జెడ్పీ విభజన కోసం తుది కసరత్తు మొదలు పెట్టారు. సిబ్బంది కేటాయింపులు, పోస్టింగులు.. తదితర అంశాలు చర్చించేందుకు పంచాయతీ కమిషనర్తో సీఈఓల సమావేశం ఈనెల 15వ తేదీన ఏర్పాటు చేశారు. వాస్తవానికి గురువారం జరగాల్సి ఉన్న ఆ సమావేశాన్ని 15వ తేదీకి వాయిదా వేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం ముగిస్తే కానీ.. జెడ్పీ విభజనపై ఒక స్పష్టత రాదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మూడు జిల్లాలకు 68మంది సిబ్బంది విభజన ఉమ్మడి జిల్లా పరిషత్కు మంజూరైన పోస్టులు కేవలం 68. ఇందులో 11 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇప్పటికే పాత జెడ్పీ 57 మందితో నడుస్తుండగా.. అందులో జూనియర్ అసిస్టెంట్లు(26), ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్ (17)లదే సింహభాగం. రెండు కొత్త జెడ్పీలు కొలువు దీరనున్నా... పాత సిబ్బంది విభజన తప్ప కొత్త సిబ్బంది రిక్రూట్మెంట్ మాత్రం లేదని అంటున్నారు. మరీ అంతకు సిబ్బంది సరిపోకపోతే ఆయా మండలాల నుంచి డిప్యుటేషన్పై సిబ్బందిని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సిబ్బంది విభజన తర్వాత ఎవరి సొంత జిల్లాలకు వారిని కేటాయించే వీలుందని పేర్కొంటున్నారు. దీనికోసం ఆయా సిబ్బంది సర్వీసు, సీనియారిటీ తదితర వివరాలతో జెడ్పీ అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. జెడ్పీ మొత్తం సిబ్బందిలో అత్యధికంగా 19 మంది ఉద్యోగులు నల్లగొండ మండలం నుంచే ఉన్నారు. అయితే, మండలాల సంఖ్యను బట్టి ఏ జిల్లాకు ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు, ఏ ప్రాతిపదికన చేపడతారు, ఏ రేషియో ప్రకారం కేటాయింపులు జరుపుతారు అన్న స్పష్టత ఇంకా రాలేదని, 15వ తేదీ నాటి సమావేశం తర్వాత నిర్ణయం జరుగుతుందని చెబుతున్నారు. మరోవైపు కొత్త ఏర్పాటైన 12 మండలాల్లో సైతం ఇప్పటికీ సిబ్బంది లేరు. ప్రధానమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టులు భర్తీ కానేలేదు. మొన్నటి పరిషత్ ఎన్నిలను సైతం తహసీల్దార్లకు బాధ్యతలు అప్పజెప్పి పూర్తి చేశారు. సూపరింటెండెంట్లు, ఈఓఆర్డీలకే ఇన్చార్జ్ ఎంపీడీఓలుగా బాధ్యతలు ఇచ్చారు. కొత్త సిబ్బందిని నియమించుకునే అవకాశం లేదని, పాతవారిని సర్దుబాటు చేయాల్సిందేనని, దీంతో మూడు జెడ్పీలకూ అరకొర సిబ్బందే దిక్కయ్యేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
కొత్త జెడ్పీ చైర్మన్లకు సీఎం కేసీఆర్ ఉద్భోద
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్ ఉద్యమం, సహకారం ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వ వైభవం రావాలని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను సీఎం కూలంకశంగా వివరించారు. జిల్లా పరిషత్ చైర్మన్లగా, వైఎస్ చైర్మన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు అందరిని అభినందించారు. ఈ ఐదేళ్లలో కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పదవి వచ్చిన తర్వాత సహత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తేను మంచి పేరు వస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవరపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలని సిఎం ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్ లో శిక్షణా కార్యక్రమం నిర్విస్తామని ప్రకటించారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్థిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలులో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ‘చాలా కాలం పంచాయితీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో స్థానిక సంస్థలు పనిచేశాయి. పారిశుద్ధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా వుండేది. దురదృష్ట వశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడింది. 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత కూడా ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్రత వాతావరణం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. గ్రామాల్లో మంచిగా ఏదీ జరగడం లేదు. పల్లెలు పెంటకుప్పల లాగా తయారయ్యాయి. ఎందుకీ క్షీణత? మంచినీళ్ల గోస ఎందుకు? తెలంగాణ ఎక్కడో లేదు....గ్రామాల్లోనే వుంది. గ్రామాలు మనం అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. మీరంతా విద్యాధికులు. పరిస్థితులను అర్థం చేసుకోగలరు. మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. భయంకరమైన గ్రామాల పరిస్థితులలో మార్పు రావాలి. అది గుణాత్మకమైన మార్పు కావాలి. మీ అందరు జులై నెలలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ లోపుగా మీరంతా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ లొ శిక్షణకు పోవాలి. దానికి మా అధికారులు ఒక మంచి కోర్స్ డిజైన్ తయారు చేస్తారు. గ్రామ పంచాయితీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయితీ రాజ్ చట్టం చాలా కఠినంగా వుంది. కార్యదర్శి చక్కగా పనిచేస్తేనే, అనుకున్న ఫలితాలను సాధిస్తేనే, మూడేళ్ళ తరువాత ఆయన సేవలను క్రమబద్దీకరిస్తాం. పంచాయితీ కార్యదర్శుల మీద పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోలతో బాగా పనిచేయించాలి. దీనికి సంబంధించిన ఆర్ధిక, పరిపాలన, ఆజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆర్నెల్లలో పూర్తి మార్పు కనబడాలి’ అని సిఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎ.జీవన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, షకీల్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, నల్లాల ఓదేలు, ఉమా మాధవరెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
అవి ఓకే.. మరి ఇవి?
సాక్షి, వరంగల్: జిల్లా ప్రజా పరిషత్ల తుదిరూపుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 7, 8వ తేదీల్లో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికతో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లా పరిషత్లు, మండల పరిషత్ల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కా ర్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల కేటాయింపు, మౌలిక వసతులపై మార్గదర్శకాలు అందకపోవడంతో అధికారులు సందిగ్దావస్థలో ఉన్నారు. గత ఐదునెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇక కొత్త పాలకవర్గాలు వచ్చే నెల 5వ తేదీ కొలువు దీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, జిల్లా పరిషత్ల కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుకు సాగాలంటే ప్రభుత్వం నుంచి సూచనలు, సలహాలతో కూడిన మార్గదర్శకాలు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల విభజన, కేటాయింపే సమస్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో ఒకే జిల్లా పరిషత్, 50 మండల పరిషత్లు ఉండగా... జిల్లా పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆరు జిల్లా ప్రజాపరిషత్లు, 71 మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లా పరిషత్లు, ఆ జెడ్పీల పరిధిలో 70 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరు జిల్లా పరిషత్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక 67 మండల పరిషత్లకు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియ మొత్తం సజావుగానే సాగినా జిల్లా పరిషత్ విభజనపై ఇప్పటికీ మార్గదర్శకాలు అందలేదు. కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు అవసరమైన కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనపై కసరత్తుతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారా.. లేదా వర్క్ టు సర్వ్ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా జిల్లా పరిషత్ల ఏర్పాటుపై పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఆరు జిల్లాలకు నోడల్ జెడ్పీగా ఉన్న వరంగల్ జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా.. ఇప్పటి వరకు ఉన్న మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే ఉద్యోగులు కమిషనర్కు నివేదించారు. ప్రస్తుతం 74 మంది.. వరంగల్ జెడ్పీలో ప్రస్తుతం జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓతో పాటు 8 మంది సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, 29 జూనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు టైపిస్టులు సహా రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, డ్రైవర్లు మొత్తం 74 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడే ఒక్కో జిల్లా పరిషత్కు కనీసం 19 మంది సిబ్బంది అవసరం. సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఇద్దరు సూపరింటెండెంట్లు, ముగ్గురు సీని యర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్కో జెడ్పీలో ఎంత తక్కువ అనుకున్నా కనీసం 19 మంది అవసరం అవుతుందని అంచనా. ఈ లెక్కన ఆరు జిల్లాలకు కలిపి 114 మంది అవసరమవుతా రు. అదే విధంగా ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్సు యంత్రాలు తదితర సామగ్రి కూడా కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి కొత్త జిల్లాలకు సిబ్బందిని బదిలీ చేస్తారా లేదా సర్వ్ టు రూల్ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే సిబ్బందిని కేటాయిస్తారా అన్న అంశాలు జిల్లా పరిషత్ ఉద్యోగుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీడీఓలు ఏరీ? ఉమ్మడి జిల్లాలో జిల్లాల పునర్విభజనతో పాటే కొత్త మండలాలు ఏర్పడగా వాటిలో ఎంపీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, వేలేరు, దామెర, టేకుమట్ల, కన్నాయిగూడెం, పలిమెల, గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర, తరిగొప్పుల, చిల్పూరు తదితర మండలాలు ఏర్పడగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మండలాల్లో కొత్త ఎంపీడీఓ కార్యాలయాల ఏర్పాటుతోపాటు ఉద్యోగులను విభజించి కేటాయించాల్సి ఉంది. ఒక్కో మండల పరిషత్కు కనీసం 9 మంది ఉద్యోగులను నియమిస్తే పాలన సాఫీగా కొనసాగుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఓ ఎంపీడీఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు అవసరమని పేర్కొన్నారు. కాగా, కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా రాలేదని అధికారిక సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ ఛైర్పర్సన్లతో పాలకవర్గాలు ఏర్పడగా.. వచ్చే జులై 5న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. ఈలోగా కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా లేదా.. అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా... జిల్లా పరిషత్లు 06 మండల పరిషత్లు (4 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికాలేదు) 71 ప్రస్తుతం వరంగల్ జెడ్పీలో ఉద్యోగులు 74 ఒక్కో కొత్త జెడ్పీకి కావాల్సిన ఉద్యోగులు 19 ఒక్కో ఎంపీడీఓ కార్యాలయానికి కావాల్సిన ఉద్యోగులు 9 -
జెడ్పీలకు భవనాలెట్ల!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో స్థానిక పరిపాలన కొత్త రూపు సంతరించుకోనుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4తో ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి కొత్తగా ఎన్నికైన వారి పదవీకాలం మొదలవుతుంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు మొదటి సమావేశంలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. పాలకవర్గం సైతం అదే రోజు కొలువుదీరుతుంది. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం ఉన్న తొమ్మిది జిల్లా పరిషత్లు 32కు పెరగనున్నాయి. అన్ని జిల్లాల్లో జెడ్పీ భవనాల కోసం పంచాయతీరాజ్ శాఖ వెతుకులాట మొదలుపెట్టింది.ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జెడ్పీ భవనాలు అన్ని రకాలుగా గొప్పగానే ఉన్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో ఆ స్థాయి భవనాలు ఎక్కడా లేవు. ఒకటిరెండు కొత్త జిల్లాల్లో తప్పితే జెడ్పీలకు ప్రభుత్వ భవనాలు ఉన్న పరిస్థితి లేదు. దీంతో పరిపాలన భవనం, సమావేశ మందిరం వంటి హంగులతో ఉండే భవనాల కోసం అధికారులు వెతుకుతున్నారు. ఎక్కువ జిల్లాల్లో ఆ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ కార్యాలయాలుగా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మండల పరిషత్లకు కొత్తగా కార్యాలయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు సొంత భవనాలలో ఉన్న మండల పరిషత్ కార్యాలయాలను ఇప్పుడు ఇతర భవనాల్లోకి మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. జెడ్పీ కార్యాలయాల కోసం భవనాల ఎంపిక ప్రక్రియను రెండుమూడు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రెండు జెడ్పీలు ఆలస్యం... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపే విషయంలో జాప్యం వల్ల ఆ జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఆలస్యంగా మొదలైంది. 2019 ఆగస్టు 6తో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ పదవీకాలం మొదలుకానుంది. -
జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక నేడే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పాలక మండలిలోని కీలక పదవుల ఎన్నిక నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, రెండు కోఆప్షన్ పదవులకు ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఖైరతాబాద్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలుత కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత జెడ్పీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు అర్హుల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు కొంత సమయం కేటాయిస్తారు. ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ లోకేష్కుమార్, ఇతర అధికారులు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఒంటిగంటలోపు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. 3.30 గంటలలోపు ఎన్నికలు పూర్తవుతాయి. కాగా, ఎన్నిక పూర్తయినప్పటికీ వీరి ప్రమాణ స్వీకారం వచ్చే నెల మొదటి వారంలో జరిగే వీలుంది. ప్రస్తుత పాలక మండలి పదవీకాలం వచ్చేనెల నాలుగో తేదీ వర కు ఉంది. ఆలోపు ప్రమాణ స్వీకారం జ రిగే తేదీని యంత్రాంగం ప్రకటించనుంది. దీనికి అనుగుణంగా కొత్త పా లక మండలి కొలువుదీరుతుంది. అదే తొలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తారు. వైస్ చైర్మన్ పదవి ఎస్టీకి లేదా బీసీకి జెడ్పీ చైర్ పర్సన్ పదవికి టీఆర్ఎస్ నుంచి మహేశ్వరం జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ తీగల అనితారెడ్డి పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈమె ఎన్నిక లాంఛనమే. ఇక వైస్ చైర్మన్ పదవిని ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా.. ఆ పదవి రెడ్డి సామాజిక వర్గం కోటాలో పడింది. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని బీసీకి కేటాయించాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. మరో సమీకరణ కూడా టీఆర్ఎస్ పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కొనసాగి ప్రస్తుత కొంత రంగారెడ్డి జిల్లాలో ఉన్న 11 మండలాల పరిధి వ్యక్తికి జెడ్పీ చైర్ పర్సన్గా అవకాశం కల్పిస్తున్నారు. పాలమూరు నుంచి రంగా రెడ్డి జిల్లాలో కలిసిన ప్రాంతానికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించాలన్న డిమా ండ్ కూడా వినిపిస్తోంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడి పది మండలాల్లో ఎస్టీ జెడ్పీటీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీనికి అనుగుణంగా ఎస్టీ సామాజిక వర్గానికి పదవికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ సామాజిక వర్గం.. అభ్యర్థి ఎవరు అన్న దానిపై పార్టీ వర్గాలు వెల్లడించడం లేదు. అధిష్టానం నుంచి వచ్చే సీల్డ్ కవరులో ఎవరి పేరు ఉంటే.. వైస్ చైర్మన్గా ఆ వ్యక్తి ఉంటారని పేర్కొంటున్నారు. -
గులాబీదే హవా..
సాక్షి, వరంగల్ రూరల్ : మండల ప్రాదేశిక అధ్యక్ష ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తిరుగులేని మెజార్టీని సొంతం చేసుకుంది. పోటీ లేకుండా మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలను దక్కించుకుంది. జిల్లాలోని 16 మండలాల అధ్యక్ష స్థానాలుండగా 15 టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లాయి. జిల్లాలో మూడు దశల్లో మే 6, 10, 14 తేదీల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. జిల్లాలో 178 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్ఎస్ పార్టీకి 127, కాంగ్రెస్కు 44, ఇండిపెండెంట్లు ఏడుగురు గెలుపొందారు. ఆయా మండల కేంద్రాల్లో శుక్రవారం ఎంపీపీల ఎన్నికలు జరిగాయి. క్యాంపుల నుంచి నేరుగా మండల పరిషత్ కార్యాలయాలకు ఎంపీటీసీ సభ్యులు చేరుకున్నారు. మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. 16 మండల పరిషత్ల్లో 15 టీఆర్ఎస్ దక్కించుకుంది. జిల్లాలో గీసుకొండ ఒక్కటే కాంగ్రెస్కు దక్కింది. ఉద్రిక్తల నడుమ నర్సంపేట ఎంపీపీ ఎన్నిక నర్సంపేట మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక ఉద్రిక్తల నడుమ జరిగింది. నర్సంపేట మండల పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీ 6, టీఆర్ఎస్ పార్టీ 5 స్థానాల్లో గెలుపొందారు. తన భార్యను కిడ్నాప్ చేశారని లక్నెపల్లి ఎంపీటీసీ రజిత భర్త బుచ్చయ్య నర్సంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. సమావేశ ప్రాంతానికి పోలీసులు చేరుకుని రజితను తీసుకుని పోలీస్స్టేషన్కు తీసుకవచ్చారు. రజితను బుచ్చయ్యకు అప్పగించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి బయటకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డుపై ధర్నా చేశారు. ఒకే దగ్గరికి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నేలకోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరినొకరు తగవులాడుకున్నారు. కొట్లాటకు దారి తీస్తుండడతో పోలీసులు రంగప్రవేశం చేసి అందరిని చెదరకోట్టేందుకు లాఠీచార్జీ చేశారు. దీంతో ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. రజిత తన భర్త బుచ్చయ్యతో కలిసి నర్సంపేట మండల పరిషత్ కార్యాలయంకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు హాజరుకాలేదు. హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు సైతం టీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. ఉద్రిక్తల నడుమ ఎంపీపీ ఎన్నిక జరిగింది. నర్సంపేట ఎంపీపీగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మోతే కమలమ్మ, ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బాంజీపేట ఎంపీటీసీ మౌనికను ఎన్నుకున్నారు. నర్సంపేట ఎంపీపీ ఎన్నికను ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీఆర్ఎస్కే దక్కే విధంగా చక్రం తిప్పారు. -
‘పరిషత్’ ఆఫీసులెక్కడ?
ఆదిలాబాద్అర్బన్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. మండలానికో జెడ్పీటీసీ, ఆయా మండలాల పరిధిలో ఉన్న స్థానాలను బట్టి ఎంపీటీసీ సభ్యులు కొత్తగా ఎన్నికయ్యారు. ఈనెల 7న మండల పరిషత్ అధ్యక్షుడితోపాటు వైస్ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. దీనికి ముందు కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇది వరకే షెడ్యూల్ జారీ చేసింది. ఇందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 4 వరకు ఉంది. ఆ లగా నూతన మండల పరిషత్లను ఏర్పాటు చేస్తారా? లేక పాత మండలాల్లోనే కొనసాగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. కొత్త పాలకవర్గం కొలువుదీరి వారి వారి మండల పరిషత్ కార్యాలయాల్లో పాలన సాగించాలంటే నూతన పరిషత్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఎంపీటీసీలు జూలై 5న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారని ఆయా మండలాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నూతన రెవెన్యూ మండలాలను పరిషత్ మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికలకు ముందే జిల్లా అధికారులను ఆదేశించింది. దీనిపై అధికారులు అప్పట్లో ఎంపీపీ కార్యాలయాల కోసం అద్దె భవనాలు, సౌకర్యాలు ఉండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఉనికిలోకి నూతన మండల పరిషత్లు. జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. ఇందులో పాత మండలాలు 13 ఉండగా, పునర్విభజన సమయంలో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటయ్యాయి. జైనథ్, బేల, తలమడుగు, గుడిహత్నూర్, నేరడిగొండ, బజార్హత్నూర్, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, తాంసి, ఆదిలాబాద్, ఇచ్చోడ, నార్నూర్ మండలాలు ఉండగా, తాంసి పరిధిలోని భీంపూర్ కొత్త మండలంగా ఏర్పాటైంది. ఇలాగే ఆదిలాబాద్ నుంచి మావల, ఇచ్చోడ నుంచి సిరికొండ, నార్నూర్ నుంచి గాదిగూడ మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. నూతన మండలాలు ఏర్పాటై దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు రెవెన్యూ మండలాలుగానే కొనసాగుతున్నాయి. కొత్త మండలాల్లో కొనసాగే పరిషత్ పాలన మాత్రం పాత మండలాల నుంచే కొనసాగుతోంది. దీనికి తోడు కొత్త మండలాలకు ఇప్పటికీ ఎంపీడీవోలను నియమించకపోవడంతోపాటు పాత మండలాల ఎంపీడీవోలను ఇన్చార్జిలుగా ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. దీంతో మండల పరిషత్లో ఏవైనా పనులుంటే పాత మండల కార్యాలయాలకే రావాల్సి వస్తోంది. ఇక నుంచి నూతన మండల పరిషత్లు ఉనికిలోకి రానుండడంతో ప్రజల బాధలు తీరనున్నాయి. కొత్త పరిషత్, పాలకవర్గం కొలువుదీరిన వెంటనే అధికారులను, సిబ్బందిని, సామగ్రిని కొత్త మండలాలకు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికారుల సన్నాహాలు కొత్తగా ఏర్పడిన మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పాత మండలాలతో పాటే పూర్తయ్యాయి. దీంతో నూతన మండలాల ఎంపీపీ, వైస్ఎంపీపీ, ఇతర పదవులకు ప్రత్యేకంగానే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా ఎంపీపీ కార్యాలయాల్లోనే ఎంపీపీ, ఇతర పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. అందుకు ఎంపీపీ కార్యాలయాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎంపీడీవో, సూపరింటెండెంట్, అకౌంట్స్ అధికారి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతోపాటు స్వీపర్లను కూడా కొత్త మండలాలకు కేటాయించాల్సి ఉంది. మొదట కార్యాలయాలకు భవనాలను ఎంపిక చేసిన తర్వాత దశల వారీగా సిబ్బంది కేటాయింపు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కొరవడిన స్పష్టత కొత్త మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. కొత్తగా ఏర్పడిన భీంపూర్ మండలం ఎంపీడీవో కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ మండలంలో తహసీల్దార్ కార్యాలయం పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ, అద్దె భవనాలు దొరకడం కొంత కష్టమే. దీంతో తహసీల్ కార్యాలయం పక్కనే ఒక రూంలో పంచాయతీ భవనం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే బాద్రూరల్ మండలం నుంచి విడిపోయిన మావల మండలం పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. మావల మండల రెవెన్యూ తహసీల్ కార్యాలయం పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల్లో కొనసాగుతోంది. ఇక్కడ మండల పరిషత్ ఏర్పాటుకు నూతన భవనం వెతకాల్సి ఉంది. అలాగే గాదిగూడ, సిరికొండ మండలాల్లో కూడా ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాలు దొరకడం కష్టంగా మారిన నేపథ్యంలో పరిషత్ ఏర్పాటు అధికారులకు ఓ విధంగా సవాల్గా మారిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, కొత్త మండలాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు ఇప్పటికీ చేపట్టపోగా, ఉన్న ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాల్లోనే కాలం వెల్లదీయాల్సి వస్తోంది. -
దేవరకద్రలో బీజేపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకుర్ గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు తరువాత, గెలిచిన బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి మంగళవారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతు ప్రేమ్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జెడ్పీ పీఠం టీఆర్ఎస్దే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాపరిషత్ పీఠం టీఆర్ఎస్ పార్టీకే దక్కనుంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జెడ్పీటీసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబర్చిన టీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్పర్సన్ సీటును కైవసం చేసుకోనుంది. జెడ్పీ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీ తరఫున ఈ స్థానానికి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి పేరును ఇప్పటికే పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మహేశ్వరం జెడ్పీటీసీగా ఈమె విజయం సాధించడంతో జెడ్పీ పీఠాన్ని అనితారెడ్డి అధిరోహించడం ఇక లాంఛనమే కానుంది. చివరి నిమిషంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకుంటే తప్ప.. చైర్పర్సన్ కుర్చీలో ఆమె కూర్చోనున్నారు. జిల్లాలోని 21 జెడ్పీటీసీల్లో గులాబీ పార్టీ 16 స్థానాలను గెలుచుకుంది. చైర్పర్సన్గా ఎన్నిక కావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 11 జెడ్పీటీసీలు. ఇంతకుమించి అదనంగా ఐదు స్థానాలను టీఆర్ఎస్ సాధించింది. నాలుగు స్థానాలు మాత్రమే సాధించిన కాంగ్రెస్ జెడ్పీ పీఠంపై ఆశలు వదులుకుంది. ఎంపీపీ సీట్లపైనా గులాబీ గురి మండల పరిషత్ అధ్యక్ష స్థానాలపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. జిల్లాలోని 21 ఎంపీపీ స్థానాల్లో తొమ్మిది గులాబీ చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఎవరి అవసరం లేకుండా స్వతహాగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీటీసీలుగా గెలిచిన అభ్యర్థులను ఎంపీపీలుగా ఎన్నుకోనున్నారు. మిగిలిన స్థానాలను చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పావులు కదుపుతోంది. స్వతంత్రులుగా గెలిచిన ఎంపీటీసీలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎంపీటీసీలు ఫోన్లో టచ్లోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరో పది ఎంపీపీ స్థానాలను సంపాదించాలని టీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్కు అబ్దుల్లాపూర్మెట్, మంచాల ఎంపీపీలు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ అధిక సంఖ్యలో గెలిచిన ఆ పార్టీ ఎంపీటీసీలను కాపాడుకుంటే ఇది సాధ్యమే. లేదంటే ఇవి కూడా చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. మిగిలిన మండలాల్లో కాంగ్రెస్కు పెద్దగా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే కందుకూరు ఎంపీపీని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ 16 ఎంపీటీసీలకుగాను.. ఏడింటిలో కమలం వికసించింది. మరో ఇద్దరు అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇక తలకొండపల్లి ఎంపీపీ స్థానం ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) ఖాతాలో దాదాపుగా పడినట్లే. ఇక్కడ ఆ పార్టీ ఆరు ఎంపీటీసీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, జనసేన నుంచి ఒకరు చొప్పున గెలుపొందారు. వారు కూడా ఏఐఎఫ్బీకే మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. -
‘పరిషత్’లోనూ కారు జోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో కారు టాప్ గేర్లో దూసుకెళ్లింది. కారు స్పీడ్కు ఇతర పార్టీలు కకావికలం అయ్యాయి. అత్యధిక ఎంపీటీసీ, జెడ్పీటీసీలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం ఎంపీటీసీల్లో సగం గులాబీ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఇక జెడ్పీటీసీల్లో 16 స్థానాలను కారు ఎగరేసుకుపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు మంగళవారం జిల్లాలో ఐదు కేంద్రాల్లో జరిగింది. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 257 ఎంపీటీసీలకుగాను ఏకగ్రీవాలతో కలుపుకుని 128 స్థానాలు గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. ఆమనగల్లులో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 73 ఎంపీటీసీ స్థానాలతో సరిపెట్టుకుంది. భారీగా ఎంపీటీసీ స్థానాలు గెలుస్తామని గంపెడాశలు పెట్టుకున్న బీజేపీ 18 స్థానాలకు పరిమితమైంది. ఆ పార్టీ అత్యధికంగా కందుకూరు మండలంలో ఏడు, మహేశ్వరం మండలాల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 29 స్థానాల్లో గెలిచి సత్తా చాటారు. అలాగే తలకొండపల్లి మండలంలో ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ గాలి వీచింది. ఇక్కడ 12 ఎంపీటీసీల్లో.. ఆరింటిలో విజయ కేతనం ఎగురవేసింది. మంచాల మండలం జాపాలలో సీపీఎం అభ్యర్థి గెలువగా.. తలకొండపల్లి మండలంలో ఒక్క స్థానాన్ని జనసేన సొంతం చేసుకుంది . మూడు మండలాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ ఆది నుంచి కాంగ్రెస్కు మంచి పట్టున్న కాంగ్రెస్.. ఎంపీటీసీ ఫలితాల్లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. మూడు మండలాల్లో కనీసం బోణీ చేయకపోవడం గమనార్హం. ఆమనగల్లు, మహేశ్వరం, శంకర్పల్లి మండలాల్లో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. స్వతంత్రులు, బీజీపీ అభ్యర్థులు విజయం సాధించినా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం ఒక్కరూ నెగ్గలేకపోయారు. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పి.సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్కు దగ్గరైన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మహేశ్వరం సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే మహేశ్వరం, కందుకూరు మండలాల్లో 29 ఎంపీటీసీలు ఉండగా.. కందుకూరు మండలంలో ఒక స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. సబిత తన వర్గాన్నంతా టీఆర్ఎస్ విజయం కోసం శ్రమించేలా చేశారని స్పష్టమవుతోంది. మొత్తం మీద గ్రామాల్లో ‘కారు’ స్పీడుకు ఇతర పార్టీల అభ్యర్థుల అడ్రస్ గల్లంతైంది. మొత్తం 21 మండలాల్లో.. 17 మండలాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. నాలుగు మండలాల్లో మాత్రమే టీఆర్ఎస్ కంటే ఎక్కవ ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకుంది. జెడ్పీటీసీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ జోరు జెడ్పీటీసీ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 21 స్థానాలకు గాను.. 16 చోట్ల కారుకు ఓటర్లు జైకొట్టారు. నాలుగు జెడ్పీటీసీల్లో కాంగ్రెస్ నెగ్గింది. శంషాబాద్, ఆమనగల్లు, మహేశ్వరం, కేశంపేట, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, నందిగామ, యాచారం, కడ్తాల్, శంకర్పల్లి, కందుకూరు, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, కొత్తూరు జెడ్పీటీసీల్లో గులాబీ దళం పాగా వేసింది. మాడ్గుల, ఇబ్రహీంపట్రం, మంచాల, అబ్దుల్లాపూర్మెట్ జెడ్పీటీసీలు ‘హస్త’గతం అయ్యాయి. తలకొండపల్లి జడ్పీటీసీ స్థానాన్ని ఏఐఎఫ్బీ దక్కించకుంది. -
కారు స్పీడ్ పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మరోసారి అధికార టీఆర్ఎస్కే పట్టంకట్టారు. పరిషత్ ఎన్ని కల్లో ఆ పార్టీకి ఏకపక్ష విజయాన్ని అందించారు. రాష్ట్రంలో 32 జిల్లాల్లోని 5,817 ఎంపీటీసీ, 538 జెడ్పీ టీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 158 ఎంపీటీసీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఏకగ్రీవమైన వాటితో కలిపి మొత్తం 3,556 ఎంపీటీసీ, 451 జెడ్పీటీసీ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో మొదటిసారిగా 32 జెడ్పీల్లోనూ గులాబీ జెండా ఎగరనుంది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రజలకు చేరవేడయంలో కీలకంగా వ్యవహరించే జెడ్పీలు, ఎంపీపీల్లో ఏకపక్ష విజయం టీఆర్ఎస్కు పెద్ద ఊపునిచ్చింది. లోక్సభ ఎన్నికల మిశ్రమ ఫలితాలతో ఆ పార్టీలో నెలకొన్ని ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి.. తాజాగా వచ్చిన పరి షత్ ఫలితాలతో తొలగిపోయింది. తెలంగాణ ప్రజ లు లోక్సభ ఎన్నికలను జాతీయ రాజకీ యాల దృష్టి లో చూశారని, రాష్ట్రంలో టీఆర్ఎస్కు తిరుగులేదని చెప్పేందుకు పరిషత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పార్టీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఎన్నికల రోజునే చైర్పర్సన్లపై నిర్ణయం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అభ్యర్థు ల ను టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించనుంది. కేసీఆర్ రెండు జిల్లాల చైర్పర్సన్ అభ్యర్థులను ప్రక టించారు. మిగిలిన అభ్యర్థుల ఎంపికపైనా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు అన్ని జెడ్పీల చైర్ పర్సన్ అభ్యర్థుల జాబితాను మంత్రులకు, ఇన్ చార్జిలకు పంపించనున్నారు. పోటీని నివారించేం దు కు అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ పార్టీ ఎన్నికల ఇన్చార్జిలకు స్పష్టంచేశారు. టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులందరినీ హైదరాబాద్కు తరలిం చేందుకు ఏర్పాట్లు పూర్త య్యాయి. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక రోజున వారిని మళ్లీ జిల్లాలకు పంపించేలా టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం అమలు చేస్తోంది. ఏయే జెడ్పీలకు ఎవరెవరు? ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరును కేసీఆర్ ఇదివరకే ప్రక టించారు. లక్ష్మి ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా ఎన్నిక య్యారు. మంచిర్యాల చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భార్య భాగ్యలక్ష్మి పేరు దాదాపుగా ఖరారైంది. ఆమె కోటపల్లి జెడ్పీటీసీగా గెలిచారు. నిర్మల్ చైర్పర్సన్గా నిర్మల్రూరల్ జెడ్పీటీసీ కొరి పెల్లి విజయలక్ష్మికి అవకాశం ఇవ్వా లని టీఆర్ఎస్ భావిస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్జాదవ్, నార్నూర్ జెడ్పీటీసీ జనార్దన్ రాథోడ్ పేర్లను పరిశీలిస్తోంది. నిజామాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా దాదాన్నగారి విఠల్రావును టీఆర్ఎస్ ఖరారు చేసింది. విఠల్రావు మాక్లూర్ నుంచి ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా ఎన్నిక య్యారు. ఉమ్మడి నిజామాబాద్ జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్రాజు సతీమణి దఫేదార్ శోభకు కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇవ్వనున్నారు. ఆమె నిజాంసాగర్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. కరీంనగర్ జెడ్పీ చైర్ప ర్స న్గా ఇల్లంతకుంట జెడ్పీటీసీ కనుమల విజయ, జగి త్యాల చైర్పర్సన్గా బుగ్గారం జెడ్పీటీసీ బి. రాజేం దర్, సిరిసిల్ల చైర్పర్సన్గా కోనారావుపేట జెడ్పీటీసీ ఎన్.అరుణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న పట్నం సునీతారెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం ఈసారి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. సునీతారెడ్డి కోట్పల్లి జెడ్పీటీసీ సభ్యు రాలిగా గెలిచారు. రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. ఆమె మహేశ్వరం జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచారు. మేడ్చల్ జెడ్పీ చైర్పర్సన్ పదవి కోసం మలిపెద్ది శరత్చంద్రారెడ్డి పేరును టీఆర్ఎస్ పరిశీలిస్తోంది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్రెడ్డి కుమారుడైన శరత్చంద్రారెడ్డి ఘట్కేసర్ జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్గా బండ నరేం దర్రెడ్డి అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఆయన నార్కట్పల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. యాదాద్రి భువనగిరి చైర్మన్ పదవికి మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి కుమారుడు సందీప్రెడ్డి, సూర్యా పేట చైర్పర్సన్గా గుజ్జ దీపిక పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. సందీప్రెడ్డి బొమ్మల రామారం, దీపిక తుంగతుర్తి జెడ్పీటీసీలుగా గెలిచారు. ఖమ్మం చైర్మన్ పదవి లింగాల కమల్రాజ్, కొత్తగూడెం జెడ్పీ చైర్పర్సన్గా కోరం కనుకయ్యలకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయించింది. కమల్రాజ్ మధిర జెడ్పీటీసీగా, కనుకయ్య టేకులపల్లి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. సిద్దిపేట జెడ్పీ చైర్పర్సన్గా వేలేటి రోజా, మెదక్ చైర్పర్సన్గా హేమలత, సంగారెడ్డి చైర్పర్సన్గా ఎస్.మంజుశ్రీ పేర్లను టీఆర్ఎస్ పరిశీలిస్తోంది. రోజా చిన్నకోడూరు, హేమలత మనోహరాబాద్, మంజుశ్రీ పుల్కల్ జెడ్పీటీసీలుగా గెలిచారు. వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్పర్సన్గా మారపెల్లి సుధీకుమార్, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్గా గండ్ర జ్యోతి, ములుగు జెడ్పీ చైర్పర్సన్గా కుసుమ జగదీశ్ పేర్లను టీఆర్ఎస్ దాదాపుగా ఖరారు చేసింది. సుధీర్కుమార్ ఎల్కతుర్తి, జ్యోతి శాయం పేట, జగదీశ్ ఏటూరునాగారం జెడ్పీటీసీలుగా గెలి చారు. మహబూబాబాద్ చైర్పర్సన్గా జి.సుచిత్ర, భూపాలపల్లి చైర్పర్సన్గా కాటారం జెడ్పీటీసీ జక్కు శ్రీహర్షిని, జనగామ చైర్పర్సన్గా చిల్పూరు జెడ్పీ టీసీ ఎస్.సంపత్రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్గా స్వర్ణ సుధా కర్ పేరు ఖరారైంది. నాగర్కర్నూల్ చైర్పర్సన్గా కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్, గద్వాల జెడ్పీ చైర్పర్స న్గా మానవపాడు జెడ్పీటీసీ సరిత, వనపర్తి జెడ్పీ చైర్పర్సన్గా వనపర్తి జెడ్పీటీసీ లోక్నాథరెడ్డి, నారా యణపేట జెడ్పీ చైర్పర్సన్గా నారాయణపేట జెడ్పీ టీసీ అంజలి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. -
పరిషత్ ఫలితాలు నేడే
-
వారంలోనే పరిషత్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్.. మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలో ఈ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో వారంలో రోజుల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. వెంటనే జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలు సైతం పూర్తి కానున్నాయి. జూన్ 10లోపే ఫలితాల వెల్లడి, పరోక్ష ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే ఈ విషయంలో అధికారిక తేదీలు ప్రకటించనుంది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14తో ముగిశాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈనెల 27న నిర్వహించాలని ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించింది. ఆర్డినెన్స్లో పలు మార్పులు.. ఎన్నికల సంఘం ప్రతిపాదనల మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ‘మొదటి సమావేశం’ అనే పదానికి బదులుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ‘ప్రత్యేక సమావేశం’అనే మార్పు చేసింది. పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న మొదటి సమావేశం అంటే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిచిన వారు మొదటిసారి సమావేశమై ఎంపీపీ, జెడ్పీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాలి. వెంటనే కొత్తగా ఎన్ని కైన వారి పదవీకాలం మొదలవుతుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం జూలై 4 వరకు ఉన్నందున ఆ తర్వాతే మొదటి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి సమావేశం అనే పదాన్ని ‘ప్రత్యేక సమావేశం’ అని చట్టంలో సవరణ చేయడంతో జూలై 4 వరకు వేచి చూడకుండా ఆలోపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను వెల్లడించవచ్చు. ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికలను వెంటనే చేపట్టొచ్చు. చట్టంలో సవరణ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం జూలై 3 వరకు ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాలు బాధ్యతలు చేప ట్టాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రస్తుత ఉమ్మడి జిల్లా ల్లోని 8 జెడ్పీపీల పాలకవర్గాల పదవీకాలం జూలై 4 తో ముగుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ఆగస్టు 6 వరకు ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పరిధిలో ప్రస్తుతం ఖమ్మం, కొత్తగూ డెం జెడ్పీలు ఏర్పాటవుతున్నాయి. ఈ జెడ్పీపీల పదవీకాలం ఆగస్టు 7 నుంచి మొదలుకానుంది. జూలై 3న లెక్కింపు... జిల్లాపరిషత్, మండల పరిషత్ ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4న ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు పరోక్ష ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలకు జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలకు మధ్య ఎక్కువ రోజులు ఉండటం వల్ల పరోక్ష ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారని, ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును జూలై 3న చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. అయితే పాఠశాలలు, విద్యా సంస్థలలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. జూన్ మొదటివారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఓట్ల లెక్కింపును వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును, పరోక్ష ఎన్నికలను త్వరగా పూర్తి చేసేలా ఎన్నికల సంఘం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదననలు పంపింది. -
క్యాంపులు పెడితే వేటు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ పదవులకు నిర్వహించే ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పరోక్ష, ప్రత్యక్ష పద్ధతుల్లో ఎలాంటి క్యాంప్లు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. ఈ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నికల నిర్వహణకు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని, స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి అశోక్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ పదవులకు జరిగిన ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు.. డబ్బు, అంగబలమున్న అభ్యర్థులు ఇళ్లు, రిసార్ట్లలో క్యాంప్లు నిర్వహించి గెలిచిన ప్రజాప్రతినిధులను సుదీర్ఘకాలం పాటు ఎక్కడో ఉంచడం తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న పార్టీకి అదనపు అవకాశాలుండటంతో ప్రభుత్వ యంత్రాంగా న్ని ఉపయోగించి ఏదోక రూపంలో ప్రభావితం చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని పేర్కొంది. ఇలాంటి పద్ధతుల కారణంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రలోభాలకు లొంగి, విప్లను ధిక్కరించి ఓటేసే పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. ప్రలోభాల నివారణకు.. జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ప్రత్యేక సెక్షన్ను ఎస్ఈసీ చేర్చింది. పరిషత్ (జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు), పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీ)ని పదవులకు పరోక్ష పద్ధతుల్లో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఈ మేరకు సవరించింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించే వారిపై ఆయా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అంశాన్ని చేరుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల కోడ్ స్థానిక ఫలితాల వెల్లడి నుంచి మొదలై పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీల్లో ఆయా పదవులకు ఎన్నికలు ముగిసే వరకు అమల్లో ఉం టుందని స్పష్టం చేసింది. జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు (ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతుల్లో) కోరుకునే ఏ రాజకీయపార్టీకి చెందినవారైనా ప్రజాప్రాతినిథ్య చట్టంలో పొందుపరిచిన లంచం ఇతరత్రా రూపాల్లోని ప్రలోభాలకు పాల్పడొద్దని పేర్కొంది. పార్టీలు ఇచ్చిన విప్ను ధిక్కరించి ప్రజాప్రతినిధులు ఓటేసేలా ఒత్తిళ్లు తేవొద్దని తెలిపింది. విప్ను ధిక్కరిస్తే పదవి కానీ ప్రోత్సాహకం కానీ ఇస్తామన్న ప్రలోభాలకు పాల్పడొద్దని హెచ్చరించింది. అధికార పార్టీ లేదా ప్రభుత్వ ప్రతినిధులు తమ అధికార హోదా లేదా పదవులను ఉపయోగించి కాంట్రాక్ట్ల కల్పన, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, లైసెన్సులు, సర్టిఫికెట్లు అందజేయడం, పెండింగ్కేసుల ఎత్తివేత వంటి వాటికి పాల్పడొద్దని స్పష్టంచేసింది. -
‘పరిషత్’పై పరేషాన్!
ప్రాదేశిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థుల్లో గుబులుమొదలైంది. తాజాగా వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాలు కొన్ని పార్టీల్లో ఆశలు పెంచగా, మరికొన్నింటిలో మాత్రం నిరాశను మిగిల్చాయి. మొన్నటి అసెంబ్లీ నుంచి లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఓటరు నాడీ మారింది. ఆయా శాసనసభ సెగ్మెంట్ల పరిధిలో కొన్ని పార్టీలు గణనీయంగా ఓటర్ల సంఖ్యను పెంచుకోగా.. ఇంకొన్ని స్థానాల్లో అదే స్థాయిలో కోల్పోయాయి.ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ పార్టీల నేతల్లో కలవరం పుట్టిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత మూడు విడతలుగా జరిగిన ప్రాదేశిక పోరులో ఓటర్లు ఎటు వైపు జై కొట్టారో అంచనా వేయడంలో నేతలు తలమునకలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా తీర్పు ఉండనుందా.. లేదంటే లోక్సభ తరహాలో ఓట్ల బదలాయింపు జరిగిందా? అనే అంశాలపై విస్తృత స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. దీని ద్వారా జెడ్పీ చైర్పర్సన్ స్థానంపై ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాలో 248 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ స్థానాలకు మూడు దశల్లో ఈ నెల 6, 10, 14 తేదీల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం జూలై మొదటి వారంలో జరిగే ఓట్ల లెక్కింపుతో తేలనుంది. పోలింగ్ అనంతరం అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు వేసుకొని తమదే గెలుపు అని ధీమాగా ఉన్నారు. అభ్యర్థులు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడని వరకు విజయంపై ఎవరికి వారు భరోసాగా ఉన్నారు. అయితే, లోక్సభ ఫలితాల వెల్లడితో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ రేసుల్లో ఉన్న ఆశావహులు మళ్లీ తమ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి.. తమకు అధ్యక్ష యోగం ఉందా లేదా అని పునః సమీక్షలోపడ్డారు. ఆందోళనలో గులాబీ నేతలు అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీ గెలుపొందినప్పటికీ ఓట్ల శాతం భారీగా తగ్గింది. టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్రెడ్డి చేవెళ్ల స్థానం నుంచి స్వల్ప ఓట్లతో నెగ్గారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన ఐదు నెలల్లోనే జిల్లాలో టీఆర్ఎస్కు అమాంతంగా ఓట్ల సంఖ్య పడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అంతఃర్మథనంలో పడ్డాయి. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా ఓటర్లకు టీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత వెల్లడైంది. ఇదే వ్యతిరేకత పరిషత్ ఎన్నికల్లో ఉందా లేదా అనే అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. లోక్సభ ఫలితాల్లో టీఆర్ఎస్ భారీగా ఓట్లను కోల్పోయింది. వీటి పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లోనూ ఓటర్లు ఇదే తీర్పునకు కట్టుబడి ఉంటారా.. లేదా అని టీఆర్ఎస్ శ్రేణులు లెక్కలు వేస్తున్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే అనుకున్న స్థాయిలో పరిషత్లు దక్కకపోవచ్చన్న ఆందోళన నెలకొంది. హస్తంలో కొంత ఉత్సాహం అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత బలపడినట్లు తెలుస్తోంది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్కు మెజార్టీ రావడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇబ్రహీంపట్నంలో 8 వేల పైచిలుకు, చేవెళ్లలో ఇంచుమించు 16 వేల ఆధిక్యం రావడంతో స్థానిక సంస్థల ఫలితాలపై ఈ పార్టీలో అంచనాలు పెరిగాయి. లోక్సభ మాదిరిగా ట్రెండ్ కొనసాగితే జెడ్పీ స్థానం తమదేనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే, షాద్నగర్, కల్వకుర్తిలో మాత్రం పరిస్థితి కొంతమేర దిగిజారిపోయింది. కమలదళంలో నూతనోత్తేజం లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కొండంత బలాన్నిచ్చాయి. ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓట్ల సంఖ్య పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలపై ఆ పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. కనీసం నాలుగు జెడ్పీటీసీల్లోనైనా నెగ్గుతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్లో గణనీయంగా ఓటు బ్యాంకును పెంచుకుంది. ముఖ్యంగా షాద్నగర్ సెగ్మెంట్లో అసెంబ్లీతో పోల్చితే ఏకంగా 35 వేల ఓట్లు అధికంగా ఈ పార్టీకి దక్కడం విశేషం. అయితే, మరోపక్క కల్వకుర్తిలో గణనీయంగా ఓట్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 62 శాతం ఓట్లను పోగొట్టుకుంది. జూలై మొదటి వారంలో ఫలితాలు! మండల, జిల్లా పరిషత్ ఓట్ల లెక్కింపు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న జరగాల్సి ఉంది. రాజకీయ పార్టీల నాయకుల అభ్యర్థన మేరకు లెక్కింపును వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జూలై మొదటి వారంలో పరిషత్ ఓట్ల లెక్కిపు నిర్వహించనున్నట్లు తెలిసింది. కానీ తేదీని మాత్రం అ«ధికారికంగా ప్రకటించలేదు. అయితే, లెక్కింపును వాయిదా వేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. -
ముగిసిన తెలంగాణ పరిషత్ ఎన్నికల పోరు
-
ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ పోలింగ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతొంది. ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉదయమే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో తొలి రెండుగంటల్లో 19 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో భాగంగా 27 జిల్లాల్లో 161 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 741మంది పోటీ చేస్తున్నారు. ఇక 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 5,723మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. -
రెండో విడత పరిషత్ ఎన్నికలు: 80 శాతం పోలింగ్ నమోదు
-
రెండోదశ పరిషత్ పోరుకు ముగిసిన ప్రచారం
-
తప్పుల తడకగా బ్యాలెట్ పేపర్లు
చౌటుప్పల్/సంస్థాన్నారాయణపురం : మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్లో ఉమ్మడి నల్లగొండజిల్లాలో పలుచోట్ల బ్యాలెట్ పేపర్లు తప్పుల తడకగా వచ్చాయి. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో 29వ పోలింగ్ బూత్లో అదే మండలం లోని నేలపట్ల గ్రామానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. ఈ క్రమంలో 13మంది ఓటర్లు ఇవే బ్యాలెట్ పేపర్లతో ఓట్లు వేశారు. తర్వాత తప్పును కొందరు ఓటర్లు గుర్తించి అధికారులకు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో అధికారు లు స్పందించి బ్యాలెట్ పేపర్లను ఆ గ్రామానికి పంపించారు. అనంతరం ఆ 13 మందిని తిరిగి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే సంస్థాన్నారాయణపురం మండలం కంకణాలగూడెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని శేరిగూడెంలో 12వ పోలింగ్ కేంద్రానికి జనగామ ఎంపీటీసీ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఇది గమనించని అధికారులు పోలింగ్ నిర్వహించారు. అప్పటికే 130 ఓట్లు పోలయ్యాయి. కంకణాలగూడెం ఎంపీటీసీ పరిధిలోని కొత్తగూడెంలో 13వ పోలింగ్ కేంద్రానికి కూడా జనగామ ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఇక్కడ 6 బ్యాలెట్ పేపర్లు ఉపయోగించగా 2 బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేశారు. నలుగురు ఓటర్లను ఓటు వేయకుండా అక్కడికే ఆపగా ఇద్దరు మాత్రం వాటిపైనే ఓటు వేశారు. అనంతరం ఆ ఇద్దరిని పిలిపించి సరైన బ్యాలెట్ పేప ర్లతో ఓటు వేయించారు. నల్లగొండ జిల్లా దేవరకొం డ మండల పరిధిలోని తెలుగుపల్లిలో కొన్ని బ్యాలెట్ పేపర్లలో కాంగ్రెస్ పార్టీ గుర్తు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసు కున్న అధికారులు బ్యాలెట్ పత్రాలను మార్పించడంతో సమస్య పరిష్కారమైంది. -
ఎన్నికల పోలింగ్కు వడదెబ్బ ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్పై వడదెబ్బ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎండ ప్రభావంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 44డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 7 నుంచి 9 వరకు ఓటర్లు బారులు తీరినా, 10 తర్వాత పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. ఎండ దెబ్బకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో అత్యంత కీలకంగా మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ విడతలో భాగంగా 195 జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది, 2,096 ఎంపీటీసీ స్థానాల్లో 7,072 మంది (2 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ ఏకగ్రీవాలు మినహాయించి)అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 వరకు (5 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకే) సాగనుంది. నాగరకర్నూల్ జిల్లా గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానంలో ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయడంతో పాటు, ఆ స్థానానికి విడిగా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎన్నిక నిర్వహించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలుండగా.. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు జరగడం లేదు. దీంతో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుంటాయి. -
పరిషత్ పోరు: తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
పరిషత్... ప్రతిష్టాత్మకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ పోరు రసవత్తరంగా సాగుతోంది. స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలు కీలకంగా మారడంతో గ్రామాల్లో ప్రలోభాలు కూడా భారీగా ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో రూ. 2 వేల వరకు నేతలు పంచుతున్నారు. రాష్ట్రంలో 838 జెడ్పీటీసీ స్థానాలకు, 5,817 ఎంపీటీసీ స్థానాలకుగాను ఇప్పటివరకు మూడు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమైతే వాటన్నింటినీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే 132 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైతే అందులో 129 స్థానాలను టీఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. మొత్తం మూడు దశల్లో పరిషత్ ఎన్నికలు జరగనుండగా తొలిదశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నెల 10న రెండో దశ, 14న మూడోదశ ఎన్నికలు ఉన్నాయి. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలే అంతా... జిల్లాలు, మండలాల పునర్విభజన అనంతరం తొలిసారి పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32 జెడ్పీలు, 838 ఎంపీపీలు ఉన్నాయి. అన్నింట్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పోటీ జరుగుతున్న ప్రతి స్థానంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా ప్రయత్నించాలని అధిష్టానం పార్టీ ఎమ్మెల్యే లను ఆదేశించింది. టీఆర్ఎస్లో పరిషత్ ఎన్నికల గెలుపు బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యే లకు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలకు అప్పగిం చారు. జెడ్పీ, ఎంపీపీల కైవసం లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. అభ్యర్థుల ఎంపికలో కొన్నిచోట్ల అసంతృప్తులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్గా మారాయి. సీనియర్లకు, విధేయులకు అవకాశం ఇవ్వడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అన్ని స్థానాల్లో గెలుపు లక్ష్యంగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ‘గులాబీ’ని నిలువరించాలని... అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో డీలా పడిన కాంగ్రెస్... గ్రామ స్థాయిలో పార్టీ పునాదులను పటిష్ట పరుచుకోవాలని లక్ష్యం నిర్దేశించుకుంది. పరిషత్ ఎన్నికలతో ఈ పని పూర్తి చేయాలని భావిస్తోంది. టీఆర్ఎస్ ఏకగ్రీవంగా ఏ స్థానంలోనూ విజయం సాధించకుండా వ్యవహరించాలని అన్ని అసెంబ్లీ స్థానాల కాంగ్రెస్ ఇన్చార్జీలకు పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యూహం కొంతవరకు ఫలించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు తగ్గాయని స్థానికంగా కాంగ్రెస్ భావిస్తోంది. 20కిపైగా జెడ్పీలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని జెడ్పీ స్థానాలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే వ్యూహంతో అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జీలు పని చేస్తున్నారు. భవిష్యత్పై బీజేపీ గంపెడాశలు... అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత డీలా పడిన బీజేపీకి లోక్సభ ఎన్నికలతో కొంత ఊపు వచ్చింది. ఐదారు లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్తో హోరాహోరీ తలపడినట్లు బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదే ఊపుతో పరిషత్ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో కమలదళం పోటీ చేస్తోంది. ప్రతి జెడ్పీలోనూ, ప్రతి ఎంపీపీలనూ ప్రాతినిధ్యం లక్ష్యంగా బీజేపీ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎక్కువ స్థానాల్లో గెలుపు ఉమ్మడి జిల్లాలవారీగా ఇన్చార్జీలను నియమించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా ఉండాలని భావిస్తున్న బీజేపీ... గ్రామాల్లో కీలకమైన ఎంపీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. మొదటిసారి బరిలో టీజేఎస్... కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి... పరిషత్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. రాజకీయ పార్టీలకు క్షేత్రస్థాయిలో బలం పెంచే కీలకమైన ఎన్నికల్లో టీజేఎస్ మొదటిసారి పరీక్షను ఎదుర్కొంటోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిస్తోంది. టీజేఎస్ అధినేత ఎం. కోదండరాం స్వయంగా పరిషత్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. పరిషత్ ఎన్నికల్లో నమోదయ్యే ఓటింగ్ శాతంపై టీజేఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వామపక్షాలు వేర్వేరుగా... అసెంబ్లీలో విడిగా పోటీ చేసి ప్రతికూల ఫలితాలను రుచి చూసిన సీపీఎం, సీపీఐ పార్టీలు... లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. పరిషత్ ఎన్నికల్లో మాత్రం మళ్లీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో బలం చాటేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వాపక్ష పార్టీలు పోటీ చేయని కొన్ని స్థానాల్లో స్థానిక నాయకత్వం నిర్ణయం మేరకు ఇతర ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి. పరిమిత స్థానాల్లో టీడీపీ పోటీ... లోక్సభ ఎన్నికల పోటీ విషయంలో చేతులెత్తేసిన టీడీపీ... పరిషత్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తోంది. స్థానికంగా నాయకులు ఉన్న కొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం పరిషత్ ఎన్నికలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. -
పరిషత్ పోరు: తొలిదశ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
-
నాలుక్కరుచుకున్న ఉమా మాధవరెడ్డి..!
-
నాలుక్కరుచుకున్న ఉమా మాధవరెడ్డి..!
సాక్షి, భువనగిరి : సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి చర్యతో టీఆర్ఎస్ నాయకులు, ఆమె తనయుడు అవాక్కయ్యారు. బొమ్మల రామారం జెడ్సీటీసీ అభ్యర్థిగా ఆమె కుమారుడు ఎలిమినేటి సందీప్రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తరపున ప్రచారం నిర్వహించిన ఉమా పొరపాటుగా మాట్లాడి నాలుక్కచురుకున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరి అక్కడున్న వారందర్నీ షాక్కు గురిచేశారు. పక్కనే ఉన్న సందీప్రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నాయకులు కారు గుర్తు అని సూచించడంతో తేరుకున్న ఆమె.. కారు గుర్తుకు ఓటేసి సందీప్రెడ్డిని భారీ మెజారితో గెలిపించాలని కోరారు. కాగా, తెలుగుదేశం పార్టీని వీడి గులాబీ గూటికి చేరినా ఉమా మాధవరెడ్డి పాత పార్టీని మరచిపోనట్టున్నారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. (చదవండి : టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా) -
ముందస్తుగానే ‘పరిషత్’ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ ముందస్తు వ్యూహంతో వెళుతోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్పర్సన్ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా ఆరుగురు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఖరారు చేశారు. ఆదిలాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల అభ్యర్థులను బుధవారం అధి కారికంగా ప్రకటించారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థుల పేర్లలోనూ ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు మిగిలిన జిల్లాల చైర్మన్ అభ్యర్థులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. పరిషత్ చైర్మన్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. చైర్మన్ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆయా మండలాలు, జిల్లాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ధీమా లభిస్తుందని, పార్టీ శ్రేణులకు కూడా స్పష్టత వస్తుందని, తద్వారా ఎన్నికలను దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ కేడర్లో విశ్వాసం కల్పించిన దిశలోనే ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించామని, తమకు అభ్య ర్థులు లేరనే అధికార పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా, మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఈ మేరకు ఎంపీపీ అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాలను డీసీసీలకు కట్టబెట్టింది. టీపీసీసీ ఖరారు చేసిన జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు.. - ఆదిలాబాద్: చారులత రాథోడ్ - మహబూబాబాద్: ఇస్లావత్ పార్వతి - మహబూబ్నగర్: జె.దుష్యంత్రెడ్డి - మంచిర్యాల: మద్ది రమాదేవి - నల్లగొండ: కోమటిరెడ్డి మోహన్రెడ్డి - నాగర్కర్నూలు: అనూరాధ వంశీకృష్ణ ఏకాభిప్రాయం వచ్చిన అభ్యర్థులు.. - సూర్యాపేట: పటేల్ లావణ్య - యాదాద్రి భువనగిరి: కుడుదుల నగేశ్ -
పంతం నెగ్గించుకున్న తీగల కృష్ణారెడ్డి
టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిపై సందిగ్ధత వీడింది. మొన్నటి వరకు జెడ్పీ పీఠం కోసం పోటీపడిన ముగ్గురు నేతల కుటుంబ సభ్యుల్లో ఒకరికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైర్మన్ గిరిపై మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసింది. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్కు తెరపడినట్లయింది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీరాజ్ కొత్త చట్టం సంస్కరణల నేపథ్యంలో చైర్పర్సన్ కీలకంగా మారనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ పదవికి తీవ్ర పోటీ ఏర్పడింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీ తరఫున ముగ్గురు నేతలు తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కోరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కూతురు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కోడలు పదవిని ఆశించారు. తన కూతురు పోటీ విషయంలో ప్రకాశ్గౌడ్ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. దీంతో తమకు వద్దని అధిష్టానానికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే కిషన్రెడ్డి కోడలు మంచాల నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. తొలిదశ ఎన్నికల జాబితాలో ఉన్న ఆ మండలంలో అప్పటికే నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అవకాశం చేజారింది. దీంతో అనితారెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. అంతేగాక అనితారెడ్డి మామ కృష్ణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అంతకుముందు అనితారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్కేపురం డివిజన్ నుంచి కార్పొరేటర్గా బరిలోకి దిగి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో తమకు ఎలాగైనా చైర్పర్సన్గా అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. ఫలితంగా చైర్పర్సన్ పదవి కోపం అనితారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు మహేశ్వరం స్థానికుల్లో ఒకరికి లేదంటే.. మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వారికే జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని కోరారు. దీనికితోడు టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైన స్థానిక ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి కూడా తమ వర్గానికి జెడ్పీటీసీ టికెట్ కావాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో అనితారెడ్డి గెలుపుకోసం స్థానిక నాయకులు, సబితమ్మ వర్గం ఏ స్థాయిలో కృషిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుంచి రేసులో ఇద్దరు.. జెడ్పీ చైరపర్సన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్రెడ్డి సతీమణి నిత్యారెడ్డి ఒకరుకాగా.. తుక్కుగూడ మాజీ సర్పంచ్ కొమిరెడ్డి నర్సింహారెడ్డి కోడలు శాలినీరెడ్డి మరొకరు. మంచాలలో నిత్యారెడ్డి పోటీచేస్తుండగా.. శాలినీరెడ్డి మహేశ్వరం నుంచి బరిలో నిలిచారు. అయితే ప్రస్తుతానికి వీరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే అభ్యర్థి పేరును ప్రకటిస్తే గ్రూపు రాజకీయాలు మొదలయ్యే ప్రమాదం ఉందని పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే నేతలు, కార్యకర్తల వలసలతో కుదేలవుతున్న జిల్లా పార్టీ.. గ్రూపు తగాదాలైతే ఇతర పార్టీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో జెడ్పీటీసీ స్థానాలు దక్కితే.. ఆ తర్వాత చైర్పర్సన్ అభ్యర్థి పేరును ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో అనిశ్చితి.. మరోపక్క బీజేపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఆ పార్టీలో చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నవారు పెద్దగా లేనట్లు తెలుస్తోంది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపుపై ప్రధానంగా దృష్టిసారించింది. తొలి, రెండు దశల్లో ఎన్నికలు జరిగే మండలాల్లో ఆ స్థాయి అభ్యర్థులు లేరని పార్టీలో చర్చజరుగుతోంది. ఇక ఆశలన్నీ మూడో దశ ఎన్నికలు జరుగుతున్న మండలాలపైనే ఉన్నాయి. -
ప్రతిష్టాత్మకం..పరిషత్ ఎన్నికలు
బెల్లంపల్లి : పరిషత్ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ , గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే ఈఎన్నికల్లోనూ సత్తాచాటాలని టీఆర్ఎస్ తహతహలాడుతుండగా కనీసం పరిషత్ ఎన్నికల్లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలనే కాంక్షతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఆ రెండు పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా పోరాడుతున్నాయి. అందులో భాగంగానే సమర్థులైన అభ్యర్థులను పోటీలోదింపి ప్రచార పర్వం సాగిస్తున్నాయి. అయితే మారిన పరిణామాలతో ప్రతీచోట ఎన్నిక ఏ ఒక్కరాజకీయ పార్టీకి అంత ఈజీగా లేకపోవడంతో చెమటోడ్చాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా ఏకపక్షంగా ఏ పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు కానరావడం లేదు. ఈ తీరు ఆయాపక్షాల అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. పోటీలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి. ఎన్నికల్లో గెలుపు సాధించడమే ప్రధాన కర్తవ్యంగా రెండు ప్రధాన పక్షాలు ముందుకు సాగుతుండటంతో ఓటర్ల ఆదరణ ఎవరికి ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. అసెంబ్లీ నియోజకవర్గంలో... బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు తొలిదఫాలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. నియోజకవర్గంలోని 7 జెడ్పీటీసీ స్థానాలకు ఏకంగా 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తాండూర్, కన్నెపల్లి జెడ్పీటీసీ సా ్థనాల్లో ఆరుగురు అభ్యర్థులు, కాసిపేటలో నలుగురు అభ్యర్థులు, నెన్నెల , భీమిని, బెల్లంపల్లి మండలాల్లో ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీకి సిద్ధమయ్యారు. వేమనపల్లి మండలంలో మా త్రం ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోంది. ఏకగ్రీవానికి ‘నై’ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వగా పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఆ పాచిక ఎక్కడా సరిగా పారలేదు. ప్రతీచోట పోటీ చేయడానికే ఔత్సాహిక అభ్యర్థులు మరీ ముఖ్యంగా యువకులు ఆసక్తి చూపించారు. రిజర్వేషన్ ప్రాతిపదికన మహిళలు కూడా అధికసంఖ్యలోనే పోటీలో ఉన్నారు. ఓ ప్రధానరాజకీయ పార్టీ అక్కడక్కడ తమ అభ్యర్థులు ఏకగ్రీవం కావడానికి ఆదిలో పావులు కదిపినా ప్రయోజనం లేకుండా పోయింది. అన్నిచోట్ల కూడా పోటీకీ అభ్యర్థులు సిద్ధపడటం, ప్రలోభాలకు ఆకర్షితులు కాకపోవడంతో పోటీ అనివార్యమైంది. కాగా ఎన్నికల ప్రచారపర్వం మరో రెండు, మూడురోజుల్లో ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంపీటీసీ బరిలో 166 మంది 47 ఎంపీటీసీ స్థానాల్లో 166 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాసిపేట మండలంలో ఉన్న 9 స్థానాల్లో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా తాండూర్లోని 9 స్థానాలకు 39 మంది, బెల్లంపల్లిలోని 8 స్థానాలకు 26 మంది, నెన్నెలలో 7స్థానాలకు 19 మంది. కన్నెపల్లిలో 5 స్థానాలకు 18 మంది, వేమనపల్లిలో 5 స్థానాలకు 14 మంది పోటీలో ఉన్నారు. భీమిని మండలంలో 4 స్థానాలు ఉండగా 8 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చిన్నగుడిపేట ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. ఇక్కడ ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఆఖరిరోజు నలుగురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అయితే సదరు అభ్యర్థి ఎన్నికను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ ఒక్కస్థానంలో మినహా ఇతర అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కనిపిస్తోంది. -
తొలి విడత ప్రచారం షురూ!
సాక్షి, హైదరాబాద్: తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురణతో రాజకీయ పార్టీలు, స్వతంత్రుల గుర్తుల వారీగా బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను రిటర్నింగ్ అధికారులు ఖరారు చేసి, అభ్యర్థుల జాబితాలు ప్రకటించారు. వచ్చేనెల 6న 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలుండడంతో రాజకీయ పార్టీల గుర్తులతో బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్నకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు లేదా నాలుగు రోజుల్లోనే వీటి ముద్రణ పూర్తిచేసి, పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. ఈ విడత ఎన్నికల ప్రచారం కూడా ఆదివారం సాయంత్రం నుంచే మొదలైంది. నేడు రెండో విడత నామినేషన్ల పరిశీలన రెండోదశ పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సోమవారం సాయంత్రం 5 వరకు నామినేషన్లను పరిశీలించి, 5 గంటల తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా సిద్ధం చేస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా అప్పీలు చేసుకోవాలి. మే1న సాయంత్రం 5లో గా వాటిని పరిష్కరిస్తారు. 2న నామినేషన్ల ఉపసం హరణ గడువు ముగిశాక, అదేరోజుసాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 10న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం వరకు 1,913 ఎంపీటీసీ స్థానాలకు 4, 652, 180 జెడ్పీటీసీ స్థానాలకు 660 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోదశకు నామినేషన్ల ప్రక్రియ ఆఖరు రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
‘పరిషత్’ ప్రచారానికి వేళాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారానికి వేళైంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత జిల్లా, మండల స్థాయిల్లో ఎన్నికల ప్రచారంతో వేడి పుట్టించేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలతో, ఆ పార్టీలు అధికారికంగా పోటీకి నిలిపే అభ్యర్థులతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 6న తొలి విడత ఎన్నికల నేపథ్యంలో, ఆ విడతలో బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటించనున్నారు. అలాగే గుర్తులు కూడా కేటాయిస్తారు. తొలి విడత ప్రచారం మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తొలి విడత ప్రచారం నేపథ్యంలో ఎస్ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా జిల్లా ఎన్నికల అధికారులు, జనరల్ అబ్జర్వర్ల విచారణ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై ప్రకటన చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే... అభ్యర్థులను బెదిరించినా, ఎత్తుకెళ్లినా... ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ దొరికినా ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ అక్రమ పద్ధతుల్లో గెలిచిన వారిని పదవి నుంచి తొలగించడంతోపాటు ఆరేళ్లు ఎలాంటి పదవులకు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార, చర్చా వేదికలుగా ఉపయోగించడం, ఇతరులను రెచ్చగొట్టేలా మాట్లాడితే చర్యలు తీసుకునే అధికారాన్ని స్థానిక అధికారులకు కల్పించారు. అభ్యర్థుల తుది జాబితాను తెలుగు అక్షరమాల క్రమంలో రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో తెలుగు అక్షరమాల ప్రకారం మొదటి వ్యక్తికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన గుర్తుల్లో మొదటి గుర్తును, రెండో అభ్యర్థికి రెండో గుర్తును కేటాయిస్తారు. ఒకవేళ బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటే నామినేషన్ సంఖ్య ఆధారంగా గుర్తులను కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వేలం వేస్తే వేటే... ఏకగ్రీవాల కోసం వేలం వేసి ఓటర్లను కొనుగోలు చేయడం, ప్రలోభాలకు గురిచేయడం, అభివృద్ధి సాధన కోసం అంటూ ఆయా పోస్టులను వేలం వేస్తే జైలు, జరిమానా, అనర్హత వేటు వేసే అధికారం ఎస్ఈసీకి ఉంది. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించకుండా విచారణ చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఎస్ఈసీ పేర్కొంది. గతంలో ఏకగ్రీవాలను రిటర్నింగ్ అధికారులే ప్రకటించేవారు. కానీ ఈ సారి ఏకగ్రీవమైనట్లుగా దరఖాస్తు చేసుకోవాలని, దాన్ని జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల అధికారి లేదా జనరల్ పరిశీలకులు విచారణ చేసి, ఆ తర్వాత జిల్లా కలెక్టరే ప్రకటిస్తారంది. విచారణలో అనైతిక వ్యవహారాలు, డబ్బు ప్రభావం వంటివి బయటకు వస్తే... రద్దు చేసే అధికారం కలెక్టర్కు కల్పించారు. -
‘నూకలు చెల్లినయ్.. ఆ పార్టీని తరిమేయాలి’
సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల మాదిరే తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి బండ నరేందర్ భారీ రోడ్షో నిర్వహించారు. అనంతరం శబరి గార్డెన్స్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. జిల్లా కాంగ్రెస్ నాయకుల చేతకానితనం వల్లనే ఫ్లోరైడ్ సమస్య, కరువు విస్తరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్, జిల్లా నుంచి కాంగ్రెస్ను తరిమేయాలి’ అని అన్నారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జడ్పీ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్లో రెబల్స్ బెడద
సాక్షి,మేడ్చల్ జిల్లా: ఈ మండల పరిషత్ ఎన్నికలు జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. జిల్లా పరిధిలో ఐదు మండలా లు ఉండగా, ఈ ఐదూ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. మొదటి దశలోనే మే 6న తేదీన పోలింగ్ జరగనుంది. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత సీఎం కేసీఆర్ మంత్రి మల్లారెడ్డికి అప్పగించారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో కొంత గందరగోళం చోటుచేసుకుందని, ఈ కారణంగానే రెబల్స్ తప్పడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఐదు జెడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసిన వారికే ప్రాధాన్యం కల్పించారనే భావన మండలస్థాయి నేతల్లో ఉంది.రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిపాజిట్ చేయటమో లేదా చూపించటమో ..చేసిన వారికి మాత్రమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు కేటాయించినట్లు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలతోపాటు పలు ఎంపీటీసీ స్థానాల్లో టికెట్ కేటాయించిన వారే కాకుండా ఇతర నాయకులు కూడా పార్టీ రెబల్స్గా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది. జెడ్పీటీసీ స్థానాల్లో ఇలా.... ♦ ఘట్కేసర్ టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి కుమారుడు మలిపెద్ది శరత్చంద్రారెడ్డికి టికెట్ కేటాయించగా, రెబల్గా చౌదరిగూడకు చెందిన బైరు రాములుగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ♦ మేడ్చల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా శైలజారెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వగా, రెబల్గా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ సతీమణి అనితాయాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ♦ కీసర జెడ్పీటీసీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బెస్త వెంకటేష్ నామినేషన్ వేయగా, రెబల్గా కీసర సర్పంచి భర్త నాయకుపు వెంకటేష్ ముదిరాజ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ♦ మూడుచింతలపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా మద్దుల శ్రీనివాస్రెడ్డి పార్టీ నుంచి నామినేషన్ వేయగా, రెబల్గా రామిగి మధుకర్రెడ్డి, వంగాలక్ష్మారెడ్డిలు నామినేషన్ వేశారు. ఎంపీటీసీ స్థానాల్లో అంతే... ♦ ఘట్కేసర్ మండల పరిధిలో ఎదులాబాద్ 2వ ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి మంకం రవికి రెబల్గా బద్దం వెంకటేశ్, చౌదరిగూడ– 2లో టీఆర్ఎస్ అభ్యర్థి సందీప్రెడ్డికి రెబల్గా బైరు రాములుగౌడ్, చౌదరిగూడ– 1 ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాల్కు రెబల్గా నిరుడి రామారావు, బైరు లక్ష్మణ్గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. ♦ కాచవానిసింగారం– 1 ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వర్కల లక్షమ్మకు రెబల్గా మునికుంట్ల స్వర్ణలత నామినేషన్ వేశారు. ♦ కీసర మండల పరిధిలోని కీసర గ్రామంలో 1వ ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి జంగయ్యయాదవ్కు రెబల్గా నారాయణ శర్మ , 2వ ఎంపీటీసీ స్థానంలో పార్టీ అభ్యర్థి మల్లారెడ్డికి రెబల్గా రమేష్గుప్తా, సతీష్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ♦ అంకిరెడ్డి పల్లిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ♦ శామీర్పేట్ మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఒకచోట రెబల్ బెడద ఉంది ♦ మేడ్చల్ మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, తొమ్మిదింటిలో రెబల్స్ బెడద ఉంది. ముగిసిన నామినేషన్ల పర్వం సాక్షి,మేడ్చల్ జిల్లా: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మేడ్చల్ జిల్లాలో ఐదు జెడ్పీటీసీ స్థానాలకు 34 మంది అభ్యర్థుల నుంచి 44 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు ఎనమిది ఉన్నాయి. 42 ఎంపీటీసీ స్థానాలకు 193మంది అభ్యర్థులు 279 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థులు 92 మంది ఉన్నారు. చివరి జెన జెడ్పీటీసీ స్థానాలకు 38 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 218 నామినేషన్లు దాఖలు అయ్యాయి. -
మూడు జిల్లా పరిషత్లు మావే..
నల్లగొండ : త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు జిల్లా పరిషత్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీతోపాటు ఆ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. అక్టోబర్నుంచి రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజా సమస్యలను పట్టించుకునే పాలకులే లేకుండా పోయారని ఆరోపించారు. ముఖ్యమంత్రి దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో వారి అభ్యర్థులపై ఖర్చు చేసి గెలిపించుకోవాలనే చూస్తున్నారే తప్ప ప్రజలను, పాలనను పట్టించుకోవడంలేదన్నారు. ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ నేతలు ఓటర్లను మభ్యపెట్టారన్నారు. బ్యాంకు అధ్యక్షుడు, భూ కబ్జాదారు అయినటువంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. జిల్లాల్లో రెండు పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన ఏర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే సాధ్యమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవాలంటే అత్యధిక జెడ్పీటీసీ సభ్యుల స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధిష్టానం ఆదేశిస్తే నార్కట్పల్లి నుంచి మా కుటుంబ సభ్యులనుబరిలోకి దించుతాం.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నార్కట్పల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. అయితే పార్టీ ఆదేశానుసారం పోటీలో ఉండే విషయం త్వరలోనే వెల్లడిస్తామని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం లేదు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, దానికి ఇంటర్ బోర్డు ఫలితాలే నిదర్శనమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. వీళ్లు చేసిన నిర్వాకానికి ప్రభుత్వ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మం త్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాదిమంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదా అని నిలదీశారు. కారు, సారు, పదహారు అంటూ 16మంది ఎంపీలను డబ్బులు పెట్టిగెలిపించుకునేందుకు చూశారని, ఇప్పుడేమో అన్ని జిల్లాపరిషత్లు తమవే అంటున్నారని, పాలన మాత్రం జరగడం లేదని దుయ్యబట్టారు. రెవెన్యూలో కొత్త చట్టం తెస్తామంటున్నారని, మొదట ఆ శాఖ అధికారులు బాగా చేస్తున్నారని మెచ్చుకున్న సీఎం కేసీఆర్ నేడేమో ప్రక్షాళన అంటూ వాళ్లను దొంగలను చేస్తున్నారని, రెవెన్యూ మంత్రిత్వ శాఖ తన వద్దే ఉంచుకొని అలా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
అధికార పార్టీలో టికెట్ల పోరు
ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిత్వాల ఖరారు అధికార పార్టీ టీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. జిల్లాలో 20 జెడ్పీటీసీ, 189 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఒక్కో స్థానానికి సగటున ముగ్గురు చొప్పున టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్... అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించిన నేపథ్యంలో అభ్యర్థిత్వాల ఖరారుపై ‘గులాబీ’ ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. ఇదేక్రమంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలో ఇంకా నిశ్శబ్దం వీడని పరిస్థితి ఉంది. –సాక్షి, మెదక్ ఇటీవల అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్లో దూసుకుపోయిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ.. అందులోనూ ఘన విజయం సాధిస్తామనే ధీమా ఆ పార్టీలో ఉంది. ఇలా వరుస ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్న టీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకులు అధిక సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ టీసీ పదవులకు పోటీచేసేందుకు ఎగబడుతున్నారు. కొన్ని చోట్ల జెడ్పీటీసీ పదవిని నలుగురైదుగురు.. ఎంపీటీసీ పదవిని ఐదారుగురు ఆశిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీలో భిన్న పరిస్థితులు వరుస ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంటే.. వరుస ఓటమితో కాంగ్రెస్, బీజేపీల్లో పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. గుర్తింపు ఉన్న నేతలైనప్పటికీ.. ఎన్నికల్లో పోటీచేసి నెగ్గగలమా, పైసలు దండగ అంటూ పలువురు పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. కొన్ని మండలాల్లో బరిలో దిగేందుకు అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల అభ్యర్థుల కో సం హస్తం, కమలం నేతలు వెతుకులాటలో నిమగ్నమైనట్లు సమాచారం. జెడ్పీటీసీ స్థానాలపై మొ గ్గు చూపిస్తున్నప్పటికీ.. ఎంపీటీసీ బరిలో నిలిచే ందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మండలాల పరిధిలో ఇలా.. ►రేగోడు మండలంలో జెడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ స్థానం నుంచి టికెట్ను అధికార పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఆశి స్తున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ గాడ్ఫాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ మండల పరిధిలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఒక్కోస్థానానికి టీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒక్కొక్కరు మాత్రమే టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ►పెద్దశంకరంపేట మండలంలో జెడ్పీటీసీ పదవిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి సైతం ముగ్గురు ఆశావహులు టికెట్ను ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ మండల పరిధిలో 12 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో స్థానానికి టీఆర్ఎస్ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు పోటీ చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెద్దశంకరంపేట మేజర్ పంచాయతీ పరిధిలో మూడు ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్రులుగా నామినేషన్ వేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. ►చిన్నశంకరంపేట మండలంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ పదవిని టీఆర్ఎస్ నుంచి ఆరుగురు మహిళలు ఆశిస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీపీ పదవిని టీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఆశిస్తున్నట్లు తెలిసింది. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, నలుగురు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా రు. కాంగ్రెస్ నుంచి ఒక్కరు చొప్పున మాత్రమే టికెట్ కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. ►శివ్వంపేట జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్గా రిజర్వ్ అయ్యాయి. టీఆర్ఎస్ నుంచి ఎంపీపీ పదవిని నలుగురు, జెడ్పీటీసీ పదవిని ఐదుగురు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ఒక్కరు మాత్రమే టికెట్ను ఆశిస్తున్నారు. ►నర్సాపూర్ మండలంలో జెడ్పీటీసీ స్థానం ఎస్టీకి రిజర్వేషన్ అయింది. తుల్జారంపేట తండాకు చెందిన ఒకరు.. నంద్యా తండాకు చెందిన మరొకరు టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి లింగాపూర్ తండాకు చెందిన ఒకరు టికెట్ను ఆశిస్తున్నారు. ఎంపీపీ సైతం ఎస్టీ మహిళకు రిజర్వేషన్ కాగా.. ఇద్దరు మాజీ ఎంపీపీలు టీఆర్ఎస్ నుంచి టికెట్ల వేటలో మునిగినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. బీజేపీలో ఇప్పటివరకు చలనం లేదు. ►వెల్దుర్తి మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు జనరల్కు కేటాయించారు. ఎంపీపీ పదవిని టీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. జెడ్పీటీసీ పదవులను టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఆశిస్తున్నట్లు సమాచారం. ఎంపీటీసీ పదవులకు సంబంధించి టీఆర్ఎస్లో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ఒక్కో స్థానంలో ముగ్గురు చొప్పున బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
చెయ్యి.. అందిస్తాం రా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాజకీయ భవిష్యత్తుకు సోపానంగా భావించే జిల్లా పరిషత్ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్వల విసురుతోంది. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేల ఆదరణకు నోచుకోక, టికెట్టుకు దూరమవుతున్న మండల నాయకులను పార్టీలోకి ఆహ్వానించి, భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయిన నేతలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం టీఆర్ఎస్ అసంతృప్తి వాదులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. ‘గెలిచిన తరువాత పార్టీ మారబోను’ అనే అఫిడవిట్ సమర్పించిన బలమైన టీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకొని టికెట్టు ఇవ్వాలని ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేల టికెట్టు కోసం పోటీపడి, సిట్టింగ్లకు సీట్లివ్వడంతో మిన్నకుండిపోయిన బలమైన టీఆర్ఎస్ నాయకులకు ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు ఇచ్చేందుకు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అనాసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీపీగా మండలంలో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న నాయకులకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. పార్టీ ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి బీఫారాలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పంపిం చింది. స్థానిక నియోజకవర్గ ఇన్చార్జిలు, సీనియర్ నేతలతో సంప్రదించిన తరువాత ఏకాభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షులు బీఫారాలను అభ్యర్థులకు అందజేయాల్సి ఉంటుంది. తొలి విడత ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించి బుధవారంలోగా బీఫారాలు ఇచ్చే అవకాశం ఉంది. వలసలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దృష్టి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాలలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో టీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా గత కొద్దిరోజులుగా పావులు కదుపుతున్నారు. కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యమని చెబుతున్న ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జమ్మికుంట మునిసిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామిని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్పించిన పొన్నం.. రామస్వామి సతీమణికి ఇల్లందకుంట జెడ్పీటీసీ టికెట్టు ఇవ్వనున్నారు. హుజూరాబాద్లో టికెట్టు వచ్చే అవకాశం లేని వారితో మాట్లాడి ఆయన కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో సైతం పొన్నం ఇదే రీతిన టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. సిరిసిల్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావును కాదని పార్టీ మారే ధైర్యం నాయకులకు లేదు. టికెట్టు వచ్చినా, రాకపోయినా టీఆర్ఎస్లోనే కొనసాగుతామని వారు చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు బలమైన నాయకత్వం లేకపోవడం కూడా వలసలు పోయేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. జగిత్యాలలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారని భావిస్తున్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మంగళవారం అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభించనున్నారు. ధర్మపురిలో టీఆర్ఎస్ టికెట్టు కోసం పోటీ ఎక్కువగానే ఉన్నప్పటికీ, పార్టీ మారేందుకు నాయకులు ఆసక్తి చూపడం లేదని సమాచారం. పెద్దపల్లిలో మారనున్న సమీకరణలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి దాదాపుగా అన్ని మండలాలకు జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేశారు. సుల్తానాబాద్, పెద్దపల్లి, శ్రీరాంపూర్, జూలపల్లి, ఓదెల మండలాల్లో ఒక్కో చోట ముగ్గురేసి అభ్యర్థులు పోటీ పడుతుండగా, వారితో విడివిడిగా సమావేశమై టికెట్టు కేటాయింపుపై స్పష్టత ఇచ్చారు. జెడ్పీటీసీ పోటీలో ముందున్న ఆశావహులకు ఎంపీపీ హామీలతో బుజ్జగిస్తున్నారు. కాగా కొందరు సిట్టింగ్ జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఆయన మొండి చేయి చూపనున్నారని స్పష్టమైంది. టికెట్టు రాని వారి గురించి మాజీ ఎమ్మెల్యే సిహెచ్.విజయరమణారావుకు సమాచారం అందడంతో ఆయన బలమైన అభ్యర్థులుగా భావిస్తున్న వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్లో టీఆర్ఎస్కు తిరుగుబాట్లు తప్పకపోవచ్చు. సుల్తానాబాద్లో జెడ్పీటీసీ టికెట్టు విషయంలో వివాదం తలెత్తింది. ఈ నియోజకవర్గంలోనే ఓ సిట్టింగ్ ఎంపీపీ, సీనియర్ నాయకుడికి జెడ్పీటీసీ టికెట్టు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు టీఆర్ఎస్ జెడ్పీటీసీ, ఎంపీపీ ఆశావహులపై వల విసురుతున్నారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిలవడంతో టీఆర్ఎస్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూస్తున్నారు. రామగుండంలో కాంగ్రెస్ నేత రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అసంతృప్తి మండల నాయకులను టీఆర్ఎస్లో చేర్పించే పనిలో ఉన్నారు. -
అందరికీ అవకాశం
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ప్రస్థానం ఈ ప్రాదేశిక ఎన్నికల అనంతరం ముగిసిపోనుంది. 1959లో ఏర్పాటైన జెడ్పీ అరవై సంవత్సరాలు కలిసి నడిచింది. జిల్లాల విభజనతో ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలుగా ఏర్పడటం, ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు జిల్లాల వారీగా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇక ఉమ్మడి జెడ్పీ చరిత్రగా మిగిలిపోనుంది. ఉమ్మడి జెడ్పీలో ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ జిల్లాల నుంచి జెడ్పీ చైర్మన్ల ప్రాతినిధ్యం ఉంది. ప్రస్తుతం నాలుగు జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుంచి కూడా పలువురు ప్రాతినిధ్యం వహించారు. నిర్మల్ నుంచే అత్యధికం.. ఉమ్మడి గా 1959 నుంచి 2019 వరకు 19 మంది ప్రాతినిధ్యం వహించారు. మధ్యకాలంలో కాల పరిమితి ముగిసినప్పుడు ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగింది. స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు వ్యవహరించారు. ఈ 19 మందిలో ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచే 11 మంది ఉండటం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో నిర్మల్కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రధానంగా రాజకీయ చైతన్యం ఈ ప్రాంతంలో అధికం. ఆ తర్వాత మంచిర్యాల నుంచి ఐదుగురు, ఆదిలాబాద్ నుంచి ఇద్దరు, కుమురంభీం జిల్లా నుంచి ఒక్కరు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాకో జెడ్పీ చైర్మన్ స్థానం ఏర్పడింది. దీంతో స్థానిక నేతలకు అవకాశం లభించనుంది. కొంతమందికి ఉన్నతి.. ఉమ్మడి జెడ్పీచైర్మన్గా వ్యవహరించిన వారిలో కొంతమంది రాజకీయంగా ఉన్నతి సాధించారు. మరికొంత మంది ఆ పదవి తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. ఇంకొంతమంది ఇప్పటికీ ఉన్నత పదవి కోసం పోరాడుతున్నారు. మొదటి చైర్మన్ రంగారావు పల్సికర్ రాజకీయం అక్కడితోనే నిలిచిపోయింది. 1960 నుంచి 1961 వరకు జెడ్పీ చైర్మన్గా వ్యవహరించిన పి.నర్సారెడ్డి ముఖ్యమంత్రులు బ్రహ్మానందంరెడ్డి, వెంగల్రావుల హయాంలో రెండుసార్లు మంత్రులుగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా ఆయన పేరు గడించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయిలో పదవి అలంకరించారు. ఆయనకు సోదరుడైనటువంటి పి.గంగారెడ్డి 1964 నుంచి 1967 వరకు జెడ్పీచైర్మన్గా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచి కోట్ల విజయ్భాస్కర్రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. టి.మధుసూదన్రెడ్డి 1983 నుంచి 1985 వరకు జెడ్పీచైర్మన్గా వ్యవహరించారు. ఆయన ఆ తర్వాత ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు. మహ్మద్ సుల్తాన్అహ్మద్ 1985 నుంచి 1986 వరకు జెడ్పీచైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరకు జెడ్పీ చైర్మన్గా ఉన్న అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం రెండోసారి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు. 2006 నుంచి 2009 వరకు అధ్యక్షుడిగా ఉన్న రాథోడ్ రమేశ్ ఎమ్మెల్యే, ఎంపీగా కూడా పనిచేశారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కొంతమంది కనుమరుగు.. జెడ్పీచైర్మన్లుగా పనిచేసిన వారిలో కొంతమంది రాజకీయంగా కనుమరుగయ్యారు. మరికొంత మంది వివిధ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. కడెంకు చెందిన జి.నారాయణరెడ్డి ఏడాదిపాటు 1967 నుంచి 1968 వరకు చైర్మన్గా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా ఎలాంటి పదవులు లభించలేదు. 1991 నుంచి 1992 వరకు చైర్మన్గా ఉన్న చుంచు ఊశన్నది కూడా అదే పరిస్థితి. 1995 నుంచి 1996 వరకు చైర్ పర్సన్గా వ్యవహరించిన సుమతిరెడ్డి ఆ తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. టి.పురుషోత్తంగౌడ్ది ఇదే పరిస్థితి. చిట్యాల సుహాసిని ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి చెందారు. ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. లోలం శ్యామ్సుందర్ నిర్మల్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలో చేరారు. జుట్టు అశోక్ చైర్మన్ పదవి తర్వాత ఎలాంటి ఉన్నత పదవి చేపట్టలేదు. సిడాం గణపతి ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా చైర్మన్ పదవి తర్వాత ఎలాంటి ఉన్నతి లభించలేదు. పూర్తి కాలం కొంతమందే.. జెడ్పీచైర్మన్లుగా పూర్తికాలం కొంత మందే పదవిలో ఉన్నారు. జి.నర్సింహారెడ్డి 1970 నుంచి 1976 వరకు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి 1987 నుంచి 1991 వరకు, లోలం శ్యామ్సుందర్ 2001 నుంచి 2006 వరకు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న వి.శోభారాణి 2014 నుంచి పదవిలో ఉన్నారు. ఈ జూన్తో పదవి కాలం ముగియనుంది. జెడ్పీచైర్మన్ రిజర్వేషన్ మొదట్లో ఉండేది కాదు. ఆ తర్వాత బీసీ, ఎస్సీలకు వచ్చింది. 2014లో బీసీ (మహిళ)కు రిజర్వ్ చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో 52 స్థానాలకు గాను 38 ఏకపక్షంగా గెలిచింది. ఆ తర్వాత పలువురు ఇతర పార్టీల జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో కలవడంతో సంపూర్ణమైంది. ఇక అప్పట్లో చైర్పర్సన్ స్థానం కోసం టీఆర్ఎస్లో నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణి, మంచిర్యాల జెడ్పీటీసీ ఆశాలత, నార్నూర్ జెడ్పీటీసీ రూపావతి పుష్కర్ల మధ్య పోటీ నెలకొనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణి పేరును జెడ్పీ చైర్పర్సన్గా ఖరారు చేశారు. జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్లు.. నిర్మల్ : రంగారావు పల్సికర్, రాంచంద్రారావు అన్నాజీ, లోలం శ్యామ్సుందర్, జుట్టు అశోక్ (ముథోల్ నియోజకవర్గం), పి.నర్సారెడ్డి, పి.గంగారెడ్డి, ఎ.ఇంద్రకరణ్రెడ్డి, ఎన్.సుమతిరెడ్డి, వి.శోభారాణి (నిర్మల్ నియోజకవర్గం), జి.నారాయణరెడ్డి, రాథోడ్ రమేశ్(ఖానాపూర్ నియోజకవర్గం). మంచిర్యాల: జి.నర్సింహారెడ్డి, బి.సీతాపతి, చుంచు ఊశన్న(మంచిర్యాల నియోజకవర్గం), మహ్మద్ సుల్తాన్ అహ్మద్ (చెన్నూర్ నియోజకవర్గం), టి.పురుషోత్తంగౌడ్ (బెల్లంపల్లి నియోజకవర్గం). కుమురంభీం : సిడాం గణపతి (సిర్పూర్ నియోజకవర్గం). ఆదిలాబాద్ : టి.మధుసూదన్రెడ్డి, చిట్యాల సుహాసిని రెడ్డి (ఆదిలాబాద్ నియోజకవర్గం) పెరిగిన జెడ్పీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లాలో 52 మండలాలు ఉండగా 52 మంది జెడ్పీటీసీలు ఎన్నికయ్యేవారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడడంతో జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 66కు పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాతో పోలిస్తే.. 14 జెడ్పీటీసీ స్థానాలు పెరిగాయి. 636 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కొత్త జిల్లాల్లో ఈ సంఖ్య తగ్గి 568కి చేరింది. ప్రధానంగా పలు ఎంపీటీసీ స్థానాలు ఉన్నటువంటి గ్రామాలు సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేయడం, తక్కువ ఓటర్లు ఉన్న వాటిని సమీపంలోని మరో ఎంపీటీసీ స్థానంలో కలపడం వంటివి జరగడంతో ఈ సంఖ్య తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆదిలాబాద్ 17 158 మంచిర్యాల 16 130 కుమురంభీం 15 124 నిర్మల్ 18 156 మొత్తం 66 568 -
గులాబీ ఖరారు..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలకు రేపో.. మాపో నగరా మోగనుంది. ఈలోగానే అధికార టీఆర్ఎస్ విపక్షాలకు సవాలు విసిరింది. నల్ల గొండ జెడ్పీ చైర్మన్ పోస్టుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ బండా నరేందర్రెడ్డిని ఎంపిక చేసింది. ఆయన తన సొంత మండలం నార్కట్పల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి స్థానిక ఎన్నికల బరిలోకి దిగనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్తోనే కొనసాగుతున్న బండా నరేందర్రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీకి విధేయుడిగా పేరున్న ఆయనకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. గతంలో ఆయన స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లోనూ పోటీచేశారు. నాడు తాము గెలిచే అవకాశం ఏమాత్రం లేకున్నా.. పార్టీ నాయకత్వం ఆయనను స్థానికసంస్థల ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయమని ఆదేశించడంతో పోటీపడ్డారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నెరవేర్చుకుంటూ పోతున్న ఆయన విధేయతను మెచ్చే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ జెడ్పీ చైర్మన్ పదవికి అభ్యర్థిగా ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్లోని పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జెడ్పీ చైర్మన్ పోస్టుకు పార్టీ నేతల మధ్య జరుగుతున్న రేసుకు చెక్ పెట్టేందుకు అధినాయకత్వం బండా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి, ఈ మేరకు జిల్లా నాయకత్వానికి సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం బండా నరేందర్రెడ్డికి నేరుగా ఫోన్ చేసి చైర్మన్ పదవికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, బండా గురువారమే తన చైర్మన్ పదవికి రాజీనామా చేయగా, ప్రభుత్వం శుక్రవారం ఆమోదించిందని చెబుతున్నారు. దీంతో ఆయన జెడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెలుపు ధీమాలో గులాబీ శ్రేణులు.. బండా నరేందర్రెడ్డి తన సొంత మండలం నార్కెట్పల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలోకి దిగనునన్నారని చెబుతున్నారు. ఈసారి జిల్లా పరిషత్ జనరల్ కేటగిరీకి రిజర్వు అయ్యింది. నార్కట్పల్లి జెడ్పీటీసీ స్థానం కూడా జనరల్కే కేటాయించడంతో బండాకు అవకాశం కలిసి వచ్చిందని పేర్కొంటున్నారు. నోటిఫికేషన్కు ముందే అభ్యర్థిని ప్రకటించి ఒక విధంగా విపక్షాలకు టీఆర్ఎస్ నాయకత్వం సవాలు విసిరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 31 జెడ్పీటీసీ స్థానాలున్న నల్లగొండ జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే 16 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంటే సరిపోతుంది. కాగా, ఇటీవల జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు ఓటర్లు ఎక్కువగా మొగ్గుచూపారు. దీంతో నల్లగొండ జిల్లా పరిధిలోని నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలు మినహా మిగిలిన నాలుగు చోట్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించా రు. నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నెల రోజుల కిందటే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేతిలో ఉన్నట్లయ్యింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమా టీఆర్ఎస్ నాయకత్వంలో ఉంది. నల్లగొండ, మిర్యాలగూడ తదితర నియోజకవర్గాల నుంచి కొందరు నాయకులు జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. కాగా, బండా పేరును ఖరారు చేయడంతో వారి ప్రయత్నాలకు చెక్ పడింది. -
జెడ్పీ పీఠంపై ‘గులాబీ’ గురి..
సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ నేతలు కన్నేశారు. ఇటీవల వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న టీఆర్ఎస్ నుంచి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అప్పుడే పైరవీలు మొదలైనట్లు సమాచారం. గత సంవత్సరం డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయ బావుటా ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్కు మంచి అవకాశాలు ఉండడంతో ఈ జిల్లాల్లో జెడ్పీ పదవిని చేజిక్కించుకునే విధంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నట్లు సమాచారం. కాగా వారు ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ జెడ్పీ చైర్మన్లను, చైర్పర్సన్లను ప్రకటిస్తారని, తమ చేతుల్లో ఏమీ లేదని కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఆశావహులకు తెలియజేస్తున్నట్లు సమాచారం. అయినా చివరి దాకా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల జాబితాను తేల్చేందుకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆయా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఆశావహులు ఆసక్తి చూపుతూ తమ పేర్లను వారికి అందిస్తున్నారు. మూడు జెడ్పీలు మహిళలకే జిల్లాల పునర్విభజన కాకముందు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ సంగారెడ్డి కేంద్రంలోనే ఉంది. జిల్లా పరిషత్ ప్రధాన కార్యాలయం కూడా సంగారెడ్డిలోనే ఉండడం గమనార్హం. పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఉమ్మడి మెదక్లో సంగారెడ్డి, సిద్దిపేటలు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో ఈ జిల్లాల్లో పరిషత్లు కొత ్తగా ఆవిర్భవించనున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జెడ్పీ చైర్పర్సన్గా రాజమణి ఉన్నారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా పరిషత్లు జనరల్ మహిళలకు కేటాయించారు. మెదక్ జెడ్పీ పీఠం బీసీ మహిళ అధిష్టించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జెడ్పీలు మహిళలకే రిజర్వు కావడంతో తమకు అవకాశాలు లేకపోవడంతో ఆ స్థానాల్లో తమ భార్యలు, ఇతర కుటుంబ సభ్యులను జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తమ అభిప్రాయాలను ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో పంచుకుంటున్నారు. తమకు అవకాశమిస్తామని ముందుగా హామీ ఇస్తే జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేయిస్తామని వారు పేర్కొంటున్నారు. ఆశావహులెందరో.. ఉమ్మడి జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఆశావహులు టీఆర్ఎస్ నుంచి ఆ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉమ్మడి మెదక్ చైర్పర్సన్గా ఉన్న రాజమణి మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోకి రావడంతో సంగారెడ్డి జెడ్పీ చైర్మన్గా కొత్తవారికి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం కేసీఆర్ ఎవరి పేరును ప్రకటిస్తారోనని టీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు నేడో, రేపో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో వచ్చే వారంలో నామినేషన్లు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపిక కూడా నాలుగైదు రోజుల్లో ఖరారయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో.. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళలకు కేటాయించారు. దీంతో కొంతమంది ఆశావహులకు తమ మండల జెడ్పీటీసీ అనుకూల కేటగిరీ రాకపోవడంతో పక్క మండలాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. దీనికి ఆయా మండలాల్లోని నాయకులు ఎంతమేరకు సహకరిస్తారనే విషయంలో లెక్కలు వేసుకుంటున్నారు. అధిష్టానం అధికారికంగా టికెట్ ఖరారు చేస్తే పార్టీ శ్రేణులు పనిచేయాల్సి వస్తుందని, టికెట్ తెచ్చుకోవడమే తరువాయి అని కొంతమంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే విధంగా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంతమంది పోటీలో ఉన్నారనే విషయంలో ఆశావహుల నుంచి ముందుగా అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కో స్థానం నుంచి పదుల సంఖ్యలో ఆశావహులు తమ పేర్లను చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఎవరి పేరును ఖరారు చేయాలనే విషయంలో ఎమ్మెల్యేలు సైతం ఆచితూచి అడుగేస్తున్నట్లు సమాచారం. ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసికట్టుగా పని చేయాలని, పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా పనిచేయాల్సి ఉంటుందని శ్రేణులకు ఇప్పటి నుంచే దిశా నిర్దేశం చేస్తున్నారు. టికెట్ రాని పక్షంలో వారు నిరాశపడకుండా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా ఎవరికి టికెట్ ఇస్తున్నామనే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఎవరనేది గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయిస్తున్నందున అందరూ సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యేలు, ముఖ్యనేత లు ఆశావహులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. -
నేడో, రేపో పరిషత్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ శుక్ర లేదా శనివారాల్లో విడుదల కానుంది. కొన్ని జిల్లాల గెజిట్లు గురువారం రాత్రికి, శుక్రవారం ఉదయం ప్రచురించే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం కారణంగా షెడ్యూల్ విడుదలకు అవకాశం లేకపోతే శనివారం వెలువడనుంది. రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలో కొత్తగా నాలుగు మండలాలు చేర్చడంతో, మండలాలు, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 539కు చేరింది. అయితే ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ వివాదం కారణంగా హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలో 1.57 కోట్ల ›గ్రామీణ ఓటర్లున్నా రు. పరిషత్ నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదయ్యే వారిని కూడా ఓటర్లుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతో ఈ సంఖ్య 1.60 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లు, ఎస్పీలతో నాగిరెడ్డి సమీక్ష... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం మ్యారియట్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నిర్వహించిన సమావేశానికి సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, పీఆర్ ముఖ్యకార్యదర్శి (ఎప్ఏసీ) సునీల్శర్మ, పీఆర్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎస్ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. తమ జిల్లాల పరిధిలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ నాగిరెడ్డిని పలువురు ఎస్పీలు కోరినట్లు సమాచారం. దీంతో 26 జిల్లాల్లో 3 విడతల్లో, 5 జిల్లాల్లో 2 విడతల్లో, కేవలం ఒక్క జిల్లాలో (మేడ్చల్–మల్కాజిగిరి) మాత్రం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా 4 మండలాలు, 4 జెడ్పీటీసీలు... రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలో కొత్తగా 4 మండలాలు అంటే 4 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలం పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి విడిగా మోస్రా, చండూరు మండలాలుగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను విడదీసి నారాయణరావుపేట, మేడ్చల్ జిల్లాలో శామీర్పేట మండలంలోని కొన్ని గ్రామాలతో మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల జెడ్పీటీసీ స్థానాలను కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 ఎంపీపీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాక పరోక్ష పద్ధతిలో మండలాధ్యక్షులను ఎన్నుకుంటారు. మూడు చింతలపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ స్థానానికి రిజర్వు చేయగా... ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్కు కేటాయించారు. మంగపేట జెడ్పీటీసీ ఎన్నిక వాయిదా... ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ జెడ్పీటీసీ స్థానం షెడ్యూల్డ్ ఏరియాలోకి వస్తుందా లేదా అన్న వివాదం నేపథ్యంలో హైకోర్టు దీని ఎన్నిక విషయంలో స్టే ఇచ్చింది. ఈ స్థానాన్ని ఎస్టీగానా లేదా జనరల్గానా ఎలా పరిగణించాలన్న వివాదంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థానంలో ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అన్నది ఎస్ఈసీని ములుగు కలెక్టర్ స్పష్టత కోరారు. హైకోర్టు స్టే విధించినందున ఇక్కడ ఎన్నిక నిర్వహించరాదని నిర్ణయించారు. ఎన్నికల ఏర్పాట్లు భేష్: వి.నాగిరెడ్డి జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించాం. జిల్లాల్లో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు బాగున్నాయి. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉంది. తాము చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వివరించారు. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం. పరిషత్ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. భద్రతాపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగడంతో ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించామన్నారు. 22న తొలి నోటిఫికేషన్ పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక... ఈ నెల 22న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి నోటిఫికేషన్ను ఎస్ఈసీ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా వచ్చే నెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. 26న రెండో నోటిఫికేషన్ను విడుదల చేశాక.. మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 30న తుది విడత నోటిఫికేషన్ను జారీచేయనుంది. వచ్చేనెల 14న తుది విడత ఎన్నికలతో పోలింగ్ ముగియనుంది. మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించాకే పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతే 32 జెడ్పీ చైర్పర్సన్లు, 5,187 ఎంపీపీ అధ్యక్షులను పరోక్ష పద్ధతుల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. -
నేడో, రేపో పరిషత్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ శుక్ర లేదా శనివారాల్లో విడుదల కానుంది. కొన్ని జిల్లాల గెజిట్లు గురువారం రాత్రికి, శుక్రవారం ఉదయం ప్రచురించే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం కారణంగా షెడ్యూల్ విడుదలకు అవకాశం లేకపోతే శనివారం వెలువడనుంది. రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలో కొత్తగా నాలుగు మండలాలు చేర్చడంతో, మండలాలు, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 539కు చేరింది. అయితే ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ వివాదం కారణంగా హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలో 1.57 కోట్ల ›గ్రామీణ ఓటర్లున్నా రు. పరిషత్ నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదయ్యే వారిని కూడా ఓటర్లుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతో ఈ సంఖ్య 1.60 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లు, ఎస్పీలతో నాగిరెడ్డి సమీక్ష... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం మ్యారియట్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నిర్వహించిన సమావేశానికి సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, పీఆర్ ముఖ్యకార్యదర్శి (ఎప్ఏసీ) సునీల్శర్మ, పీఆర్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎస్ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. తమ జిల్లాల పరిధిలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ నాగిరెడ్డిని పలువురు ఎస్పీలు కోరినట్లు సమాచారం. దీంతో 26 జిల్లాల్లో 3 విడతల్లో, 5 జిల్లాల్లో 2 విడతల్లో, కేవలం ఒక్క జిల్లాలో (మేడ్చల్–మల్కాజిగిరి) మాత్రం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా 4 మండలాలు, 4 జెడ్పీటీసీలు... రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలో కొత్తగా 4 మండలాలు అంటే 4 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలం పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి విడిగా మోస్రా, చండూరు మండలాలుగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను విడదీసి నారాయణరావుపేట, మేడ్చల్ జిల్లాలో శామీర్పేట మండలంలోని కొన్ని గ్రామాలతో మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల జెడ్పీటీసీ స్థానాలను కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 ఎంపీపీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాక పరోక్ష పద్ధతిలో మండలాధ్యక్షులను ఎన్నుకుంటారు. మూడు చింతలపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ స్థానానికి రిజర్వు చేయగా... ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్కు కేటాయించారు. మంగపేట జెడ్పీటీసీ ఎన్నిక వాయిదా... ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ జెడ్పీటీసీ స్థానం షెడ్యూల్డ్ ఏరియాలోకి వస్తుందా లేదా అన్న వివాదం నేపథ్యంలో హైకోర్టు దీని ఎన్నిక విషయంలో స్టే ఇచ్చింది. ఈ స్థానాన్ని ఎస్టీగానా లేదా జనరల్గానా ఎలా పరిగణించాలన్న వివాదంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థానంలో ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అన్నది ఎస్ఈసీని ములుగు కలెక్టర్ స్పష్టత కోరారు. హైకోర్టు స్టే విధించినందున ఇక్కడ ఎన్నిక నిర్వహించరాదని నిర్ణయించారు. ఎన్నికల ఏర్పాట్లు భేష్: వి.నాగిరెడ్డి జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించాం. జిల్లాల్లో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు బాగున్నాయి. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉంది. తాము చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వివరించారు. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం. పరిషత్ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. భద్రతాపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగడంతో ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించామన్నారు. 22న తొలి నోటిఫికేషన్ పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక... ఈ నెల 22న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి నోటిఫికేషన్ను ఎస్ఈసీ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా వచ్చే నెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. 26న రెండో నోటిఫికేషన్ను విడుదల చేశాక.. మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 30న తుది విడత నోటిఫికేషన్ను జారీచేయనుంది. వచ్చేనెల 14న తుది విడత ఎన్నికలతో పోలింగ్ ముగియనుంది. మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించాకే పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతే 32 జెడ్పీ చైర్పర్సన్లు, 5,187 ఎంపీపీ అధ్యక్షులను పరోక్ష పద్ధతుల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. -
‘పరిషత్’ ఎన్నికలపై టీఆర్ఎస్ దూకుడు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) దూకుడు పెంచింది. నిన్న, మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమించిన గులాబీ శ్రేణులను మళ్లీ ఎన్నికలకు సంసిద్ధులను చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమై స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు స్థానాలను గెలుచుకోవడంతో పాటు అన్ని ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకుని విజయబావుటా ఎగురవేయాలని ఆయన టీఆర్ఎస్ నేతలకు తేల్చిచెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, వచ్చే పరిషత్ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నిలపాలని అధినేత మార్గదర్శనం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను బుధవారం నియమించారు. ఇందులో శాసనసభ్యులతో పాటు పార్టీ ముఖ్యనేతలకు భాగస్వామ్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణులతో మమేకం కావడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి రానున్న పరిషత్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. పరిశీలకులు వీరే... భూపాలపల్లి : దాస్యం వినయ్భాస్కర్ (వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే), కన్నెబోయిన రాజయ్య యాదవ్ ములుగు : నన్నపునేని నరేందర్ (వరంగల్ తూర్పు ఎమ్మెల్యే) మహబూబాబాద్ లోక్సభ పరిధి : సీతారాంనాయక్ (ఎంపీ), మాలోతు కవిత (మాజీ ఎమ్మెల్యే) కొత్తగూడ, గంగారం మండలాల పరిశీలన : సీతారాంనాయక్ (ఎంపీ) బయ్యారం, గార్ల మండలాల పరిశీలన : మాలోతు కవిత (మాజీ ఎమ్మెల్యే) స్టేషన్ ఘన్పూర్ : వాసుదేవరెడ్డి వర్ధన్నపేట : మర్రి యాదవరెడ్డి నర్సంపేట : గుండు సుధారాణి పరకాల : పులి సారంగపాణి పాలకుర్తి : జన్ను జకారియా(పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల), పరంజ్యోతి(తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర). హుజూరాబాద్, హుస్నాబాద్ : ఎర్రబెల్లి ప్రదీప్రావు (కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి). -
292మంది పోటీకి అనర్హులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల వ్యయాన్ని చూపించని వారిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. వారు మూడేళ్లపాటు ఎన్నికలకు అనర్హులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలా జిల్లాలో 292 మందిని అనర్హులుగా పేర్కొంది. జిల్లాలో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఎన్ని నిధులు ఖర్చు చేశారనేది ఎన్నికల కమిషన్కు ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఖర్చును అధికారులకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో సీరియస్ అయిన ఎన్నికల సంఘం వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించింది. 88 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు అనర్హులు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేసిన వారిలో 292 మంది ఓటమిపాలయ్యారు. పోలింగ్ ముగిసిన అనంతరం ప్రచారంలో వారు చేసిన ఖర్చులు చూపించాలని ఎన్నికల అధికారులు పలుమార్లు సూచించినా అభ్యర్థులు పెడచెవిన పెట్టారు. వీరిలో 88మంది జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. 2014 ఎన్నికల్లో వీరంతా జెడ్పీటీసీలుగా ఆయా మండలాల్లో పోటీ చేశారు. వారు నిబంధనల ప్రకారం ఎన్నికల్లో వారు పెట్టిన ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారులకు తెలియపర్చాలి. కానీ ఓడిపోవడంతో వారు వాటిపై దృష్టి సారించలేదు. దీంతో ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదంటూ అనర్హులుగా ప్రకటించింది. ఈ విషయాన్ని జనవరి మాసంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అనర్హత పొందిన వారు... జెడ్పీటీసీగా పోటీ చేసి లెక్కలు చూపనందుకు అనుముల మండలంలో 9 మంది, చందంపేటలో ఇద్దరు, చండూరులో 9, చింతపల్లి 6, చిట్యాల ఒకరు, దామరచర్ల, దేవరకొండలో 6 చొప్పున, గుండ్రపల్లిలో నలుగురు, గుర్రంపోడులో ఐదుగురు, కనగల్ 6, కట్టంగూర్ 5, కేతెపల్లి 5, మిర్యాలగూడ 7, మునుగోడు, నకిరేకల్లో ముగ్గురు చొప్పున, వేములపల్లి, నల్లగొండ, నార్కట్పల్లిలో ఒక్కొక్కరూ, పీఏపల్లి, పెద్దవూరలో 4గురు చొప్పున మొత్తం 88 మంది ఉన్నారు. వీరంతా అనర్హత వేటుకు గురయ్యారు. 204 మంది ఎంపీటీసీ పోటీదారులు ఎంపీటీసీలుగా పోటీ చేసి ఖర్చుల వివరాలను ఇవ్వకపోవడంతో 204 మందిని అనర్హులుగా ఈసంవత్సరం జనవరిలోనే ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో అనుముల మండలంలో ఒకరిపై అనర్హత వేటుకు గురికాగా, చండూరులో 33 మంది, దామరచర్లలో ఒకరు, గుర్రంపోడులో 30, కట్టంగూర్ 38, మునుగోడులో 21, నకిరేకల్లో 26, నిడమనూరులో 4గురు, పెద్దవూరలో 34మంది, వేములపల్లిలో 13 మంది ఉన్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో కోర్టు అనుమతితో కొందరు పోటీ.... ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీరు పోటీకి అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. వారు సర్పంచులుగా పోటీ చేసేందుకు అనర్హులని ఎన్నికల అధికారులు పేర్కొనడంతో జిల్లాలో చాలామంది కోర్టును ఆశ్రయించారు. తాము ఎన్నికల్లో ఓటమి పాలవడం వల్ల ఎన్నికల ఖర్చుల వివరాలు అప్పగించాలనేది తెలియలేదని, దీంతో అప్పగించలేకపోయామని, వేరే ఉద్దేశం లేదని విన్నవించారు. దీంతో కోర్టు అనుమతితో దాదాపు 15 మంది వరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన చేపూరి యాదయ్య కోర్టు నుంచి అనుమతి పొంది సర్పంచ్గా పోటీ చేశాడు. చాలామంది కోర్టును ఆశ్రయించకపోవడంతో వారు పోటీ చేయలేకపోయారు. -
మెజారిటీ జెడ్పీ స్థానాలు సాధించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న పరిషత్తు ఎన్నికల్లో మెజారిటీ జెడ్పీ స్థానాలను సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్ని కలకు సంబంధించిన సమీక్షతోపాటు రాబోయే స్థాని క సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఓటింగ్ సరళి ఉన్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రధానిగా నరేంద్రమోదీనే ఉండా లన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలన్న దృక్పథం ప్రజల్లో వచ్చినట్లు సమావేశం అభిప్రాయపడింది. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం టీఆర్ఎస్ బీజేపీ మధ్యే పోటీ జరిగినట్లుగా ఉందని, టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు భావించినట్లు కూడా సమావేశం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోటీ చేయాలని, మెజారిటీ జెడ్పీ స్థానాలు కైవసం చేసుకునేలా సన్నద్ధం కావాలని నిర్ణయించింది. టీఆర్ఎస్పై పోరాటం: లక్ష్మణ్ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. హంగ్ వచ్చే అవకాశముందని, కచ్చితంగా టీఆర్ఎస్ సహాయంతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని, కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఖాయమని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్సే కాదు ఏ ఇతర పార్టీ సహకారం లేకుండానే ఎన్డీయే పూర్తిస్థాయిలో మెజారిటీ స్థానాలు సాధిస్తుందని వెల్లడించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ క్షేత్రస్థాయి పోరాటాన్ని ఉధృతం చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను బట్టబయలు చేస్తామన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉందని, అసలు ప్రభుత్వం పనిచేస్తుందా? లేదా అనే అనుమానాలు ప్రజలకు వస్తున్నాయని పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలేసి, ఎన్నికలపైనే దృష్టి సారిస్తున్న ప్రభుత్వ పెద్దలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రక్షాళన అనేది కేవలం ఉద్యోగులపై కక్ష సాధింపునకేనన్నారు. ఉద్యోగుల మధ్యంతర భృతి, పీఆర్ఎస్ ఏమైందని, కొత్త్త కొలువుల సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిత వ్యాన్ని త్రిశంకు స్వర్గంలో ఉంచారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేస్తామని, రాబో యే స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలాన్ని చాటుతామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి హన్స్రాజ్ ఆహిర్, ఎంపీ బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి పక్ష నాయకులు ఎన్.రాంచందర్రావు, కిషన్రెడ్డి, ఇతర రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
మీ ఎంపీటీసీగా ఎవరుండాలి?
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త పరీక్ష తెచ్చిపెట్టాయి. ఆయా నియోజకవర్గాల్లోని అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే.. ఎమ్మెల్యేలకు రాజకీయంగా, పార్టీలో పట్టు ఉంటుంది. దీంతో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ బీఫారం దక్కితే గెలుపు ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఉంది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం అధికార పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. ఆశావహుల్లో పోటీని అధిగమించి గెలిచే వారికి అవకాశాలు ఎలా ఇవ్వాలా అని ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. ఏకాభిప్రాయం అనే విధానాన్ని అనుసరించాలని కొందరు నిర్ణయించారు. అయితే అన్ని పార్టీల నేతలు టీఆర్ఎస్లోకి చేరడంతో గ్రామాల్లో రెండు మూడు గ్రూపులుగా ఉన్నాయి. అన్ని స్థాయిలలో గ్రూపులు ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కావట్లేదు. దీంతో అభ్యర్థుల ఎంపిక కోసం చివరికి సర్వే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పలు సంస్థలతో సర్వే నిర్వహించి.. టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఎమ్మెల్యేలు సొంత ఖర్చులతో సర్వేలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల్లోనూ పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు సర్వేలతోనే అభ్యర్థులను ప్రకటించారు. పలు సంస్థలతో.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అమలు చేస్తున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టికెట్ల కోసం పోటీలో ఉన్న వారి జాబితా రూపొందించి వారిలో మెరుగైన అభ్యర్థి ఎవరనేది ప్రజల నుంచి తెలుసుకునేలా ఈ సర్వేలు సాగుతున్నాయి. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇబ్బంది లేకున్నా.. ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు మాత్రం ఎమ్మెల్యేలకు తలనొప్పులు తెస్తోంది. మరోవైపు గ్రామాల్లోని స్థానిక పరిస్థితులను అంచనా వేయడం క్లిష్టంగా మారుతోంది. సర్వే నివేదికల ఆధారంగా మండలాల వారీగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల ముఖ్యులతో చర్చించి సర్వే వివరాలను చెబుతున్నారు. సర్వేలో పలానా వారి పేరు ముందుందని, వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుందని వివరిస్తున్నారు. ఆశావహులకు సర్వే వివరాల కాపీలను అందజేసి పార్టీ గెలుపు కోసం పని చేయాలని అనునయిస్తున్నారు. మరోసారి సర్వే చేయాలని ఎమ్మెల్యేలను కొందరు కోరుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. బీ ఫారాలు ఇచ్చే వరకు సర్వేలు నిర్వహిస్తామని, అప్పటి వరకు ఎవరు మెరుగ్గా ఉంటే వారికే అవకాశం వస్తుందని చెబుతున్నారు. సర్వే వివరాలను పరిశీలించిన ఆశావహులు అందులోని అంశాలను చూసి ఎమ్మెల్యేల నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. గ్రామ ప్రజల్లో తమ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు. -
టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలి..
సాక్షి, సిద్దిపేట : తెలంగాణలో జరిగే ఏ ఎన్నిక అయినా టీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. జిల్లాలో ఐదు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవాలని, టీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుందని, కానీ పార్టీ నిర్ణయించిన వారికి మద్దతుగా నిలబడి గెలిపిస్తే అందరికి గౌరవం ఉంటుందని చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలో సైనికుల్లాంటి కార్యకర్తలు, నమ్మకస్తులైన ఓటర్లు ఉన్నారని, మీరందరే తన బలం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అభివృద్ధి, సంక్షేమం, పార్టీని బలోపేతం చేయడంలో సిద్దిపేట ముందు వరుసలో ఉందని, ఇప్పుడు కూడా అందరం కలసికట్టుగా పనిచేసి అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. సిద్దిపేట అంటేనే నమ్మకమైన కార్యకర్తలకు నిదర్శనం అని మరోసారి రుజువు చేయాలని హరీశ్ రావు అన్నారు. ‘బ్యాంకుల్లో డబ్బులు ఉంటే ఎంత నమ్మకం ఉంటుందో.. మీ మీద నాకు, టీఆర్ఎస్ పార్టీకి అంతే నమ్మకం ఉంటుందని అన్నారు. అభ్యర్థుల ఖరారు కూడా గ్రామస్తులు, పార్టీ పెద్దలు సమావేశమై గ్రామాభివృద్ధికి దోహద పడే నాయకుడిని ఎంపిక చేసుకోవాలని’ సూచించారు. అందరి ఆమోదంతోనే అభ్యర్థులను నియమించుకొని ఐక్యంగా పనిచేయాలని హితవు చెప్పారు. పార్టీలో పని చేసిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ప్రతీ కార్యకర్తను తన కుటుంబ సభ్యునిగా చూశానని, మీరు కూడా అంతే గౌరవం ఇచ్చారని అన్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగించి నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నంగునూరు జడ్పీటీసీలు, 45 ఎంపీటీలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
కోర్ కమిటీదే ఎంపిక బాధ్యత
మోర్తాడ్ (బాల్కొండ): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ అధిష్టానం మండలానికి ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుండటంతో అన్ని పార్టీల్లో అలజడి మొదలైంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడానికి క్షేత్రస్థాయిలో కమిటీ అవసరం అని అధిష్టానం భావించింది. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునితో పాటు సీనియర్ నాయకులతో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. కోర్ కమిటీ సభ్యులు అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులతో సమావేశాలను నిర్వహించి ఎంపీటీసీ అభ్యర్థుల ఆశావహుల పేర్లను సేకరించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి జెడ్పీటీసీ అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులను గెలిపించాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సి ఉంది. జిల్లాలో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ జిల్లా అంతటిని అజమాయిషీ చేసే బాధ్యతను మంత్రి ప్రశాంత్రెడ్డికి ఇచ్చారు. కోర్ కమిటీ సభ్యులు ఆశావహుల జాబితాలను తయారు చేసి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించాల్సి ఉంది. ఎమ్మెల్యేలే అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపనున్నారు. కోర్ కమిటీ సభ్యుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో వారు రెండు మూడు రోజుల్లో ఆశావహుల జాబితాలను తయారు చేయడానికి గ్రామాల వారీగా సమావేశాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే కోర్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు తీవ్రంగానే ఉందని స్పష్టం అవుతుంది. -
అన్ని జిల్లాల జెడ్పీ పీఠాలే లక్ష్యం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొత్తం 32 జిల్లాలకు 32 జెడ్పీ ఛైర్మన్ పీఠాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. దీంతో పాటు ఎన్నికలు జరుగనున్న సుమారు 530పైగా మండల పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లోనూ నిరాశ తప్పదన్నరు. ఈ మేరకు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల కమిషన్ను కోరిన నేపథ్యంలో రానున్న వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నరు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేటీఆర్ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. గత నెల రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మరోసారి బ్రహ్మరథం పట్టనున్నారని కేటీఆర్ తెలిపారు. ఇదే తరహాలో వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో పనిచేయాలన్నరు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకొనేలా ముందుకు పోతామన్నరు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేస్తారని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. -
పదవులపై ‘నజర్’
సాక్షి, అడ్డాకుల: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 3న ఎంపీపీల పదవీ కాలం ముగియనున్నందున ఆ లోపు ఎన్నికలు పూర్తయితే కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టే విధంగా సర్కారు ఎన్నికలకు అంతా సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే నెల 27న ముగియనుంది. రాష్ట్రంలో ఈనెల 11న మొదట విడతలోనే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వాహణపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం జిల్లా, మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ స్థానిక ఎన్నికల వేడి రగులుకుంటోంది. ఆశావహుల ‘ప్రచారం’.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సమీపించడంతో పోటీలో నిలవాలనుకున్న ఆశావహులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ముగియగానే తమ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరందుకోవడంతో తాజాగా గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రిజర్వేషన్ అనుకూలించే నేతలు అందరినీ కలుపుకుపోవడానికి సమాయత్తం అవుతున్నారు. వలస ఓటర్లపై కూడా మెల్లగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే వలస ఓటర్లు రెండు సార్లు గ్రామాలకు వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. ఒకసారి ఎమ్మెల్యే మరోసారి సర్పంచ్ ఎన్నికలకు వచ్చి ఓట్లు వేశారు. తాజాగా మరో రెండు ఎన్నికలు రావడంతో వలస ఓటర్లను గ్రామాల నేతలు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా వచ్చే రెండు ఎన్నికలకు వచ్చి వలస ఓటర్లు ఓట్లు వేసి పోయే విధంగా ఆశావహులు ఫోన్లు చేస్తున్నారు. జెడ్పీటీసీపై నేతల గురి.. అడ్డాకుల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఈసారి జనరల్కు రిజర్వు చేశారు. దీంతో చాలా మంది మండల ముఖ్య నేతలు జెడ్పీటీసీపై గురి పెట్టారు. జెడ్పీ చైర్మన్ స్థానం జనరల్కు కేటాయించడంతో ఇక్కడ జెడ్పీటీసీగా విజయం సాధిస్తే అదృష్టం వరించి జెడ్పీ చైర్మన్ కావొచ్చన్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి పార్టీ మండల అధ్యక్షుడు డి.నాగార్జున్రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు పొన్నకల్ మహిమూద్, సింగిల్విండో అధ్యక్షుడు ఎం.జితేందర్రెడ్డి, పెద్దమునుగల్ఛేడ్ సర్పంచ్ భర్త రాజశేఖర్రెడ్డి, అడ్డాకుల తిరుపతిరెడ్డి, చంద్రమోహన్రెడ్డి, బలీదుపల్లి వేణుయాదవ్తో పాటు మరి కొందరు తెలంగాణ ఉద్యమ నేతలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్ధం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీని ఎదుర్కొవడానికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో రెండు పార్టీలు తలమునకలయ్యాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డోకూర్ పవన్కుమార్రెడ్డి బీజేపీలో చేరడంతో ఆ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో ముగ్గురు నేతలు జెడ్పీటీసీ స్థానంపై గురి పెట్టినా పక్క మండలానికి చెందిన ఓ నియోజకవర్గ నేతను ఇక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీల లెక్కతేలింది!
సాక్షి, జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తూ ఓటర్ జాబితాను విడుదల చేశారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ వసంతకుమారీ ఓటర్ జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జెడ్పీ కార్యాలయంలో మండలాల వారీగా జాబితాను ప్రచురించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పునర్విభజన ప్రక్రియతోపాటు రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ఓటర్ జాబితా కూడా సిద్ధం కావడంతో ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వచ్చేది మాత్రమే మిగిలి ఉంది. పెరిగిన స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో 64 జెడ్పీటీసీ, 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం 71 జెడ్పీటీసీలు, 805 ఎంపీటీసీకు చేరింది. ఈ మేరకు ఫిబ్రవరి నెల 20వ తేదీన ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చేందుకు మండలాల్లో పునర్విభజన డ్రాఫ్ట్ నోటిపికేషన్ జారీ అయింది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీ పదవీకాలం జూలై 4వ తేదీతో ముగుస్తుంది. జూన్లో ఈ ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ప్రతిపాదనలు పంపింది. జూలై 3, 4 తేదిల్లో ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీల కాల పరిమితి ముగియనుండటంతో ఈ వెంటనే కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఏర్పడేలా చర్యలు తీసుకుంటున్నారు. 805 ఎంపీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీల లెక్క ఇప్పటికే తేలింది. జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీల సంఖ్యను తేల్చారు. మహబూబ్నగర్ జిల్లాలో 184 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో గండీడ్ మండలంలో అత్యధికంగా 20 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా నవాబ్పేట్లో 19 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అత్యల్పంగా మూసాపేట్, రాజాపూర్ మండలాల్లో 8 చొప్పన ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. జర్చర్లలో 15 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా ఇందులో జడ్చర్ల ఎంపీటీసీ స్థానానికి 2020 వరకు పాలక మండలి గడువు ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ఒక్క స్థానానికి ఎన్నిక జరుగదు. మహబూబ్నగర్లో 441 గ్రామ పంచాయతీలు ఉంటే ఇందులో 184 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 453 పంచాయతీలు ఉంటే 212 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో బిజినపల్లి మండలంలో 35 గ్రామ పంచాయతీలుంటే 21 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. అత్యల్పంగా పదర మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉంటే 5 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉంటే 128 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధికంగా పాన్గల్ మండలంలో 28 పంచాయతీలు ఉంటే కొత్తగా 14 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. అత్యల్పంగా అమరచింత మండలంలో 14 పంచాయతీలకు గాను 5 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గద్వాల జిల్లాలో మొత్తం 255 పంచాయతీ ఉం టే ఇందులో 141 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఇందులో అత్యధికంగా అయిజ, గట్లు మండ లాల్లో 16 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. అత్యల్పకంగా వడ్డేపల్లిలో 6 ఎంపీటీసీ స్థానాలు అయ్యాయి. నారాయణపేట జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలుంటే ఇందులో 140 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా అత్యధికంగా మద్దూర్ మండలంలో 19, అత్యల్పంగా మాగనూర్లో 7 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. 805 ఎంపీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 982 స్థానాలు ఉండేవి. ఉమ్మడి జిల్లా పరిదిలోని 6 జిల్లాలా వ్యాప్తంగా 805 స్థానాలకు ఏర్పాడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,80,971 జనాబా ఉంది. దీని ఆదారంగానే ఎంపీటీసీల స్థానాలను అధికారులు గుర్తించారు. ప్రతి ఎంపీటీసీ ప్రదేశిక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఎన్నిల నిబందనల మేరకు 3500 జనాబా ఉండేలా జాగ్రత్త పడ్డారు. దానికి అనుగుణంగానే ఎంపీటీసీ స్థానాలను గుర్తించారు. 2014లో ఎన్నికలు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,07,170 జనాభా ఉంది. దీని ప్రకారం ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 982 ఎంపీటీసీ స్తానాలు ఉండేవి. గత 2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల 982 స్థానాలకు, 64 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో కలిశాయి. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుత జిల్లాలో 27,80,971 జనాభా ఉంది. దాని ప్రకారం ఎంపీటీసీ స్థానాలను గుర్తించారు. దానికి అనుగునంగా ప్రస్తుతం 805 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాడ్డాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రామీణ ఓటర్ల వివరాలు 71 జెడ్పీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 జెడ్పీటీసీలు స్థానాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో 64 జెడ్పీటీసీలు ఉండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో మూసాపేట్, రాజాపూర్, గండీడ్ (రంగారెడ్డి నుంచి జిల్లాలో కలిసింది), గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలి, కేటీ దొడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊరకొండ, చారకొండ, పదర, నారాయణపేట జిల్లాలో కృష్ణ, మరికల్, రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్, నందిగామ, చౌదర్గూడ, వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అమరచింత మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి అధికారులు జెడ్పీటీసీ స్థానాలుగా గుర్తించారు. వీటిలో వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. ఏప్రిల్ 8న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఏ ప్రిల్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తారు. 8వ తేదీన డ్రాఫ్ట్ గుర్తింపుకోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పోలింగ్స్టేషన్ ఏర్పాటులో ఏమైనా అభ్యంతరాలు వస్తే స్వీకరిస్తారు. ఈ మేరకు 17వ తేదీన గుర్తుంపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. స మావేశంలో పోలింగ్ స్టేషన్లపై వచ్చే అభ్యంతరాల ను వారికి వివరించి సూచనలు, సలహాలు తీసుకుంటారు. 18వ తేదీన గుర్తించిన పోలింగ్ స్టేషన్ వివరాలతో కలెక్టర్కు నివేదిక పంపిస్తారు. 20వ తేదీన పోలింగ్స్టేషన్ల తుది జాబితా విడుదల చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్? ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందడి నడుస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరగను న్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత ఎప్పుడై నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సమయం తక్కువగా ఉన్నం దున అధికార యం త్రాంగం ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియతోపాటు ఓటర్ జాబితా కూడా సిద్ధం చేశారు. ఇక ఎన్నికలు నిర్వహించడమే తరువాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోలాహలం నెలకుంది. ఈ ఎన్నికలు పూర్తి కాగానే స్థానిక సమయం మొదలు కానుంది. జెడ్పీటీసీ, ఎంపీసీటీ పునర్విభజన స్థానాల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. 71 జెడ్పీటీసీ, 805 ఎంపీటీసీ స్థానాలుగా అధికారులు గుర్తించారు. ఈ నివేదికలను కలెక్టర్ అప్రొవల్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం ఎన్నికల కసరత్తు ప్రారంబించనున్నారు. ఓటర్ జాబితాను విడుదల చేశాం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పునర్విభజన ప్ర క్రియ ఇప్పటికే పూర్తి చేశాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏ ర్పాట్లు అయిపోయా యి. ఓటర్జాబితాను సిద్ధం చేసి జెడ్పీ కా ర్యాలయంలో ప్రచురించాం. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి నివేదిస్తాం. తదుపరి ఎ న్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే నెల 8న పోలింగ్ కేంద్రాలకు డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసి 20న తుది జాబితా విడుదల చేస్తాం. – వసంతకుమారీ, జెడ్పీ సీఈఓ -
600 మందికి ఒక పోలింగ్ స్టేషన్
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లాపరిషత్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నందున ఒక్కో పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా 600 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్బూత్లు ఏర్పాటు చేయాలని సూచించింది.27న గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురించి, 30న అన్ని జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఆ జాబితా ఆధారంగా వచ్చే నెల 7న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్ ఆదేశించారు. ఈ పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ వచ్చే నెల 20లోగా పూర్తిచేసుకోవాలని సూచించారు. జిల్లా సీఈవోలు, జిల్లా సహాయ ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒక షెడ్యూల్ను ఇచ్చారు. మండలాల్లో పోలింగ్ బూత్ల ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భవనాలను ఎంపీడీవోలు, ఇతర అధికారులు పరిశీలించి, అక్కడున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అన్నది అంచనా వేయాలని ఎస్ఈసీ సూచించింది. -
‘ప్రాదేశిక’ ఓటర్లు 57,789
సాక్షి, కరీంనగర్రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లతో ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తులు చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో 24,402, కరీంనగర్రూరల్ మండలంలో 33,387 ఓటర్లు, మొత్తం 57,789 మందితో కూడిన కొత్త ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారులు శని వారం విడుదల చేశారు. ఆయా గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలున్నట్లయితే ఈనెల 20వరకు లిఖితపూర్వకంగా స్వీకరిస్తారు. తుది ఓటర్ల జాబితాను ఈనెల 27న ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ మండల పరిషత్ సమావేశమందిరంలో కరీంనగర్, కొత్తపల్లి మండలాలకు చెందిన రాజకీయపక్షాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయపార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీవో పవన్కుమార్ కోరారు. ఎంపీటీసీ కోసం ప్రయత్నాలు ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో స్థానిక నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తూ నే మరోవైపు ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు మద్దతు కూడగట్టుతున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తులతో ఉండటంతో రిజర్వేషన్ల ప్రకా రం పోటీచేసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు నాయకులు మరోమారు పోటీ చేసేం దుకు సమాయత్తమవుతున్నారు. రిజర్వేషన్లు కలి సిరాని నాయకులు తమ భార్యలను బరిలో దిం చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్రూరల్ మండలంలో మొత్తం 12, కొత్తపల్లి మం డలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కరీంనగర్రూరల్ ఎంపీపీ పదవి జనరల్, కొత్తపల్లి ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో పలువురు నాయకులు ఎంపీపీ పదవికోసం పావులు కదుపుతున్నారు. కరీంనగర్ ఎంపీపీ కోసం జనరల్ ఎంపీటీసీస్థానాలైన బొమ్మకల్–2, నగునూరు–2, గోపాల్పూర్, చెర్లభూత్కూర్, చామన్పల్లి ఎంపీటీసీలకు అవకాశముంది. అదేవిధంగా కొత్తపల్లి ఎంపీపీ కోసం బావుపేట–1, చింతకుంట–1, నాగులమల్యాల ఎంపీటీసీ స్థానా ల నుంచి మహిళలకు అవకాశముంది. దీంతో ఈస్థానాల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు నాయకులు పోటిచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. స్థానిక నాయకుల నుంచి అవసరమైన మద్దతు కూడగట్టుతున్నారు. సతీమణులకు అవకాశం కరీంనగర్రూరల్ జెడ్పీటీసీ స్థానం జనరల్ మ హిళ, కొత్తపల్లి జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళలకు కేటాయించడంతో అధికారపార్టీకి చెందిన పలువు రు నాయకులు తమ భార్యలను రంగంలోకి దిం పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్రూరల్ జెడ్పీటీసీ కోసం టీఆర్ఎస్ నుంచి బొమ్మకల్, చేగుర్తి మాజీ సర్పంచులు పురుమల్ల లలిత, బల్మూరి భాగ్యలక్ష్మి, దుర్శేడ్ ఎంపీటీసీ కోరుకంటి శోభరాణి, బీజేపీ నుంచి మొగ్ధుంపూర్ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి లక్ష్మి, కాంగ్రెస్పార్టీ నుంచి ఇరుకుల్ల మాజీ సర్పంచ్ మారుతీరావు సతీమణి శ్వేత పోటీచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తపల్లి జెడ్పీటీసీ కోసం బావుపేటకు చెందిన పిల్లి మహేశ్గౌడ్, మల్కాపూర్మాజీ సర్పంచ్ కాసారపు శ్రీనివాస్గౌడ్, ఎలగందల్కు చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిమ్మ ల అంజయ్య తదితరులు తమ సతీమణులను పోటీలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు 57,789 కొత్తపల్లి మండలం 24,402 కరీంనగర్రూరల్ మండలం 33,387 -
మళ్లీ ఎన్నికల సందడి
సాక్షి, తాడూరు: గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. శాసన సభ, సర్పంచ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటిందో లేదో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. తాజాగా అధికారులు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో పాటు ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు కొలిక్కి రావడంతో అధికారుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు స్తబ్ధత ఏర్పడిన తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో ఎక్కడ ఎంపీటీసీ రిజర్వేషన్లు గ్రామాల పరిధిపై చర్చ కొనసాగుతుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు సహితం పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఆశావహుల్లో ఉత్కంఠ ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఆశావహుల్లో ఉత్కంఠతో పాటు మరి కొంత మంది ఏ విధంగా బరిలోకి దిగాలన్న ఆలోచనలో పావులు కదుపుతున్నారు. గ్రామాల పునర్విభజన చేయడంతో కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. మండలంలో ఆరు కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాలలో ఆశించిన స్థాయిలో రిజర్వేషన్లు కాకపోవడం, ప్రస్తుతం రిజర్వేషన్లు అయిన తర్వాత అనుకూలంగా రాకపోవడంతో ఆశవాహుల్లో కొంత మేరనిరాశ, ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి నుంచి ఆయా పార్టీల నాయకులు మాజీ సర్పంచ్లు, ప్రస్తుత సర్పంచ్లతో మంతనాలు మొదలయ్యాయి. దీంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లు ఇలా.. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్ మహిళకు కేటాయించగా, పది ఎంపీటీసీ స్థానాలకు సిర్సవాడ జనరల్, భల్లాన్పల్లి జనరల్ మహిళ, తుమ్మలసుగూరు జనరల్, చర్ల తిర్మలాపూర్ ఎస్సీ మహిళ, ఇంద్రకల్ జనరల్ మహిళ, తాడూరు బీసీ మహిళ, యాదిరెడ్డిపల్లి బీసీ జనరల్, అల్లాపూర్ ఎస్సీ జనరల్, మేడిపూర్ జనరల్, అంతారం బీసీ మహిళ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. -
అభివృద్ధిపై ఆశలు
సాక్షి, బుగ్గారం: ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బుగ్గారం ప్రాంతం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు పొందిన ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయినా బుగ్గారం గ్రామం, దాని చుట్టుపక్కల గ్రామాలు చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించలేదు. తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ కేంద్రాన్ని ధర్మపురికి మార్చారు. దీంతో ఇక అభివృద్ధి ఉండదని గ్రామస్తులు అనుకున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం మొదటిసారి కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఈ పునర్విభజనలో భాగంగా ధర్మపురి మండలంలో అంతర్భాగంగా ఉన్న బుగ్గారంను ధర్మపురి మండలంలోని 8 గ్రామాలు, గొల్లపల్లి మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మొత్తం 11 గ్రామాలతో నూతన మండలకేంద్రంగా ఏర్పాటు చేశారు. దీంతో బుగ్గారంలో తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, పోలీస్స్టేషన్ తదితర కార్యాలయాలు నెలకొల్పారు. స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మండల ప్రజాపరిషత్ సంబంధమైన పనులు మాత్రం ధర్మపురిలోని ఎంపీపీ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దరిమిలా పాత ప్రాదేశిక స్థానాల్లో మార్పులు జరిగి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 75 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ బుగ్గారం మండలంలో ఈసారి మండల ప్రజాపరిషత్ ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మండలం నుంచి నూతనంగా జెడ్పీ స్థానం కూడా ఖరారు చేశారు. 11 గ్రామాలు.. 6 ఎంపీటీసీ స్థానాలు బుగ్గారం మండలంలో మొత్తం 11గ్రామాలకు గానూ 6ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 21,716 కాగా.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రకారం మొత్తం మండల ఓటర్లు 16,493. ఇంతకుముందు ధర్మపురి మండల పరిధిలో ఉన్నప్పుడు బుగ్గారంలోని 8 గ్రామాలకు గానూ 5 ఎంపీటీసీ స్థానాలుండేవి. ప్రస్తుతం గొల్లపల్లి నుంచి కలిసిన మూడు గ్రామాలైన శెకెల్ల, యశ్వంతరావుపేట, గంగాపూర్ గ్రామాలతో మరో ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయడంతో మండలంలో మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు మండలం నుంచి ఈసారి జెడ్పీటీసీ స్థానం కూడా ఏర్పడడంతో స్థానిక సంస్థల పాలన ప్రజలకు మరింత చేరువై సమర్థవంతంగా కొనసాగే అవకాశం ఉంటుందని నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ధర్మపురి కేంద్రంగా కొనసాగిన పంచాయతీల పాలనా వ్యవహారాలు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం మండలకేంద్రం నుంచే గ్రామాల పాలనా వ్యవహారాల పర్యవేక్షణ జరుగుతుంది. దీంతో మండలంలో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగి గ్రామాల ముఖచిత్రం మారే అవకాశాలున్నాయి. జెడ్పీ నిధులు కూడా నేరుగా మండలానికే రానుండడంతో అభివృద్ధిలో వేగం పెరిగే అవకాశాలుంటాయని నాయకులంటున్నారు. యువత ఆసక్తి త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ బలాబలాలను గురించి లెక్కలు వేసుకుంటూ స్థానిక ప్రజల వద్ద అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓడిపోయిన అభ్యర్థులు, రిజర్వేషన్ అనుకూలించనివారిలో కొంతమందికి ప్రస్తుతం ఖరారు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు కలిసి వస్తుండడంతో మళ్లీ ఎన్నికల సమరంలో దిగడానికి సిద్ధమౌతున్నారు. పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక మంది ఔత్సాహికులు తమతమ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరికొంతమంది యువకులు, నాయకులు తమకు పార్టీ టికెట్ రాకున్నా స్వతంత్రంగానైనా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. తమకున్న కుల బలం, ఇతర అంశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. కేవలం 6 ఎంపీటీసీ స్థానాలతో ఏర్పడ్డ చిన్న మండలం కావడంతో మరికొంతమంది ఎంపీపీ స్థానంపై కన్నేశారు. ఇదిలా ఉండగా.. మండలంలోని ఎంపీపీ, జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పలు పార్టీల పెద్దలు మండలంలోని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రజాదరణతోపాటు అంగబలం, ఆర్థిక బలం కలిగిన నాయకుల కోసం పార్టీలు అన్వేషణ సాగిస్తున్నాయి. -
మే మొదటి వారంలో పరిషత్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్లకు మే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలిదశలోనే (ఏప్రిల్ 11) తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ రెండో నోటిఫికేషన్ ఇచ్చి.. దీనికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోడ్ అమలు గడువు ముగిసేలోపు (మే 25) జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబరులో అసెంబ్లీ, జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో నెలల తరబడి ఎన్నికల నియమావళి అమల్లో ఉంటోంది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఉండటంలేదు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను త్వరగా ముగించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈవీఎంలతో పరిషత్ ఎన్నికల్లో ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలు (ఈవీఎం) ఉపయోగించాలనే ఆలోచనలో ఎస్ఈసీ ఉంది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై టీఆర్ఎస్, తదితర పార్టీల నుంచి సానుకూలత వ్యక్తమైనట్టు సమాచారం. ఈ ఎన్నికలు రెండువిడతల్లో నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించాలనే ఆలోచనతో ఎస్ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా అన్ని పార్టీలనుంచి ఆమోదం వచ్చినట్లు సమాచారం. వేగంగా ఏర్పాట్లు పరిషత్ ఎన్నికలకోసం ఎస్ఈసీ ఏర్పాట్లును వేగవంతం చేసింది. వచ్చే జూలై 4న కొత్త జడ్పీలు, ఎంపీపీ పాలకవర్గాలు ఏర్పడేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలోని పాత 9 జడ్పీల స్థానంలో 32 జడ్పీల చైర్పర్సన్లు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాల పరిధిలో ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. కొత్త జడ్పీలు, ఎంపీపీల పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కూడా పూర్తయింది. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారయ్యాయి. 32 జడ్పీలు, 535 ఎంపీపీలు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ ప్రక్రియను పూర్తిచేయడంలో భాగంగా ఇప్పటికే పాత 9 జడ్పీల స్థానంలో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 32 జడ్పీలు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను ఎంపీపీలుగా పునర్విభజన పూర్తిచేశారు. 32 జడ్పీ చైర్పర్సన్లు, 535 ఎంపీపీలకు సంబంధించి ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. కొత్తగా 68 మున్సిపాటిలీలు ఏర్పడిన నేప థ్యంలో ఆయా మండలాల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 27న ఓటర్ల తుది జాబితా ఈ నెల 27న రాష్ట్రంలో గ్రామపంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఎస్ఈసీ ఇదివరకే ఆదేశించింది. తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించాలని గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సూచించిన మేరకు వార్డుల విభజన పూర్తిచేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ నెల 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ జాబితాలపై వివిధ ప్రక్రియలను నిర్వహించాక 27న డీపీవో చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామపంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి. -
‘బీసీ రిజర్వేషన్ల తగ్గింపు దుర్మార్గం’
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 18 శాతానికి తగ్గించి అమలు చేయడం దుర్మార్గమని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యానగర్లోని బీసీ భవన్లో శుక్రవారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ స్థాయిలలో బీసీల నాయకత్వం ఎదగకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్లలో ఆరు చైర్మన్లు, 550 మండల పరిషత్ చైర్మన్లలో 94 చైర్మన్లు ఏ లెక్కన ఇస్తారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. రిజర్వేషన్ల తగ్గింపునకు వ్యతిరేకంగా అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు సగభాగం..
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలోని 25 మండల పరిషత్లకు గాను 14 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. 13 మండలాల జెడ్పీటీసీ స్థానాలనూ మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియపై అధికార యంత్రాంగం రెండు, మూడు రోజులుగా కసరత్తు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు వివరాలను ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు, జెడ్పీసీటీ స్థానాల రిజర్వేషన్లను గురువారం జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ప్రకటించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మహిళల రిజర్వేషన్లను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. మండల పరిషత్లకు సంబంధించి 25 స్థానాల్లో బీసీలకు ఐదు ఎంపీపీలు,ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు మూడు రిజ ర్వు అయ్యాయి. 13 ఎంపీపీ స్థానాలు జనరల్ అయ్యాయి. ఆయా కేటగిరిల్లో మహిళలకు 14 స్థానాలు వచ్చాయి. బీసీలకు ఆరు జెడ్పీటీసీ స్థానాలు.. ఆయా మండలాల జెడ్పీటీసీ స్థానాల రిజ ర్వేషన్ల వివరాలను పరిశీలిస్తే.. ఆరు జెడ్పీటీసీలు బీసీలకు రిజర్వు అయ్యాయి. అలా గే ఎస్సీలకు నాలుగు స్థానాలు, ఎస్టీలకు రెండు జెడ్పీటీసీలు కేటాయించగా, 13 స్థానాలు జనరల్కు వచ్చాయి. రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిం చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వచ్చే పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవింద్, డీపీవో కృష్ణమూర్తి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు తజ్ముల్, హజ్రాబేగం, కాంగ్రెస్ నుంచి శివకుమార్, బీజేపీకి చెందిన గంగాకిషన్ పాల్గొన్నారు. మండలం ఎంపీపీ రిజర్వేషన్ జెడ్పీటీసీ రిజర్వేషన్ ఆర్మూర్ ఎస్సీ ఎస్సీ బాల్కొండ బీసీ బీసీ (మహిళ) భీంగల్ జనరల్ బీసీ బోధన్ జనరల్ (మహిళ) జనరల్ (మహిళ) ధర్పల్లి జనరల్ (మహిళ) జనరల్ డిచ్పల్లి జనరల్ జనరల్ (మహిళ) ఇందల్వాయి ఎస్టీ జనరల్ (మహిళ) జక్రాన్పల్లి జనరల్ (మహిళ) జనరల్ (మహిళ) కమ్మర్పల్లి బీసీ (మహిళ) బీసీ (మహిళ) కోటగిరి జనరల్ (మహిళ) జనరల్ మాక్లూర్ జనరల్ జనరల్ మెండోరా ఎస్సీ (మహిళ) ఎస్సీ మోర్తాడ్ జనరల్ జనరల్ మోపాల్ ఎస్టీ (మహిళ) ఎస్టీ (మహిళ) ముప్కాల్ జనరల్ (మహిళ) జనరల్ (మహిళ) నందిపేట జనరల్ జనరల్ (మహిళ) నవీపేట ఎస్సీ ఎస్సీ (మహిళ) నిజామాబాద్ జనరల్ (మహిళ) జనరల్ (మహిళ) రెంజల్ బీసీ (మహిళ) బీసీ (మహిళ) రుద్రూరు బీసీ (మహిళ) బీసీ సిరికొండ ఎస్టీ (మహిళ) ఎస్టీ వేల్పూరు ఎస్సీ (మహిళ) ఎస్సీ (మహిళ) వర్ని జనరల్ (మహిళ) జనరల్ ఎడపల్లి బీసీ బీసీ ఏర్గట్ల జనరల్ జనరల్ -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పెంచుతారా?
సాక్షి, హైదరాబాద్: జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా కొన్నింటి పరిధి మరీ చిన్నగా మారడం ఇప్పుడు సమస్యగా పరిణమిస్తోంది. గతంలోని ఉమ్మడి 9 జిల్లా పరిషత్ల స్థానంలో కొత్తగా 32 జిల్లా పరిషత్లు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వి భజనలో పరిమితంగా కొన్ని మండలాలతో ఏర్పడిన కొన్ని జెడ్పీలు, పరిమితంగా కొన్ని గ్రామాలతో ఏర్పడిన కొన్ని మండల ప్రజాపరిషత్లలో పాలకవర్గాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న మీమాంసకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు గురవుతున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో 4 గ్రామీణ మండలాలు, వరంగల్–అర్బన్ జిల్లాలో 7 గ్రామీణ మండలాలు, నారాయణపేటతోపాటు కొన్ని జిల్లాల్లోనూ తక్కువ సంఖ్యలో మండలాలు ఉండడంతో అలాంటి చోట్ల పాలకవర్గాలను ఎలా ఏర్పాటు చేస్తే బావుంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. కొన్ని స్థానాలే ఉన్నచోట జెడ్పీపీ చైర్పర్సన్, వైస్చైర్మన్ పదవులు పోగా మిగిలినసభ్యుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ జెడ్పీ లేదా ఎంపీపీ మనుగడ ఎలా అని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 15–20 వేల జనాభాకు ఒక జెడ్పీటీసీ... గతంలో ఒక మండలాన్ని జెడ్పీటీసీ స్థానంగా, గ్రామాన్ని లేదా మూడున్నర నాలుగు వేల జనాభా గత ప్రాంతాన్ని ఎంపీటీసీగా పరిగణిస్తూ వచ్చారు. కొత్తగా 32 జిల్లాలు ఏర్పడిన దృష్ట్యా, మండలాల సంఖ్య మరీ తక్కువగా ఉన్న జిల్లాల్లో, గ్రామాల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సంఖ్య పెంచితే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాలను 15–20 వేల మధ్య జనాభాకు ఒక జెడ్పీటీసీ స్థానం ఏర్పాటు చేయాలని, రెండున్నర, మూడువేల జనాభాలోపు ఎంపీటీసీ స్థానంగా పరిగణించాలని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. ఆయా పదవులకు రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చునని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
ఎస్టీలకే దక్కిన పీఠం..
సాక్షి, కొత్తగూడెం: జిల్లాల పునర్విభజన తరువాత ఆవిర్భవించనున్న సరికొత్త జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ రెండున్నర సంవత్సరాలుగా జిల్లా, మండల పరిషత్లు ఉమ్మడిగానే ఉన్నాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుండడంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయినప్పటికీ మరికొన్ని మండలాలు మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోకి వెళ్లాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉండగా, వాటిలో భద్రాచలం, కొత్తగూడెం మండలాలు పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తున్నాయి. మిగిలిన 21 మండలాల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు, ఆయా మండలాల పరిధిలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 21 మండలాలకు గాను జెడ్పీటీసీలు ఎస్టీ జనరల్కు 05, ఎస్టీ మహిళలకు 05 కేటాయించారు. జనరల్ 05, జనరల్ మహిళకు 06 రిజర్వ్ చేశారు. మొత్తం మహిళలకు 11 రాగా, జనరల్కు 10 వచ్చాయి. బీసీ, ఎస్సీలకు ఒక్క జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం కూడా కేటాయించలేదు. ఇక మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్టీ జనరల్కు 09, ఎస్టీ మహిళలకు 09, జనరల్కు 01, జనరల్ మహిళకు 01, ఎస్సీ మహిళకు 01 కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో మహిళలకు 11, జనరల్కు 10 వచ్చాయి. వీటిలో ఎస్టీ కోటాలోనే మొత్తం 18 ఎంపీపీలు వచ్చాయి. బీసీలకు ఒక్క ఎంపీపీ కూడా రాలేదు. జెడ్పీటీసీలపైనే అందరి దృష్టి.. మండల ప్రజాపరిషత్లు సింహభాగం ఎస్టీలకు రిజర్వు కావడంతో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 21 జెడ్పీటీసీల్లో 10 ఎస్టీలకు రిజర్వు కాగా, 11 జెడ్పీటీసీలు జనరల్కు వచ్చాయి. వీటిల్లో 05 జనరల్, 06 జనరల్ మహిళలకు కేటాయించారు. జిల్లాలో గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి విజయం సాధించింది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఓట్లపరంగా ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ఈ ఎన్నికలపై పకడ్బందీగా దృష్టి పెట్టాయి. అయితే తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా నడిచింది. సింహభాగం పంచాయతీలను గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. దీంతో టీఆర్ఎస్లోనూ జోష్ వచ్చింది. ఇక భద్రాద్రి జిల్లాలో వామపక్షాలు స్థానికంగా గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు సైతం తగినన్ని జెడ్పీటీసీలు, మండల పరిషత్లు గెలుచుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ పీఠం సాధించేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 11 సాధించే విషయంలో ప్రతి జెడ్పీటీసీ స్థానం కీలకమే. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పీఠం కోసం సైతం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ఇక మండల ప్రజాపరిషత్ల అధ్యక్ష పదవుల విషయంలో రాజకీయం మరింత రసవత్తరంగా ఉండనుంది. కొన్ని మండలాల్లో 4 ఎంపీటీసీ స్థానాలు, మరొకొన్ని మండలాల్లో 5 ఎంపీటీసీలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఒక్క ఎంపీటీసీ గెలుచుకున్నవారు సైతం ఎంపీపీ రేసులో ముందు వరుసలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, మండల పరిషత్ల పోరు రసవత్తరంగా మారనుంది. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల జనాభా, రిజర్వేషన్లు.. మండలం మొత్తం జనాభా జెడ్పీటీసీ స్థానాలు రిజర్వేషన్ ఆళ్లపల్లి 12268 1 ఎస్టీ జనరల్ అన్నపురెడ్డిపల్లి 21130 1 జనరల్ మహిళ చండ్రుగొండ 27911 1 జనరల్ చర్ల 42947 1 ఎస్టీ మహిళ చుంచుపల్లి 42290 1 జనరల్ దుమ్ముగూడెం 46802 1 ఎస్టీ జనరల్ గుండాల 15857 1 ఎస్టీ మహిళ జూలూరుపాడు 33395 1 ఎస్టీ మహిళ కరకగూడెం 15221 1 ఎస్టీ జనరల్ లక్ష్మీదేవిపల్లి 38093 1 జనరల్ మహిళ మణుగూరు 40026 1 జనరల్ ములకలపల్లి 34794 1 ఎస్టీ జనరల్ పాల్వంచ 33673 1 జనరల్ పినపాక 33155 1 జనరల్ మహిళ టేకులపల్లి 47879 1 ఎస్టీ జనరల్ ఇల్లందు 57302 1 ఎస్టీ మహిళ అశ్వాపురం 43067 1 జనరల్ మహిళ బూర్గంపాడు 36910 1 జనరల్ మహిళ దమ్మపేట 58444 1 జనరల్ సుజాతనగర్ 27989 1 ఎస్టీ మహిళ మొత్తం 768805 21 -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎంపీపీల జిల్లా కోటాను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు కసరత్తు చేసిన జిల్లా పరిషత్ అధికారులు బుధవారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు సంబంధించి మండలాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగించారు.ఎంపీటీసీల రిజర్వేషన్ మాత్రం ఆయా జిల్లాల ఆర్డీఓల పర్యవేక్షణలో ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ను జనాభా ప్రాతిపదికన నిర్ణయించగా, బీసీల రిజర్వేషన్ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించారు. ఉదయంనుంచి రాత్రి వరకు రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రస్తుతం తయారు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతికి సూర్యాపేట, భువనగిరికి రిజర్వేషన్ జాబితాను పంపంచి అనుమతి తీసుకున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ నల్లగొండ జిల్లా ఎంపీపీ జెడ్పీటీసీ అడవిదేవులపల్లి ఎస్టీ(జ) ఎస్టీ(జ) అనుముల ఎస్సీ(జ) ఎస్సీ(జ) చందంపేట ఎస్టీ(మ) ఎస్టీ(మ) చండూరు బీసీ(మ) బీసీ(జ) చింతపల్లి జనరల్(మ) జనరల్(మ) చిట్యాల బీసీ(మ) బీసీ(మ) దామరచర్ల ఎస్టీ(మ) ఎస్టీ(మ) దేవరకొండ జనరల్ జనరల్(మ) గుండ్లపల్లి జనరల్(మ) జనరల్ గుర్రంపోడు జనరల్ జనరల్(మ) కనగల్ బీసీ(జ) బీసీ(జ) కట్టంగూర్ జనరల్ జనరల్ కేతెపల్లి ఎస్సీ(జ) ఎస్సీ(మ) కొండమల్లేపల్లి జనరల్(మ) జనరల్(మ) మాడ్గులపల్లి ఎస్సీ(మ) ఎస్సీ(జ) మర్రిగూడ జనరల్ జనరల్ మిర్యాలగూడ జనరల్(మ) జనరల్ మునుగోడు బీసీ(జ) బీసీ(మ) నకిరేకల్ జనరల్ జనరల్(మ) జనరల్ జనరల్(మ) నల్లగొండ ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఎస్సీ(జ) నాంపల్లి జనరల్(మ) జనరల్ నార్కట్పల్లి నార్కట్పల్లి(జ) జనరల్ నేరేడుగొమ్ము ఎస్టీ(జ) ఎస్టీ(జ) నిడమనూరు జనరల్(మ) జనరల్(మ) పీఏపల్లి జనరల్ జనరల్(మ) పెద్దవూర జనరల్(మ) జనరల్ శాలిగౌరారం ఎస్సీ(మ) ఎస్సీ(మ) తిప్పర్తి జనరల్ జనరల్ తిరుమలగిరి సాగర్ ఎస్టీ(జ) ఎస్టీ(మ) త్రిపురారం జనరల్(మ) జనరల్(మ) వేములపల్లి ఎస్సీ(మ) ఎస్సీ(మ) అడ్డగూడూరు ఎస్సీ(జ) ఎస్సీ(మ) ఆలేరు ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఆత్మకూరు ఎం జనరల్(మ) జనరల్ బొమ్మల రామారం జనరల్ జనరల్ భువనగిరి బీసీ(మ) బీసీ(జ) బీబీనగర్ జనరల్ జనరల్(మ) చౌటుప్పల్ జనరల్ జనరల్ గుండాల ఎస్సీ(మ) ఎస్సీ(మ) మోటకొండూరు జనరల్(మ) జనరల్ మోత్కూర్ జనరల్(మ) జనరల్(మ) నారాయణపురం జనరల్(మ) జనరల్(మ) పోచంపల్లి జనరల్ జనరల్(మ) రాజాపేట బీసీ(జ) బీసీ(జ) రామన్నపేట బీసీ(మ) బీసీ(మ) తుర్కపల్లి ఎస్టీ(జ) ఎస్టీ(జ) వలిగొండ బీసీ(జ) జనరల్(మ) యాదగిరిగుట్ట బీసీ(జ) బీసీ(మ) నల్లగొండ జిల్లాకు సంబంధించిన రిజర్వేషన్తోపాటు మిగిలిన రెండు జిల్లాల జాబితాను కూడా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అనుమతితో జెడ్పీ అధికారులు ప్రకటించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలో మొత్తం 16మహిళలకు రిజర్వ్ కాగా, 15 మండలాలు జనరల్కు కేటాయించారు. సూర్యాపేటలో మొత్తం 23 మండలాలకు మహిళలకు 12, జనరల్కు 11 కేటాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు గాను 7 మహిళలకు రిజర్వ్ చేయగా, 10 జనరల్కు కేటాయించారు. మూడు జిల్లాల పరిధిలో ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం కేటాయించారు. -
ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు!
సాక్షి, అచ్చంపేట: వరుస ఎన్నికలతో మరోసారి పల్లెలు సందడిగా మారనున్నాయి. లోక్సభతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ వరకు ఎన్నికల కోలాహలం ఉండడంతో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ఇక అధికారులు ఓటర్లు, మున్సిపల్ వార్డులు, పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో తంతు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మమ్మురమైంది. ఇప్పటికే ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా ప్రజా పరిషత్ల పరిధిలోని 71మండల ప్రజాపరిషత్లో నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో ఒక మండలం ఏజెన్సీ ఏరియాలో ఉంది. మిగిలిన 70మండలాల్లో 50శాతం అంటే 35మండలాల ఎంపీపీ స్థానాలను జనరల్కు కేటాయించారు. మిగిలిన వాటిలో ఏడు ఎస్టీలకు, 14 ఎస్సీలకు, 14 బీసీలకు రిజర్వ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన, బీసీ రిజర్వేషన్లు ఓటర్ల ప్రకారం నిర్ణయించారు. గతంలో ఇలా.. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీలు జిల్లా పరిషత్లో నామినేషన్లు వేయగా, ఎంపీటీసీలు ఆయా మండలాల్లో సమర్పించేవారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని సవరించి జెడ్పీటీసీలు మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మూడు ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించి నామినేషన్లు స్వీకరించే విధంగా నిర్ణయించారు. దీంతో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ అభ్యర్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో జిల్లాలో దూర ప్రాంతాల నుంచి జిల్లాకేంద్రానికే వచ్చి నామినేషన్ల పత్రాలు సమర్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఎన్నికల సంఘం వెసులుబాటు కలిగించడంతో ఊరట కలగనుంది. 600–700మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం 600 మంది నుంచి 700 మంది ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతు కావడంతో వాటిని తిరిగి చేర్పించేందుకు ఓటర్ల నమోదు ముసాయిదా నిర్వహించారు. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ ఓటర్లతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు 2లక్షల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాను ఆధారంగా చేసుకునే ఈ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్లను విభజించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల నూతనంగా తయారు చేసిన ఓటర్ల జాబితాను కలెక్టర్ ద్వారా తీసుకున్నారు. దాని ఆధారంగానే గ్రామాల వారీగా ఆయా వార్డుల జాబితాను తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీటి ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. అనంతరం ఎంపీటీసీల నియోజకవర్గాల వారీగా తయారు చేసి ఈ నెల 27న తుది జాబితాను ప్రకటించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో కొత్తగా పదర, చారకొండ, పెంటవెల్లి, ఊర్కొండ, వనపర్తి జిల్లాలో చిన్నంబావి, మదనాపురం, శ్రీరంగాపూర్, జోగుళాంబ జిల్లాలో కేటీ దొడ్డి, రాజోళి, ఉండవెల్లి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో మరికల్, మూసాపేట, రాజాపూర్, కృష్ణా మండలాలు ఏర్పడ్డాయి. పాత మండల పరిషత్లో ఉన్న ఈ మండలాల్లో కొత్త పరిషత్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఏ జిల్లాకు ఆ జిల్లా జెడ్పీటీసీలతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలిపి ప్రస్తుతం 71 జెడ్పీటీసీ, 804 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్లకు లక్కీడిప్.. గద్వాల అర్బన్: ఎట్టకేలకు జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీనికోసం మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో కలెక్టర్ కె.శశాంక ఆధ్వర్యంలో లక్కీడిప్ తీశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాములు, డీపీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీటీసిల లెక్క తేలింది..!
సాక్షి,యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) లెక్క తేలింది. సవరించిన జాబితా ప్రకారం ఎంపీటీసీల సంఖ్య 177గా నిర్ధారించారు. జిల్లాలో కలిసిన గుండాలతో కలుపుకుని 17 మండలాల్లో జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాలను రూపొందించారు. తుది జాబితా ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండనుంచి యాదాద్రి భువనగిరి జిల్లాను 16 మండలాలతో ఏర్పాటు చేశారు. అయితే పాత మండలాలు 14 మాత్రమే ఉండగా ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతూ ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతోపాటు జిల్లాలో మోటకొండూరు, అడ్డగూడురు రెండు నూతన మండలాలు ఏర్పాటు చేశారు. మూడు మండలాలు అదనంగా చేరడంతో జిల్లాలో ప్రస్తుతం మండలా సంఖ్య 17కు చేరింది. ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 17 మండలాలతో కలిపి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, రెవెన్యూ మండలాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పునర్విభజన చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఫిబ్రవరి 16న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించారు. 3,500 జనాభాకు ఒక మండల ప్రాదేశిక నియోజకవర్గం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల తక్కువగా ఉన్నప్పటికీ ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ముందుగా జారీ చేసిన ముసాయిదా పై పలు అభ్యంతరాలు వచ్చాయి. ఎంపీటీసీల్లో విలీనమైన గ్రామాల మధ్యన దూరం తగ్గించాలని, ఓటర్ల సంఖ్యను 3,500 నుంచి 2000 కు తగ్గించాలంటూ సుమారు 20 అభ్యంతరాలు వచ్చాయి. 177 ఎంపీటీసీలు నూతన ముసాయిదా ప్రకారం జిల్లాలోని 17 మండలాల్లో 177 ఎంపీటీసీ స్థానాలను ఖరా రయ్యాయి. గతంలో జిల్లాలో 207 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 177కు తగ్గిపోయాయి. మేజర్ గ్రామపంచాయతీలైన ఆలే రు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీలుగా మారాయి. భువనగిరి మున్సిపాలిటీలో రాయిగిరి, బొమ్మాయపల్లి, పగిడిపల్లి గ్రామాలు ఇలా మొత్తం మున్సిపాలటీల్లో 17 పంచాయతీలు విలీనం అయ్యాయి. గతంలో 2,500 మందికి ఒక ఎంపీటీసీ స్థానం ఉండగా ప్రస్తుతం 3,500కు పెంచారు. కాగా జిల్లాలో వలిగొండ మండలంలో17 అత్యధికంగా ఎంపిటీసీలు ఉండగా,మోత్కూరులో అతి తక్కువగా 4 ఎంపిటీసీలు ఉన్నాయి. ఆలేరు అడ్డగూడురు, మోటకొండూరులో ఏడేసీ చొప్పున ఎంపీటీసీలు ఉండగా, ఆత్మకూర్(ఎం) లోఎనిమిది ఎంపిటీసీ స్థానాలుఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.. ఎంపీటీసీ,జెడ్పీటీసీల సంఖ్య ఖరారు కావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు అధికార యం త్రాంగం సిద్ధమవుతోంది.రాష్ట్ర ఎన్నికల సం ఘం ఎప్పుడు ఆదేశించిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి పంచాయతీరాజ్ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటరు జాబితాలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసే పనిలో పడింది. అలాగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేస్తోంది. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు ఆలేరు 7, భువనగిరి 13, బీబీనగర్ 14 , బొ మ్మలరామారం 11, చౌటుప్పల్ 12, మోట కొండూర్ 7, మోత్కూర్ 4, నారాయణపురం13, రాజాపేట 11, వలిగొండ 17, యాద గిరిగుట్ట 9, ఆత్మకూర్ 8, భూదాన్పోచంపల్లి 10, అడ్డగూడూరు 7, రామన్నపేట 15, తుర్కపల్లి 10, గుండాల 9 ఉన్నాయి. రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలి భువనగిరి(వలిగొండ) : జిల్లాలో చాలా మం దికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందలేదని వెంటనే ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. వలిగొండలో శుక్రవారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో చాలా మంది రైతులకు పాస్ పుస్తకాలు అందజేదన్నారు. దీంతో వారికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రానివారందరికీ వెంటనే అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వేముల మహేందర్, మా టూరి బాలరాజు, చిర శ్రీశైలంరెడ్డి, మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి, ముగిలి పాక గోపాల్, కృష్ణ, అంజనేయులు, సత్తిరెడ్డి, కిష్టయ్య, రాంచందర్ పాల్గొన్నారు. 3న భాషా పండితుల సమావేశం భువనగిరిటౌన్ : హైదరాబాద్లోని కొత్తపేటలో గల మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ఈనెల 3వ తేదీన భాషా పండితుల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జీడిపల్లి సైదులురెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి తెలుగు, హిందీ ఉర్దూ పండిట్లతో పాటు పీఈటీలందరూ హాజరుకావాలని కోరారు. -
లెక్క తేలింది.. తీర్పు మిగిలింది..
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక వర్గాల పదవీకాలం జూలైతో ము గియనుంది. ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జిల్లాల వారీగా మండల, జిల్లా పరిషత్ స్థానాల పునర్విభజన చేశారు. ఈ నెల 20న మండల స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు, జిల్లా స్థాయిలో జెడ్పీ స్థానాలు వివరాలతో కూడిన ముసాయిదా జాబితాను కలెక్టర్ల ఆమోదంతో విడుదల చేశారు. 22 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని పరిష్కరించి సోమవారం తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలో 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీ సభ్యులు ఉండనున్నారు. కొత్త జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ మండలాలు, పంచా యతీలను దృష్టిలో ఉంచుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పునర్విభజించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నెల 16న జిల్లా అధికారులకు ఉత్తర్వులను జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాదేశిక నియోజకవర్గాలను గుర్తించా లని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పంచాయతీరాజ్ అధికారులు ఈ నెల 20న పునర్ వ్యవస్థీకరించిన జెడ్పీ, మండల స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను ప్రకటించారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ నెల 21, 22వ తేదీల్లో 19 అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 23, 24 తేదీల్లో 19 అభ్యంతరాలు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించారు. పూర్వపు వరంగల్ జిల్లాలో 705 ఎంపీటీసీలు, 50 జెడ్పీటీసీలున్నాయి. తగ్గిన ఎంపీటీసీలు.. జిల్లాలో పునర్ వ్యవస్థీకరణ కంటే ముందు 188 ఎంపీటీసీలు స్థానాలుండేవి. పునర్విభజనతో 178కి చేరింది. దీంతో జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. పరకాల, నర్సంపేట మునిసిపాలిటీల్లో పలు గ్రామాలు విలీనమయ్యాయి. అలాగే వర్ధన్నపేట, డీసీ తండా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా మారాయి. దీంతో జిల్లాలో ఎంపీటీసీల స్థానాలు తగ్గాయి. ఈ మేరకు జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు 16కు చేరాయి. 2500లలోపు ప్రజలు ఉంటున్నవి 22 ఎంపీటీసీలు జిల్లాలో మండలం యూనిట్గా 2011 జనాభా ప్రాతిపదికన 2500 నుంచి 5వేల మంది జనాభాకు ఒక ఎంపీటీసీని కేటాయించారు. 2500 మంది జనాభా లోపు ఉన్న ఎంపీటీసీలు 22 ఉండగా 2500 నుంచి 5వేల మంది ఉన్న జనాభావి 156 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఆదేశానుసారం రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. -
ఎంపీటీసీ స్థానాల లెక్క కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోని ఎంపీటీసీ స్థానాలతో పోలిస్తే ఇప్పుడు 493 స్థానాలు తగ్గనున్నాయి. 3,500 జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలు పునర్విభజన చేశారు. ఉమ్మడి 9 జిల్లా ల పరిధిలో మొత్తం 6,473 ఎంపీటీసీ స్థానాలుండగా ఇప్పుడు 5,977కి తగ్గనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల ప్రాతిపదికన మొత్తం 535 జడ్పీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేర కు సోమవారం ముసాయిదా ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి సమర్పించనుంది. రాష్ట్రంలో కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. పట్టణ స్వరూప మున్న మండల కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. మార్చి 30న పంచాయతీవార్డులవారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమవుతాయి. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ నియోజకవర్గాల సంఖ్య అత్యధికంగా 98 పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 89 ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి. -
లెక్క తేలుస్తున్నారు!
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మరో ఎన్నికల సమరానికి అ«ధికారులు సిద్ధమవుతున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సంకేతాలు వస్తున్నాయి. ఇదేకాకుండా ఏ సమయంలో నోటిఫికేషన్ వచ్చినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై నెలతో ముగియనుంది. ఇక ఈ నెలాఖరులో లేదంటే వచ్చే నెల మొదట్లో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరగనున్నాయి. మే నెలాఖరులోగా ఈ ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాల కు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు.. అభ్యంతరాలు కూడా స్వీకరించారు. వీటిని పరిశీలించి సోమవారం తుది జాబితా ప్రచురించనున్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మండలలకు నూతనంగా జెడ్పీటీసీ నియోజకవర్గం ఏర్పాటు చేయాల్సి చేయనున్నారు. అందులో ఎన్ని ఎంపీటీసీ స్థానాలు, ఎంత జనాభా ఉంటందనే వివరాలతో కూడిన నోటిఫికేషన్ను మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మండల జనాభాను 3,500 తో భాగించి వచ్చే సంఖ్యను ఎంపీటీసీ స్థానాలుగా గుర్తిస్తారు. అంటే ప్రతీ ఎంపీటీసీ నియోజకవర్గంలో 3 వేల నుంచి 4 లోపు జనాభా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే 6 వేల వరకు కూడా జనాభాతో కూడా ఎంపీటీసీ స్థానం ఏర్పాటుచేస్తారు. ఇలా చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై అభ్యంతరాలను 22వ తేదీ వరకు స్వీకరించారు. ఇక వచ్చిన అభ్యంతరాలను శని, ఆదివారాల్లో పరిశీలించి సోమవారం తుది జాబితా వెల్లడించనున్నారు. 25లోగా ప్రతిపాదలు కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా ప్రతిపాదనలను పూర్తిచేసి ఈనెల 25లోగా పంపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. 2019 జనవరి 1 నాటికి ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. ఆ విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలో ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల వచ్చే నెలాఖరులోగా ఖరారు చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇటీవల గ్రామపంచాయతీలకు అమలు చేసినట్లు రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా ఖరారు చేయనున్నారు. ఇక గ్రామపంచాయతీ ఎన్నికల మాదిరిగానే బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముందని సమాచారం. కాగా, జిల్లా కలెక్టర్, ఎస్పీల నివేదికకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలా అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. 950 ఎంపీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా పరిదిలోని 6 జిల్లా వ్యాప్తంగా 950 ఎంపీటీసీ స్థానాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,07,170 జనాభా ఉండగా ఆ ప్రకారం ఎంపీటీసీ స్థానాలను నిర్థారించారు. ఉమ్మడి జిల్లాలో గతంలో 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. 2014లో 982 ఎంపీటీసీ స్థానాలు, 64 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే, ప్రభుత్వం నూతన జిల్లాలతోపాటు మండలాలను కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మండలాల సంఖ్య 84కు చేరడంతో అదే సంఖ్యలో జెడ్పీటీసీల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. పెరిగిన జెడ్పీటీసీలు.. తగ్గిన ఎంపీటీసీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 జెడ్పీటీసీ స్థానాలు పెరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో గతంలో 64గా ఉన్న మండలాల సంఖ్య 84కు చేరిన విషయం విదితమే. దీంతో ప్రతీ మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేస్తూ డ్రాఫ్ట్ విడుదల చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో ముసాపేట, రాజాపూర్, గండీడ్(రంగారెడ్డి నుంచి జిల్లాలో కలిసింది), జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలి, కేటీ.దొడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊరకొండ, చారకొండ, పదర, నారాయణపేట జిల్లాలో కృష్ణా, మరికల్, రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్, నందిగామ, చౌదర్గూడ, వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అమరచింత మండలాలు ఏర్పాడ్డాయి. వీటికి కూడా అధికారులు నోటిఫికేషన్ను జారీ చేశారు. ఈ మేరకు ఆయా స్థానాలు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఉమ్మడి జిల్లాలో 982 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 950కి తగ్గింది. అంటే 32 స్థానాలు తగ్గాయి. ఎంపీటీసీ స్థానాలు ఉన్న ప్రాంతాలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఓటరు జాబితాల తయారీ ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడినా పాత జిల్లా పరిషత్, వాటి పరిధిలోని మండల పరిషత్లో కాలపరిమితి ముగియలేదు. దీంతో వాటి విభజన చేపట్టలేదు. ఇక ఉమ్మడి జిల్లాలో పాతవి 64 మండలాలు ఉండగా అందుకు అనుగుణంగా జెడ్పీటీసీలు, 982 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ మేరకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయలని కలెక్టర్లను పంచాయతీ శాఖ ఆదేశించింది. -
జెడ్పీటీసీలు.. 21 ఎంపీటీసీలు: 258
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పరిధి తగ్గింది. జిల్లాల పునర్విభజనతో జెడ్పీటీసీల సంఖ్యతోపాటు.. మండల ప్రాదేశిక స్థానాల సంఖ్యకు కూడా కోత పడింది. చాలా గ్రామాలు పురపాలనలో విలీనం కావడంతో ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో జెడ్పీటీసీల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 33 జిల్లా ప్రాదేశిక స్థానాలుండగా తాజాగా కేవలం రంగారెడ్డి జిల్లా వరకే చూస్తే ఈ సంఖ్య 21 పరిమితమైంది. ఎంపీటీసీల విషయానికి వస్తే.. పాత జిల్లాలో 753 ఉండగా ప్రస్తుతం మన జిల్లాలో 258 ఎంపీటీసీలు మిగిలాయి. ఒక్క కొత్త రంగారెడ్డి జిల్లాలోనే 116 ఎంపీటీసీలకు కత్తెర పడింది. రాజేంద్రనగర్, సరూర్నగర్ గ్రామీణ మండలాలు సంపూర్ణంగా పురపాలనలో విలీనం కావడంతో పాటు శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయంజాల్, శంకర్పల్లిలు మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. వీటిలో పరిసర గ్రామాలు కలవడంతో మండల ప్రాదేశిక స్థానాలు కనుమరుగయ్యాయి. అదే సమయంలో పాలమూరు జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన ఆమనగల్లు కూడా పురపాలికగా మారడంతో సమీపంలోని కొన్ని గ్రామాల ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి. ముసాయిదా రెడీ ప్రస్తుత జెడ్పీ పాలకవర్గ కాలపరిమితి జులై మొదటి వారంలో ముగియనుండగా.. ఆ లోగా నూతన జిల్లాల ప్రాతిపదికన మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కసరత్తు చేసిన పంచాయతీరాజ్ విభాగం కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను సిద్ధం చేసింది. శేరిలింగంపల్లి, సరూర్నగర్, రాజేంద్రనగర్, బాలాపూర్, హయత్నగర్, గండిపేట మండలాలు పట్టణ ప్రాంత ప్రాంతాలు కావడంతో వీటిని పంచాయతీరాజ్ విభాగం నుంచి తొలగించారు. ఇలా సరూర్నగర్, రాజేంద్రనగర్ మండలాల్లో 71 ఎంపీటీసీ స్థానాలు కనుమరుగు అయ్యాయి. ఇక కొన్ని గ్రామాలు నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఆమనగల్లు, శంకర్పల్లి, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో పదుల సంఖ్యలో ఎంపీటీసీలు కలిసిపోయాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో మహబూబ్నగర్ నుంచి జిల్లాలో కొన్ని ప్రాంతాలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా కడ్తాల్, చౌదిరిగూడ, నందిగామ మండలాలుగా అవతరించాయి. ఈ మండలాల్లో నూతనంగా 28 ఎంపీటీసీ స్థానాలు తోడయ్యాయి. అలాగే ఫరూఖ్నగర్లో అదనంగా ఒక స్థానం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముసాయిదా జాబితా ప్రకారం కొత్త రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 258కి తగ్గింది. 21 జెడ్పీటీసీ స్థానాలు ఎంపీటీసీ స్థానాల సంఖ్య కుదింపుకాగా జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి పెరిగింది. ప్రస్తుతం కొత్త జిల్లా ప్రకారం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ముసాయిదా జాబితాను అనుసరించి ఈ సంఖ్య 21కు చేరుకుంది. పట్టణీకరణ కారణంగా సరూర్నగర్, రాజేంద్రనగర్ స్థానాలు గల్లంతుకాగా.. కడ్తాల్, నందిగామ, చౌదరిగూడ జెడ్పీటీసీ స్థానాలుగా అవతరించనున్నాయి. 3,500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ మండలాల ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రతి 3,500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్ధిష్ట జనాభా ఒక పంచాయతీలోనే ఉంటే.. ఆ గ్రామాన్ని ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రెండు మూడు గ్రామాలను కలిపి ఒక ఎంపీటీసీ స్థానంగా విభజించారు. వీటిలో అధిక జనాభా ఉన్న గ్రామం పేరిటే ఎంపీటీసీ స్థానంగా నిర్ణయిస్తారు. 25న తుది జాబితా 258 ఎంపీటీసీ, 21జెడ్పీటీసీ స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 22 వరకు ఉంది. అందిన అభ్యంతరాలను 23, 24 తేదీల్లో పరిష్కరించి 25వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేస్తారు. -
పరిషత్ ఎన్నికలకు కసరత్తు షురూ
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్ మాసంలో లోకసభ ఎన్నికలు జరుగనుండడంతో.. వెనువెంటనే మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు.. ఓటరు జాబితా.. పోలింగ్కు అవసరమయ్యే సామగ్రి.. ఉద్యోగుల నియామకంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు బుధవారం మండల స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు, జిల్లా స్థాయిలో జెడ్పీ స్థానాలు వివరాలతో కూడిన ముసాయిదాను జాబితాను కలెక్టర్ల ఆమోదంతో విడుదల చేసింది. ఈ నెల 22 వరకు అభ్యంతరాలు స్వీకరించి 25న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ అభ్యంతరాలను ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. కొత్త జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ మండలాలు, పంచాయతీలను దృష్టిలో ఉంచుకొని ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలను పునర్విభజించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నెల 16న జిల్లా అధి కారులకు ఉత్తర్వులను జారీ చేసింది. 2011 జనా భా లెక్కల ప్రకారం ఈ ప్రాదేశిక నియోజకవర్గాలను గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు రం గంలోకి దిగిన పంచాయతీరాజ్ అధికారులు బుధవారం పునర్ వ్యవస్థీకరించిన జెడ్పీ,మండల స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను వెల్లడించారు. ఈనెల 21, 22వ తేదీల్లో అభ్యంతరా లను స్వీకరిస్తారు. 23, 24వ తేదీల్లో వాటిని పరి శీలించి పరిష్కరిస్తారు. ఈ నెల 25న తుది జాబి తాను ప్రకటించనున్నారు. పూర్వపు వరంగ ల్ జిల్లాలో 705ఎంపీటీసీలు, 50జెడ్పీటీసీలున్నాయి. 3500 జనాభాకు ఒక ఎంపీటీసీ.. జిల్లాలో మండలం యూనిట్గా 2011 జనాభా ప్రాతిపదికన 3500 మంది జనాభాకు ఒక ఎంపీటీసీని కేటాయించారు. ఈ నెల నెల 25న తుది జాబితాను సిద్ధం చేసి తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారం రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కొరతను అధిగమించేందుకు ఈ సారి బ్యాలెట్ విధానంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. -
జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల కసరత్తు షురూ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్రంలో జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. గతంలో జిల్లా ప్రజాపరిషత్ల సంఖ్య 9 ఉండగా, ఇప్పుడు కొత్తగా జిల్లాలు (తాజాగా ప్రకటించిన రెండు జిల్లాలు కలిపి), మండలాల పునర్విభజనతో జిల్లాల సంఖ్య 32కు (ఆగస్టుతో కాలపరిమితి ముగియనున్న ఖమ్మం జెడ్పీ దాని పరిధిలోని భద్రాద్రి జిల్లా కలిపి) పెరగబోతోంది. వచ్చే జూలై 3, 4 తేదీలతో పాత జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగియనుండటంతో కొత్తజిల్లా పరిషత్లకు ఎన్నిక లు జరగాల్సి ఉంది. మే చివరి కల్లా మండల, జిల్లా పరిషత్ల ఎన్నికల నిర్వహణ పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, వాటి పరిధిలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాల్సి ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల గుర్తింపు ఆ తర్వాత రిజర్వేషన్ల ఖరారు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు: వచ్చే నెలాఖరులోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకే ఎస్ఈసీ సూచించింది. మే ఆఖరులోగా ఈ ఎన్నికలు పూర్తయితే జూలై 5న 30 జెడ్పీలు, ఆగస్టు 7న ఖమ్మం, భద్రాద్రి జెడ్పీ (ఉమ్మడి జెడ్పీ గడువు ముగిశాక) పాలకవర్గాలు బాధ్యతలు చేపడతాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, కొత్త గ్రామపంచాయతీల ప్రాతిపదికన జిల్లా, మండల ప్రజాపరిషత్ స్థానాలు ఖరారుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన 32 జెడ్పీలు, కొత్త మండలాల ప్రాతిపదికన మండల ప్రజాపరిషత్లు ఏర్పడతాయి. గతంలో 438 మండలాల నుంచి పునర్విభజన తర్వాత మరో 96 గ్రామీణ మండలాల ఏర్పాటుతో ఈ సంఖ్య 534కు పెరగగా తాజాగా మరో 4 మండలాలను పెంచడంతో 538కు చేరనుంది. దీంతో జెడ్పీటీసీల సంఖ్య కూడా 538కు పెరగనుంది. చిన్న జిల్లాల పరిస్థితేంటీ?: కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో గ్రామీణ మండలాలు మరీ తక్కువ సంఖ్యలో ఉండటంతో ఆ జిల్లాల్లో జిల్లా పరిషత్ల ఏర్పాటు సాధ్యమేనా అన్న సందేహాలున్నాయి. ఈ జిల్లాల్లోని ఆయా మండలాలను పొరుగునే ఉన్న జిల్లాల్లో విలీనం చేస్తారా అన్న దానిపైనా ఇంకా స్పష్టత రాలేదు. -
ఓటర్ల జాబితాలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. వచ్చే జూలై 3,4 తేదీల్లో ప్రస్తుత ఎంపీపీ, జెడ్పీపీపీల కాలపరిమితి ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువు ముగియగానే కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వార్డులవారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా త్వరలోనే ఎస్ఈసీ నోటిఫికేషన్ వెలువరించనుంది. ఈ నెల 22న ప్రకటించనున్న (2019 జనవరి 1 నాటి) అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ) సిద్ధం చేయాలని ఎస్ఈసీ సూచించింది. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి చర్యలు వేగవంతం చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్కి ఎస్ఈసీ సూచించింది. ఈ జాబితాలకు అనుగుణంగా మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా సీఈవోలు తయారు చేయాల్సి ఉంటుంది. గురువారం ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), జిల్లా ఎన్నికల అధికారులకు లేఖ లు పంపించారు. గ్రామ పంచాయతీల్లోని వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి, ప్రచురించడానికి ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీకి ఒక అధికారిని నియమించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాను తయారుచేసేందుకు పంచాయతీ కార్యదర్శి కేడర్ అధికారిని డిజిగ్నేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి అనుసరించాల్సిన మార్గదర్శకాలు పాటిం చాలని సూచించింది. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలను సరిచూసుకునే కార్యక్రమాన్ని ముందుగానే పూర్తిచేసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించింది. -
ఇక పరిషత్ పోరు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులను మరో ఆర్నెల్లు కొనసాగిస్తుండడంతో వాయిదా పడ్డాయి. ఓ వైపు పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా.. ఆ వెంటనే మండల, జిల్లా ప్రాదేశిక, పరిషత్లు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి త్వరలోనే పరిషత్లు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. బహుశా మే, జూన్లో నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్లో పూర్తయితే ఆ వెంటనే మండల, జిల్లా పరిషత్లు, మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా అధికారులు.. ఆ ఏర్పాట్లను కూడా పూర్తిచేయాలన్న ఆదేశాల మేరకు కసరత్తు ప్రారంభించారు. దీంతో రాజకీయ పార్టీల్లో స్థానిక సంస్థల హడావుడి మళ్లీ మొదలైంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికలపై మొదలైన రాజకీయ సందడి ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో మళ్లీ స్థానిక ఎన్నికల చర్చ జోరందుకుంది. ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 313 గ్రామ పంచాయతీలకు 208 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 39 చోట్ల కాంగ్రెస్, 11 బీజేపీ, నాలుగు టీడీపీ, మూడు సీపీఐ మద్దతుదారులు గెలుచుకోగా.. 48 పంచాయతీల్లో స్వతంత్రులు, ఇతరులు పాగా వేశారు. ఇదే ఊపులో పార్టీ బ్యానర్పై జరిగే మండల, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో పాగా వేయాలని టీఆర్ఎస్ నేతలు ఇప్పటినుంచే వ్యూహరచనలో పడ్డారు. 39 పంచాయతీలతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బలం పెంచుకోవాలన్న తపనతో ఉంది. అయితే పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి కలిసి పోటీ చేస్తుందా..? లేక కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐలు ఎవరికీవారుగా పోటీ చేస్తారా? అన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదు. అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఎవరికీవారుగా ఈ ఎన్నికల్లో ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతోపాటు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి మరోఛాన్స్ ఇచ్చి సానుభూతి పొందాలనే కొన్ని పార్టీలు యోచిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఎన్నికల సంఘం మే, జూన్లో పరిషత్, పుర, నగరపాలక సంస్థల ఎన్నికల జరుపుతామని ప్రకటించడంతో ఆయా పార్టీలు మళ్లీ గెలుపుగుర్రాల వేటలో పడ్డాయి. జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు? కొత్త మున్సిపాలిటీలకు ఈసారే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 817 మండల ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) స్థానాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా పూర్వ కరీంనగర్ నాలుగు జిల్లాలుగా విభజించబడింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా 57 పాత మండలాలు, కొత్తగా ఏర్పడిన 16 మండలాలు వెరసి మొత్తం 73 మండలాలు, 7 రెవెన్యూ డివిజన్లుగా ఆవిర్భవించింది. కొత్త జిల్లాల ఏర్పాటైన తొలి దసరా నుంచే జిల్లాలోని 73 మండలాలను మొత్తం ఏడు జిల్లాలకు విభజించారు. 16 మండలాలతో కరీంనగర్ జిల్లా మిగలగా.. 13 మండలాలతో సిరిసిల్ల, 18 మండలాలతో జగిత్యాల, 14 మండలాలతో పెద్దపల్లి జిల్లా ఏర్పాటయ్యాయి. ఇవిగాకుండా కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లాలోకి 5, సిద్దిపేటలోకి 4, వరంగల్ అర్బన్ జిల్లాలోకి 3 మండలాలను చేర్చారు. ఇక విభజన తర్వాత కరీంనగర్ జిల్లా 16 మండలాల్లో మొత్తం 180 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు మాత్రం 12 ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ఇల్లందకుంట, గన్నేరువరం, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని గ్రామాల్లో కూడా ఈ ఎంపీటీసీ స్థానాలే ఉండనున్నాయి. అదేవిధంగా హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల నుంచి సిద్దిపేట, వరంగల్ అర్బన్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కలిసిన మండలాలను మినహాయిస్తే 12 మండలాలకే ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. దీంతో పాత పద్ధతిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్ నగరపాలకసంస్థతో పాటు నగర పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన హుజూరాబాద్కు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలకు ఈ సారి ఎన్నికలు జరుగుతాయని అధికారవర్గాల సమాచారం. -
ఎన్నికల్లో పోటీకి డబ్బు తేవాలని భార్యను..
మైసూరు: జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన డబ్బు తీసుకురావాలని భర్త వేధిస్తున్న నేపథ్యంలో భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈఘటన మైసూరు జిల్లా, కేఆర్ నగర తాలుకాలోని నాటనహళ్లిలో చోటు చేసుకుంది. గ్రామంలో సంతోష్, కావ్యారాణి (28) దంపతులు నివాసం ఉంటున్నారు. సంతోష్ కాంగ్రెస్ నాయకుడుగా కొనసాగుతున్నాడు. వచ్చే జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన రూ. 15 లక్షలు పుట్టింటినుంచి తీసుకురావాలని కొంతకాలంగా సంతోష్ తన భార్యను వేధించేవాడు. అంతేగాకుండా అత్త, ఆడపడుచులు కావ్యారాణిని వేధించేవారని సమాచారం. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి కావ్యారాణి బాధపడేది. వేధింపులు తీవ్రతరమైన నేపథ్యంలో కావ్యారాణి శుక్రవారం వంటిపై కాలిన గాయాలతో అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. సంతోష్, అతని తల్లి శారదమ్మ, అడపడుచు సౌమ్య, సౌమ్య భర్త చంద్రశేఖర్లు తమ బిడ్డపై కిరోసిన్పోసి నిప్పు అంటించారని మృతురాలి తల్లిదండ్రులు కేఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జెడ్పీటీసీ సభ్యత్వం రద్దు
రాయగడ : రాయగడ జిల్లా కాశీపూర్ ‘సి’జోన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు నీలకంఠజోడియా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ గుహపూనాంతపస్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడ జిల్లా పరిషత్లో 22స్థానాలు ఉండగా కాంగ్రెస్ 11స్థానాలు, బీజేడీ 7స్థానాలు, బీజేపీ 4స్థానాలు, గత మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందాయి. అయితే కాశీపూర్ జోన్లో ఓడిపోయిన బీజేడీ పార్టీకి చెందిన అభ్యర్థి పాపులర్ మజ్జి ఎన్నికల అనంతరం కాశీపూర్ ‘సి’ జోన్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నీలకంఠ జోడియాపై ఫిర్యాదు చేశారు. నీలకంఠ జోడియా ఆ దివాసీ కాదని ఎన్నికల నామినేషన్లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం అందజేశారంటూ జిల్లా మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జిల్లా మెజిస్ట్రేట్ ఈ నెల 21న విచారణ చేసి అనంతరం కాశీపూర్ ‘సి’జోన్ కాంగ్రెస్ అభ్యర్థి నీలకంఠజోడియా సభ్యత్వం చెల్లదని నిర్ధారించారు. నీలకంఠ జోడియా సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు నకిలీవని నిర్ధారించి ఆయన జిల్లా పరిషత్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తరఫున హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తానని ఈ సందర్భంగా నీలకంఠజోడియా మీడియాకు తెలియజేశారు. -
9న జిల్లాకు వైఎస్ జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఈ నెల 9వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు రానున్నారు. రెండు రోజులపాటు ఆయన జిల్లాలోని రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలతో పాటు జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, జెడ్పీ చైర్మన్ ఎన్నికపై అధినేత సమీక్షిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 9వ తేదీన కర్నూలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపైనా, 10వ తేదీన నంద్యాల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగిన తీరును విశ్లేషించుకుంటావున్నారు. అంతేకాకుండా వివిధ ప్రజా సవుస్యలపై ఏ విధంగా వుుందుకు వెళ్లాలనే అంశాన్నీ చర్చించుకుంటావున్నారు. అదేవిధంగా పార్టీ అన్ని విభాగాల బలోపేతంపైనా సమీక్ష ఉంటుందని ఆయున వివరించారు. నేడు ఎస్వీ హోటల్లో ముఖ్యులతో సన్నాహాక సమావేశం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకను పురస్కరించుకుని బుధవారం (7వ తేదీన) ఉదయుం 11 గంటలకు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు వుుఖ్యనేతలందరూ కర్నూలులోని ఎస్వీ హోటల్లో సవూవేశం అవుతున్నావుని బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. -
'కూర్చోండి.. లేకుంటే బయటకు వెళ్లండి'
నెల్లూరు: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పెంచలమ్మను సమావేశం హాలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తొలగించేందుకు టీడీపీ సభ్యులు యత్నించడంతో నిబంధనలు ఉల్లంఘించొద్దని కలెక్టర్ హెచ్చరించారు. ఆరుగురు వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యులు టీడీపీ వరుసలోకి వెళ్లారు. ఆయా పార్టీ సభ్యులు వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలని కలెక్టర్ సూచించారు. వారు పట్టించుకోకపోవడంతో బయటకు వెళ్లిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో నలుగురు వైఎస్ఆర్ సీపీ సభ్యులను పోలీసులు బయటకు పంపారు. అయితే ఇద్దరు మాత్రం లోపలే ఉన్నారు. సీక్రెట్ ఓటింగ్ జరిపించాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది. టీడీపీ సభ్యుల డిమాండ్ ను కలెక్టర్ తిరస్కరించారు. -
మున్సిపల్, స్థానిక ఫలితాల తేది ఖరారు
-
వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా పోలింగ్
పొదలకూరు, న్యూస్లైన్ : సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా పోలింగ్ జరిగినట్టు ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. కుటుంబ సమేతంగా తోడేరులో శుక్రవారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పొదలకూరు పార్టీ కార్యాలయంలో కాకాణి పోలింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుని విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గలో ఫ్యాన్గాలి వీస్తున్నట్టు తెలిపారు. ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలను తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. గత పంచాయతీ ఎన్నికలతో పోల్చిచూస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం పెరిగిందన్నారు. అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. పొదలకూరు మండలంలోని కొన్ని సెగ్మెంట్లలో వందల్లో మెజారిటీ రాబోతున్నట్టు వెల్లడించారు. ఈ మండలంలో టీడీపీకి శృంగభంగం తప్పదన్నారు. ఒక్క తోడేరు సెగ్మెంట్లోనే 1500 పైచిలుకు ఓట్లు మెజారిటీని వైఎస్సార్సీపీ సాధిస్తుందని చెప్పారు. ఇదే గాలి సీమాంధ్ర మొత్తం వీస్తున్నట్టు తెలిపారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ఓటర్లు ఆయన్ను అక్కున చేర్చుకుని ఓట్లు వేస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల విశ్లేషణలో ఇదే సమాచారం తమకు అందినట్టు వెల్లడించారు. కార్యకర్తలు ఎండను సైతం లెక్కచేయకుండా సైనికుల్లా పనిచేయబట్టే మంచి ఫలితాలు సాధించబోతున్నట్టు కాకాణి సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహాన్ని కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలని సూచించారు. జగన్మోహన్రెడ్డిపై నమ్మకం, వైఎస్సార్పై అభిమానం, తాను ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధే తమ పార్టీకి శ్రీరామరక్షగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎందరు వచ్చి కుయుక్తులు పన్నినా లాభం లేదన్నారు. చేసిన అభివృద్ధి చూపి ఓట్లు అడుగుతున్నట్టు చెప్పారు. కాకాణి వెంట పార్టీ నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, వెంపులూరు శ్రీనివాసులుగౌడ్ తదితరులు ఉన్నారు. -
పాదేశిక పోరు
పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల 17న జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నోటిఫికేషన్ ఆ రోజు నుంచి 20 వరకు నామినేషన్లు ఏప్రిల్ 6న ఎన్నికలు..8న కౌంటింగ్ ఖమ్మం కలెక్టరేట్, న్యూస్లైన్: పంచాయతీరాజ్ ఎన్నికల సైరన్ కూడా మోగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ రోజే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఆ రోజు నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, 22 సాయంత్రం 5 గంటల వరకు వాటిపై అభ్యంతరాలు, 23న అభ్యంతరాల తిరస్కరణ ఉంటాయి. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఏప్రిల్ 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం గెలుపొందిన వారి జాబితాను ప్రకటిస్తారు. జడ్పీ చైర్మన్, ఎంపీపీలను కూడా అదే రోజు ఎన్నుకునే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో సుమారు నెల రోజుల పాటు ‘స్థానిక’ సందడి నెలకొననుంది. చురుగ్గా ఏర్పాట్లు ... రాష్ట్ర ఎన్నికల క మిషన్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లా పరిషత్ అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 15 వేల మంది సిబ్బంది అవసరమని అంచనా వేస్తున్నారు. వీరికి తోడు జిల్లాలో 46 మంది రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓ పైస్థాయి అధికారులను నియమించాలని కమిషన్ ఆదేశించింది. అలాగే 92 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. వీరంతా ఎంపీడీవో, తహశీల్దార్ కేడర్లో ఉంటారు. జిల్లా వ్యాప్తంగా 46 జడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. 2006లో 592 ఎంపీటీసీ, 46 జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఆసంఖ్య 640కి పెరిగింది. పోలింగ్ స్టేషన్ల జాబితాను ఈనెల 12 లోగా పూర్తిచేయాలని, ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ విధానంతో నిర్వహించనున్నారు. గతంలో 1865 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఈసారి 1945కు పెరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహ ణకు 4900 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. సిద్ధమవుతున్న బ్యాలెట్ పేపర్లు ... జిల్లా వ్యాప్తంగా 46 జడ్పీటీసీ, 640 ఎంపీటీసీల ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు, ఎంపీటీసీలకు పింక్ (ఊదా) రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. తెలుపు బ్యాలెట్లు 9,350, పింక్ బ్యాలెట్లు 9,350 మెట్రిక్ టన్నుల చొప్పున అవసరం ఉంటుందని, ఈ మేరకు ఇప్పటికే అందుబాటులో ఉంచామని జడ్పీ అధికారులు తెలిపారు. పార్టీ బీ ఫాం ఉన్న అభ్యర్థులకు పార్టీ గుర్తులు, స్వతంత్ర అభ్యర్థులకు ఇతర గుర్తులతో బ్యాలెట్లు ముద్రించనున్నట్లు చెప్పారు. ఎన్నికల బడ్జెట్ రూ.2.85 కోట్లు... జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రూ. 2.85 కోట్లు ఖర్చు అవుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. బ్యాలెట్ల ముద్రణ, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల టీఏ, డీఏ, సిరా(ఇంక్), వాహనాల ఏర్పాటుకు ఈ బడ్జెట్ నుంచే ఖర్చు చేస్తారు. గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రూ.2 కోట్లు ఖర్చయింది. రిజర్వేషన్ల ఖరారు ..... జిల్లాలోని 640 ఎంపీటీసీలు, 46 జడ్పీటీసీలు, 46 ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ జాబితాను పంచాయతీరాజ్ శాఖాధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 18,36,837 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ జిల్లా పరిషత్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఎన్నికలపై ప్రత్యేక నిఘా... స్థానిక సంస్థల ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేయనున్నారు. ఆయా మండలాల స్థాయిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించనున్నారు. ఇందుకోసం మండల పరిధిలోని ఎస్సై, ఎంపీడీవో, తహశీల్దార్తో కమిటీ వేయనున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కెమెరా, వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించేలా చర్యలు తీసుకోనున్నారు. అవరసమైన చోట ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఆశావహుల ఎదురుచూపు... ఎట్టకేలకు సుధీర్ఘ కాలం తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పునివ్వడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రామస్థాయి, మండల స్థాయి నాయకుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈసారి ఎలాగైనా సీటు సంపాదించి గెలుపొందాలని ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ దిశగా ఆయా పార్టీల నాయకులను కలుసుకుని తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సైతం మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. -
సుప్రీంలో విచారణకు రాని జెడ్పీటీసీ ఎన్నికల కేసు
నోటిఫికేషన్ జారీచేశామని విన్నవించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్పై సోమవారానికల్లా సానుకూలంగా స్పందించాలని, తీసుకున్న చర్యలను సోమవారం కోర్టుకు వివరించాలని గత శుక్రవారం సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు సోమవారం సుప్రీంకోర్టులో 86వ నంబరు అంశంగా జాబితాలో ఉంది. అయితే 83వ అంశం వరకే విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు మిగిలిన కేసులను బుధవారం లేదా గురువారం విచారిస్తామని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది తాము ఎన్నికల షెడ్యూలు విడుదల చేశామని వివరించబోయారు. దీనికి న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ స్పందిస్తూ షెడ్యూలు విడుదల చేసినట్టుగా అఫిడవిట్ ఇవ్వాలని సూచించారు. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.