అమరుల త్యాగాలు చిరస్మరణీయం
ఆదిలాబాద్: పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగం చిరస్మరణీయమని సనాత న హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు ప్ర మోద్ కుమార్ ఖత్రి అన్నారు. జిల్లా కేంద్రంలో ని కార్గిల్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద మాజీ సైనికులు, సమితి ఆధ్వర్యంలో శుక్రవా రం కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం సురక్షితంగా ఉంటుందంటే సైనికుల త్యాగాలే కారణమన్నారు. ఉగ్రవాదుల ఉనికిని తుద ముట్టించినప్పుడే అమరుల త్యాగాలకు సార్థకత చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో మా జీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, ఉత్సవ సమితి సభ్యులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment