పార్టీ అధినేతను కలిసిన అరకు ఎంపీ | - | Sakshi
Sakshi News home page

పార్టీ అధినేతను కలిసిన అరకు ఎంపీ

Published Fri, Mar 7 2025 10:06 AM | Last Updated on Fri, Mar 7 2025 10:02 AM

పార్టీ అధినేతను కలిసిన అరకు ఎంపీ

పార్టీ అధినేతను కలిసిన అరకు ఎంపీ

పాడేరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అరకు పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ గుమ్మా తనూజారాణి, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్‌ గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో ఆదివాసీల చట్టాలు, హక్కుల అమలుతోపాటు గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యలను ప్రస్తావించిన తీరుపై ఎంపీ తనూజారాణిను అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, విధివిధానాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఏజెన్సీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తమకు సూచించారని వారు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement