పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత

Published Sat, Mar 8 2025 2:12 AM | Last Updated on Sat, Mar 8 2025 2:12 AM

-

ఇచ్చోడ: మండల కేంద్రంలోని ఎస్బీఐ సిరిచెల్మ ఎక్స్‌రోడ్డు బ్రాంచిలో బంగారు ఆభరణాలు పో గొట్టుకున్న వ్యక్తికి మేనేజర్‌ సునీల్‌ మనోహర్‌ శుక్రవారం అప్పగించారు. వి వరాలు ఇలా ఉన్నాయి.. బోథ్‌ మండలం సొనాల గ్రామానికి చెందిన అనిల్‌ మండల కేంద్రంలో ముత్తుట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన తులం బంగారాన్ని డబ్బులు కట్టి విడిపించుకున్నాడు. అక్కడి నుంచి మరో పనిమీద సిరిచెల్మ ఎక్స్‌రోడ్డులో ఎస్బీఐ బ్రాంచికి వె ళ్లాడు. చెక్కు రాస్తుండగా క వరులో ఉన్న బంగారం నగలు కౌంటర్‌ వద్ద మరిచి బయట కు వెళ్లిపోయాడు. కౌ ంటర్‌ వద్ద కేశవపట్నానికి కలీం గ మనించి బ్రాంచి మేనేజర్‌కు అందించాడు. బంగారు నగలు పోగొట్టుకున్న సదరు వ్యక్తి మేనేజర్‌ను సంప్రదించాడు. బంగారం నగలను అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement