సాక్షి,పాడేరు: హుకుంపేట మండలం మత్స్యగుండంలో జరిగే శివరాత్రి జాతరకు పాడేరు డిపో నుంచి 30 ఆర్టీసీ ప్రత్యేక స ర్వీసులను నడపనున్నట్టు ఆర్టీసీ జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్టు అఽధికారి టి.ఉమామహేశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈనెల 26,27తేదీల్లో రెండు రోజుల పాటు ఈ బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.పాడేరు,అరకులోయ,చింతపల్లి,జోలాపుట్టు ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు నడుస్తాయని తెలిపారు. మత్స్యగుండం జాతరకు వచ్చే భక్తులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment