తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
● జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మణరావు
రంపచోడవరం: వేసవిలో గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో వి.వి.వి.ఎస్. లక్ష్మణరావు అన్నారు.రంపచోడవరంలో బుధవారం ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా తాగునీటి నాణ్యతను పరిశీలించి, పలు సూచనలు చేశారు.రంపచోడవరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో సుండం శ్రీనివాసదొరతో కార్యాలయానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment